వ్యవసాయంలో విలువ జోడింపు ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పిన ప్రధాని;
కొత్త వంగడాలు ఎంతో ప్రయోజనకరమని.. ఖర్చు తగ్గడమేగాక పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపుతాయన్న రైతులు;
కొత్త వంగడాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందన;
వినియోగంలోకి రాని పంటలను ప్రధాన స్రవంతిలోకి తేవాలన్న ప్రధాని సూచన మేరకు కృషి చేస్తున్నట్లు తెలిపిన శాస్త్రవేత్తలు;
ప్రకృతి వ్యవసాయంతో ప్రయోజనాలు.. సేంద్రియ ఆహార డిమాండ్‌ పెరుగుదలపై చర్చించిన ప్రధాని మోదీ

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రాంగణంలో  నిర్వహించిన కార్యక్రమంలో 109 రకాల అధిక దిగుబడినిచ్చే, వాతావరణ ప్రతిరోధక, జీవ-బలోపేత వంగడాలను ఆవిష్కరించారు.

 

   ఈ సందర్భంగా ఆయన రైతులు, శాస్త్రవేత్తలతో కొద్దిసేపు ముచ్చటించారు. కొత్త వంగడాల ప్రాముఖ్యాన్ని ప్రస్తావిస్తూ- వ్యవసాయంలో విలువ జోడింపు ప్రాధాన్యాన్ని గుర్తుచేశారు. అలాగే కొత్త వంగడాల ఆవిష్కరణపై రైతులు స్పందిస్తూ- ఇవెంతో ప్రయోజనకరమేగాక సాగు ఖర్చును తగ్గిస్తాయని, పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపుతాయని అన్నారు.

 

   అటుపైన ప్రధానమంత్రి చిరుధాన్యాల ప్రాముఖ్యాన్ని ప్రస్తావిస్తూ- పౌష్టికాహారం దిశగా ప్రజలు అడుగు వేస్తుండటాన్ని ఉదాహరించారు. ప్రకృతి వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలు, సేంద్రియ ఉత్పత్తులపై సామాన్యుల్లోనూ పెరుగుతున్న విశ్వాసం గురించి చెప్పారు. దీనివల్ల సేంద్రియ ఆహారాలకు డిమాండ్ పెరుగుతున్నదని ప్రధాని పేర్కొన్నారు. దీనిపై రైతులు మాట్లాడుతూ- ప్రభుత్వం ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్న తీరుకు  అభినందనలు తెలిపారు.

 

   రైతులకు అవగాహన కల్పనలో వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు (కెవికె) పోషిస్తున్న పాత్రను అన్నదాతలు కొనియాడారు. కాగా, ప్రతినెలలో విడుదలయ్యే కొత్త వంగడాల సమాచారాన్ని రైతులకు తెలియజేస్తూ, వాటి ప్రయోజనాలపై అవగాహన పెంచాలని ప్రధాని ‘కెవికె’లకు సూచించారు.

 

   రైతులకు అవగాహన కల్పనలో వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు (కెవికె) పోషిస్తున్న పాత్రను అన్నదాతలు కొనియాడారు. కాగా, ప్రతినెలలో విడుదలయ్యే కొత్త వంగడాల సమాచారాన్ని రైతులకు తెలియజేస్తూ, వాటి ప్రయోజనాలపై అవగాహన పెంచాలని ప్రధాని ‘కెవికె’లకు సూచించారు.

 

   ఈ కొత్త వంగడాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలను ప్రధాని ప్రశంసించారు. కాగా, వినియోగంలోకి రాని పంటలను ప్రధాన స్రవంతిలోకి తేవాలన్న ప్రధాని సూచన మేరకు కృషి చేస్తున్నామని వారు తెలిపారు.

   ఈ కార్యక్రమంలో భాగంగా 61 పంటలకు సంబంధించిన 109 కొత్త వంగడాలను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. వీటిలో 34 సాధారణ పంటలు కాగా, 27 ఉద్యాన పంటల రకాలున్నాయి. సాధారణ పంట రకాల్లో చిరుధాన్యాలు, పశుగ్రాసం, నూనెగింజలు, పప్పుధాన్యాలు, చెరకు, పత్తి, పీచు తదితర విత్తనాలను విడుదల చేశారు. అలాగే ఉద్యాన పంటలలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఇతర పంటలు, దుంపలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పజాతులు, ఔషధ మొక్కల విత్తనాలను విడుదల చేశారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves

Media Coverage

Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26, 2026
దేశంలో క్రీడలు.. యువ నాయకత్వం.. పౌర బాధ్యత.. స్వచ్ఛంద సేవ.. దారుఢ్యం.. దేశ ప్రగతి వంటి అంశాలను ఈ చర్చలు ఒకే వేదికపైకి తెస్తాయి
ఈ చర్చలు ప్రధానంగా క్రీడలు.. ఒలింపిక్స్‌ ఆకాంక్షలు.. యువ నేతృత్వం.. వికిసిత భారత్.. మాదకద్రవ్య రహిత యువతరంపై దృష్టి సారిస్తాయి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026లో భాగంగా ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోగల రెండు కళాశాలల్లో యువతరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రగతి కార్యకలాపాల్లో యువత ఆకాంక్షలకు కీలక స్థానమిస్తూ ఆరోగ్యకర, క్రమశిక్షణాయుత. క్రీడాస్ఫూర్తి గల దేశానికి రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో క్రీడలు, యువ నాయకత్వం, పౌర కర్తవ్యం, స్వచ్ఛంద సేవ, దారుఢ్యం, దేశ పురోగమనం తదితర అంశాలన్నిటిపైనా చర్చను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తెస్తుంది. దేశ క్రీడారంగ పురోగమన ఆకాంక్షలతో యువత మమేకమయ్యే ప్రత్యక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. దేశ యువతరం, క్రీడా వ్యవస్థపై చర్చల సందర్భంగా వారి ఆలోచనలు, దృక్కోణాలను పంచుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమం అనంతరం యువ భాగస్వాములు, మై భారత్ వలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో చర్చలు సాగుతాయి. క్రీడాసక్తి గల యువత, ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతల మధ్య ప్రత్యక్ష ఇష్టాగోష్ఠి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో ‘యువతరం చర్చలు’ ప్రధానాంశంగా ఉంటాయి. యువ భాగస్వాములు తమ ఆలోచనలు, దృక్కోణాలు, ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఈ చర్చలు ప్రధానంగా దిగువ పేర్కొన్న 5 అంశాలపై కేంద్రీకృతమవుతాయి:

· మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, క్రీడా విజ్ఞానం, సార్వజనీన భాగస్వామ్యంతో జాతీయ క్రీడా వ్యవస్థ మెరుగుదల.

· శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపు, పారదర్శక ఎంపిక, దీర్ఘకాలిక క్రీడా వికాసం ద్వారా 2036లో ఒలింపిక్స్ దిశగా ప్రతిభకు పదును పెట్టడం.

· పరిపాలన వేదికలు, మై భారత్ నేతృత్వంలోని స్వచ్ఛంద సేవ ద్వారా యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం.

· పౌర చైతన్యం, భవిష్యత్‌ సంసిద్ధ నైపుణ్యం, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం, ద్వారా వికసిత భారత్ ప్రస్థానం వైపు యువతరానికి సాధికారత కల్పన.

· ఈ నెల 2న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి 100 వారాల ప్రచారం’లో భాగంగా వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య వినియోగంపై పోరులో క్రీడలు సహా, సహ రంగాల్లోని వివిధ బృందాల సేవల ద్వారా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ధ్యేయం.