టలీలోని అపులియాలో జి-7 సదస్సులో భాగంగా ఇవాళ కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతం తదితర అంశాలపై నిర్వహించిన విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా తొలుత జి-7 కూటమి 50వ వార్షికోత్సవ మైలురాయిని అందుకోవడంపై ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ- మానవాళి చరిత్రలోనే  అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియలో తాను మూడోసారి ఎన్నికైన తర్వాత ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ప్రధాని హర్షం వెలిబుచ్చారు. మానవ కేంద్రక విధాన ప్రాతిపదికగా ఉన్నపుడే సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం కాగలదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు సేవా ప్రదానం కోసం డిజిటల్ సాంకేతికత వినియోగంలో భారత్ సాధించిన విజయాలను సభికులతో ప్రధాని పంచుకున్నారు.

   ‘‘అందరి కోసం కృత్రిమ మేధ’’ పేరిట భారత్ చేపట్టిన కార్యక్రమాన్ని ఉటంకిస్తూ- ఎలాంటి సాంకేతిక పరిజ్ఞాన వినియోగమైనా సర్వజన ప్రగతి, శ్రేయస్సు లక్ష్యంగా ఉండాలని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ విస్తృత దృక్కోణంతోనే కృత్రిమ మేధపై ప్రపంచ భాగస్వామ్యం సంస్థాపన సభ్యురాలుగా భారతదేశం ఈ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన గుర్తుచేశారు. భారత ఇంధన పరివర్తన మార్గం గురించి ప్రధానమంత్రి విశదీకరిస్తూ- ఇది లభ్యత, అందుబాటు, సరళత, ఆమోదయోగ్యత ప్రాతిపతికగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే దేశంలో 2070 నాటికి నికర శూన్య ఉద్గార స్థాయిని సాధించే దిశగా భారత్ నిర్విరామ కృషి చేస్తున్నదని తెలిపారు.

 

   భారత్ ప్రతిపాదించిన మిషన్ ‘లైఫ్’ [పర్యావరణం కోసం జీవనశైలి] గురించి ప్రస్తావిస్తూ- ఇందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో తాను స్వయంగా మొక్కల పెంపకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని వెల్లడించారు. అంతర్జాతీయ సమాజం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ‘‘ప్లాంట్4మదర్’’ [భూమాత కోసం ఒక మొక్క] నినాదంతో వ్యక్తిగతంగా ప్రారంభించి, అంతర్జాతీయ కర్తవ్యంతో దీన్నొక ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు.

 

   దక్షిణార్థ గోళం... ముఖ్యంగా ఆఫ్రికా దేశాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు. కాగా, భారత్ జి-20 అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఆఫ్రికా సమాఖ్యకు ఆ కూటమిలో శాశ్వత సభ్యత్వం లభించడం తమ దేశానికి దక్కిన గౌరవమని ఆయన గుర్తుచేశారు.

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Safe, Inclusive AI For All': PM Modi Says India Helping Shape 'Force For Good' Conversation

Media Coverage

'Safe, Inclusive AI For All': PM Modi Says India Helping Shape 'Force For Good' Conversation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM shares a Sanskrit Subhashitam highlighting the importance of complete and scientifically grounded knowledge
February 18, 2026

Prime Minister Shri Narendra Modi today shared a Sanskrit Subhashitam highlighting the importance of complete and scientifically grounded knowledge. Such a complete true wisdom leads an individual to fullness, Clarity and the supreme realisation of truth.

The PM quoted an ancient Sanskrit verse on X:

“ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः।

यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते।।”