‘గ్లోబల్ సౌత్ కు చెందిన పలు దేశాలతో సహా 100కు పైగా దేశాలకు దాదాపు 300 మిలియన్డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ లను భారత్ సరఫరా చేసింది‘
‘అనారోగ్యం లేకపోవడం మంచి ఆరోగ్యంతో సమానం కాదని భారతదేశ సాంప్రదాయ విజ్ఞానంచెబుతోంది‘
"భారతదేశానికి చెందిన పురాతన గ్రంథాలు ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూడాలనిమనకు ప్రబోధిస్తాయి"
‘చివరి మైలు వరకు ఆరోగ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా భారత్ చర్యలు‘
“వైవిధ్యం స్థాయితో పనిచేసే భారతదేశ విధానం ఇతర దేశాలకు కూడా ఒక ఫ్రేమ్ వర్క్ గా మారుతుంది"

గౌరవనీయులు,ప్రముఖులు, ప్రతినిధులు, నమస్కారాలు!

 

జెనీవాలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 76వ సమావేశాలకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతాభినందనలు. 75 ఏళ్ల పాటు ప్రపంచానికి సేవలందించిన చారిత్రాత్మక మైలురాయిని పూర్తి చేసినందుకు డబ్ల్యూహెచ్ ఒ ను అభినందిస్తున్నాను. 100 ఏళ్ల సర్వీసుకు చేరుకోబోయే వచ్చే 25 ఏళ్ల కాలానికి డబ్ల్యూహెచ్ లక్ష్యాలను నిర్దేశించుకుంటుందని నేను విశ్వసిస్తున్నాను.

 

మిత్రులారా,

 

కోవిడ్-19 మహమ్మారి ఆరోగ్య సంరక్షణలో మరింత సహకారం అవసరాన్ని మనకు చూపించింది. ఈ మహమ్మారి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలోని అనేక లోపాలను ఎత్తిచూపింది. ప్రపంచ వ్యవస్థల్లో స్థితిస్థాపకతను పెంపొందించడానికి సమిష్టి కృషి అవసరం.

 

మిత్రులారా,

 

ప్రపంచ ఆరోగ్య వాటా (ఈక్విటీ) ని పెంచాల్సిన అవసరాన్ని కూడా మహమ్మారి తెలియచేసింది. సంక్షోభ సమయంలో అంతర్జాతీయ సహకారానికి భారత్ తన నిబద్ధతను చాటుకుంది. దాదాపు 300 మిలియన్ వాక్సిన్ డోసులను 100 దేశాలకు పంపించాం.

వీటిలో చాలా దేశాలు గ్లోబల్ సౌత్ కు చెందినవి. రాబోయే సంవత్సరాల్లో వనరుల సమాన లభ్యతకు మద్దతు ఇవ్వడం డబ్ల్యూహెచ్ఓకు మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

 

మిత్రులారా,

 

అనారోగ్యం లేకపోవడం మంచి ఆరోగ్యంతో సమానం కాదని భారతదేశ సాంప్రదాయ విజ్ఞానం చెబుతుంది. అనారోగ్యం నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్యం దిశగా మరో అడుగు ముందుకు వేయాలి. యోగా, ఆయుర్వేదం , ధ్యానం వంటి సాంప్రదాయ పద్ధతులు ఆరోగ్య సంబంధిత శారీరక, మానసిక ,సామాజిక అంశాలను పరిష్కరిస్తాయి.

డబ్ల్యూహెచ్ ఒ మొట్టమొదటి గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ను భారత్ లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ద్వారా చిరుధాన్యాల ప్రాముఖ్యతను ప్రపంచం గుర్తించడం కూడా సంతోషంగా ఉంది.

 

మిత్రులారా,

 

ప్రపంచాన్ని ఒకే కుటుంబం - వసుధైక కుటుంబం - గా చూడాలని భారతదేశ ప్రాచీన గ్రంథాలు బోధిస్తాయి. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే నినాదంతో ఈ ఏడాది జీ20 సదస్సు సందర్భంగా పనిచేస్తున్నాం. మంచి ఆరోగ్యం కోసం మన విజన్ 'వన్ ఎర్త్ వన్ హెల్త్'. మన పర్యావరణ వ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. కాబట్టి, మన దృష్టి కేవలం మానవులకు మాత్రమే పరిమితం కాదు. ఇది జంతువులు, మొక్కలు ,పర్యావరణంతో సహా మొత్తం పర్యావరణ వ్యవస్థకు విస్తరిస్తుంది.

 

మిత్రులారా,

 

గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశం తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ లభ్యత, ప్రాప్యత పై పనిచేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్ కావచ్చు, లేదా ఆరోగ్య మౌలిక సదుపాయాలను భారీగా పెంచడం కావచ్చు, లేదా లక్షలాది కుటుంబాలకు పారిశుధ్యం మరియు తాగునీరు అందించే డ్రైవ్ కావచ్చు; చివరి మైలు వరకు ఆరోగ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మన అనేక ప్రయత్నాలు ఉన్నాయి. భారతదేశ వైవిధ్యం స్థాయితో పనిచేసే విధానం ఇతరులకు కూడా ఒక ఫ్రేమ్ వర్క్ కావచ్చు. అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాల్లో ఇలాంటి ప్రయత్నాలలోడబ్ల్యూహెచ్ ఒ కు మద్దతు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాం.

 

మిత్రులారా,

 

అందరికీ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో 75 ఏళ్లుగా డబ్ల్యూహెచ్ ఒ చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను. డబ్ల్యూహెచ్ ఒ వంటి ప్రపంచ సంస్థల పాత్ర గతంలో చాలా ముఖ్యమైనది. కానీ సవాళ్లతో నిండిన భవిష్యత్తులో ఇది మరింత ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రతి ప్రయత్నానికి సహాయం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India Semiconductor Mission 2.0 to boost domestic chip manufacturing

Media Coverage

India Semiconductor Mission 2.0 to boost domestic chip manufacturing
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the limitless potential of students and the spirit of ‘Pariksha Pe Charcha’
February 09, 2026

The Prime Minister, Shri Narendra Modi said that our students are endowed with extraordinary talent and possess the complete potential to turn their dreams into reality. He noted that the objective of Pariksha Pe Charcha is to guide students on how to meaningfully use their abilities and skills for personal growth and success.

The Prime Minister shared a Sanskrit Subhashitam on the occasion-

“विद्या वितर्को विज्ञानं स्मृतिस्तत्परता क्रिया। यस्यैते षड्गुणास्तस्य नासाध्यमतिवर्तते॥”

The Subhashitam conveys that a person who possesses knowledge, logic, science, memory, promptness and activity can overcome any challenge, and nothing is impossible for such an individual.

The Prime Minister wrote on X;

“अद्भुत प्रतिभा के धनी हमारे विद्यार्थियों में अपने सपनों को सच करने की पूरी क्षमता है। 'परीक्षा पे चर्चा' का उद्देश्य भी यही है कि कैसे वे अपनी प्रतिभा और कौशल का सार्थक इस्तेमाल कर सकते हैं।

विद्या वितर्को विज्ञानं स्मृतिस्तत्परता क्रिया।

यस्यैते षड्गुणास्तस्य नासाध्यमतिवर्तते॥”