అంకుర సంస్థలు తమ ఉత్పత్తులు, నమూనాలు, పరిష్కారాలు, అల్గారిథమ్‌లను 5జి భవిష్యత్తరం సాంకేతికతల సాయంతో ధ్రువీకరించేందుకు ఇది మద్దతునిస్తుంది

   భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) రజతోత్సవాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 మే 17వ తేదీన ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రసంగిస్తారు. దీంతోపాటు ప్రత్యేక తపాలా బిళ్లను కూడా ఆయన ఆవిష్కరిస్తారు.

   ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఐఐటీ-మ‌ద్రాస్ నేతృత్వంలోని 8 సంస్థల ద్వారా ద్వారా బహుళ సంస్థల సహకార ప్రాజెక్టు కింద రూపొందించబడిన ప్రయోగాత్మక 5జి వేదిక (టెస్ట్‌ బెడ్‌)ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న ఇతర సంస్థలలో ఢిల్లీ, హైదరాబాద్, బాంబే, కాన్పూర్, ఐఐటీలు సహా బెంగళూరులోని ఐఐఎస్‌సి, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్‌ రీసెర్చ్ (సమీర్‌), సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ వైర్‌లెస్ టెక్నాలజీ (సెవిట్‌) కూడా ఉన్నాయి.

  ఈ ప్రాజెక్టు రూపకల్పన కోసం రూ.220 కోట్లకుపైగా వ్యయం చేశారు. ఈ టెస్ట్ బెడ్ భారతీయ పరిశ్రమలు, అంకుర సంస్థలకు సహాయక పర్యావరణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది. ఆ మేరకు అవి తమ ఉత్పత్తులు, నమూనాలు, పరిష్కారాలు, అల్గారిథమ్‌లను 5జి, భవిష్యత్తరం సాంకేతికతల ద్వారా ధ్రువీకరించడంలో తోడ్పాటునిస్తుంది.

   కాగా, టెలికాం నియంత్రణ ప్రాధికార చట్టం-1997 ప్రకారం భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ‘ట్రాయ్‌’ 1997లో ఏర్పాటు చేయబడింది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From conflict to progress: Remote Irpanar village in Chhattisgarh gets electricity

Media Coverage

From conflict to progress: Remote Irpanar village in Chhattisgarh gets electricity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 ఏప్రిల్ 2026
April 27, 2026

Sabka Saath, Sabka Vikas 2.0: PM Modi Delivers Self-Reliance, Global Trade & National Pride