దేశంలోని మారుమూల ప్రాంతాలు, ఇంత‌కాలం స‌రైన ర‌వాణా సౌక‌ర్యాలు లేకుండా ప్ర‌ధాన స్ర‌వంతిలో లేని ప్రాంతాల‌కు రైల్వే సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తూ వాటిని క‌ల‌ప‌డం జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. గుజ‌రాత్ లోని కెవాడియానుంచి దేశంలోని ప‌లు ప్రాంతాలకు వేసిన 8 కొత్త రైళ్ల‌ను ఆయ‌న ప్రారంభించారు. అంతే కాదు ప‌లు రైల్వే ప్రాజెక్టుల‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించారు. 
బ్రాడ్ గేజ్ రైళ్ల వేగాన్ని పెంచ‌డం, విద్యుదీక‌ర‌ణ ప‌నులను చేప‌ట్ట‌డం త‌దిత‌ర ప‌నుల‌ను వేగ‌వంత‌మ‌య్యాయ‌ని రైళ్ల వేగం మ‌రింత పెరుగుతుంద‌ని అన్నారు. అత్య‌ధిక వేగ సామ‌ర్థ్యాల‌కోసం బ‌డ్జెట్లో నిధుల‌ను పెంచ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాని అన్నారు.రైల్వేలు ప‌ర్యావ‌ర‌ణ హితంగా వుండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని ఆయ‌న అన్నారు. కెవాడియా రైల్వే స్టేష‌న్ కు హ‌రిత భ‌వ‌న స‌ర్టిఫికెట్ ల‌భించింద‌ని..ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి రైల్వే స్టేష‌న్ గా నిలిచింద‌ని ఆయ‌న అన్నారు. 

రైల్వే రంగంలో ప్రారంభించిన ఆత‌ర్మ‌నిర్భ‌ర కార్య‌క్ర‌మాల ప్రాధాన్య‌త‌ను ఆయ‌న వివ‌రించా‌రు.రైల్వే సంబంధిత త‌యారీ, సాంకేతిక‌త అనేది ఫ‌లితాల‌నిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. అత్య‌ధిక హార్స్ ప‌వ‌ర్ విద్యుత్ రైల్వే ఇంజిన్ ను భార‌త‌దేశంలోనే త‌యారు చేయ‌డం కార‌ణంగా , ప్ర‌పంచ మొద‌టి డ‌బుల్ స్టాక్డ్ లాంగ్ హాల్ కంటెయిన‌ర్ రైలును భార‌త‌దేశం ప్రారంభించింద‌ని ఆయ‌న అన్నారు. త‌ద్వారా ఆత్మ‌నిర్భ‌ర్ విజ‌య‌వంతమైంద‌ని ఆయ‌న అన్నారు. ఈ రోజున దేశంలోనే త‌యారైన ప‌లు ఆధునిక రైళ్లు భార‌తీయ రైల్వేలో భాగంగా వున్నాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
రైల్వేల‌రంగంలో మార్పుల‌కోసం నైపుణ్య‌త క‌లిగిన మాన‌వ‌వ‌న‌రుల అవ‌స‌రం ఎంతైనా వుంద‌ని ఈ కొర‌త తీర్చ‌డానికిగాను వ‌డోద‌ర‌లో రైల్వేల‌కు చెందిన డీమ్డ్ విశ్వ‌విద్యాల‌యం స్థాపించ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు. ఈ స్థాయిలో సంస్థ‌ను క‌లిగిన అతి కొద్ది దేశాల్లో భార‌త‌దేశం ఒక‌టి అని ఆయ‌న అన్నారు. రైల్వేల‌ద్వారా వ‌స్తు ర‌వాణాకోసం, బ‌హుముఖ ప‌రిశోధ‌న‌లకోసం, శిక్ష‌ణ‌ల‌కోసం ఆధునిక సౌక‌ర్యాలు ఏర్పాటు చేసుకున్నామ‌ని ప్ర‌ధాని వివ‌రించారు. ఇక్క‌డ 20 రాష్ట్రాల‌కు చెందిన యువ‌త‌కు శిక్ష‌ణ ల‌భిస్తోంద‌ని వారు రైల్వే రంగ ప్ర‌గ‌తిని ముందుకు తీసుకుపోతార‌ని ఆయ‌న అన్నారు. ప‌రిశోధ‌న‌లు, ఆవిష్క‌ర‌ణ ద్వారా రైల్వే రంగాన్ని ఆధునీక‌రించ‌డానికి ఇది దోహ‌దంచేస్తుంద‌ని ప్ర‌ధాని అన్నారు. 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Our focus for next five years is to triple exports from India and our plants in Indonesia, Vietnam

Media Coverage

Our focus for next five years is to triple exports from India and our plants in Indonesia, Vietnam": Minda Corporation's Aakash Minda
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam on Parakram Diwas, recalls Netaji Subhas Chandra Bose’s ideals of courage and valour
January 23, 2026

The Prime Minister, Shri Narendra Modi said that the life of Netaji Subhas Chandra Bose teaches us the true meaning of bravery and valour. He noted that Parakram Diwas reminds the nation of Netaji’s indomitable courage, sacrifice and unwavering commitment to the motherland.

The Prime Minister shared a Sanskrit Subhashitam reflecting the highest ideals of heroism-

“एतदेव परं शौर्यं यत् परप्राणरक्षणम्। नहि प्राणहरः शूरः शूरः प्राणप्रदोऽर्थिनाम्॥

The Subhashitam conveys that the greatest valour lies in protecting the lives of others; one who takes lives is not a hero, but the one who gives life and protects the needy is the true brave.

The Prime Minister wrote on X;

“नेताजी सुभाष चंद्र बोस का जीवन हमें बताता है कि वीरता और शौर्य के मायने क्या होते हैं। पराक्रम दिवस हमें इसी का स्मरण कराता है।

एतदेव परं शौर्यं यत् परप्राणरक्षणम्।

नहि प्राणहरः शूरः शूरः प्राणप्रदोऽर्थिनाम्॥”