గృహ విజ్ఞానం, యోగా, ఆయుర్వేదం కరోనాను జయించడంలో పెద్ద పాత్ర పోషించాయి : ప్రధానమంత్రి
స్వస్థత అనే భారతీయ ఆలోచన ఒక వ్యాధిని నయం చేయడం కంటే ఎక్కువ : ప్రధానమంత్రి
యోగా మరియు ఆయుర్వేదాలను వారికి అర్థమయ్యే భాషలో ప్రపంచానికి తెలియజేయాలి : ప్రధానమంత్రి
ఆధ్యాత్మిక మరియు స్వస్థత పర్యాటకానికి భారతదేశాన్ని ఒక కేంద్రంగా తీర్చిదిద్దడానికి పిలుపు

నమస్కారం!

 

శ్రీ రామచంద్ర మిషన్ 75 సంవత్సరాలు పూర్తి చేసినందుకు మీ అందరికీ అభినందనలు. శుభాకాంక్షలు. 75 సంవత్సరాల ఈ మైలురాయి దేశ నిర్మాణంలో, సమాజాన్ని బలమైన మార్గంలో ముందుకు తీసుకెళ్లడంలో చాలా ముఖ్యమైనది. లక్ష్యం పట్ల మీ అంకితభావం ఫలితంగా, ఈ రోజు ఈ ప్రయాణం 150 కి పైగా దేశాలకు వ్యాపించిందనే లక్ష్యానికి మీ అంకితభావం ఈ ఫలితం.. ఈ రోజు మనం బసంత్ పంచమి శుభ సందర్భంగా గురు రామచంద్ర గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాము. మీ అందరికీ నా అభినందనలతో, బాబుజీకి గౌరవప్రదమైన నివాళులు అర్పిస్తున్నాను. మీ అద్భుతమైన ప్రయాణంతో పాటు మీ నూతన ప్రధాన కార్యాలయం కన్హా శాంతి వనానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. కన్హా శాంతివనం నిర్మించిన స్థలం గతంలో బంజరు భూమి అని నాకు చెప్పబడింది. మీ చొరవ మరియు అంకితభావం ఈ బంజరు భూమిని కన్హా శాంతివనం గా మార్చాయి. ఈ శాంతి వనం బాబుజీ బోధలకు ప్రకాశవంతమైన ఉదాహరణ.


మిత్రులారా,

బాబూజీ నుంచి స్ఫూర్తి పొందినట్లు మీరంతా భావించారు. జీవితపు ప్రాముఖ్యతను సాధించడానికి ఆయన చేసిన ప్రయోగాలు, మానసిక ప్రశాంతతను సాధించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు మన అందరికీ గొప్ప ప్రేరణ. ఈ 20-20 ప్రపంచంలో, వేగం పై చాలా దృష్టి ఉంటుంది. ప్రజలకు సమయం తక్కువ. క్రియాశీలక ఆధ్యాత్మికత ద్వారా వ్యక్తులను తేలికగా ఆరోగ్యంగా ఉంచడం ద్వారా మీరు గొప్ప సహకారాన్ని అందిస్తున్నారు. వేలాది మంది వాలంటీర్లు మరియు శిక్షకులు యోగా మరియు ధ్యానం యొక్క నైపుణ్యాలను ప్రపంచం మొత్తానికి పరిచయం చేస్తున్నారు. ఇది మానవాళికి ఎంతో సేవ. మీ శిక్షకులు, స్వచ్ఛంద సేవకులు జ్ఞానానికి నిజమైన అర్థం చెప్పారు. ధ్యానం మరియు ఆధ్యాత్మికత ప్రపంచంలో మన కమలేష్ జీని 'డా జీ' అని పిలుస్తారు. కమలేష్ గారి గురించి నేను చెప్పగలిగేది ఏమిటంటే, ఆయన పాశ్చాత్య, భారత దేశాల లక్షణాల సంగమం. మీ ఆధ్యాత్మిక నాయకత్వంలో, శ్రీ రామచంద్ర మిషన్ మొత్తం ప్రపంచాన్ని, ముఖ్యంగా యువతను, ఆరోగ్యవంతమైన శరీరం, ఆరోగ్యవంతమైన మనస్సు వైపు చైతన్యాన్ని కలిగిస్తుంది.

మిత్రులారా,

నేడు, జీవనశైలి వ్యాధుల నుండి మహమ్మారి వరకు, నిరాశ నుండి ఉగ్రవాదం వరకు ప్రపంచం కష్టాల్లో ఉంది. అటువంటి పరిస్థితిలో, సహజ్ మార్గ్, హృదయపూర్వక కార్యక్రమం,యోగా, ప్రపంచానికి ఆశల కిరణం లాంటివి. ఇటీవలి కాలంలో, పెద్ద సంక్షోభాలను అధిగమించడానికి కొద్దిగా అప్రమత్తత ఎలా సహాయపడుతుందో ప్రపంచం మొత్తం చూసింది. కరోనాతో జరిగిన యుద్ధంలో 130 కోట్ల మంది భారతీయుల అవగాహన ప్రపంచానికి ఎలా ఒక ఉదాహరణగా నిలిచిందో కూడా మేము సాక్ష్యమిస్తున్నాము. ఈ యుద్ధంలో, ఇంటి జ్ఞానం, అలవాట్లు మరియు యోగా-ఆయుర్వేదం కూడా చాలా పెద్ద పాత్ర పోషించాయి. మహమ్మారి సంభవించినప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశం గురించి ఆందోళన చెందింది. కానీ నేడు, కరోనాపై భారతదేశం చేస్తున్న పోరాటం ప్రపంచాన్ని ప్రేరేపిస్తోంది.

 

మిత్రులారా,

ప్రపంచ మేలును పెంపొందించడానికి భారతదేశం మానవ కేంద్రిత విధానాన్ని అనుసరిస్తో౦ది. ఈ మానవ కేంద్రిత విధానం ఆరోగ్యవంతమైన సంతులనం పై ఆధారపడి ఉంటుంది: సంక్షేమం, శ్రేయస్సు, సంపద. గత ఆరు సంవత్సరాల్లో, భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. పేదలకు ఆత్మగౌరవం, అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సార్వత్రిక పారిశుధ్య కవరేజీ నుంచి సామాజిక సంక్షేమ పథకాల వరకు, పొగరహిత వంటశాల ల నుంచి బ్యాంకింగ్ వరకు, టెక్నాలజీ నుంచి అందరికీ హౌసింగ్ వరకు, భారతదేశ ప్రజా సంక్షేమ పథకాలు అనేక మంది జీవితాలను స్పృశించాయి. ప్రపంచ వ్యాప్త మహమ్మారి రావడానికి ముందు కూడా మన దేశం స్వస్థత పై దృష్టి సారించింది.


మిత్రులారా,

స్వస్థత అనే మన ఆలోచన కేవలం ఒక వ్యాధిని నయం చేయడానికి మాత్రమే కాదు. నివారణ ఆరోగ్య సంరక్షణపై విస్తృతమైన కృషి జరిగింది.. భారతదేశ ప్రధాన ఆరోగ్య సంరక్షణ పథకం, ఆయుష్మాన్ భారత్ అమెరికా మరియు అనేక యూరోపియన్ దేశాల జనాభా ల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం. మందులు, వైద్య పరికరాల ధరలు తగ్గించారు. యోగా కు ఉన్న ఆదరణ మీ అందరికీ తెలిసిందే. ఈ ప్రాముఖ్యత స్వస్థతకు ప్రాముఖ్యత ఇవ్వడం అనేది మన యువత ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. వారు జీవనశైలి సంబంధిత వ్యాధులతో వ్యవహరించాల్సిన అవసరం లేదు. కోవిడ్-19 కోసం ప్రపంచానికి ఔషధాలు అవసరమైనప్పుడు, భారతదేశం వాటిని అన్నింటినీ పంపినందుకు గర్వంగా ఉంది. ఇప్పుడు, భారతదేశం ప్రపంచ వ్యాక్సినేషన్ లో కీలక పాత్ర పోషిస్తోంది. స్వస్థత కొరకు మన దృష్టి దేశీయంగా ఉన్నంత ప్రపంచవ్యాప్తంగా ఉంది.

 

మిత్రులారా,


ఆరోగ్యం, స్వస్థత ల పై ప్రపంచం చాలా శ్రద్ధ వహిస్తోంది ముఖ్యంగా కోవిడ్ -19 తర్వాత. ఈ విషయంలో భారత్ కు చాలా అవకాశాలున్నాయి. ఆధ్యాత్మిక, స్వస్థత పర్యాటకం కొరకు భారతదేశాన్ని హబ్ గా తీర్చిదిద్దే దిశగా మనం పనిచేద్దాం. మన యోగా, ఆయుర్వేదం ఆరోగ్యవంతమైన గ్రహానికి దోహదం చేస్తాయి. వీటిని వారు అర్థం చేసుకోగల భాషలో ప్రపంచానికి అందించాలనేది మా లక్ష్యం. వాటి ప్రయోజనాల గురించి శాస్త్రీయంగా వివరించాలి మరియు భారతదేశంలో కి వచ్చి పునరుజ్జీవం పొందడానికి ప్రపంచాన్ని ఆహ్వానించాలి. మీ స్వంత హృదయపూర్వక ధ్యాన అభ్యాసం ఆ దిశగా ఒక అడుగు.

మిత్రులారా,

 

కరోనా అనంతర ప్రపంచంలో, యోగా, ధ్యానంలపై శ్రద్ధ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ఇది భగవద్గీతలో వ్రాయబడింది :


सिद्ध्य सिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते


పరిపూర్ణత, వైఫల్యం రెండింటిలోనూ సమానత్వంతో, యోగాలో చర్యలను చేయండి. ఈ సమానత్వాన్ని యోగా అంటారు. నేటి ప్రపంచంలో యోగాతో పాటు ధ్యానం కూడా అవసరం. ప్రపంచంలోని అనేక ప్రధాన సంస్థలు మాంద్యం మానవ జీవితానికి పెద్ద సవాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. మీ హృదయపూర్వక కార్యక్రమం నుండి యోగా మరియు ధ్యానం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు మానవాళికి సహాయం చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

మిత్రులారా,


మన వేదాలలో ఇలా చెప్పబడింది ,


यथा दयोश् च, पृथिवी च, न बिभीतो, न रिष्यतः। एवा मे प्राण मा विभेः


అనగా, ఆకాశం, భూమి భయపడవు లేదా నాశనం చేయబడవు, ఓ ’నా ఆత్మ! మీరు కూడా నిర్భయంగా ఉంటారు. ఎవరు స్వేచ్ఛగా ఉంటారో నిర్భయంగా ఉండవచ్చు. సహజ్ మార్గ్‌ ను అనుసరించడం ద్వారా మీరు ప్రజలను శారీరకంగా, మానసికంగా నిర్భయంగా మారుస్తారని నాకు నమ్మకం ఉంది. వ్యాధి లేని పౌరులు, మానసికంగా బలమైన పౌరులు భారతదేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళతారు. ఈ సంవత్సరం మన స్వాతంత్ర్యం 75 వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. మీ ప్రయత్నాల ద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్లండి! ఈ ఆకాంక్షలతో, మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు .

ధన్యవాదాలు !

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Farmers to benefit as Centre hikes onion procurement price by 13% to ₹2,125 per quintal

Media Coverage

Farmers to benefit as Centre hikes onion procurement price by 13% to ₹2,125 per quintal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tribute to Shri Ram Vilas Paswan ji
July 05, 2026

The Prime Minister, Shri Narendra Modi, paid tributes to former Union Minister Shri Ram Vilas Paswan ji on his birth anniversary today."He made significant contributions to the upliftment of society's deprived and weaker sections. He will always be remembered for his dedication to public service and national service", Shri Modi remarked.

The Prime Minister posted on X:

पूर्व केंद्रीय मंत्री रामविलास पासवान जी की जयंती पर उन्हें मेरी भावभीनी श्रद्धांजलि। समाज के वंचित और कमजोर वर्गों के उत्थान के लिए उन्होंने अहम योगदान दिया। जनसेवा और राष्ट्रसेवा के प्रति अपने समर्पण भाव के लिए वे हमेशा याद किए जाएंगे।