ఈ రోజు శ్రీ సి. రాజగోపాలాచారి జయంతి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ఒక స్వాతంత్య్ర యోధునిగానూ, ఆలోచనాపరునిగానూ, మేధావిగానూ, రాజనీతి కోవిదునిగానూ ఆయనను ప్రధానమంత్రి స్మరించుకున్నారు. 20వ శతాబ్దంలో చురుకైన మేధస్సుగల వ్యక్తుల్లో  ఒకరుగా రాజాజీ మెలిగారు, విలువలను ఏర్పరచాలనీ, ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవాలనీ ఆయన విశ్వసించారు అని ప్రధానమంత్రి అన్నారు.
భారత స్వాతంత్య్ర పోరాటానికీ, ప్రజాజీవనానికీ ఆయన అందించిన సేవలు కలకాలం నిలిచేనని దేశ ప్రజలు కృతజ్ఞత‌ పూర్వకంగా గుర్తుచేసుకుంటున్నారని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘శ్రీ సి. రాజగోపాలాచారి పేరును స్మరించుకోగానే స్వాతంత్య్ర యోధుడు, ఆలోచనపరుడు, మేధావి, రాజనీతికోవిదుడు.. ఈ విశేషణాలు వెనువెంటనే మనకు స్ఫురిస్తాయి. ఆయన జయంతి సందర్భంగా ఆయనకు ఇవే నివాళులు. 20వ శతాబ్దంలో చురుకైన మేధస్సుగల వ్యక్తులలో ఒకరుగా రాజాజీ  నిలుస్తారు, విలువలను ఏర్పరచాలనీ, ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవాలనీ ఆయన విశ్వసించారు. కలకాలం నిలిచే ఆయన సేవలను మన దేశ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.

రాజాజీ జయంతి సందర్భంగా,  ప్రాచీన గ్రంథాలయ దస్తావేజుల్లో నుంచి కొన్ని ఆసక్తిదాయక అంశాలను నేను మీతో పంచుకుంటున్నాను. వీటిలో యవ్వనంలో రాజాజీ చిత్రం, క్యాబినెట్ మంత్రిగా ఆయనను నియమించినప్పటి అధికార ప్రకటన, 1920వ దశాబ్దంలో స్వచ్ఛంద కార్యకర్తలతో కలిసి ఉన్న ఒక చిత్రం, 1922 లో గాంధీ జీ జైలులో ఉండగా రాజాజీ సంపాదకునిగా వ్యవహరించిన యంగ్ ఇండియా సంచిక  ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India remains fastest-growing major economy, domestic investors power market resilience

Media Coverage

India remains fastest-growing major economy, domestic investors power market resilience
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 మార్చి 2026
March 15, 2026

Empowering Bharat: From Loans to Global Leadership Under PM Modi