శ్రీ ప్రణబ్ ముఖర్జీ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. శ్రీ ముఖర్జీ ఒక శిఖరాయమాన రాజనీతిజ్ఞుడు. అసాధారణ ప్రజ్ఞావంతుడు. దశాబ్దాల పాటు ప్రజాజీవనంలో అచంచలమైన అంకితభావంతో భారత్కు ఆయన సేవలు అందించారని ప్రధానమంత్రి ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘శ్రీ ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్బంగా ఆయనకు నేను నివాళులు అర్పిస్తున్నాను. శిఖరాయమాన రాజనీతిజ్ఞునిగా, అసాధారణ ప్రజ్ఞావంతునిగా దశాబ్దాల పాటు ప్రజాజీవనంలో అచంచలమైన అంకితభావంతో భారత్కు ఆయన సేవలందించారు. ప్రణబ్ బాబు తెలివితేటలు, స్పష్టమైన ఆలోచనలు మన ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా సుసంపన్నం చేశాయి. ఏళ్ల తరబడి ఆయనతో నేను మాటామంతీ జరిపిన క్రమంలో, ఎన్నో విషయాలను ఆయన నుంచి నేర్చుకో గలగడం నాకు దక్కిన భాగ్యం’’ అని పేర్కొన్నారు.
Tributes to Shri Pranab Mukherjee on his birth anniversary. A towering statesman and a scholar of exceptional depth, he served India with unwavering dedication across decades of public life. Pranab Babu’s intellect and clarity of thought enriched our democracy at every step. It’s… pic.twitter.com/CSUctgZAmm
— Narendra Modi (@narendramodi) December 11, 2025


