PM Modi pays homage to Dr. Sree Sree Sree Sivakumara Swamigalu during #MannKiBaat, remembers his teachings
I commend the Election Commission for continuous efforts to strengthen our democracy: PM During #MannKiBaat
Upcoming Lok Sabha elections an opportunity for the first time voters of 21st century to take the responsibility of the nation on their shoulders: PM during #MannKiBaat
Subhas Babu will always be remembered as a heroic soldier and skilled organiser: PM during #MannKiBaat
For many years it was being demanded that the files related to Netaji should be made public and I am happy that we fulfilled this demand: PM during #MannKiBaat
Netaji had a very deep connection with the radio and he made it a medium to communicate with the countrymen: PM refers to Azad Hind Radio during #MannKiBaat
We all know Gurudev Rabindranath Tagore as a wonderful writer and a musician. But Gurudev was also a great painter too: PM during #MannKiBaat
#MannKiBaat: PM Modi remembers Sant Ravidas’ invaluable teachings, says He always taught the importance of “Shram” and “Shramik”
The contribution of Dr. Vikram Sarabhai to India's space programme is invaluable: Prime Minister during #MannKiBaat
The number of space missions that took place since the country's independence till 2014, almost the same number of space missions has taken place in the past four years: PM #MannKiBaat
India will soon be registering it’s presence on moon through the Chandrayaan-2 campaign: PM Modi during #MannKiBaat
PM Modi during #MannKiBaat: We are using Space Technology to improve delivery and accountability of government services
#MannKiBaat: Our satellites are a symbol of the country's growing power today, says PM Modi
Those who play, shine; when a player performs best at the local level then there is no about his or her best performance best at global level: PM #MannKiBaat
With the support of the people of India, today the country is rapidly moving towards becoming an open defecation free nation: PM during #MannKiBaat
More than five lakh villages and more than 600 districts have declared themselves open defecation free. Sanitation coverage has crossed 98% in rural India: PM during #MannKiBaat

నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం! ఈ నెల 21వ తేదీన దేశానికి ఒక చాలా బాధాకరమైన విషయం తెలిసింది. ఏమిటంటే, కర్ణాటక లోని తుముకూరు జిల్లాకు చెందిన శ్రీ సిధ్ధగంగా మఠాథిపతి డా. శ్రీ శ్రీ శ్రీ శివకుమార్ స్వామి గారు ఇక లేరనే వార్త. శివ కుమార్ స్వామి గారు తన యావత్ జీవితాన్నీ సమాజ సేవకే సమర్పించేసారు. బసవేశ్వర భగవానుడు మనకు “కాయకవే కైలాస్” అని నేర్పించాడు. అంటే, కఠినమైన శ్రమ చేస్తూ నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండడం శివుడి నివాసమైన కైలాసానికి వెళ్ళడం లాంటిది అని అర్థం. శివకుమార స్వామి గారు ఇదే బాటపై నడిచారు. ఆయన తన 111ఏళ్ళ జీవితకాలంలో ఎన్నో వేల మందికి సామజిక, విద్యా, ఆర్థిక సహాయాలను అందించే పనులను చేసారు. వారి ఖ్యాతికి కారణం ఆయన విద్వత్తు. ఆంగ్ల, కన్నడ, సంస్కృత భాషలలో ఆయనకు అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. ఆయన ఒక సంఘ సంస్కర్త. ప్రజలకు భోజనము, ఆశ్రయము, విద్య, ఆథ్యాత్మిక జ్ఞానం అందించడానికి మాత్రమే ఆయన తన జీవితాంతం పాటుపడ్డారు. రైతులు నిరతరం క్షేమంగా ఉండాలన్నదే జీవితంలో ఆయనకు అత్యంత ముఖ్యమైన విషయం. సిధ్ధగంగా మఠం ద్వారా క్రమం తప్పకుండా జంతువుల, వ్యవసాయ వేడుకల నిర్వాహణ జరుగుతూ ఉంటుంది. పరమ పూజ్యులైన స్వామీజీ అశీస్సులు నాకు అనేక సార్లు లభించడం నా అదృష్టం. 2007లో శ్రీ శ్రీ శ్రీ శివ కుమార స్వామి గారి శత సంవత్సర ఉత్సవ వేడుకలకు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్.ఎ.పి.జె.అబ్దుల్ కలాం గారు తుమ్కూరు వెళ్లారు. కలాం గారు పూజ్యులైన స్వామి గారికి ఒక కవితను కూడా ఆ సందర్భంగా వినిపించారు. అదేమిటంటే –

“O my fellow citizens – In giving, you receive happiness,

In Body and Soul – You have everything to give.

If you have knowledge – share it

If you have resources – share them with the needy.

You, your mind and heart

To remove the pain of the suffering,And, cheer the sad hearts.

In giving, you receive happinessAlmighty will bless, all your actions.”

“నా తోటి దేశ పౌరులారా, ఇవ్వడంలో ఆనందం ఉంది.

దేహం లోనూ, ఆత్మలోనూ – ఇవ్వడానికి ఎంతో ఉంది.

మీకు జ్ఞానం ఉంటే పంచండి.

మీ వద్ద వనరులు ఉంటే – అవసరార్థులకు పంచండి.

మీరు, మీ బుధ్ధిని, మీ మనసుని

బాధలో ఉన్నవారి కోసం ఉపయోగించండి. దు:ఖితులను ఆహ్లాదపరచండి.

ఇవ్వడం ద్వారా ఆనందం లభిస్తుంది. భగవంతుడు మీ ప్రతి చర్యను ఆశీర్వదిస్తాడు.”

అని అర్థం.

శ్రీ శ్రీ శ్రీ శివ కుమార స్వామి గారి జీవితాన్నీ, సిధ్ధగంగ మఠం లక్ష్యాన్నీ డాక్టర్ కలాం గారు ఈ కవిత ద్వారా అందంగా సమర్పించారు.మరోసారి నేను ఈ మహాత్ముడికి నా శ్రధ్ధాంజలిని అర్పిస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, 1950, జనవరి26 వ తేదీన మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆరోజున మన దేశం ఒక గణతంత్ర దేశంగా మారింది. నిన్ననే మనం ఆడంబరంగా, గౌరవ మర్యాదలతో మన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. కానీ ఇవాళ నేనింకో మాట చెప్పాలనుకుంటున్నాను. జనవరి25వ తేదీ మన ఎన్నికల సంఘాన్ని స్థాపించిన రోజు. ఆ రోజుని మనం జాతీయ ఓటరు దినోత్సవంగా(National Voter’s Day) జరుపుకుంటాం. భారతదేశంలో ఎన్నికల ఏర్పాట్లు ఏ స్థాయిలో జరుగుతాయో చూసి ప్రపంచం యావత్తు ఆశ్చర్య పడుతుంది. మన ఎన్నికల సంఘం ఎంత చాకచక్యంగా ఈ ఏర్పాట్లన్నీ చేస్తుందో చూసి ప్రతి భారతీయుడూ గర్వపడడమనేది సాధారణమైన విషయమే. రికార్డు లో నమోదైన ప్రతి పౌరుడికీ, ప్రతి నమోదైన ఓటరుకీ తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశాన్ని మన దేశం ఏర్పాటు చేస్తుంది.

హిమాచల్ ప్రదేశ్ లోని 15,000 అడుగుల ఎత్తుపై ఉన్న ప్రాంతాల్లో కూడా ఎన్నికల కేంద్రాలు ఏర్పాటవుతాయి. అండమాన్ నికోబార్ ద్వీప సమూహాల్లోని దూర దూర ద్వీపాల్లో కూడా ఎన్నికల ఏర్పాట్లు జరుగుతాయి. గుజరాత్ లోని విషయాన్ని మీరు తప్పక వినే ఉంటారు. గిర్ అడవిలోని ఒక అందమైన ప్రాంతంలో కేవలం ఒకే ఒక ఓటరు కోసం ఒక పోలింగ్ బూత్ పెడతారు. కేవలం ఒకే ఒక్క ఓటరు కోసం! ఇటువంటి ఎన్నికల సంఘాన్ని చూసి మనం గర్వపడడం చాలా సాధారణమైన విషయం. ఆ ఒక్కొక్క ఓటరు కోసం, అతడికి తన ఓటు హక్కుని ఉపయోగించుకునే అవకాశం లభించాలనే ఉద్దేశంతో, ఎన్నికల సంఘం ఉద్యోగుల జట్టు మొత్తం దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఎన్నికలు జరిగేలా చూస్తుంది. ఇదే మన గణతంత్ర దేశంలోని అందం. మన గణతంత్రాన్ని బలంగా ఉంచడానికి నిరంతరం ప్రయాస పడే ఎన్నికల సంఘాన్ని నేను మెచ్చుకుంటున్నాను. ఎన్నికల ప్రక్రియలో పాల్గొని, స్వతంత్రంగా, నిష్పక్షంగా ఎన్నికలు జరగడానికి సహాయపడే అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాల ఉద్యోగులను, మిగతా ఉద్యోగులనందరినీ కూడా నేను అభినందిస్తున్నాను.
ఈ ఏడాది మన దేశంలో జరగబోయే లోక్ సభ ఎన్నికలలో 21వ శతాబ్దంలో పుట్టిన యువత ఎన్నికలలో తమ ఓటు హక్కుని మొదటిసారిగా వినియోగించుకోబోతున్నారు. దేశ బాధ్యతని తమ భూజాలకు ఎత్తుకునే అవకాశం వారికి లభిస్తోంది. ఇప్పుడు వాళ్ళు దేశంలో నిర్ణయప్రక్రియలో భాగస్వాములు కాబోతున్నారు. తమ సొంత కలలను దేశ స్వప్నాలతో ముడిపెట్టే తరుణం వచ్చింది. ఎన్నికలలో పాల్గోవడానికి అర్హులైన యువత తమ పేర్లను ఓటర్ల జాబితాలో తప్పక రిజిస్టరు చేయించుకోవాల్సిందిగా నేను యువతను కోరుతున్నాను. దేశంలో ఓటరుగా గుర్తింపు పొందడం, ఓటు హక్కుని పొందడం అనేది జీవితంలో ఎదురయ్యే అనేక ముఖ్యమైన ఘట్టాల్లో ఒక ముఖ్యమైన మెట్టు. దానితో పాటుగా ఓటువెయ్యడం అనేది నా బాధ్యత అన్న భావం మన లోపల పెరగాలి. జీవితంలో ఎప్పుడైనా, ఏదైనా కారణం వల్ల ఓటు వెయ్యలేకపోతే చాలా బాధ కలగాలి. అయ్యో , నేను ఓటు వెయ్యలేకపోయాను, ఆ రోజు నేను ఓటువెయ్యడానికి వెళ్లలేదు. అందువల్లనే దేశం ఇవాళ ఇంత ఒత్తిడిలో ఉంది.. అనుకునేంతటి బాధ్యత మనకి ఉండాలి. ఇది మ వృత్తి,ప్రవృత్తి కావాలి. ఇది మన సంస్కృతి కావాలి. దేశంలోని ప్రముఖ వ్యక్తులకు నేను చెప్పేదేమిటంటే, మనందరము కలిసి

ఓటరుజాబితాలో మన పేర్లను నమోదు చేయించడం, ఎన్నికలు జరిగే రోజున ఓటు వెయ్యడం, మొదలైన విషయాలను ప్రచారం చేసి, ప్రజలను అప్రమత్తులుగా తయారుచేద్దాం. పెద్ద సంఖ్యలో మన యువ ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకుంటారనీ, తమ భాగస్వామ్యంతో మన గణతంత్రానికి మరింత బలాన్ని ఇస్తారని నేను నమ్ముతున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, పవిత్రమైన ఈ భరతగడ్డపై ఎందరో మహాపురుషులు జన్మించారు. వారంతా మానవత్వం కోసం కొన్ని అద్భుతమైన, మరవలేని పనులను చేశారు. మన భరతభూమి ఎందరో రత్నాలవంటి బిడ్డలను కన్న భూమి. అటువంటి మహాపురుషులలో ఒకరే నేతాజీ సుభాష్ చంద్ర బోస్. జనవరి 23వ తేదీన యావత్ భారతదేశం ఒక విభిన్నమైన రీతిలో ఆయన జయంతిని జరుపుకుంది. భారతదేశ స్వతంత్ర సంగ్రామానికి తమ భాగస్వామ్యాన్ని అందించిన మహావీరుల స్మారకార్థంగా తయారుచేసిన ఒక సంగ్రహాలయాన్ని(మ్యూజియంను) ప్రారంభం చేసే అదృష్టం నాకు నేతాజీ జయంతి నాడు లభించింది. స్వాతంత్రం వచ్చిన నాటి నుండీ ఎర్రకోటలో ఎన్నో గదులు మూసివేయబడి ఉన్నాయాని మీకు తెలిసు కదా. అలా మూసివేయబడి ఉన్న గదులన్నింటినీ ఎంతో అందమైన సంగ్రహాలయాలుగా తీర్చిదిద్దారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ కి ఒక సంగ్రహాలయం, ‘याद-ए-जलियां’, ఇంకా1857 – Eighteen Fifty Seven, India’s First War of Independenceపేర్లతో మరికొన్ని సంగ్రహాలయాలు తయారయ్యాయి. ఈ సంగ్రహాలయాలు ఉన్న గదుల్లోని ప్రతి ఇటుకలోనూ మన గౌరవపూర్వకమైన చరిత్ర తాలూకూ పరిమళాలు నిండి ఉన్నాయి. ఈ సంగ్రహాలయాల ప్రతి అంగుళంలోనూ మన స్వాతంత్ర సమరవీరుల గాధలను చెప్పే విషయాలు మనల్ని చరిత్రలోకి తీసుకువెళ్తాయి. ఇదే ప్రదేశంలో భారతమాత వీరపుత్రులైన – కర్నల్ ప్రేమ్ సెహ్గల్, కర్నల్ గురుభక్ష్ సింహ్ డిల్లో, మేజర్ జనరల్ షహన్వాజ్ ఖాన్ లపై ఆంగ్ల ప్రభుత్వం దావా నడిపింది.

ఎర్రకోటలోని క్రాంతి మందిర్ లో నేతాజీ కి సంబంధించిన జ్ఞాపకాలను సందర్శిస్తున్నప్పుడు నేతాజీ కుటుంబసభ్యులొకరు నాకు ఒక అరుదైన టోపీని బహుకరించారు. అది ఒకప్పుడు నేతాజీ పెట్టుకున్న టోపీట. అక్కడకు వచ్చిన ఆ టోపీని చూసిన ప్రజలలో దేశభక్తి కలిగేందుకు ప్రేరణ లభిస్తుందనే ఉద్దేశంతో ఆ టోపీని ఆ సంగ్రహాలయంలోనే ఒక చోట పెట్టించేసాను నేను. అసలు మన నాయకుల శౌర్యం, దేశభక్తిల గురించి నవతరానికి వేరు వేరు రూపాల్లో మళ్ళీ మళ్ళీ నిరంతరం అండింఛాల్సిన అవసరం ఉంది. క్రిందటి నెల డిసెంబర్ ముప్ఫై న నేను అండమాన్ నికోబార్ ద్వీపానికి వెళ్లాను. 75ఏళ్ల క్రితం ఎక్కడైతే నేతాజీ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారో, సరిగ్గా అదే ప్రదేశంలో మళ్ళీ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. 2018,అక్టోబర్ లో ఎర్రకోటలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేయడం చూసి జనాలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ఆగస్టు పదిహేను కి మాత్రమే జాతీయపతాకాన్ని ఎగురవేసే అలవాటు ఉంది. ఆజాద్ హింద్ సర్కార్ తయారై 75ఏళ్ళు పూర్తైన సందర్భంలో అలా ఎగురవేశాము.

సుభాష్ బాబుని ఎప్పటికీ ఒక వీర సైనికుడిగా, ఒక నైపుణ్యం గల నిర్వాహకుడిగా గుర్తుంచుకుంటాము. స్వతంత్ర సంగ్రామంలో ఒక ముఖ్యమైన పాత్ర వహించిన వీరుడైన సైనికుడిగా గుర్తుంచుకుంటాము. “ఢిల్లీ చలో”, “తుమ్ ముఝే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా”(నువ్వు నాకు రక్తం ఇవ్వు, నేను నీకు స్వాతంత్రాన్ని ఇస్తాను), లాంటి చురుకైన నినాదాలతో నేతాజీ ప్రతి భారతీయుడి గుండెల్లోనూ స్థానాన్ని సంపాదించుకున్నాడు. నేతాజీకి సంబంధించిన ఫైళ్లను సార్వజనికం చేయాలని చాలా ఏళ్ళ నుండీ కోరడం జరిగింది. ఇది మేము చెయగలిగామని నాకు ఆనందంగా ఉంది. నేతాజీ కుటుంబం మొత్తం ప్రధానమంత్రి కార్యాలయానికి వచ్చిన రోజు ఇంకా నాకు గుర్తు ఉంది. మేమంతా కలిసి నేతాజి గురించి ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. నేతాజీకి శ్రధ్ధాంజలి ఘటించాం.

భారతదేశానికి చెందిన ఎందరో మహా నాయకులతో ముడిపడి ఉన్న కొన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచే ప్రయత్నం జరగడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించిన 26,అలీపూర్ రోడ్డు , సర్దార్ పటేల్ సంగ్రహాలయం, క్రాంతి మందిర్ మొదలైనవి. మీరు ఢిల్లీ వస్తే గనుక ఈ ప్రాంతాలను తప్పక సందర్శించండి.

నా ప్రియమైన దేశప్రజలారా, ఇవాళ మనం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురించి, అది కూడా మన్ కీ బాత్ లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నేను నేతాజీ గారి జీవితానికి సంబంధించిన ఒక కథను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఎప్పుడూ కూడా రేడియోను మనుషులను కలిపే ఒక మాధ్యమంగా భావించాను. అలానే నేతాజీ కి కూడా రేడియోతో బాగా దగ్గర సంబంధం ఉంది. ఆయన కూడా దేశప్రజలతో సంభాషించడానికి రేడియోను మాధ్యమంగా ఎన్నుకున్నారు.

1942లో,సుభాష్ బాబు ఆజాద్ హిండ్ రేడియోను మొదలుపెట్టారు. రేడియో ద్వారానే ఆయన ఆజాద్ హిండ్ ఫౌజ్ లోని సైనికులతోనూ, దేశప్రజలతోనూ మాట్లాడుతూ ఉండేవారు. రేడియోలో సుభాష్ బాబు మాట్లాడే పధ్ధతే వేరుగా ఉండేది. మాట్లాడే ముందుగా ఆయన అందరితోనూ -– This is Subhash Chandra Bose speaking to you over the Azad Hind Radio అనేవారు. ఆ మాట వింటూనే శ్రోతల్లో ఒక కొత్త ఉత్సాహం, కొత్త శక్తి ప్రవహించేవి.

ఈ రేడియో స్టేషన్ వారానికొకసారి వార్తలను కూడా ప్రసారం చేసేదని నాకు చెప్పారు. ఆంగ్లం, హిందీ, తమిళం, బాంగ్లా,మరాఠీ, పంజాబీ,పష్తో , ఇంకా ఉర్దూ భాషల్లో ఈ వార్తలు ప్రసారమయ్యేవిట. ఈ రేడియో స్టేషన్ ను నిర్వహించడంలో

గుజరాత్ లో ఉండే ఎమ్.ఆర్.వ్యాస్ గారు చాలాముఖ్య పాత్ర వహించారుట.ఆజాద్ హింద్ రేడియోలో ప్రసారమయ్యే కార్యక్రమాలను ప్రజలు బాగా ఇష్టపడేవారుట. ఆ కార్యక్రమాల వల్ల మన స్వాతంత్ర సమరయోధులకు కూడా చాలా బలం లభించేది.

ఈ క్రాంతి మందిరంలోనే ఒక దృశ్యకళా సంగ్రహాలయం కూడా తయారుచేసారు. భారతీయ కళలు,సంస్కృతిలను గురించి ఎంతో ఆకర్షణీయంగా చెప్పే ప్రయత్నం ఇక్కడ చేశారు. సంగ్రహాలయంలో నాలుగు చారిత్రాత్మక ప్రదర్శనలు ఉన్నాయి. అక్కడ మూడు శతాబ్దాల పూర్వం వేయబడిన 450 కన్నాఎక్కువ చిత్తరువులు, కళాచిత్రాలు ఉన్నాయి. సంగ్రహాలయంలో అమృతా షేర్గిల్, రాజారవివర్మ, అవనీంద్ర నాథ్ టాగూర్, గగనేంద్రనాథ్ టాగూర్, నందలాల్ బోస్, జామినీ రాయ్, సైలోజ్ ముఖర్జీ, వంటి ఎందరో గొప్ప కళాకారుల ఉత్కృష్టమైన చిత్రాలు ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. మీరు అక్కడికి వెళ్ళి గురుదేవులు రవీంద్రనాథ ఠాగూర్ చిత్రాలను కూడా తప్పక చూడవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నను. చిత్రలేఖనం గురించి మాట్లాడుతూ గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ గీసిన ఉత్కృష్టమైన చిత్రాలను చూడమంటున్నారేమిటీ అనుకుంటున్నారా? మీకు ఇంతవరకు గురుదేవులు రవీంద్రనాథ్ టాగూర్ ఒక రచయితగా, ఒక సంగీతకారుడిగానే తెలిసి ఉంటారు. కానీ గురుదేవులు ఒక చిత్రకారుడు కూడా. ఆయన ఎన్నో విషయలాపై చిత్రాలను గీశారు. ఆయన పశుపక్ష్యాదుల చిత్రాలను కూడా వేశారు. ఎన్నో సుందరమైన దురానుగత చిత్రాలను కూడా చిత్రించారు. ఇంతే కాక ఆయన మనుష్య గుణగణాలను కూడా తన కేన్వాస్ పై చిత్రీకరించే ప్రయత్నం చేసారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే గురుదేవులు టాగూర్ తన అత్యధిక చిత్రలకు ఏ పేరూ పెట్టనేలేదు. తన చిత్రాలను చూసేవారు, స్వయంగా ఆ చిత్రాన్ని అర్థం చేసుకుని, ఆ చిత్తరువులో ఉన్న సందేశాన్ని తన దృష్టికోణంతో అర్థం చేసుకోవాలని ఆయన అనుకునేవారు. ఆయన చిత్తరువులు యూరోపియన్ దేశాల్లో, రూస్ లోనూ, అమెరికాలోనూ కూడా ప్రదర్శించబడ్డాయి. క్రాంతి మందిరంలో ఆయన చిత్తరువులను చూడడానికి మీరు తప్పక వెళ్తారని నాకు నమ్మకం ఉంది.

నా ప్రియమైన దేశప్రజలారా, భారతదేశం సాధువుల భూమి. మన సాధువులు, తమ ఆలోచనలు, తమ పనుల ద్వారా సద్భావం, సమానత, ఇంకా సామాజిక సాధికారత సందేశాలను అందించారు. అలాంటి ఒక సాధువే సంత్ రవిదాస్. ఫిబ్రవరి19 రవిదాస్ గారి జయంతి. సంత్ రవిదాస్ గారి దోహాలు చాలా ప్రసిధ్ధి పొందాయి. సంత్ రవిదాస్ గారు చిన్న చిన్న వాక్యాల్లోనే పెద్ద పెద్ద సందేశాలను అందించేవారు. ఆయన ఏమన్నారంటే –

“जाति-जाति में जाति है,

जो केतन के पात,

रैदास मनुष ना जुड़ सके

जब तक जाति न जात”

అరటిచెట్టుకాండాన్నిచీరుతూఉంటే, పొరవెనకాలపొర, మళ్ళీపొర వెనకాల పొర వస్తాయే కానీ లోపల ఏమీ ఉండదు. చెట్టు చీరడం పూర్తయిపోతుంది. అచ్చం అలానే, మనిషిని మతాల్లోకి పంచేసరికీ మనిషి మనిషిగా మిగలలేదు. అయన ఏమనేవారంటే, నిజంగా భగవంతుడు ప్రతి మనిషిలోనూ ఉన్నప్పుడు, మనుషులను కులం, మతం మొదలైన సామాజిక ఆధారాలతో విడదీయడం సరైనది కాదు అనేవారు.

గురు రవిదాస్ గారి జననం ప్రవిత్ర భూమి అయిన వారణాసిలో జరిగింది. సంత్ రవిదాస్ గారు తన జీవితకాలమంతా తన సందేశాల ద్వారా శ్రమ, ఇంకా శ్రామికుల ప్రాముఖ్యతను తెలిపే ప్రయత్నం చేశారు. ఆయన ప్రపంచానికి శ్రమ తాలూకూ ప్రాముఖ్యతను వాస్తవికంగా తెలిపే ప్రయత్నం చేశారనడం తప్పు అవదు. ఆయన అనేవారు –

“मन चंगा तो कठौती में गंगा”

అంటే “మీమనసు, హృదయంపవిత్రంగాఉంటేసాక్షాతూఈశ్వరుడేమీహృదయంలోనివసిస్తాడు” అనిఅర్థం.

సంత్రవిదాస్సందేశాలుప్రతిశాఖను, అన్నివర్గాలప్రజలనుప్రభావితంచేశాయి. చిత్తోడ్మహారాజా, రాణీలను,మీరాబాయిమొదలైనవారంతాఆయనశిష్యులే. నేనుమరోసారిసంత్రవిదాస్గారికినమస్కరిస్తున్నాను.
నాప్రియమైనదేశప్రజలారా, కిరణ్సిదర్గారుమైగౌలోఏంరాసారంటే, నేనుమన్కీబాత్లోభారతీయఅంతరిక్ష్యకార్యక్రమాలు, దానిభవిష్యత్తుతోముడిపడినవిషయాలపైదృష్టినిసారించాలనిచెప్పారు. విద్యార్థులలోఅంతరిక్ష్య కార్యక్రమాలపై ఆసక్తి పెంచేలాంటి విషయాలు మాట్లాడాలనీ, కొంచెం కొత్తగా, విద్యార్థులు ఆకాశపు పరిధిని దాటి ఆలోచించేలా ఉండాలని కోరుతూ వాళ్లతో మాట్లాడమని నన్ను కోరారు.

కిరణ్ గారూ, మీ ఆలోచనను, ప్రత్యేకంగా మన పిల్లల కోసం ఇచ్చిన సందేశాన్ని మెచ్చుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం నేను అహ్మదాబాద్ వెళ్ళాను. అక్కడ నాకు విక్రమ్ సారాభాయ్ గారి విగ్రహావిష్కరణ చేసే అదృష్టం లభించింది. భారత అంతరిక్ష్య కార్యక్రమాల్లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారికి ఒక ప్రత్యేకమైన తోడ్పాటు ఉంది. మన అంతరిక్ష్య కార్యక్రమాల్లో దేశంలోని అసంఖ్యాక యువ వైజ్ఞానికుల సహకారం ఉంది. మనం ఎంతో గర్వించదగ్గ విషయం ఏమిటంటే ఇవాళ మన విధ్యార్థులు అభివృధ్ధి చేసిన సేటిలైట్, Sounding Rocketsఅంతరిక్ష్యం లోకి వెళ్తున్నాయి. ఈ జనవరి 24న మన విధ్యార్థులు తయారు చేసిన “కలామ్- సేట్” లాంచ్ చెయ్యబడింది. ఒరిస్సాలో విశ్వవిద్యాలయ విద్యార్థుల ద్వారా తయరుచెయ్యబడిన Sounding Rocketsకూడా ఎన్నో రికార్డులను సృష్టించాయి. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండీ 2014 వరకూ తయారైన స్పేస్ మిషన్లన్నింటిలో దాదాపు Space Mission లన్నింటినీ గడచిన నాలుగేళ్ళలో మొదలుపెట్టారు. ఒకే అంతరిక్ష్యయానంతో, ఒకేసారి 104 సేటిలైట్స్ లాంచ్ చేసిన ప్రప్రంచరికార్డుని కూడా మనం సృష్టించాము. త్వరలోనే మనం చంద్రయాన్ -2 ప్రచారం ద్వారా చంద్రుడిపై భారతదేశ ఉనికిని నమోదు చెయ్యబోతున్నాం.
స్పేస్ టెక్నాలజీని మన దేశం ధన, మాన రక్షణకి కూడా బాగా ఉపయోగించుకుంటోంది. వరదలైనా, రైలు లేదా రోడ్డు రక్షణ మొదలైనవాటికి స్పేస్ టెక్నాలజీ వల్ల చాలా సహాయం అందుతోంది. మన మత్స్యకార సోదరులకు NAVICdevices పంచడం జరిగింది. ఇది వాళ్ల రక్షణతో పాటూ వాళ్ళు ఆర్థికంగా అభివృధ్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సేవల పంపిణీకీ ,accountability ని ఇంకా మెరుగుపరచడానికీ స్పేస్ టెక్నాలజీ ని మనం వాడుకుంటున్నాం. “Housing for all”అందరికీ ఇళ్ళు అనే పథకంలో 23 రాష్ట్రాల్లో దాదాపు 40లక్షల ఇళ్ళను జియో-ట్యాగ్ చేసారు. దానితో పాటుగా ఉపాధిరూపంలో దాదాపు 350కోట్లు సంపత్తిని జియో ట్యాగ్ చేశారు . ఇవాళ మన శాటిలైట్లు అభివృధ్ధి చెందుతున్న దేశ ప్రగతికి ప్రతీకలు. ప్రపంచంలో ఎన్నో దేశాలతో మనకు పెరుగుతున్న సత్సంబంధాలకు దీని సహకారం ఎంతో ఉంది. సౌత్ ఏషియా శాటిలైట్స్ కి ఒక ప్రత్యేకమైన చొరవ ఉంది. అవి పొరుగున ఉన్న మన మిత్రరాజ్యాలకు కూడా అభివృధ్ధి బహుమతిని ఇచ్చాయి. తన competitive launch servicesద్వారా భారతదేశం ఇవాళ కేవలం అభివృధ్ధి చెందుతున్న దేశాలవే కాకుండా అభివృధ్ధి చెందిన దేశాల శాటిలైట్స్ ని కూడా లాంచ్ చేస్తోంది. ఆకాశం, నక్షత్రాలూ ఎప్పుడూ పిలల్లకు ఆకర్షణీయమైనవే. మన స్పేస్ ప్రోగ్రామ్ పిల్లలకు గొప్పగా ఆలోచించడానికీ, తమ పరిధిని దాటి ఆలోచించడానికీ అవకాశం ఇస్తుంది. ఇది ఇప్పటిదాకా అసంభవమనుకున్న విషయాలు. ఇది మన పిల్లలు నక్షత్రాలను చూడడం తో పాటుగా, కొత్త నక్షత్రాలను వెతకడానికి, వారికి ప్రేరణను అందించడానికి ఉపయోగపడే దృష్టికోణం ఇది.

నా ప్రియమైన దేశప్రజలారా, నేను ఎప్పుడూ చెప్తాను. ఆటలు ఆడేవారు రాణించాలి. ఈసారి ఖేలో ఇండియాలో ఎందరో తరుణ్ లు ,యువ ఆటగాళ్ళూ, వికశించి ముందుకువచ్చారు. జనవరి నెలలో పూనాలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో 18 క్రీడల్లో దాదాపు 6000మంది ఆటగాళ్ళు పాల్గొన్నారు. మన క్రీడల local ecosystem బలంగా ఉంటే, అంటే మన మూలాలు బలంగా ఉంటేనే మన యువ క్రీడాకారులు దేశంలోనూ, ప్రపంచంలోనూ తమ సామర్థ్యాన్ని అత్యుత్తమంగా ప్రదర్శించగలరు. స్థానికంగా క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనను కనబరచిప్పుడే వారు గ్లోబల్ స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రదర్శనను చూపగలరు. ఈసారి ఖేలో ఇండియాలో ప్రతి రాష్ట్రం నుండి క్రీడాకారులు తమతమ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనను అందించారు. మెడల్ వచ్చిన ఎందరో క్రీడాకారుల జీవితం, ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది.

బాక్సింగ్ లో యువ క్రీడాకారుడు ఆకాష్ గోర్ఖా వెండి పతకాన్ని సాధించాడు. ఆకాష్ తండి రమేష్ గారు పుణే లోని ఒక కాంప్లెక్స్ లో వాచ్మేన్ గా పని చేస్తారు. తన కుటుంబంతో పాటూ ఆయన ఒక పార్కింగ్ షెడ్ లో ఉంటారు. మహారాష్ట్ర లో అండర్-21 మహిళా కబడ్డి జట్టు కేప్టెన్ సోనాలీ హేల్వీ సతారా నివాసి. చిన్నవయసులోనే తన తండ్రిని కోల్పోయింది ఆమె. ఆమె తల్లి, సోదరుడు ఆమె ప్రతిభకు తమ సహకారాన్ని అందించారు. చాలాసార్లు కబడ్డి లాంటి ఆటల్లో మహిళలకు సహకారం పెద్దగా లభించదు. అయినా కూడా సోనాలీ కబడ్ది ని వరించి, అత్యుత్తమ ప్రతిభను చూపెట్టింది. ఆసన్సోల్ లోని పదేళ్ళ అభినవ్ షా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో అందరికంటే తక్కువ వయస్కుడిగా బంగారు పతకాన్ని సాధించాడు. కర్ణాటక కు చెందిన ఒక రైతు బిడ్డ అక్షతా వాస్వాని కమ్తీ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకాన్ని గలుచుకుంది. ఆమె తన గెలుపుకి కారణం తన తండ్రి అని చెప్పింది. ఆమె తండ్రి బెల్గామ్ లో ఒక రైతు. మనం నవభారత నిర్మాణం గురించి మాట్లాడుతుంటాం. యువశక్తి సంకల్పమే న్యూ ఇండియా కదా. ఖేలో ఇండియా తాలూకూ ఈ కథలన్నీ చెప్పేదేమిటంటే – న్యూ ఇండియా నిర్మాణం కేవలం పెద్ద పట్టణాల ప్రజలది మాత్రమే కాక; చిన్న చిన్న నగరాల, గ్రామాల, ప్రాంతాల నుండి వచ్చిన యువజనుల, పిల్లల, young sporting talents,మొదలైనవారందరి సహకారం కూడా ఉంది.

నా ప్రియమైన దేశప్రజలారా, మీరు ఎన్నో ప్రముఖ అందాల పోటీల గురించి వినే ఉంటారు. కానీ మీరు మెరిసే టాయిలెట్ ల పోటీ గురించి ఎప్పుడైనా విన్నారా?గత నెల రోజులుగా జరుగుతున్న ఈ విచిత్రమైన పోటీలో ఏభైవేల కన్నా ఎక్కువ టాయిలెట్లు పోటీ పడ్డాయి. ఈ విచిత్రమైన పోటీ పేరు “స్వచ్ఛ సుందర్ సౌచాలయ్”. ప్రజలు తమ టాయిలెట్లను శుభ్రంగా ఉంచడంతో పాటూ, దానిని రంగులతో అలంకరించి, వాటికి పెయింటింగ్స్ వేయించి అందంగా కూడా తయారుచేస్తున్నారు. మీకు కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా, కచ్ నుండి కామ్రూప్ వరకూ ఉన్న స్వచ్ఛ సుందర్ సౌచాలయాల చిత్రాలు సామాజిక మాధ్యమాలలో చూడడానికి దొరుకుతాయి. నేను సర్పంచ్ లకూ, గ్రామాధిపతులకూ తమ పంచాయితీలలో ఈ ప్రచారానికి నేతృత్వం వహించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీ స్వచ్ఛ సుందర్ సౌచాలయ్ ఫోటోను #MylzzatGharతో జోడించి సామాజిక మాధ్యమంలో తప్పక షేర్ చేయండి.

మిత్రులారా, 2014, అక్టోబర్ రెండవ తేదీన మనందరము మన దేశాన్ని పరిశుభ్రంగా తయారుచెయ్యడానికీ, బహిరంగ మలమూత్రవిసర్జన రహితంగా తయారుచెయ్యడానికి కలిసికట్టుగా ఒక చిరస్మరణియ యాత్రను మొదలుపెట్టాము. భారతదేశంలో ప్రజల సహకారంతో ఇవాళ భారతదేశం 2019 కన్నా ముందరే బహిరంగ మలమూత్రవిసర్జన రహితంగా తయారయ్యింది. ఇది బాపూజీ 150 వ జయంతి కల్లా మనం ఇచ్చే గొప్ప శ్రధ్ధాంజలి.

పరిశుభ్ర భారతదేశం తాలూకూ ఈ చిరస్మరణియ యాత్రను లో మన్ కీ బాత్ శ్రోతల సహకారం కూడా ఎంతో ఉంది. అందువల్లనే, ఐదు లక్షల ఏభైవేల కన్న ఎక్కువ గ్రామాలు, ఆరువందల జిల్లాలు తమని తాము బహిరంగ మలమూత్రవిసర్జన నుండి విముక్తి పొందినట్లుగా ప్రకటించాయన్న విషయం మీ అందరితో పంచుకోవడం ఆనందాన్ని ఇస్తోంది. గ్రామీణ భారతదేశంలో పరిశుభ్రత coverage 98% ని మించింది. దాదాపు తొమ్మిది కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం అందించబడింది.

నా ప్రియమైన చిట్టి పొట్టి మిత్రులారా, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో నివశించే అంశుల్ శర్మ మై గౌ లో ఏం రాసాడంటే, నాకు పరీక్షలు, ఎక్షామ్ వారియర్స్ గురించి చెప్పండి అని రాశాడు.

అంశుల్ గారూ, ఈ విషయం ఎత్తినందుకు ధన్యవాదాలు. అవును. ఎన్నో కుటుంబాలకు ఏడాదిలో మొదటిభాగం పరీక్షా సమయం. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి అధ్యాపకుల వరకూ, అందరూ పరీక్షల సంబంధిత పనులలో బిజీగా ఉంటారు. నేను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపకులకూ శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను ఈ విషయంపై ఇవాల్టి మన్ కీ బాత్ కార్యక్రమంలో చర్చించాలనుకుంటున్నాను. కానీ నేను రెండు రోజుల తర్వాత, అంటే జనవరి29వ తేదీన ఉదయం 11 గంటలకు పరీక్షలపై దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో చర్చా కార్యక్రమాన్ని జరపబోతున్నానని చెప్పడం మీకు ఆనందాన్ని కలిగింస్తుందని ఆశిస్తున్నాను. ఈసారి విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులనూ, అధ్యాపకులనూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గోబోతున్నారు. ఈసారి కొన్ని ఇతర దేశాల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గోబోతున్నారు. ఈ పరీక్షలలో చర్చలో, పరీక్షలతో ముడిపడిన అనేక విషయాలతో, ప్రత్యేకంగా ఒత్తిడి రహిత పరీక్షల గురించి యువ మిత్రులతో ఎన్నో కబుర్లు మాట్లాడబోతున్నాను.

ఇందుకోసం నేను ప్రజలను ఇన్పుట్ లనూ, ఐడియాలను పంపాలని కోరాను. మై గౌ లో పెద్ద ఎత్తున ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో ఎన్నో అభిప్రాయాలు, సూచనలనూ నేను తప్పకుండా టౌన్ హాల్ కార్యక్రమంలో మీ ముందర ఉంచుతాను. మీరు తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొని, సామాజిక మాధ్యమం, నమో యాప్ మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమం లైవ్ టెలీకాస్ట్ ను చూడవచ్చు.

నా ప్రియమైన దేశప్రజలారా, జనవరి 30 పూజ్యులైన బాపూ వర్ధంతి. పదకొండింటికి యావత్ దేశం అమరవీరులకు శ్రధ్ధాంజలి ఘటిస్తుంది. మనం ఎక్కడ ఉన్నా ఒక కూడా రెండు నిమిషాలు అమరవీరులకి తప్పక శ్రధ్ధాంజలి ఘటిద్దాం. పూజ్యులైన బాపూ ని తప్పక స్మరిద్దాం. పూజ్యులైన బాపూ కలలను సాకారం చేయాలని, నవభారతాన్ని నిర్మించాలని, దేశపౌరులుగా మన కర్తవ్యాలను నిర్వహించాలని – ఈ సంకల్పాలతో ముందుకు నడుద్దాం రండి. ఈ 2019 యాత్రను సఫలపూర్వకంగా ముందుకు నడిపిద్దాం. మీ అందరికీ నా అనేకానేక శుభాకాంక్షలు. అనేకానేక ధన్యవాదాలు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
In a historic first, Constitution of India translated in Kashmiri

Media Coverage

In a historic first, Constitution of India translated in Kashmiri
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Cabinet approves Rs 1,526.21 crore upgrade of NH-326 in Odisha
December 31, 2025

The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi today approved the widening and strengthening of existing 2-Lane to 2-Lane with Paved Shoulder from Km 68.600 to Km 311.700 of NH-326 in the State of Odisha under NH(O) on EPC mode.

Financial implications:

The total capital cost for the project is Rs.1,526.21 crore, which includes a civil construction cost of Rs.966.79 crore.

Benefits:

The upgradation of NH-326 will make travel faster, safer, and more reliable, resulting in overall development of southern Odisha, particularly benefiting the districts of Gajapati, Rayagada, and Koraput. Improved road connectivity will directly benefit local communities, industries, educational institutions, and tourism centres by enhancing access to markets, healthcare, and employment opportunities, thereby contributing to the region’s inclusive growth.

Details:

  • The section of Mohana–Koraput of the National Highway (NH-326) at present have sub-standard geometry (intermediate lane/2-lane, many deficient curves and steep gradients); the existing road alignment, carriageway width and geometric deficiencies constrain safe, efficient movement of heavy vehicles and reduce freight throughput to coastal ports and industrial centres. These constraints will be removed by upgrading the corridor to 2-lane with paved shoulders with geometric corrections (curve realignments and gradient improvements), removal of black spots and pavement strengthening, enabling safe and uninterrupted movement of goods and passengers and reducing vehicle operating costs.
  • The upgradation will provide direct and improved connectivity from Mohana–Koraput into major economic and logistics corridors — linking with NH-26, NH-59, NH-16 and the Raipur–Visakhapatnam corridor and improving last-mile access to Gopalpur port, Jeypore airport and several railway stations. The corridor connects important industrial and logistic nodes (JK Paper, Mega Food Park, NALCO, IMFA, Utkal Alumina, Vedanta, HAL) and education/tourism hubs (Central University of Odisha, Koraput Medical College, Taptapani, Rayagada), thereby facilitating faster freight movement, reducing travel time and enabling regional economic development.
  • The project lies in southern Odisha (districts of Gajapati, Rayagada and Koraput) and will significantly improve intra-state and inter-state connectivity by making vehicle movement faster and safer, stimulating industrial and tourism growth and improving access to services in aspirational and tribal areas. Economic analysis shows the project’s EIRR at 17.95% (base case) while the financial return (FIRR) is negative (-2.32%), reflecting the social and non-market benefits captured in the economic appraisal; the economic justification is driven largely by travel-time and vehicle-operating-cost savings and safety benefits (including an estimated travel-time saving of about 2.5–3.0 hours and a distance saving of ~12.46 km between Mohana and Koraput after geometric improvements).

Implementation strategy and targets:

  • The work will be implemented on EPC mode. Contractors will be required to adopt proven construction and quality-assurance technologies, which may include precast box-type structures and precast drains, precast RCC/PSC girders for bridges and grade separators, precast crash barriers and friction slabs on Reinforced-Earth wall portions, and Cement Treated Sub-Base (CTSB) in pavement layers. Quality and progress will be verified through specialized survey and monitoring tools such as Network Survey Vehicle (NSV), periodic drone-mapping. Day-to-day supervision will be carried out by an appointed Authority Engineer and project monitoring will be conducted through the Project Monitoring Information System (PMIS).
  • The work is targeted to be completed in 24 months from the appointed date for each package, followed by a five-year defect liability/maintenance period (total contract engagement envisaged as 7 years: 2 years construction + 5 years DLP). Contract award will follow after completion of statutory clearances and required land possession.

Major impact, including employment generation potential:

  • This project is aimed at providing faster and safer movement of traffic and improving connectivity between the southern and eastern parts of Odisha, particularly linking the districts of Gajapati, Rayagada, and Koraput with the rest of the State and neighbouring Andhra Pradesh. The improved road network will facilitate industrial growth, promote tourism, enhance access to education and healthcare facilities, and contribute to the overall socio-economic development of the tribal and backward regions of southern Odisha.
  • Various activities undertaken during the construction and maintenance period are expected to generate significant direct and indirect employment opportunities for skilled, semi-skilled and unskilled workers. The project will also boost local industries involved in the supply of construction materials, transportation, equipment maintenance, and related services, thus supporting the regional economy.
  • The project is located in the State of Odisha and traverses three districts — Gajapati, Rayagada, and Koraput. The corridor connects major towns such as Mohana, Rayagada, Laxmipur, and Koraput, providing improved intra-state connectivity within Odisha and enhancing inter-state linkage with Andhra Pradesh through the southern end of NH-326.

Background:

Government has declared the stretch “the Highway starting from its junction with NH-59 near Aska, passing through Mohana, Raipanka, Amalabhata, Rayagada, Laxmipur and terminating at its junction with NH-30 near Chinturu in the State of Odisha” as NH-326 vide Gazette Notification dated 14th August 2012.