సిక్కు ప్రతినిధుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. అత్యంత పవిత్రమైన, అమూల్యమైన శ్రీ గురు గోవింద సింగ్, మాతా సాహిబ్ కౌర్ల ‘జోరే సాహిబ్’ సంరక్షణ, ప్రదర్శనపై ప్రతినిధులు అందించిన సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. ‘జోర్ సాహిబ్’ వంటి పవిత్ర స్మృతి చిహ్నాలు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనవనీ, విశేషమైన సిక్కు చరిత్రలో ఒక భాగమనీ, దేశ సంస్కృతికి మూలాలనీ పేర్కొన్నారు. ‘‘శ్రీ గురు గోవింద్ సింగ్ చూపిన ధైర్యం, ధర్మం, న్యాయం, సామాజిక సామరస్య మార్గాన్ని అనుసరించేలా భవిష్యత్ తరాలకు పవిత్రమైన ఈ స్మృతి చిహ్నాలు స్ఫూర్తినిస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి పోస్టుకు శ్రీ మోదీ స్పందన:
‘‘శ్రీ గురు గోవింద్ సింగ్, మాతా సాహిబ్ కౌర్లకు చెందిన అత్యంత పవిత్రమైన, అమూల్యమైన ‘జోరే సాహిబ్’ను సంరక్షించడానికి, ప్రదర్శించడానికి సిక్కు ప్రతినిధుల బృందం చేసిన విలువైన సూచనలను సంతోషంగా స్వీకరిస్తున్నాను.

సిక్కు చరిత్రలో ‘జోరే సాహిబ్’ పవిత్రమైన స్మృతి చిహ్నాలు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనవి. దేశ సాంస్కృతిక మూలాల్లో ఇవి భాగంగా ఉన్నాయి.

శ్రీ గురు గోవింద్ సింగ్ చూపిన ధైర్యం, ధర్మం, న్యాయం, సామాజిక సామరస్య మార్గాన్ని అనుసరించేలా భవిష్యత్ తరాలకు ఈ పవిత్ర స్మృతి చిహ్నాలు స్ఫూర్తినిస్తాయి’’
I was very happy to receive the distinguished and accomplished members of the Sikh delegation who handed over their recommendations with regard to the safekeeping and befitting display of the immensely sacred and invaluable holy 'Jore Sahib' of Sri Guru Gobind Singh Ji and Mata… https://t.co/37Zo3zWd3t
— Narendra Modi (@narendramodi) September 19, 2025
ਮੈਨੂੰ ਸਿੱਖ ਵਫ਼ਦ ਦੇ ਪ੍ਰਤਿਸ਼ਠਾਵਾਨ ਅਤੇ ਕੁਸ਼ਲ ਮੈਂਬਰਾਂ ਦਾ ਸਵਾਗਤ ਕਰਦੇ ਹੋਏ ਬਹੁਤ ਖੁਸ਼ੀ ਹੋਈ, ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਸ਼੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਅਤੇ ਮਾਤਾ ਸਾਹਿਬ ਕੌਰ ਜੀ ਦੇ ਅਤਿ ਪਵਿੱਤਰ ਅਤੇ ਅਨਮੋਲ ਪਵਿੱਤਰ 'ਜੋੜੇ ਸਾਹਿਬ' ਦੀ ਸੁਰੱਖਿਆ ਅਤੇ ਉੱਚਿਤ ਪ੍ਰਦਰਸ਼ਨੀ ਸਬੰਧੀ ਆਪਣੀਆਂ ਸਿਫ਼ਾਰਸ਼ਾਂ ਸੌਂਪੀਆਂ।
— Narendra Modi (@narendramodi) September 19, 2025
'ਜੋੜੇ ਸਾਹਿਬ' ਜਿੰਨੇ ਮਹੱਤਵਪੂਰਨ… https://t.co/37Zo3zWd3t


