Inaugurate New Terminal Building at Tiruchirappalli International Airport
Dedicates to nation multiple projects related to rail, road, oil and gas and shipping sectors in Tamil Nadu
Dedicates to nation indigenously developed Demonstration Fast Reactor Fuel Reprocessing Plant (DFRP) at IGCAR, Kalpakkam
Dedicates to nation the General Cargo Berth-II (Automobile Export/Import Terminal-II & Capital Dredging Phase-V) of Kamarajar Port
Pays tributes to Thiru Vijyakanth and Dr M S Swaminathan
Condoles the loss of lives due heavy rain in recent times
“The new airport terminal building and other connectivity projects being launched in Tiruchirappalli will positively impact the economic landscape of the region”
“The next 25 years are about making India a developed nation, that includes both economic and cultural dimensions”
“India is proud of the vibrant culture and heritage of Tamil Nadu”
“Our endeavour is to consistently expand the cultural inspiration derived from Tamil Nadu in the development of the country”
“Tamil Nadu is becoming a prime brand ambassador for Make in India”
“Our government follows the mantra that development of states reflects in the development of the nation”
“40 Union Ministers from the Central Government have toured Tamil Nadu more than 400 times in the past year”
“I can see the rise of a new hope in the youth of Tamil Nadu. This hope will become the energy of Viksit Bharat”

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

 

తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి గారు, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ గారు, నా మంత్రివర్గ సహచరులు జ్యోతిరాదిత్య సింధియా గారు, ఈ ధరణి కుమారుడు ఎల్.మురుగన్ గారు, తమిళనాడు ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమిళనాడు లోని నా కుటుంబ సభ్యులు!

 

వనక్కం (నమస్కారం)!

 

(తమిళ భాషలో ప్రారంభ వ్యాఖ్యలు)

 

2024 సంవత్సరం అందరికీ ప్రశాంతంగా, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. 2024లో నా తొలి బహిరంగ కార్యక్రమం తమిళనాడులో జరగడం అదృష్టంగా భావిస్తున్నా. దాదాపు రూ.20,000 కోట్ల విలువైన నేటి అభివృద్ధి ప్రాజెక్టులు తమిళనాడు పురోగతిని బలోపేతం చేస్తాయి. రోడ్డు మార్గాలు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇంధనం, పెట్రోలియం పైప్లైన్ వంటి ప్రాజెక్టులకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. వీటిలో చాలా ప్రాజెక్టులు ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడంతో పాటు వేలాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.

 

మిత్రులారా,

2023 చివరి కొన్ని వారాలు తమిళనాడులో చాలా మందికి కష్టంగా ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా చాలా మంది తోటి పౌరులను కోల్పోయాం. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. బాధిత కుటుంబాల పరిస్థితి చూసి చలించిపోయాను. ఈ విపత్కర సమయంలో తమిళనాడు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. అంతేకాదు, కొద్ది రోజుల క్రితం విజయకాంత్ గారిని కోల్పోయాం. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ ఆయన కెప్టెన్ గా రాణించారు. సినిమాల్లో తన నటనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. రాజకీయ నాయకుడిగా ఆయన ఎప్పుడూ అన్నింటికంటే జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు. ఆయనకు నివాళులర్పిస్తున్నాను. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా,

ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు తమిళనాడుకు చెందిన మరో కుమారుడు డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ జీ కూడా గుర్తుకొస్తారు. దేశానికి ఆహార భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. గత ఏడాది కూడా ఆయన్ను కోల్పోయాం.

 

ప్రియమైన నా తమిళ కుటుంబ సభ్యులారా,

 

రాబోయే 25 ఏళ్ల పాటు సాగే 'ఆజాదీ కా అమృత్కాల్' శకం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అంకితం చేయబడింది. నేను అభివృద్ధి చెందిన భారత్ గురించి ప్రస్తావించినప్పుడు, అది ఆర్థిక మరియు సాంస్కృతిక కోణాలను కలిగి ఉంటుంది. ఈ ప్రయాణంలో తమిళనాడుది ప్రత్యేక పాత్ర. తమిళనాడు భారతదేశ సాంస్కృతిక ఔన్నత్యానికి, వారసత్వానికి ప్రతీక. ఈ రాష్ట్రం తమిళ భాష మరియు జ్ఞానం యొక్క పురాతన భాండాగారాన్ని కలిగి ఉంది. తిరువళ్లువర్ నుంచి సుబ్రమణ్యభారతి వరకు ఎందరో ఋషులు, పండితులు విశేషమైన సాహిత్యాన్ని రచించారు. సి.వి.రామన్ నుంచి సమకాలీన వ్యక్తుల వరకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఈ నేల నుంచే ఆవిర్భవించింది. అందుకే తమిళనాడు పర్యటన నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.



ప్రియమైన కుటుంబ సభ్యులారా,



తిరుచిరాపల్లి నగరం ప్రతి మలుపులోనూ దాని ఘనమైన చరిత్రకు సాక్ష్యాలను ప్రదర్శిస్తుంది. ఇది పల్లవ, చోళ, పాండ్య, నాయక వంటి వివిధ రాజవంశాలు అవలంబించిన సుపరిపాలన నమూనాను ప్రతిబింబిస్తుంది. చాలా మంది తమిళ మిత్రులతో నాకున్న వ్యక్తిగత పరిచయం వల్ల, తమిళ సంస్కృతిపై లోతైన అవగాహన పొందాను. నేను ఎక్కడికి వెళ్లినా తమిళనాడు గురించి మాట్లాడకుండా ఉండటం కష్టం.

 

మిత్రులారా,

తమిళనాడు నుంచి వచ్చిన సాంస్కృతిక స్ఫూర్తిని నిరంతరం దేశాభివృద్ధి, వారసత్వంలో కలపాలన్నదే నా ఆకాంక్ష. ఢిల్లీలోని కొత్త పార్లమెంటు భవనంలో పవిత్ర సెంగోల్ ను ఏర్పాటు చేయడం యావత్ దేశాన్ని ప్రభావితం చేసిన తమిళనాడు సుపరిపాలన నమూనా నుండి ప్రేరణ పొందే ప్రయత్నానికి ప్రతీక. కాశీ-తమిళ సంగమం, సౌరాష్ట్ర-తమిళ సంగమం వంటి కార్యక్రమాలు దీని లక్ష్యం. ఈ ప్రచారాలు దేశవ్యాప్తంగా తమిళ భాష మరియు సంస్కృతి పట్ల ఉత్సాహాన్ని పెంచాయి.

ప్రియమైన కుటుంబ సభ్యులారా,



గత పదేళ్లలో ఆధునిక మౌలిక సదుపాయాలపై భారత్ గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, నిరుపేదలకు గృహనిర్మాణం, ఆరోగ్య సంరక్షణ ఇలా ఏ రంగంలోనైనా భారత్ భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనలో అపూర్వమైన పెట్టుబడులు పెడుతోంది. నేడు, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మొదటి ఐదు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది, ఇది కొత్త ఆశాదీపాన్ని అందిస్తుంది. ప్రధాన అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుండి గణనీయమైన పెట్టుబడులు భారతదేశానికి వస్తున్నాయి, ఇది తమిళనాడు మరియు దాని ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. 'మేకిన్ ఇండియా' కార్యక్రమానికి తమిళనాడు ప్రముఖ అంబాసిడర్ గా ఎదుగుతోంది.

 

ప్రియమైన కుటుంబ సభ్యులారా,

రాష్ట్రాభివృద్ధి ద్వారా జాతీయాభివృద్ధి అనే సూత్రానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ఏడాది కాలంలో కేంద్రానికి చెందిన 40 మంది మంత్రులు కలిసి 400 సార్లు తమిళనాడును సందర్శించారు. తమిళనాడులో త్వరితగతిన అభివృద్ధి చెందడం వల్ల భారతదేశ సమగ్ర పురోగతికి దోహదపడుతుంది. అభివృద్ధి, వాణిజ్యం, వ్యాపారం, ప్రజలకు సౌలభ్యం పెంపొందించడంలో కనెక్టివిటీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అభివృద్ధి స్ఫూర్తి నేడు తిరుచిరాపల్లిలో స్పష్టంగా కనిపిస్తోంది. తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్, దాని సామర్థ్యాన్ని మూడింతలు పెంచుతుంది, ఇది తూర్పు ఆసియా, మధ్యప్రాచ్యం మరియు దేశంలోని ఇతర ప్రాంతాలతో మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీని పెంచుతుంది. ఇది విస్తారమైన పరిసర ప్రాంతాలలో కొత్త పెట్టుబడి అవకాశాలను మరియు వ్యాపారాలను సృష్టిస్తుంది, విద్య, ఆరోగ్యం మరియు పర్యాటకం వంటి రంగాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. విమానాశ్రయ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, జాతీయ రహదారితో అనుసంధానించే ఎలివేటెడ్ రహదారి కూడా గణనీయమైన సౌలభ్యాన్ని అందిస్తుంది. తిరుచ్చి విమానాశ్రయం స్థానిక కళలు, సంస్కృతి మరియు తమిళ సంప్రదాయాలను ప్రపంచానికి ప్రదర్శిస్తుందని గమనించడానికి నేను సంతోషిస్తున్నాను.

 

ప్రియమైన కుటుంబ సభ్యులారా,



తమిళనాడు రైల్వే కనెక్టివిటీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఐదు కొత్త ప్రాజెక్టులను ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు ప్రయాణ మరియు రవాణాను సులభతరం చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలు మరియు విద్యుత్ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ రోజు ప్రారంభించిన రహదారి ప్రాజెక్టులు శ్రీరంగం, చిదంబరం, మదురై, రామేశ్వరం మరియు వెల్లూరు వంటి ముఖ్యమైన ప్రదేశాలను కలుపుతాయి - భక్తి, ఆధ్యాత్మికత మరియు పర్యాటకం యొక్క ముఖ్యమైన కేంద్రాలు. దీనివల్ల సామాన్యులకు, యాత్రికులకు ఎంతో మేలు జరుగుతుంది.



ప్రియమైన కుటుంబ సభ్యులారా,



గత దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వం ఓడరేవుల అభివృద్ధిపై విస్తృతంగా దృష్టి సారించింది. తీరప్రాంత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో, మత్స్యకారుల జీవితాలను మార్చడంలో మేము భారీ ప్రయత్నాలు చేసాము. తొలిసారి మత్స్యశాఖకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బడ్జెట్ ను రూపొందించారు. కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని తొలిసారి మత్స్యకారులకు విస్తరించారు. డీప్ సీ ఫిషింగ్ కోసం బోట్ల ఆధునీకరణకు ప్రభుత్వం తన సహకారాన్ని అందించింది. పీఎం మత్స్య సంపద యోజన మత్స్య రంగంలోని వారికి గణనీయమైన సహాయాన్ని అందిస్తోంది.

 

ప్రియమైన కుటుంబ సభ్యులారా,



సాగరమాల పథకం కింద తమిళనాడు సహా దేశంలోని వివిధ ఓడరేవులను చక్కగా నిర్మించిన రహదారులతో అనుసంధానం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాల కారణంగా, భారతదేశం యొక్క నౌకాశ్రయ సామర్థ్యం మరియు నౌక టర్నరౌండ్ సమయం గణనీయంగా మెరుగుపడింది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓడరేవుల్లో కామరాజర్ పోర్టు ఒకటి. మా ప్రభుత్వం దాని సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసింది. జనరల్ కార్గో బెర్త్-2, క్యాపిటల్ డ్రెడ్జింగ్ ఫేజ్-5 ప్రారంభోత్సవం తమిళనాడు దిగుమతి-ఎగుమతి సామర్థ్యాలను పెంచుతుంది, ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి ప్రయోజనం చేకూరుస్తుంది. న్యూక్లియర్ రియాక్టర్, గ్యాస్ పైప్లైన్లు తమిళనాడులో పరిశ్రమలు, ఉపాధి కల్పనను మరింత పెంచుతాయి.

 

ప్రియమైన కుటుంబ సభ్యులారా,



ప్రస్తుతం తమిళనాడు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిధులు వెచ్చిస్తోంది. గత దశాబ్ద కాలంలో తమ ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.120 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. 2014కు ముందు పదేళ్లలో తమిళనాడుకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల కంటే 2.5 రెట్లు ఎక్కువ నిధులు తమ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. గతంతో పోలిస్తే మన ప్రభుత్వం తమిళనాడులో జాతీయ రహదారుల నిర్మాణానికి మూడు రెట్లు అధికంగా ఖర్చు చేసింది. అదేవిధంగా 2014కు ముందుతో పోలిస్తే తమిళనాడులో రైల్వేల ఆధునీకరణకు 2.5 రెట్లు ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాం. నేడు తమిళనాడులో లక్షలాది పేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచిత రేషన్, వైద్యం అందుతున్నాయి. ఇక్కడి ప్రజలకు పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, కుళాయి నీటి కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్లతో సహా వివిధ సౌకర్యాలను మా ప్రభుత్వం అందించింది.



ప్రియమైన కుటుంబ సభ్యులారా,



అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి సమిష్టి కృషి అవసరం. తమిళనాడు ప్రజలు, యువత శక్తి సామర్థ్యాలపై నాకు అచంచల విశ్వాసం ఉంది. తమిళనాడు యువతలో కొత్త ఆలోచనలు, ఉత్సాహాన్ని నేను చూడగలను. ఈ ఉత్సాహమే అభివృద్ధి చెందిన భారత్ కు చోదకశక్తి అవుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి మీ అందరికీ అభినందనలు.



భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

వనక్కం!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi Speaks With Kuwait Crown Prince, Reaffirms India's Stand On Regional Security

Media Coverage

PM Modi Speaks With Kuwait Crown Prince, Reaffirms India's Stand On Regional Security
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets everyone on occasion of Navratri
March 19, 2026
PM shares a Sanskrit Subhashitam and a Hymn on this occasion

Prime Minister Shri Narendra Modi has extended his warmest greetings to everyone on the auspicious occasion of Navratri, praying for prosperity, health, and the fulfillment of the resolve for a Viksit Bharat.

The Prime Minister shared a Sanskrit Subhashitam on this occasion, highlighting the divine and benevolent grace of Goddess Shailaputri as the holy festival of Navratri commences. PM Modi also shared a devotional hymn dedicated to the Goddess on this occasion, noting that through the boundless mercy of the Goddess, the welfare of all citizens would be ensured, providing a powerful impetus to the collective goal of a developed India.

In a series of posts, the Prime Minister wrote on X:

"देशभर के मेरे परिवारजनों को नवरात्रि की हार्दिक मंगलकामनाएं। शक्ति की आराधना का यह दिव्य अवसर आप सभी के लिए सुख, सौभाग्य, समृद्धि और उत्तम स्वास्थ्य लेकर आए। शक्तिस्वरूपा मां दुर्गा की असीम कृपा से सबका कल्याण हो, जिससे विकसित भारत के हमारे संकल्प को भी नई ऊर्जा मिले। जय अंबे जगदंबे मां!"

"नवरात्रि के पहले दिन मां दुर्गा के प्रथम स्वरूप देवी शैलपुत्री की पूजा का विधान है। उनके आशीर्वाद से हर किसी के जीवन में संयम, शांति और सकारात्मक ऊर्जा का संचार हो, यही कामना है।

वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।
वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥"

I bow to Goddess Shailaputri, who fulfills all the wishes of her devotees, who is adorned with a crescent moon on her forehead, who rides a bull and who holds a trident in her hand. She is a glorious and revered goddess.

"जगतजननी मां दुर्गा के चरणों में कोटि-कोटि देशवासियों की ओर से मेरा नमन और वंदन! नवरात्रि के पावन पर्व पर देवी मां से विनती है कि वे हर किसी को अपने स्नेह और अनुकंपा का आशीर्वाद प्रदान करें। जय माता दी!"