అంతరీక్షం వరకు సహకారం!

Published By : Admin | May 5, 2017 | 23:00 IST

5 మే 2017, దక్షిణాసియా సహకారం బలమైన ప్రోత్సాహాన్ని పొందిన రోజుగా చరిత్రలో నిలిచిపోతుంది – అది దక్షిణ ఆసియా ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన రోజు, భారతదేశం రెండు సంవత్సరాల క్రితం చేసిన నిబద్ధతను నెరవేర్చింది.

దక్షిణాసియా ఉపగ్రహాలతో దక్షిణాసియా దేశాలు తమ సహకారాన్ని అంతరిక్షంలోకి విస్తరించాయి!

ఈ చారిత్రాత్మక ఘటనను తిలకించడానికి, భారతదేశం, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్ మరియు శ్రీలంక నాయకులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణాసియా ఉపగ్రహాన్ని సాధించే సామర్ధ్యం గురించి పూర్తి వివరాలను సమర్పించారు.

ఈ ఉపగ్రహం సుదూర ప్రాంతాలకు మంచి పాలన, సమర్థవంతమైన కమ్యూనికేషన్, మెరుగైన బ్యాంకింగ్, విద్య, ఉపగ్రహ వాతావరణం, టెలీ మెడిసిన్తో ప్రజలను కలుపుతూ, మంచి చికిత్సకు భరోసా కల్పించడం వంటివి చేసేందుకు సహాయపడుతుందని ఆయన చెప్పారు.

"మనము చేతులు కలిపి, పరస్పర జ్ఞానం, సాంకేతికత మరియు పెరుగుదల పట్ల పంచుకున్నప్పుడు, మన అభివృద్ధి మరియు శ్రేయస్సును వేగవంతం చేయవచ్చు." అని శ్రీ మోదీ అన్నారు.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India's economy maintains growth momentum despite global uncertainties: Report

Media Coverage

India's economy maintains growth momentum despite global uncertainties: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలోని ఎన్ డి ఎ ప్ర‌భుత్వం ప‌నితీరును అనేక అంత‌ర్జాతీయ సంస్థ‌లు విశేషంగా ప్ర‌శంసించాయి. భార‌త‌దేశంలో ప‌రివ‌ర్త‌న‌ ర‌థ‌చ‌క్రాలను కదిలించిన విధానాల‌ను వేనోళ్ల కొనియాడాయి

భార‌త‌దేశం 2014-15 సంవ‌త్స‌రంలో సాధించిన వృద్ధి 5.6 శాతం మాత్ర‌మే కాగా, 2015-16లో అసాధార‌ణ స్థాయిలో 6.4 శాతంతో వృద్ధి చెంద‌గ‌ల‌ద‌ని ప్ర‌పంచ బ్యాంకు ఆశాభావం వ్య‌క్తం చేసింది. అంతేగాక దీన్ని తాము ‘మోదీ లాభాంశం’ (the Modi dividend)గా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ విధానాల వ‌ల్ల పెట్టుబ‌డులు జోరు అందుకొనే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని, చ‌మురు ధ‌ర‌ల క్షీణ‌త మ‌రొక పక్క నుండి తోడ్ప‌డుతుంద‌ని ప్ర‌పంచ‌ బ్యాంకు పేర్కొంది

ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్షుడు శ్రీ జిమ్ యాంగ్ కిమ్ కూడా ఈ సానుకూల భావ‌న‌ను ప్ర‌తిధ్వ‌నింప‌జేశారు. ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ "బ‌ల‌మైన దార్శ‌నిక నాయ‌క‌త్వం" దేశ ప్ర‌జ‌ల‌కు ఆర్థిక సార్వ‌జ‌నీన‌త దిశ‌గా భార‌తదేశం "అసాధార‌ణ కృషి" చేసేందుకు పురిగొల్పింద‌ని ఆయ‌న చెప్పారు. అలాగే ఆర్థిక సార్వ‌జ‌నీన‌త‌లో భాగంగా జ‌న్‌ ధ‌న్ యోజ‌న‌ ద్వారా భార‌తదేశ ప్ర‌భుత్వం చేస్తున్న‌కృషిని కూడా ఆయ‌న కొనియాడారు.

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ మోదీ ఆర్థిక సంస్క‌ర‌ణ‌లను చేప‌ట్ట‌డంతోపాటు చ‌మురు ధ‌ర‌ల్లో క్షీణ‌తవ‌ల్ల భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ అంచ‌నాల‌కు మించిన వేగ‌వంత‌మైన వృద్ధి సాధించి చివ‌ర‌కు చైనాను అధిగ‌మించ‌గ‌ల‌ద‌ని అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి (ఐఎమ్ఎఫ్) సూచించింది. పెట్టుబ‌డిదారుల‌లో న‌మ్మ‌కం పెర‌గ‌డానికి సంస్క‌ర‌ణ‌లు దోహ‌ద‌ప‌డుతున్న‌ట్లు కూడా ఐఎమ్ఎఫ్ పేర్కొంది.

భార‌త‌దేశంలో ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను శ‌క్తిమంత‌మైన‌, సుస్థిర‌, స‌మ్మిళిత వృద్ధిప‌థంలో నిలుపుతాయ‌ని ఒఇసిడి అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌ధాన‌ మంత్రి సంస్క‌ర‌ణాభిలాష‌ను ఈ ప్ర‌క‌ట‌న‌ మ‌రోసారి ప్ర‌స్ఫుటం చేస్తోంది.

ప్ర‌పంచ‌వ్యాప్త ఆద‌ర‌ణ‌గ‌ల అగ్ర‌శ్రేణి సంస్థ మూడీస్ భార‌తదేశం రేటింగ్ అంచ‌నాల‌ను అంత‌కుముందున్న “సానుకూల” ద‌శ నుంచి “సుస్థిర” ద‌శ‌కు మార్చి స్థాయి పెంచింది. ఇది పెట్టుబ‌డిదారుల‌లో విశ్వాసాన్ని మ‌రోసారి ఇనుమ‌డింప‌జేసి, ప్ర‌ధాన‌ మంత్రి, ఆయ‌న బృందం చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌ల‌కు కితాబిచ్చింది.

ప్ర‌పంచ ఆర్థిక ప‌రిస్థితులు-భ‌విష్య‌త్తుపై ఐక్య‌రాజ్య స‌మితి విడుద‌ల చేసిన‌ మ‌ధ్యంత‌ర వార్షిక తాజా నివేదిక‌లో భార‌తదేశం వృద్ధిపై ఇదే విధ‌మైన ఆశావ‌హ స్పంద‌నను వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు దేశంలో ఈ ఏడాది, వ‌చ్చే ఏడాది వృద్ధి 7 శాతంగా న‌మోదు కాగ‌ల‌ద‌ని అంచ‌నా వేసింది.

ఆ విధంగా ప్ర‌ధాన‌ మంత్రి సంస్క‌ర‌ణోత్సాహం, సంస్క‌ర‌ణల‌ ర‌థం వేగం పుంజుకోవ‌డం వ‌ల్లనూ, త‌ద‌నుగుణంగా దేశ ప్ర‌తిష్ఠ‌ను పెంచుతూ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఆశావ‌హ అంచ‌నాలు వెలువ‌డిన కార‌ణంగానూ ప్ర‌పంచం దృష్టి ఇప్పుడు భార‌తదేశం వైపు మ‌ళ్లింది