"మూడు ప్రధాన ఓడరేవులు, పదిహేడు చిన్న ఓడరేవులతో, తమిళనాడు సముద్ర వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా మారింది"
"సుస్థిరమైన, ముందుచూపుగల అభివృద్ధితో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్న భారత్"
" భారతదేశ అభివృద్ధిలో ఆవిష్కరణలు, ఇతరులతో కలిసి పనిచేయడం గొప్ప బలాలు"
"ప్రపంచ సరఫరా వ్యవస్థలో ప్రధాన వాటాదారుగా భారత్, మెరుగవుతున్న ఈ సామర్థ్యమే మన ఆర్థిక వృద్ధికి పునాది"

నా మంత్రివర్గ సహచరులు, సర్బానంద సోనావాల్ జీ, శాంతనూ ఠాకూర్ జీ, టుటికోరిన్ పోర్ట్ అధికారులు, ఉద్యోగులు, ఇతర ప్రముఖ అతిథులు, సోదర సోదరీమణులారా,

'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) దిశగా మన ప్రయాణంలో ఈ రోజు అత్యంత ముఖ్యమైనది. ఈ కొత్త టుటికోరిన్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ భారతదేశ సముద్ర మౌలిక సదుపాయాలలో కొత్త తారగా నిలుస్తుంది. ఈ టెర్మినల్ వి.వో చిదంబరనార్ నౌకాశ్రయ సామర్థ్యాన్ని విస్తరిస్తుంది. పద్నాలుగు మీటర్ల కంటే ఎక్కువ లోతైన డ్రాఫ్ట్, 300 మీటర్ల కంటే ఎక్కువ బెర్త్‌తో వి.ఓ.సి. నౌకాశ్రయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వి.ఓ.సీ నౌకాశ్రయం వద్ద రవాణాపరమైన ఖర్చులు తగ్గించడంతో పాటు, భారత్ కోసం విదేశీ మారకద్రవ్యాన్ని కూడా ఆదా చేస్తుంది. ఈ సందర్భంలో మీ అందరికీ అలాగే తమిళనాడు ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

 

 రెండేళ్ల క్రితం పలు వి.ఓ.సీ. సంబంధిత ప్రాజెక్ట్‌లను ప్రారంభించే అవకాశం నాకు లభించిన విషయం ఇంకా నాకు గుర్తుంది. ఆ సమయంలో, ఈ నౌకాశ్రయంలో సరుకు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి అనేక పనులు ప్రారంభమైనాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో నేను టుటికోరిన్‌ సందర్శించిన సమయంలో కూడా, నౌకాశ్రయానికి సంబంధించి మరిన్ని పనులు ప్రారంభమైనాయి. ఈ రోజు వేగంగా జరుగుతున్న ఈ పనులు చూస్తుంటే నా సంతోషం రెట్టింపు అవుతుంది. ఈ కొత్త టెర్మినల్‌లో 40% మంది ఉద్యోగులు మహిళలే కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సముద్ర రంగంలోనూ మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధికి ఇది ప్రతీకగా నిలుస్తుంది.

 

మిత్రులారా,

తమిళనాడు తీరప్రాంతాలు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక్కడ నౌకాశ్రయ మౌలికవసతులలో మూడు ప్రధాన ఓడరేవులు అలాగే పదిహేడు చిన్న ఓడరేవులు ఉన్నాయి. ఈ సామర్థ్యం కారణంగా తమిళనాడు ఇప్పుడు సముద్ర వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉంది. పోర్ట్ ఆధారిత అభివృద్ధి మిషన్‌ను మరింత వేగవంతం చేయడానికి, మేము ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తున్నాము. దీనికోసం ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెడుతున్నాము. మేము వి.ఓ.సీ. సామర్థ్యాన్ని పెంచే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నాము. ఈ వి.ఓ.సీ. నౌకాశ్రయం భారతదేశ సముద్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉంది.

మిత్రులారా,

భారత సముద్ర మిషన్ నేడు కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాత్రమే పరిమితం కాలేదు. భారత్ ఇప్పుడు సుస్థిరమైన, ముందుచూపు గల అభివృద్ధితో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నది. ఇది మన వి.ఓ.సీ నౌకాశ్రయం విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నౌకాశ్రయం గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా, అలాగే సముద్రతీర పవన శక్తి కోసం నోడల్ పోర్ట్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంలో మన కార్యక్రమాలు అత్యంత ప్రభావవంతమైనవి అని ఇది రుజువు చేస్తుంది.

 

మిత్రులారా,

ఈ అభివృద్ధి ప్రయాణంలో ఆవిష్కరణలు, ఇతరులతో కలిసి పని చేయడం భారతదేశపు గొప్ప బలాలుగా ఉన్నాయి. నేడు ప్రారంభించుకున్న కొత్త టెర్మినల్ ఐక్యతా బలానికి నిదర్శనంగా నిలుస్తుంది. బాగా అనుసంధానించబడిన భారత్‌ నిర్మాణం కోసం సమష్టిగా కృషి జరుగుతున్నది. దేశవ్యాప్తంగా నేడు రహదారులు, జాతీయ రహదారులు, జలమార్గాలు, వాయుమార్గాల విస్తరణతో అనుసంధానం ఎంతో మెరుగైంది. దీని ఫలితంగా ప్రపంచ వాణిజ్యంలో భారత్ స్థానం గణనీయంగా బలపడింది. ప్రపంచ సరఫరాల వ్యవస్థలో భారతదేశం ప్రధాన వాటాదారుగా మారుతున్నది. మెరుగవుతున్న ఈ సామర్థ్యం మన ఆర్థికవృద్ధికి పునాది అవుతుంది. ఇదే బలం భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతుంది. భారత్ సామర్థ్యాలను మరింతగా పెంచుటలో తమిళనాడు కీలక పాత్ర పోషించడం నాకు సంతోషం కలిగిస్తున్నది. వీ.ఓ.సీ నౌకాశ్రయం వద్ద కొత్త టెర్మినల్‌ ప్రారంభ సందర్భంగా మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ధన్యవాదాలు.

 వణక్కమ్ (నమస్కారం).

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x

Media Coverage

India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26, 2026
దేశంలో క్రీడలు.. యువ నాయకత్వం.. పౌర బాధ్యత.. స్వచ్ఛంద సేవ.. దారుఢ్యం.. దేశ ప్రగతి వంటి అంశాలను ఈ చర్చలు ఒకే వేదికపైకి తెస్తాయి
ఈ చర్చలు ప్రధానంగా క్రీడలు.. ఒలింపిక్స్‌ ఆకాంక్షలు.. యువ నేతృత్వం.. వికిసిత భారత్.. మాదకద్రవ్య రహిత యువతరంపై దృష్టి సారిస్తాయి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026లో భాగంగా ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోగల రెండు కళాశాలల్లో యువతరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రగతి కార్యకలాపాల్లో యువత ఆకాంక్షలకు కీలక స్థానమిస్తూ ఆరోగ్యకర, క్రమశిక్షణాయుత. క్రీడాస్ఫూర్తి గల దేశానికి రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో క్రీడలు, యువ నాయకత్వం, పౌర కర్తవ్యం, స్వచ్ఛంద సేవ, దారుఢ్యం, దేశ పురోగమనం తదితర అంశాలన్నిటిపైనా చర్చను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తెస్తుంది. దేశ క్రీడారంగ పురోగమన ఆకాంక్షలతో యువత మమేకమయ్యే ప్రత్యక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. దేశ యువతరం, క్రీడా వ్యవస్థపై చర్చల సందర్భంగా వారి ఆలోచనలు, దృక్కోణాలను పంచుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమం అనంతరం యువ భాగస్వాములు, మై భారత్ వలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో చర్చలు సాగుతాయి. క్రీడాసక్తి గల యువత, ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతల మధ్య ప్రత్యక్ష ఇష్టాగోష్ఠి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో ‘యువతరం చర్చలు’ ప్రధానాంశంగా ఉంటాయి. యువ భాగస్వాములు తమ ఆలోచనలు, దృక్కోణాలు, ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఈ చర్చలు ప్రధానంగా దిగువ పేర్కొన్న 5 అంశాలపై కేంద్రీకృతమవుతాయి:

· మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, క్రీడా విజ్ఞానం, సార్వజనీన భాగస్వామ్యంతో జాతీయ క్రీడా వ్యవస్థ మెరుగుదల.

· శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపు, పారదర్శక ఎంపిక, దీర్ఘకాలిక క్రీడా వికాసం ద్వారా 2036లో ఒలింపిక్స్ దిశగా ప్రతిభకు పదును పెట్టడం.

· పరిపాలన వేదికలు, మై భారత్ నేతృత్వంలోని స్వచ్ఛంద సేవ ద్వారా యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం.

· పౌర చైతన్యం, భవిష్యత్‌ సంసిద్ధ నైపుణ్యం, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం, ద్వారా వికసిత భారత్ ప్రస్థానం వైపు యువతరానికి సాధికారత కల్పన.

· ఈ నెల 2న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి 100 వారాల ప్రచారం’లో భాగంగా వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య వినియోగంపై పోరులో క్రీడలు సహా, సహ రంగాల్లోని వివిధ బృందాల సేవల ద్వారా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ధ్యేయం.