ప్రతిష్ఠాత్మకమైన ఫైడ్ ప్రపంచ కప్- 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఎంతో గర్వ కారణమైన విషయమని, దీనికోసం ఎంతో ఉత్సహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 20 కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంటుకు భారతదేశం అతిథ్యం ఇవ్వనున్నది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అంతర్జాతీయ చెస్ సమాఖ్య చేసిన పోస్టుపై ప్రధానమంత్రి మోదీ ఈ విధంగా స్పందించారు:
“రెండు దశాబ్దాల తర్వాత ప్రతిష్ఠాత్మకమైన ఫైడ్ ప్రపంచ కప్-2025కు ఆతిథ్యం ఇవ్వటంపై భారతదేశం సంతోషంగా ఉంది. మన యువతలో చెస్ ఆదరణ పొందుతోంది. ఈ టోర్నమెంటు... ఉత్కంఠభరితమైన పోటీలకు సాక్ష్యంగా నిలుస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్ల ప్రతిభను ప్రదర్శిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను."
India is delighted to be hosting the prestigious FIDE World Cup 2025 and that too after over two decades. Chess is gaining popularity among our youth. I am sure this tournament will witness thrilling matches and showcase the brilliance of top players from around the world. https://t.co/iyfS7f3gGz
— Narendra Modi (@narendramodi) August 26, 2025


