Mahatma Gandhi served communities in South Africa that were bearing the brunt of apartheid: PM during #MannKiBaat
Gandhiji shared an unbreakable bond with truth: PM Modi during #MannKiBaat
For Mahatma Gandhi, the individual and society, human beings and humanity was everything: PM #MannKiBaat
The way 130 crore countrymen ran a campaign for cleanliness with utmost enthusiasm, let us now join hands in curbing ‘single use plastic’: PM #MannKiBaat
Visit sites associated with nature and wildlife and animals: PM Modi during #MannKiBaat
The concern and care for the environment in India seems natural: PM Modi during #MannKiBaat
Swami Vivekananda shook the conscience of the human race of the entire world, imparted onto this world a glorious identity of India: PM #MannKiBaat

నా ప్రియదేశవాసులారా, నమస్కారం. మనదేశం ప్రస్తుతం ఒకవైపు వర్షాన్ని ఆస్వాదిస్తూ ఉంది. రెండో వైపు హిందూస్తాన్ లోని మూలమూలలా ఏదోఒక ఉత్సవం, మేళా దీపావళి వరకూఅన్నీ జరుగుతుంటాయి. బహుశా మన పూర్వీకులు, ఏ పరిస్థితిలోనూ సమాజములో ఒక మందకొడితనం రాకుండా ఉండేలా ఋతుచక్రము, ఆర్థిక చక్రము సమాజ జీవన వ్యవస్థ ను అమర్చిపెట్టారు. ఇంతవరకు మనం అనేక పండుగలు జరుపుకున్నాము. నిన్న హిందూస్తాన్ అంతటా శ్రీ కృష్ణ జన్మ మహోత్సవం జరిగింది. ఇలాంటి వ్యక్తిత్వం ఉంటుందని, వేల ఏండ్లు గడిచినా కూడా ప్రతి పండుగ ఒక కొత్తదనాన్ని తీసుకొస్తుందని, కొత్త స్ఫూర్తిని అందిస్తుందని, కొత్త శక్తిని తీసుకొస్తుందని అసలు ఎవరైనా ఊహించగలరా? వేల ఏండ్ల నాటి జీవనం ఈనాటికీ సమస్యల పరిష్కారానికై ఉదాహరణగా చూపించదగినదని, ప్రేరణ ఇవ్వగలదని, ప్రతి వ్యక్తి శ్రీకృష్ణుని జీవితంలో నుంచి, వర్తమానకాలపు సమస్యలపరిష్కారాలు వెదుకగలడని ఊహించగలరా? ఇంత సామర్థ్యం ఉండి కూడా కృష్ణుడు ఒకసారి రాసక్రీడలో లీనమౌతూ, ఇంకోసారి గోవులమధ్య, గోపాలకుల మధ్య ఉంటూ, మరోసారి ఆటపాటల్లో, వేణుగానాల్లో ఇలా చెప్పలేనన్ని వైవిధ్యతలతో నిండిన వ్యక్తిత్వము, అసమాన సామర్థ్యం కలిగిన శ్రీమంతుడు. కానీ సమాజ శక్తికి అంకితమైన, లోకశక్తికి అంకితమైన, లోకపాలకుని రూపంలో కొత్తకీర్తిపతాకాలను స్థాపించే వ్యక్తిత్వం. స్నేహం ఎలా ఉండాలో చెప్పాలంటే సుదాముని సంఘటనను ఎవరు మరిచిపోగలరు? అంతేకాదు, యుద్ధభూమిలో ఇన్ని గొప్పతనాలున్నా కూడా సారథి పని చేపట్టడం కూడా అంతే. పర్వతాలను మోయగలడు, ఎంగిలి విస్తళ్ళను తీసేయగలడు. ఇలా ప్రతి పనిలోనూ ఒక కొత్తదనం కనిపిస్తుంది. ఈరోజు నేను మీతో మాట్లాడుతుంటే ఇద్దరు గొప్ప మోహనుల గురించి ఆలోచన వస్తోంది. ఒకరు సుదర్శనచక్రధారి మోహనుడు, ఒకరు చరఖాధారి మోహనుడు. సుదర్శనచక్రధారి మోహనుడు యమునా తీరమును వదిలేసి, గుజరాత్ లోని సముద్రతీరానికి వెళ్ళి ద్వారకానగరములో స్థిరపడితే, సముద్రతీరములో పుట్టిన మోహనుడు యమునాతీరానికి వచ్చి దిల్లీలో జీవితపు అంతిమఘడియలను గడిపాడు. సుదర్శన చక్రధారి మోహనుడు ఆనాటి స్థితిలో వేల ఏండ్ల క్రితమే, యుద్ధాన్ని ఆపడానికి, ఘర్షణను నివారించడానికి, తన బుద్ధిని, కర్తవ్యాన్ని, తన సామర్థ్యాన్ని, తన వివేక చింతనను పూర్తిగా ఉపయోగించాడు. అలాగే చరఖాధారి మోహనుడు కూడా స్వాతంత్ర్యం కొరకు, మానవీయ విలువల కొఱకు, వ్యక్తిత్వం యొక్క మూల తత్వానికి బలం చేకూర్చడానికి స్వాతంత్ర్య పోరాటానికే ఎలా ఒక కొత్తరూపాన్నిచ్చాడో, ఎలాంటి కొత్త మలుపు తిప్పాడో, చూసిన విశ్వమే అబ్బురపడింది. నేటికీ అబ్బురపడుతూనే ఉంది. నిస్వార్థ సేవ యొక్క మహత్యాన్ని గానీ, జ్ఞానం యొక్క మహత్యాన్ని గానీ లేదా జీవితపు ఎగుడుదిగుళ్ళలో చిరునవ్వుతో ముందుకు సాగే తీరు యొక్క మహత్యాన్ని గానీ మనము శ్రీకృష్ణభగవానుని సందేశం నుంచి నేర్చుకోగలము. అందుకే శ్రీ కృష్ణుడు జగద్గురువు రూపంలో ఇప్పటికీ ప్రసిద్ధుడు. – కృష్ణం వందే జగద్గురుమ్.

నేడు మనం పండుగల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే సమయంలో భారతదేశం ఇంకొక పెద్ద పండుగ యొక్క ఏర్పాట్లలో ఉంది. భారతదేశమే కాదు, ప్రపంచమంతటా ఇదే చర్చ జరుగుతోంది. నా ప్రియదేశవాసులారా! నేను మహాత్మాగాంధీ యొక్క 150 వ జయంతి గురించి మాట్లాడుతున్నాను. 2 అక్టోబర్ 1869, పోర్ బందర్ లో సముద్రతీరాన నేడు మనం కీర్తిమందిరం అని పిలుచుకునే చోట, ఆ చిన్న యింట్లో, మానవ చరిత్రకు కొత్త మలుపు ఇచ్చినటువంటి కొత్త కీర్తిపతాకం స్థాపించినటువంటి ఒక వ్యక్తి, కాదు ఒక యుగం పుట్టుక జరిగింది. మహాత్మా గాంధీ గారి ఒక మాట ఎప్పటికీ ఉండిపోయే మాట, ఒక రకంగా చెప్పాలంటే వారి జీవితపు ఒక భాగంగా ఉండిపోయిన సేవ, సేవాభావం, సేవ పట్ల కర్తవ్య పరాయణత. వారి మొత్తం జీవనం చూస్తే, దక్షిణాఫ్రికా లో జాతివివక్షకు గురి అవుతున్న సమూహాల సేవ. ఆ యుగంలో అది చిన్న విషయమేం కాదు సుమండీ! ఆయన చంపారణ్యంలో వివక్షకు గురి అవుతున్న రైతులకు సేవ చేశారు. తగిన కూలీ పొందని మిల్లు కార్మికులకు సేవ చేశారు. బీదలు, అసహాయులు, బలహీనులు, క్షుధార్తులకు సేవచేయడమే తన జీవిత పరమకర్తవ్యంగా భావించారు. రక్తపిత్త వ్యాధి విషయంలో ఉన్న అనేక భ్రమలను తొలగించడానికి వారు స్వయంగా రక్తపిత్త వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. సేవద్వారానే తన జీవితాన్నే ఉదాహరణగా నిలుపుకున్నారు. సేవను మాటల్లో కాకుండా జీవించి చూపించారు. సత్యంతో గాంధీకి ఎంత విడదీయరాని బంధం ఉండిందో, సేవతో కూడా అంతే అనన్యసామాన్యమైన విడదీయరాని బంధం ఉండేది. ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ ఏ అవసరం పడినా, మహాత్మాగాంధీ సహాయానికి సిద్ధంగా ఉండేవారు. వారు కేవలం సేవను మాత్రమే కాక దానితో ముడిపడిన ఆత్మానందాన్ని కూడా సమర్థించేవారు. సేవాశబ్దము యొక్క సార్థకత దాన్ని ఆనందంతో చేయడం లోనే ఉంది – సేవా పరమో ధర్మః. కానీ దాంతోపాటు ఉత్కృష్టమైన ఆనందము, స్వాంతఃసుఖాయ అనే భావం యొక్క అనుభూతి కూడా సేవలో అంతర్నిహితమై ఉంటుంది. ఈ విషయాన్ని బాపూజీ జీవితం నుంచి మనం చక్కగా అర్థం చేసుకోగలము. మహాత్మాగాంధీ అసంఖ్యాక భారతీయుల స్వరమై వినిపించడమే కాదు, మానవ విలువలు, మానవ గరిమకై విశ్వపు గొంతుకగా కూడా మారిపోయారు. మహాత్మా గాంధీకి వ్యక్తి, సమాజం, మానవులు, మానవత ఇదే ముఖ్యంగా ఉండేది. ఆఫ్రికాలోని ఫీనిక్స్ ఫార్మ్ అయినా, టాల్ స్టాయ్ ఫార్మ్ అయినా, సబర్మతీ ఆశ్రమమైన, వార్ధా అయినా అన్ని చోట్లా, తన ఒక విశిష్టమైన రీతిలో సమాజ ప్రగతి, కమ్యూనిటీ మొబెలైజేషన్ పట్ల వారి సమర్థన ఉండేది. పూజ్య మహాత్మాగాంధీ కి సంబంధించిన అనేక ముఖ్యస్థలాలకు వెళ్ళి నమస్కరించే గొప్ప అదృష్టం నాకు కలిగింది. సేవాభావం ద్వారా సంఘటిత భావాన్నే వారు సమర్థించేవారు అని చెప్పగలను. సమాజసేవ, సమాజ ప్రగతి కమ్యూనిటీ సర్వీస్ కమ్యూనిటీ మొబెలైజేషన్ ఈ భావనలన్నిటినీ మనం మన వ్యావహారిక జీవనంలో తేవలసిన అవసరం ఉంది. నిజం చెప్పాలంటే ఇదే మహాత్మా గాంధీకి నిజమైన శ్రద్ధాంజలి, నిజమైన కార్యాంజలి. ఇలాంటి సందర్భాలు చాలా వస్తుంటాయి, మనమూ ఆచరిస్తుంటాము. కానీ గాంధీ యొక్క 150 వ జయంతి కూడా ఇలాగే వచ్చి వెళ్ళిపోవడం మనకు సమ్మతమేనా? కాదు దేశవాసులారా! మనమందరం మనలను ప్రశ్నించుకుందాం. చింతన చేద్దాం, మేథోమథనం చేద్దాం, సామూహికంగా సంభాషిద్దాం. మనము సమాజంలో ప్రజలతో కలిసి, అన్ని వర్గాలవారితో కలిసి, అన్ని వయసుల వారితో కలిసి, గ్రామమూ పట్టణమూ స్త్రీ పురుషుడు అని లేక అందరితో కలిసి సమాజం కొఱకు ఏం చేద్దాం, ఒక వ్యక్తిగా నేను నా ప్రయత్నంగా ఏం చేయగలను అని ఆలోచిద్దాం. నా తరఫునుంచి వాల్యూ అడిషన్ ఏముంటే బాగుంటుంది? సామూహికత మన బలం. ఈ 150 వజయంతి సంవత్సరం పొడుగునా జరిగే కార్యక్రమాల్లో సామూహికత, సేవ కూడా ఉండనిద్దాం. మన వీధిలో ఉండేవారంతా కలిసి ఎందుకు ప్రయత్నించకూడదు? మన ఫుట్ బాల్ టీం ఉందంటే ఫుట్ బాల్ కూడా ఆడదాము, ఒకటీ అరా గాంధీ ఆదర్శాలకూ అనుగుణంగా సేవాకార్యక్రమాలూ చేద్దాం. మన మహిళా మండలి లేడీస్ క్లబ్ ఉంది. ఆధునిక యుగంలో లేడీస్ క్లబ్ యొక్క కార్యకలాపాలూ చేద్దాం, కానీ లేడీస్ క్లబ్ యొక్క సఖులంతా కలసి ఏదో ఒక సేవాకార్యక్రమం అందరు కలసి చేద్దాం. చాలా చేయగలము. పుస్తకాలను సేకరించి బీదలకు పంచడం, జ్ఞానం పంచడం ఇలా 130 కోట్ల భారతీయులకు, 130 కోట్ల ఊహలు ఉన్నాయి. 130 కోట్ల ఆరంభాలు చేయవచ్చు. ఏ హద్దూ లేదు. మనసులో అనుకున్నది – మంచి అభిలాష, సత్కారణం, సద్భావం పూర్తి అంకితభావంతో సేవ చేయగలిగితే చాలు. అది కూడా స్వాంతః సుఖాయ – ఒక అనన్యమైన ఆనందానుభూతి కోసం అయి ఉంటే చాలు.

నా ప్రియ దేశవాసులారా, నేను కొన్ని నెలల క్రితం గుజరాత్ లోని దాండికి వెళ్ళాను. స్వాతంత్ర్య పోరాటంలో ‘ఉప్పు సత్యాగ్రహం’ దాండి చాలా ముఖ్యమైన ఒక మలుపు. దాండి లో మహాత్మాగాంధీకి అంకితమిచ్చిన ఒక అత్యాధునిక మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొన్నాను. మీ అందరితో కూడా నా ఒక విన్నపమేమిటంటే- మీరంతా రానున కాలంలో మహాత్మాగాంధీ కి సంబంధించిన ఏదో ఒక ప్రదేశాన్ని సందర్శించండి. పోర్ బందర్ కానీ, సబర్మతీ కానీ, చంపారణ్యం కానీ, వర్ధా ఆశ్రమం కానీ, దిల్లీ లోని మహాత్మాగాంధీకి సంబంధించిన చోటైనా గానీ, ఇటువంటి చోట్లకు మీరు వెళ్తే మీ ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పంచుకోండి. దీనిద్వారా ఇతరులు కూడా స్ఫూర్తి పొందేలా, ఆ ఫోటోలతో పాటు మీ భావాలను వ్యక్తం చేస్తూ మూడు నాలుగు మాటలు వ్రాయండి. మీ మనసులోనుంచి వచ్చే మాటలు ఏ ఇతర పెద్ద సాహిత్య రచనలలో వాటికన్నా ఎక్కువ ప్రభావశీలంగా ఉంటాయి. నేటి రోజున మీ దృష్టిలో మీ కలంతో గీసిన గాంధీ చిత్రం ఇంకా ఎక్కువ రెలెవెంట్ గా కనిపించవచ్చు. రానున్న సమయంలో చాలా కార్యక్రమాలు, పోటీలు, ప్రదర్శనల ఏర్పాట్లు చేయబడ్డాయి. కానీ ఈ సందర్భంలో ఒక ఆసక్తి కరమైన మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Venice Biennale ఒక ప్రసిద్ధమైన కళా ప్రదర్శన. అక్కడ ప్రపంచంలోని కళాకారులంతా కలుస్తారు. ఈ సారి Venice Biennale యొక్క భారతీయ భవనంలో గాంధీ స్మృతులతో ఒక ఆసక్తికరమైన ప్రదర్శన ఏర్పాటయింది. ఇందులో హరిపురా Panels విశేషమైన ఆసక్తితో ఉంది. గుజరాత్ లోని హరిపురాలో కాంగ్రెస్ సమావేశం జరగడం, అందులో సుభాశ్ చంద్రబోస్ అధ్యక్షుడుగా ఎన్నిక కావడం అనే చరిత్రకెక్కిన సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది. ఈ ఆర్ట్ పానెల్ కు ఒక అందమైన గతం ఉంది. కాంగ్రెస్ యొక్క హరిపురా సభకన్నా ముందు 1937-38 లో మహాత్మా గాంధీ శాంతినికేతన్ కళాభవన్ యొక్క తత్కాలీన ప్రిన్సిపాల్ నందలాల్ బోస్ ను ఆహ్వానించారు. భారతదేశంలో నివసించే వారి జీవనశైలిని కళామాధ్యమంద్వారా చూపించాలని, ఈ సభలో వారి ఆర్ట్ వర్క్ యొక్క ప్రదర్శన ఉండాలని గాంధీజీ అభిలషించారు. మన రాజ్యాంగానికి శోభతెచ్చే ఆర్ట్ వర్క్ ఈ నందలాల్ బోస్ దే. రాజ్యాంగానికి ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చేదది. ఈ బోస్ గారి కళాసాధన రాజ్యాంగంతో పాటు తననూ అమరుడిని చేసింది. నందలాల్ బోస్ హరిపురా చుట్టుపక్కల గ్రామాలను పర్యటించి, చివరికి గ్రామీణ భారత జీవనాన్ని చూపిస్తూ ఒక art canvas తయారుచేశారు. ఈ అమూల్యమైన కళా ప్రజ్ఞ గురించి Venice లో గొప్ప చర్చ జరిగింది. గాంధీ జీ యొక్క 150 జన్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలతో పాటు ప్రతీ హిందుస్తానీ నుంచి ఏదైనా ఒక సంకల్పాన్ని నేను కోరుకుంటాను. దేశం కోసం, సమాజం కోసం, ఇతరుల కోసం ఏదో కొంత చేయాలి. అదే బాపూ యొక్క చక్కనైన, నిజమైనప్రామాణిక కార్యాంజలి అవుతుంది.

భారతమాత సుపుత్రులారా! గత కొన్నేళ్ళుగా మనము 2 అక్టోబరు కు ముందటి రోజులు దాదాపు రెండు వారాలు దేశమంతటా ‘స్వచ్ఛతయే సేవ’ ఉద్యమం చేపడుతున్నామని మీకు గుర్తుండే ఉంటుంది. ఈసారి ఇది సెప్టెంబర్ 11 నుండే మొదలవుతుంది. ఈ సమయంలో మనము మన మన ఇండ్ల నుంచి బయటికి వచ్చి శ్రమదానంతో మహాత్మాగాంధీ కి కార్యాంజలి సమర్పిద్దాము. ఇల్లు కానీ, వీధికానీ, కూడలి కానీ సందులు గానీ, బడి కానీ కళాశాల కానీ అన్ని సార్వజనిక స్థలాలలో స్వచ్ఛతా ఉద్యమం నిర్వహించాలి. ఈసారి ప్లాస్టిక్ మీద మరింత శ్రద్ధ పెట్టాలి. ఆగస్ట్15 న ఎఱ్ఱకోట నుంచి మాటలాడుతూ వందన్నర కోట్ల దేశవాసులు ఎలా ఉత్సాహం, శక్తితో స్వచ్ఛతా ఉద్యమం చేశారో నేను చెప్పాను. బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జనాల నుంచి ముక్తి లభించే పని చేశాము. అలాగే మనమందరం కలిసి Single Use Plastic యొక్క వాడుకను ఆపేయాలి. ఈ ప్రచారం విషయంలో సమాజం లోని అన్ని వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయి.

నా సోదర సోదరీ వ్యాపారులెందరో తమ దుకాణాల్లో ఒక బోర్డ్ ను పెట్టారు. ఒక placard ను పెట్టారు. అందులో వినియోగదారులు తమ సంచులను తామే తెచ్చుకోవాలి అని వ్రాసి ఉంటుంది. దీని ద్వారా డబ్బులూ మిగులుతాయి, పర్యావరణ రక్షణ లో తన వంతు పాత్రనీ పోషించినట్లవుతుంది. ఈ సారి 2 అక్టోబర్ బాపూజీ 150 వ జయంతి జరుపుకునే సందర్భంలో బహిరంగ మలమూత్ర విసర్జన నుంచి విడుదల పొందిన భారతదేశాన్ని వారికి సమర్పించడమే కాక ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి పునాది వేద్దాము. నేను సమాజంలోని అన్ని వర్గాలవారితో, ప్రతి గ్రామ, ప్రతి పట్టణ నివాసులతో ఒక అప్పీలు చేస్తున్నాను. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం గాంధీ జయంతిని ప్లాస్టిక్ చెత్త నుంచి భారతమాతను ముక్తి చేసేలా జరుపుకుందాము. 2 అక్టోబరును ప్రత్యేకంగా జరుపుకుందాము. మహాత్మా గాంధీ జయంతి రోజు ఒక విశేష శ్రమదానోత్సవం కావాలి. దేశంలోని అన్ని మునిసిపాలిటీ, కార్పొరేషన్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయత్ ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని వ్యవస్థలు, అన్ని సంస్థలు, ఒక్కొక్క పౌరుడు అందరితో నా విన్నపం ఏమంటే ప్లాస్టిక్ చెత్త కుప్ప సేకరణకు, నిల్వకు తగిన ఏర్పాటు ఉండాలి. ఈ ప్లాస్టిక్ వేస్ట్ అంతా ఒక చోట సేకరింపబడితే దాన్ని తగినట్టుగా ఎలా వదిలించుకోవాలి disposal కు ఏర్పాటు ఎలా జరగాలి అనే విషయాన్ని పరిశీలించమని నేను అన్ని కార్పొరేట్ సెక్టార్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని రీసైకిల్ చేయవచ్చు. దీన్ని ఇంధనంగా వాడవచ్చు. అదే విధంగా ఈ దీపావళి వరకు మనం ఈ ప్లాస్టిక్ చెత్త యొక్క సురక్షిత వినియోగం అనే పనిని చేయవచ్చు. సంకల్పం మాత్రం ముఖ్యం. స్ఫూర్తి కొఱకై అటూ ఇటూ చూసే పని లేదు. గాంధీ కన్నా పెద్ద స్ఫూర్తి ఇంకేముంటుంది?

నా ప్రియ దేశవాసులారా, మన సంస్కృత సుభాషితాలు ఒక రకంగా జ్ఞాన రత్నాలు. మనకు జీవితంలో ఏం కావాలో అవన్నీ వాటిలో దొరుకుతాయి. ఈ మధ్య తగ్గిపోయింది కానీ మొదట వాటితో నాకు చాలా అనుబంధం ఉండేది. ఈరోజు ఒక సంస్కృత సుభాషితంతో ఒక చాలా ముఖ్యమైన మాటను చెప్పాలనుకుంటున్నాను. ఇది శతాబ్దాల ముందర వ్రాసిన మాట. ఐనా ఇప్పటికీ దీని ప్రాధాన్యత ఉంది. ఒక ఉత్తమ మైన సుభాషితములో ఇలా చెప్తారు.

పృథివ్యాం త్రీణి రత్నాని జలమన్నం సుభాషితం।

మూఢైః పాషాణఖండేషు రత్నసంజ్ఞా ప్రదీయతే.

అంటే పృథివిలో జలము, అన్నము మరియు సుభాషితము –

అని మూడు రత్నాలున్నాయి. మూర్ఖులు రాతిని రత్నమనుకుంటారు. మన సంస్కృతిలో ఆహారానికి చాలా ఎక్కువ మహిమ ఉంది. ఎంతంటే మనము అన్నజ్ఞానాన్ని కూడా విజ్ఞానంలో కలిపేశాము. సంతులిత పౌష్టిక భోజనం మనకందరికీ అవసరమైనది. ఇంకా ముఖ్యంగా మహిళలకు, అప్పుడే పుట్టిన పిల్లలకు. ఎందుకంటే వీరే మన భవిష్యత్తుకు పునాది. ‘పోషణ్ అభియాన్’ లో దేశమంతటా ఆధునిక వైజ్ఞానిక పద్ధతులలో పోషణ ప్రజా ఉద్యమంగా తయారవుతున్నది. ప్రజలు కొత్త ఆసక్తి కరమైన పద్ధతులలో కుపోషణతో పోరాడుతున్నారు. ఒకసారి ఒక విషయం నాదృష్టిలోకి వచ్చింది. నాసిక్ లో పిడికిటి నిండా ధాన్యము అనే ఒక పెద్ద ఉద్యమం జరిగింది. అందులో పంట కోతల దినాలలో అంగన్ వాడీ సేవికలు ప్రజల నుంచి ఒక పిడికిలి ధాన్యాన్ని సేకరిస్తారు. ఈ ధాన్యాన్ని స్త్రీలు, పిల్లలకు వేడిగా ఆహారం తయారుచేయడానికి వాడతారు. ఇందులో దానం చేసే వ్యక్తి ఒక జాగరూకుడైన పౌరునిగా సమాజ సేవకునిగా అవుతున్నాడు. ఆ తర్వాత అతడు స్వయంగా ఈ లక్ష్యం కొరకు అంకితమౌతాడు. ఈ ఉద్యమంలో ఒక సైనికునిలా పనిచేస్తాడు. మనమంతా కుటుంబాల్లో హిందూస్తాన్ లో అన్ని మూలల్లో అన్నప్రాసన సంస్కారం గురించి విన్నాము. పిల్లలకు మొదటి సారి ఘనాహారం తినిపించే సమయంలో ఈ సంస్కారం జరిపించబడుతుంది. ద్రవాహారం కాదు ఘనాహారం. గుజరాత్ 2010 లో ఒక ఆలోచన చేసింది. అన్నప్రాసన సందర్భంగా పిల్లలకు కాంప్లిమెంటరీ ఫుడ్ ఇచ్చి ఈ విషయంలో అవసరమైన ఎఱుక ఎందుకు కలిగించరాదు అని. ఇది చాలా గొప్ప ముందడుగు, దీనిని ప్రతి ఒక్కరూ పాటించవచ్చు. చాలా రాష్ట్రాల్లో ప్రజలు తిథి భోజన ఉద్యమం చేస్తారు. కుటుంబంలో పుట్టినరోజు గానీ, ఏదైనా శుభదినం కానీ, ఏదైనా స్మృతిదినం కానీ, కుటుంబ సభ్యులు పౌష్టికాహారం, రుచికరమైన ఆహారం తయారుచేసి అంగన్ వాడీలకు, బడులకు వెళ్ళి కుటుంబ సభ్యులు స్వయంగా వడ్డిస్తారు, తినిపిస్తారు. తమ ఆనందాన్ని పంచుకుంటారు. ఆనందాన్ని పెంచుకుంటారు. సేవాభావము, ఆనందభావముల ఒక అద్భుతమైన సమావేశం దృశ్యగోచరమౌతుంది. సహచరులారా! ఇలా అనేకమైన చిన్న చిన్న పద్ధతులద్వారా మన దేశము కుపోషణతో పోరాడి ప్రభావం తీసుకురావచ్చు. నేడు సరైన విషయపరిజ్ఞానం లేక, బీదవారు, సంపన్నులు కూడా కుపోషణ బారిన పడుతున్నారు. దేశమంతటా సెప్టెంబరు నెల ‘పోషణ అభియాన్ ‘ రూపంలో జరుపబడుతుంది. మీరంతా ఇందులో పాలుపంచుకోండి. విషయాలు తెలుసుకోండి. కొత్తవి చేర్చండి. మీరూ పాల్గొనండి. మీరు ఒకరిద్దరు వ్యక్తులనైనా కుపోషణ నుంచి ముక్తి కలిగేలా చేశారంటే మన దేశాన్ని కుపోషణ నుంచి ముక్తి కలిగినట్టే.
“హలో సర్, నా పేరు సృష్టి విద్య. నేను 2ndఇయర్ విద్యార్థినిని. సర్ నేను 12 ఆగస్టున మీ ఎపిసోడ్ చూశాను. Bear Grylls తో మీరున్నారు. ఆ కార్యక్రమం నాకు చాలా నచ్చింది. మీకు మన ప్రకృతి, వన్యప్రాణులు, పర్యావరణం పట్ల ఎంత శ్రద్ధ ఉందో ఎంత జాగ్రత్త తీసుకుంటారో విని చాలా సంతోషం కలిగింది. ఒక సాహసి రూపంలో కొత్త రూపంలో మిమ్మల్ని చూసి సంతోషం కలిగింది. ఈ కార్యక్రమ సమయంలో మీ అనుభవం ఎలా ఉండింది అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చివరగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సర్. మీ ఫిట్ నెస్ లెవెల్ చూసి మా యువత చాలా ప్రభావితమైంది. ఇంత ఫిట్ అండ్ ఫైన్ గా మిమ్మల్ని చూసి చాలా స్ఫూర్తి కలిగింది.”
సృష్టి గారు, మీ ఫోన్ కాల్ కు ధన్యవాదాలు. మీలాగే హరియాణా నుంచి సోహనా నుంచి కే కే పాండేయ గారు, సూరత్ నుంచి ఐశ్వర్యాశర్మ గారితో పాటు చాలా మంది డిస్కవరీ ఛానల్ లో ప్రసారమైన ‘Man Vs Wild’ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ సారి నేను ‘మన్ కీ బాత్’ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ విషయం గురించి చాలా ప్రశ్నలు వస్తాయి అని ఖచ్చితంగా అనిపించింది. అలాగే జరిగింది కూడా. గత కొన్ని వారాలుగా నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలతో కలిసినా అక్కడ ‘Man Vs Wild’ గురించి ప్రస్తావన వచ్చింది. ఈ ఒక్క ఎపిసోడ్ తో నేను హిందూస్తాన్ మాత్రమే కాక ప్రపంచంలోని యువత అందరితో కలిసినట్టైంది. యువ హృదయాలలో నాకింత చోటు దొరుకుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. మన దేశంలోని, ప్రపంచంలోని యువత వైవిధ్యమైన విషయాల పైన దృష్టి పెడుతున్నదని నేనెప్పుడూ అనుకోనే లేదు. ఎప్పటికైనా ప్రపంచంలోని యువ హృదయాలను స్పృశించే అవకాశం నా జీవితంలో వస్తుందని నేనేనాడూ ఊహించలేదు. కానీ జరిగిందేమిటి? గత వారం నేను భూటాన్ వెళ్ళాను. ప్రధానమంత్రి గా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళే సందర్భం వచ్చినా నేనొక విషయాన్ని గమనిస్తున్నాను – అంతర్జాతీయ యోగ్ దివస్ వల్ల ప్రపంచంలో ఎవరితో మాట్లాడే సందర్భం ఏర్పడినా ఎవరో ఒకరు ఐదు పది నిమిషాలు యోగా గురించి నాతో మాట్లాడతారు. ప్రపంచంలో పెద్ద నేతల్లో నాతో యోగా గురించి చర్చించని వాళ్ళు అరుదు. ఈ విషయం నేను ప్రపంచమంతటి గురించి చెప్తున్నాను. కానీ ఈ మధ్య ఒక కొత్త అనుభవం కలిగింది. ఎవరు కలిసినా, ఎక్కడ మాట్లాడే సందర్భం వచ్చినా వాళ్ళు వన్యప్రాణుల గురించి చర్చిస్తున్నారు, పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. పులి, సింహము, జీవ సృష్టి ప్రజలకు ఎన్ని విషయాల్లో అభిరుచులున్నాయి! డిస్కవరీ చానల్ ఈ కార్యక్రమాన్ని 165 దేశాల్లో వారి భాషలో ప్రసారం చేసే ప్రణాళిక వేసింది. నేడు పర్యావరణం, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ వీటిగురించి విశ్వ స్థాయిలో మేథోమథనం జరుగుతున్న సందర్భంలో, భారతదేశం యొక్క సందేశము, భారతదేశం యొక్క సంప్రదాయాలు, భారతదేశం యొక్క సంస్కార యాత్రలో ప్రకృతిపట్ల ఉన్న సహానుభూతి ఈ విషయాలన్నీ విశ్వానికి పరిచయం కావడంలోఈ కార్యక్రమంసహకరిస్తుందని ఆశిస్తాను. పూర్తిగా నమ్ముతున్నాను. మన భారత దేశంలో క్లైమేట్ జస్టిస్, స్వచ్చ వాతావరణం దిశగా తీసుకున్న చర్యలను ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇంకొక ఆసక్తి కరమైన సంగతి ఏమిటంటే కొందరు సంకోచిస్తూ నన్నొక మాట అడుగుతున్నారు, మోదీగారు, ఇది చెప్పండి. మీరు హిందీలో మాట్లాడుతున్నారు, Bear Grylls కు హిందీరాదు. మరి ఇంత వేగంగా మీ మధ్య సంభాషణ ఎలా జరుగుతున్నది? దీనిని తర్వాత ఎడిట్ గాని చేసారా? మళ్ళీ మళ్ళీ షూట్ చేశారా? ఏం జరిగింది? చాలా కుతూహలంగా ప్రశ్నిస్తారు. చూడండి, ఇందులో రహస్యమేమీ లేదు. చాలా మంది మనసులో ఈ ప్రశ్న ఉంది. సరే, నేను ఈ రహస్యాన్ని ఇప్పుడు చెప్పేస్తాను. నిజానికి ఇది రహస్యమే కాదు. వాస్తవమేమంటే Bear Grylls తో జరిగిన సంభాషణలో టెక్నాలజీ ని పూర్తిగా వినియోగించడం జరిగింది. నేను ఏదైనా చెప్పగానే అది ఆంగ్లంలోకి అనువాదం సమాంతరంగా జరిగిపోయేది. సమాంతరంగా జరుగుతుండడం వల్ల Bear Grylls చెవిలో ఒక చిన్న కార్డ్ లెస్ పరికరం పెట్టి ఉంచారు. కాబట్టి నేను హిందీలో మాట్లాడుతుంటే అది అతనికి ఆంగ్లంలో వినిపిస్తూ ఉండడం వల్ల సంభాషణ సాఫీగా సాగింది. టెక్నాలజీ యొక్క చమత్కారమే అది. ఈ షో తర్వాత చాలా మంది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గురించి చర్చిస్తూ కనిపిస్తున్నారు. మీరు కూడా ప్రకృతి, వన్యప్రాణులు, ఉండే చోట్లకు తప్పక వెళ్ళండి. నేను ఇదివరకు కూడా చెప్పాను. తప్పకుండా చెప్తుంటాను. మీరు జీవితంలో ఈశాన్యభారతానికి తప్పక వెళ్ళండి. ఆహా! ఏమి ప్రకృతి ఉందక్కడ! మీరు చూస్తూనే ఉండిపోతారు. మీ అంతరంగం కూడా విశాలమౌతుంది. 15 ఆగస్టున నేను ఎఱ్ఱకోట పైనుంచి మీకు విన్నపం చేశాను. రాబోయే మూడేళ్ళలో కనీసం 15 ప్రదేశాలు, భారతదేశంలో 15 ప్రదేశాలు పూర్తిగా పర్యటనకేంద్రాలుగా అవుతాయి. మీరు వెళ్ళండి, చూడండి, అధ్యయనం చేయండి, కుటుంబాన్ని తీసుకువెళ్ళండి, కొంత సమయం అక్కడ గడపండి. వైవిధ్యాలతో నిండిన దేశం మీక్కూడా ఈ వైవిధ్యాలను ఒక ఉపాధ్యాయునిలా పరిచయం చేస్తుంది. మీలో లోపలనుంచి ఈ వైవిధ్యాన్ని నింపుతుంది. మీ జీవనపరిధి విశాలమౌతుంది. మీ ఆలోచనా పరిధి విశాలమౌతుంది. మీరు కొత్త స్ఫూర్తి, కొత్త ఆకాంక్షలు, కొత్త ప్రేరణ పొందగలిగే ప్రదేశాలుహిందూస్తాన్ లోపలే ఉన్నాయని నాకు పూర్తి నమ్మకముంది. పైగా కొన్ని ప్రదేశాలైతే మీకూ, మీ కుటుంబానికీ కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేలా ఉండొచ్చు.
నా ప్రియ దేశవాసులారా, భారతదేశంలో పర్యావరణ రక్షణ, శ్రద్ధ అంటే సంరక్షణ గురించిన ఆలోచన సహజంగా కనిపిస్తుంది. గత నెలలో నాకు దేశంలో పులి జనాభాను విడుదల చేసే అదృష్టం కలిగింది. భారతదేశంలో ఎన్ని పులులున్నాయో మీకు తెలుసా? భారతదేశంలో పులుల సంఖ్య 2967. రెండువేల తొమ్మిది వందల అరవై ఏడు. కొన్నేళ్ళ క్రిందట ఈ సంఖ్యలో సగం ఉండడమే కష్టమై ఉండేది. 2010 లో పులుల గురించి రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఒక పులుల సదస్సు జరిగింది. అందులో పులుల సంఖ్య తగ్గుతుండడం గురించి విచారం వెలిబుచ్చి, ఒక సంకల్పం తీసుకున్నారు. 2022 కల్లా ప్రపంచంలోని పులుల సంఖ్య రెట్టింపు చేయాలన్నదే ఆ సంకల్పం. కానీ ఇది ఇప్పుడు కొత్త ఇండియా. మనము లక్ష్యాలను త్వరత్వరగా పూర్తి చేస్తాము. మనము 2019 లోనే ఇక్కడి పులుల సంఖ్యను రెట్టింపు చేశాము. భారతదేశంలో పులుల సంఖ మాత్రమే కాదు అభయారణ్యాలు, కమ్యూనిటీ రిజర్వ్ స్ సంఖ్య కూడా పెరిగింది. నేను పులుల డేటా విడుదల చేసేటప్పుడు నాకు గుజరాత్ లోని గిర్ సింహాలు కూడా గుర్తొచ్చాయి. నేను అక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినప్పుడుగిర్ అడవులలో సింహాల నివాసం తగ్గుతూ ఉండింది. వాటి సంఖ్య తగ్గుతూ ఉండింది. మేము గిర్ లో ఒకటొకటిగా అనేక చర్యలు చేపట్టాము. 2007 లో అక్కడి మహిళా గార్డ్లను నియమించే నిర్ణయం తీసుకున్నాము. పర్యాటకులను పెంచడానికి మౌలిక సదుపాయాల ను మెరుగు పరచాము. ఎప్పుడైనా సరే ప్రకృతి, వన్యప్రాణుల గురించి మాట్లాడితే పరిరక్షణ గురించే చర్చ జరుగుతుంది. కానీ, రక్షణతో పాటు కరుణ వైపు ఈ చర్చను తీసుకువెళ్ళడం గురించి ఆలోచించాలి. మన శాస్త్రాలలో ఈ విషయం గురించి చక్కటి మార్గదర్శనం దొరుకుతుంది. శతాబ్దాలకు పూర్వమే మన శాస్త్రాలలో మనము చెప్పుకున్నాము.

నిర్వనో బధ్యతే వ్యాఘ్రో, నిర్వ్యాఘ్రం ఛిద్యతే వనమ్।

తస్మాద్ వ్యాఘ్రో వనం రక్షేత్, వనం వ్యాఘ్రం న పాలయేత్॥

అర్థమేమంటే, అరణ్యం లేకుంటే పులులకు మానవ ప్రాంతాలకు రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. తత్ఫలితంగా అవి చంపబడతాయి. అడవిలో పులులు లేకుంటే మనుష్యులు అడవి చెట్లను కొట్టేసి దాన్ని నాశనం చేస్తారు. కాబట్టి వాస్తవంలో పులి అడవిని రక్షిస్తుంది. అడవి పులిని కాదు. ఎంత గొప్పగా ఈ విషయాన్ని మన పూర్వీకులు వివరించారు! కాబట్టి మనం అడవులను, చెట్లను, వన్యప్రాణులను రక్షించడం మాత్రమే ఆవశ్యకం కాదు, అవి సరైన రీతిలో వృద్ధి పొందడానికి తగిన వాతావరణాన్ని కూడా కల్పించాలి.

నా ప్రియ దేశవాసులారా, 11 సెప్టెంబర్ 1893 లో స్వామీ వివేకానందుని చారిత్రక ఉపన్యాసాన్ని ఎలా మరిచిపోగలము? విశ్వమంతటా మానవజాతిని ఊపేసిన భారత యువ సన్యాసి ప్రపంచంలో భారతదేశం యొక్క తేజోవంతమైన గుర్తింపును నిలిపాడు. బానిసగా భారతదేశాన్ని ఏ ప్రపంచం వికృతంగా చూస్తూ ఉండిందో, 11సెప్టెంబర్ 1893 న స్వామీ వివేకానందుని వంటి మహాపురుషుని మాటలు అదే ప్రపంచం భారతదేశం వైపు చూసే దృష్టినే మార్చుకునేలా చేశాయి. రండి, స్వామీ వివేనందుడు భారతదేశం యొక్క ఏ రూపాన్ని చూడాలనుకున్నాడో, భారతదేశం యొక్క ఏ సామర్థ్యాన్ని తెలుసుకున్నాడో ఆ విధంగా జీవించే ప్రయత్నం చేద్దాం. మనలోనే ఉంది, అంతా ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం.

నా ప్రియ దేశవాసులారా, 29 ఆగస్ట్ న ‘జాతీయ క్రీడాదినోత్సవం’గా జరుపుకుంటామని మీకంతా గుర్తు ఉండే ఉంటుంది. ఈ సందర్భంలో మన దేశమంతటా ‘ఫిట్ ఇండియా మూవ్ మెంట్’ ప్రారంభించబోతున్నాము. స్వయంగా ఫిట్ గా ఉండాలి. దేశాన్ని ఫిట్ గా తయారు చేయాలి. ప్రతి ఒక్కరికీ పిల్లలకు, పెద్దవాళ్ళకు, యువతకు, మహిళలకు అందరికీ ఇది చాలా ఆసక్తికరమైన ఉద్యమంగా ఉంటుంది. ఇది మీకు మీ స్వంతమైన విషయంగా ఉంటుంది. వాటి వివరాలన్నీ ఇప్పుడే చెప్పను. 29 ఆగస్ట్ వరకూ వేచిఉండండి. నేను స్వయంగా ఆరోజు వివరంగా విషయాలు చెప్తాను. మిమ్మల్ని కలుపుకొని వెళ్ళకుండా ఉండను. ఎందుకంటే మిమ్మల్ని నేను ఫిట్ గా చూడాలనుకుంటున్నాను. ఫిట్ నెస్ గురించి మిమ్మల్ని జాగరూకుల్ని చేయాలనుకుంటున్నాను. ఫిట్ ఇండియా కోసం దేశం కోసం మనమంతా కలిసి కొన్ని లక్ష్యాలను నిర్ధారిద్దాము.

నా ప్రియదేశవాసులారా, 29 ఆగస్ట్ న ఫిట్ ఇండియాలో మీకోసం ఎదురుచూస్తాను. సెప్టెంబర్ నెలలో ‘పోషణ్ అభియాన్’ లో కూడా. ఇంకా ముఖ్యంగా 11 సెప్టెంబర్ నుంచి 02 అక్టోబర్ వరకూ ‘స్వచ్ఛతా అభియాన్’ లో కూడా. ఇక 02 అక్టోబర్ పూర్తిగా ప్లాస్టిక్ కోసమే అంకితం. ప్లాస్టిక్ నుంచి ముక్తి పొందడానికి మనమంతా ఇల్లు, ఇంటిబయట అన్ని చోట్లా మనస్ఫూర్తిగా పాటుపడాలి. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో దుమ్ము రేగగొడతామని నాకు తెలుసు. రండి, ఒక కొత్త ఆకాంక్ష, కొత్త సంకల్పం, కొత్త శక్తితో ముందుకు సాగుదాం.

నా ప్రియ దేశవాసులారా, నేడు’మన్ కీ బాత్’ లో ఇంతే. మళ్ళీ కలుద్దాం. నేను మీ మాటల కోసం, మీ సూచనల కోసం వేచి ఉంటాను. రండి, మనమంతా కలిసి స్వాతంత్ర్య యోధుల కలల భారతం రూపొందేలా, గాంధీ కలలను సాకారం చేసేలా ముందుకు సాగుదాం – ‘స్వాంతః సుఖాయ.’ అంతరంగం లోని ఆనందాన్ని సేవాభావం ద్వారా ప్రకటిస్తూ ముందుకు సాగుదాం.

అనేకానేక ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PMAY-U Nears 1.25 Crore Homes: Top 10 States With The Highest PMAY-U Completion Rates

Media Coverage

PMAY-U Nears 1.25 Crore Homes: Top 10 States With The Highest PMAY-U Completion Rates
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM chairs 52nd PRAGATI Meeting
June 24, 2026
PM reviews four key infrastructure projects worth around ₹30,000 crore spanning four states across Road, Power, Industrial Corridor and Metro Rail sectors
PM emphasises use of PM GatiShakti National Master Plan and timely updation of project, utility and infrastructure data on the portal for efficient planning
PM asks Ministries and State Governments to resolve pending issues in a mission-mode manner and ensure close monitoring
PM reviews TB Mukt Bharat Abhiyan and emphasizes need to leverage latest digital technologies including AI
PM reviews grievances related to Cyber Crime and Digital Arrest and stresses timely action, coordinated response and e-Zero FIR registration mechanism

Prime Minister Shri Narendra Modi chaired the 52nd meeting of PRAGATI, the ICT-enabled, multi-modal platform aimed at fostering Pro-Active Governance and Timely Implementation, by seamlessly integrating efforts of the Central and State Governments, earlier today at Seva Teerth.

During the meeting, the Prime Minister reviewed four critical infrastructure projects across the Road, Power, Industrial Corridor and Metro Rail sectors, covering four States and costing around ₹30,000 crore. These projects, important for economic growth, regional connectivity, industrial development and public welfare, were reviewed with focus on timelines, inter-agency coordination, issue resolution and timely completion.

Prime Minister underlined that delays in infrastructure projects not only lead to cost escalation, but also deprive people and industries of timely benefits. He asked the concerned Ministries and State Governments to resolve pending issues in a mission-mode manner and ensure close monitoring at the highest level.

Prime Minister emphasised the use of PM GatiShakti National Master Plan for efficient planning and timely implementation of infrastructure projects. He also underlined the need for regular and timely updation of project details, utilities, infrastructure layers, clearances and other field-level information on the portal. He further emphasised that the platform must reflect the latest ground situation so that bottlenecks can be identified in advance, inter-agency coordination can be improved and decisions can be taken on the basis of reliable, real-time data.

Prime Minister reviewed TB Mukt Bharat Abhiyan and emphasised the need to leverage latest digital technologies including Artificial Intelligence. He suggested a team of NCC cadets and MY Bharat volunteers, for awareness, patient follow-up and community mobilisation.

Prime Minister also reviewed grievances related to Cyber Crime and Digital Arrest. He expressed concern over the rising misuse of digital platforms to defraud citizens and stressed that such matters require coordinated, sensitive and time-bound handling by all concerned agencies. He noted that citizens should not be made to run from one department or agency to another. He also emphasized the need for clear ownership, faster response, better coordination among law enforcement agencies, banks and digital platforms, and stronger public awareness campaigns.

Prime Minister observed that in cases involving cyber fraud, timely action is crucial to prevent financial loss and restore public confidence. He asked all stakeholders to work in close coordination to strengthen prevention, reporting, investigation and grievance redressal mechanisms. He also emphasised that States should work towards enabling e-Zero FIR mechanisms for faster registration and response in cyber fraud cases.