సుమారు 5,450 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి పరచనున్న గురుగ్రామ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు
దాదాపుగా 1,650 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మాణం జరుగనున్న ఎఐఐఎమ్ఎస్ రేవాడీ కి శంకుస్థాపనచేశారు
కురుక్షేత్ర లోని జ్యోతిసర్ లో ‘అనుభవ కేంద్ర’ మ్యూజియమ్ ను ప్రారంభించారు
అనేక రైల్ వే ప్రాజెక్టుల కు శంకుస్థాపన తో పాటు, దేశ ప్రజల కు అంకితం చేశారు
రోహ్‌తక్-మహమ్-హాంసీ సెక్శను లో రైలు సర్వీసు కు ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపెట్టారు
‘‘హరియాణా లోని డబల్ ఇంజన్ ప్రభుత్వం ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాల కల్పన కు కంకణం కట్టుకొంది’’
‘‘వికసిత్ భారత్ ఆవిష్కారానికి హరియాణా అభివృద్ధి చెందడం మరీ ముఖ్యం’’
‘‘భగవద్ గీత లోశ్రీ కృష్ణ భగవానుడు చేసిన బోధల ను జ్యోతిసర్ అనుభవ కేంద్రం ప్రపంచాని కి పరిచయంచేయనుంది’’
‘‘జల సంబంధ సమస్యలను పరిష్కరించడం కోసం హరియాణా ప్రభుత్వం ప్రశంసనీయమైన కార్యాన్ని పూర్తి చేసింది’’
‘‘వస్త్ర పరిశ్రమ లోమరియు దుస్తుల పరిశ్రమ లో హరియాణా ఒక పెద్ద పేరు ను తెచ్చుకొంటోంది’’
‘‘పెట్టుబడి కిమరియు పెట్టుబడిని పెంచుకోవడాని కి ఒక అగ్రగామి రాష్ట్రం గా హరియాణాపుంజుకొంటున్నది; అంటే క్రొత్త ఉద్యోగ అవకాశాల లో వృద్ధి అనే దీనికి అర్థంఅన్నమాట’’

హరియాణా లోని రేవాడీ లో 9,750 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభోత్సవం, దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం లతో పాటు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు లు పట్టణ ప్రాంతాల లో రవాణా, ఆరోగ్యం, రైలు మార్గాలు మరియు పర్యటన ల వంటి అనేక ముఖ్యమైన రంగాల కు చెందినవి. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన కొన్ని ఎగ్జిబిశన్ లను కూడా శ్రీ నరేంద్ర మోదీ కలియదిరిగి పరిశీలించారు.

 

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ధైర్యవంతుల పురిటిగడ్డ రేవాడీ కి ప్రశంస ను వ్యక్తం చేస్తూ, ఈ ప్రాంతం లో తన పట్ల ప్రజలు చూపిన ఆప్యాయత ను గుర్తు కు తెచ్చారు. 2013 వ సంవత్సరం లో ప్రధాని అభ్యర్థి గా తన తొలి కార్యక్రమం రేవాడీ లోనే జరిగిన సంగతి ని ఆయన గుర్తు కు తెచ్చుకొంటూ, ప్రజలు అందించిన శుభాకాంక్షల ను స్మరించుకొన్నారు. ప్రజల ఆశీస్సులే తనకు ఒక పెద్ద ఆస్తి అని ఆయన అన్నారు. ప్రపంచం లో నూతన శిఖరాల కు భారతదేశం చేరుకొంటోంది అంటే దానికి సంబంధించిన ఖ్యాతి ప్రజల దీవెనలదే అన్నారు. యుఎఇ ని మరియు కతర్ ను ప్రధాన మంత్రి తాను సందర్శించిన విషయమై మాట్లాడుతూ, ప్రపంచ రంగస్థలం లో భారతదేశాని కి లభిస్తున్నటువంటి గౌరవం మరియు సద్భావన ల ఖ్యాతి భారతదేశ ప్రజలకే దక్కుతుంది అని స్పష్టం చేశారు. అదే విధం గా జి-20, చంద్రయాన్ మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ పదకొండో స్థానం నుండి అయిదో స్థానాని కి ఎగబాకడం.. ఇవన్నీ ప్రజల సమర్థన చలవే నన్నారు. రాబోయే సంవత్సరాల లో భారతదేశాన్ని ప్రపంచం లో మూడో అతి పెద్దదైనటువంటి ఆర్థిక వ్యవస్థ గా మలచడానికి ప్రజలు వారి యొక్క ఆశీస్సుల ను అందించాలి అని ఆయన కోరారు.

 

భారతదేశం వికసిత్ భారత్ గా రూపొందాలి అంటే హరియాణా అభివృద్ధి అవసరం అని ప్రధాన మంత్రి అన్నారు. రహదారులు మరియు రైల్ వే నెట్ వర్క్ ల ఆధునికీకరణ తో పాటు, హరియాణా అభివృద్ధి కి గాను అన్ని సౌకర్యాలు లభించేటటువంటి ఆసుపత్రులు నిర్మించేందుకు పది వేల కోట్ల రూపాయల ఖర్చు తో అనేక అభివృద్ధి పథకాల కు ఈ రోజు న శంకుస్థాపన చేయడం , దేశ ప్రజల కు ఆ ప్రాజెక్టుల ను అంకితం ఇవ్వడం గురించి ఆయన ప్రస్తావించారు. ఆయా అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి ఒక్కటొక్కటిగా పేర్కొంటూ, వాటి లో ఎఐఐఎమ్ఎస్ రేవాడీ, గురుగ్రామ్ మెట్రో , అనేక రైలు మార్గాలు మరియు క్రొత్త రైళ్ళు, ఇంకా ‘అనుభవ్ కేంద్ర’ జ్యోతిసర్ లు ఉన్నాయి అన్నారు. అనుభవ్ కేంద్ర జ్యోతి సర్ ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, భగవద్ గీత లో శ్రీ కృష్ణ భగవానుడు చేసిన బోధల ను ప్రపంచాని కి ఆ కేంద్రం పరిచయం చేయడం తో పాటు గా భారతదేశం సంస్కృతి లో వైభవోపేతమైన గడ్డ అయినటువంటి హరియాణా తోడ్పాటుల ను కూడా ప్రముఖం గా ప్రచారం లోకి తీసుకు వస్తుంది అన్నారు. ఈ రోజు న చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల కు గాను హరియాణా ప్రజల కు ఆయన అభినందనల ను తెలియ జేశారు.

 

‘మోదీ గ్యారంటీ’ (‘మోదీ హామీ ’) ని గురించి దేశ స్థాయి లోను, ప్రపంచం స్థాయి లోను సందడి నెలకొన్న సంగతి ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ‘మోదీ యొక్క హామీ’ కి తొలి సాక్షి గా రేవాడీ ఉందన్నారు. దేశం ప్రతిష్ట ను గురించి, అయోధ్య ధామ్ లో శ్రీ రామ్ దేవాలయాన్ని గురించి తాను ఇక్కడ ఇచ్చిన హామీ లను గురించి ఆయన మరొక మారు గుర్తు కు తెస్తూ, ఆ హామీ లు వాస్తవ రూపాన్ని దాల్చాయి అన్నారు. అదే విధం గా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ కి అనుగుణం గా 370 వ అధికరణాన్ని రద్దు చేయడం జరిగింది అన్నారు. ప్రస్తుతం జమ్ము, కశ్మీర్ లో మహిళలు, వెనుబడిన వర్గాల వారు, దళితులు, ఆదివాసీలు వారి వారి హక్కుల ను వినియోగించుకొంటున్నారు అని ఆయన అన్నారు.

 

మాజీ సైనికోద్యోగుల కు ‘ఒక ర్యాంకు- ఒక పెన్శన్’ (ఒఆర్ఒపి) తాలూకు హామీ ని నెరవేరుస్తానంటూ రేవాడీ లో హామీ ని ఇచ్చిన విషయాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇంతవరకు దాదాపు గా ఒక లక్ష కోట్ల రూపాయల ను అందజేయడమైందని, మరి ఈ ప్రయోజనాల ను హరియాణా కు చెందిన ఎంతో మంది మాజీ సైనికోద్యోగులు అందుకొన్నారన్నారు. రేవాడీ లో ఇంతవరకు 600 కోట్ల రూపాయల కు పైచిలుకు సొమ్మును ఒఆర్ఒపి యొక్క లబ్ధిదారులు అందుకొన్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. మునుపటి ప్రభుత్వం ఒఆర్ఒపి కి 500 కోట్ల రూపాయల బడ్జెటు ను కేటాయించిందని, అది ఒక్క రేవాడీ లోనే మాజీ సైనికులు అందుకొన్న మొత్తం కంటే తక్కువ గా ఉంది అని కూడా ఆయన వివరించారు.

 

రేవాడీ లో ఎఐఐఎమ్ఎస్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఇచ్చిన హామీ ని కూడా ను ఈ రోజు న శంకుస్థాపన చేయడం తో నెరవేర్చడం జరిగింది. రేవాడీ ఎఐఐఎమ్ఎస్ ను ప్రారంభించేది కూడా తానే అంటూ ప్రధాన మంత్రి బరోసా ను ఇచ్చారు. దీనితో మెరుగైన వైద్య చికిత్స కు అవకాశం కలుగుతుంది అని, స్థానిక పౌరుల కు వైద్యుడు గా ఎదిగేందుకు అవకాశం లభిస్తుంది అని ఆయన అన్నారు. రేవాడీ ఎఐఐఎమ్ఎస్ దేశం లో 2 2వ ఎఐఐఎమ్ఎస్ అని ప్రధాన మంత్రి తెలిపారు. గడచిన పది సంవత్సరాల లో క్రొత్త గా 15 ఎఐఐఎమ్ఎస్ లను మంజూరు చేయడం జరిగింది. 300కు పైగా వైద్య కళాశాల లు గడచిన 10 సంవత్సరాల లో ఏర్పాటు అయ్యాయి. హరియాణా లో కూడాను, ప్రతి ఒక్క జిల్లా లో కనీసం ఒక వైద్య కళాశాల ఏర్పడేటట్టు చూడడం కోసం తగిన పనులు సాగుతున్నాయి.

 

ప్రస్తుత ప్రభుత్వం మరియు గతించిన కాలపు ప్రభుత్వాల యొక్క సుపరిపాలన మరియు దుష్పరిపాలన ల మధ్య ప్రధాన మంత్రి పోలిక ను తీసుకు వచ్చారు; అదే కోవ లో గడచిన పదేళ్ళ లో హరియాణా లో డబల్ ఇంజన్ ప్రభుత్వం పనిచేస్తూ ఉండడాన్ని ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధానాల అమలు విషయాని కి వస్తే, ఈ రాష్ట్రం అగ్ర స్థానం లో నిలబడుతోంది అని ఆయన వెల్లడించారు. వ్యవసాయ రంగం లో హరియాణా యొక్క వృద్ధి ని గురించి మరియు రాష్ట్రం లో పరిశ్రమల విస్తరణ ను గురించి ఆయన వివరించారు. రహదారులు, రైలు మాగాలు లేదా మెట్రో సర్వీసుల పరం గా చూస్తే దశాబ్దాల తరబడి వెనుకపట్టునే ఉండిపోయిన దక్షిణ హరియాణా ప్రస్తుతం శరవేగం గా అభివృద్ధి చెందుతోందని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వే లో భాగం అయిన దిల్లీ- దౌసా-లాల్‌సోట్ సెక్శన్ యొక్క ఒకటో దశ ఇప్పటికే ప్రారంభం అయిందని, అదీ గాక భారతదేశం లోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అయిన దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వే హరియాణా లోని గురుగ్రామ్, పల్‌వల్, ఇంకా నూహు జిల్లాల గుండా సాగుతోంది అని ప్రధాన మంత్రి తెలిపారు.

2014కి ముందు సగటున రూ.300 కోట్లుగా ఉన్న హర్యానా వార్షిక రైల్వే బడ్జెట్ ఇప్పుడు గత పదేళ్లలో రూ.3,000 కోట్లకు పెరిగిందని ప్రధాని మోదీ వెల్లడించారు. రోహ్తక్-మెహమ్-హంసీ, జింద్-సోనిపట్ కోసం కొత్త రైల్వే లైన్లు, అంబాలా కాంట్-దప్పర్ వంటి మార్గాలను రెట్టింపు చేయడం గురించి ఆయన ప్రస్తావించారు. లక్షలాది మందికి ప్రయోజనం చేకూర్చడంతో పాటు సులభతర జీవనం, సులభతర వ్యాపారాన్ని పెంచుతుందని చెప్పారు.

 

యువతకు ఉపాధిని కల్పిస్తున్న వందలాది బహుళజాతి కంపెనీలకు నిలయంగా ఉన్న ఈ రాష్ట్రంలో నీటి సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని  ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశంలో 35 శాతానికి పైగా కార్పెట్‌లను ఎగుమతి చేస్తూ, 20 శాతం వస్త్రాలను తయారు చేస్తున్న టెక్స్‌టైల్, దుస్తుల పరిశ్రమ విషయానికి వస్తే హర్యానా తనకంటూ గొప్ప పేరు తెచ్చుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. హర్యానా జౌళి పరిశ్రమను ముందుకు తీసుకెళ్తున్న చిన్న తరహా పరిశ్రమల గురించి ప్రస్తావిస్తూ, పానిపట్ చేనేత ఉత్పత్తులకు, ఫరీదాబాద్ వస్త్ర ఉత్పత్తికి, గురుగ్రామ్ రెడీమేడ్ వస్త్రాలకు, సోనిపట్ టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు, భివానీ నాన్-నేసిన-వస్త్రాలకు ప్రసిద్ధి చెందిందని ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. గత 10 సంవత్సరాలలో ఎంఎస్ఎంఈలు, చిన్న తరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల రూపాయల సహాయం గురించి ప్రధాన మంత్రి తెలియజేసారు, దీని ఫలితంగా పాత చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు బలోపేతం అవుతున్నాయి. వేలాది కొత్త పరిశ్రమలు కూడా రాష్ట్రంలో స్థాపించారు.

రేవారిలోని విశ్వకర్మ ఇత్తడి పనితనం,  హస్తకళల పనితనంపై వెలుగునిస్తూ, 18 వృత్తులకు సంబంధించిన అటువంటి సంప్రదాయ కళాకారుల కోసం పీఎం-విశ్వకర్మ యోజన ప్రారంభించడాన్ని ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో భాగమవుతున్నారని, మన సాంప్రదాయ కళాకారులు, వారి కుటుంబాల జీవితాలను మార్చడానికి ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోందని ఆయన తెలియజేశారు.

 

“మోదీ హామీ అనేది బ్యాంకులకు గ్యారెంటీ లేని వారి కోసం ఉద్దేశించబడింది”, చిన్న రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని అందించడం, పేదలకు, దళితులకు తాకట్టు లేని రుణాల కోసం ముద్రా యోజనను అందించడం గురించి ప్రధాని ప్రస్తావించారు. అలాగే వెనుకబడిన, ఓబీసీ కమ్యూనిటీలు, వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి యోజన అమలు చేస్తున్నామని అన్నారు.

రాష్ట్రంలోని మహిళల సంక్షేమం గురించి మాట్లాడుతూ, హర్యానాకు చెందిన లక్షలాది మంది మహిళలతో సహా దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది మహిళలను స్వయం సహాయక సంఘాలతో అనుసంధానించడంతో పాటు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, నీటి సరఫరాను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ స్వయం సహాయక సంఘాలకు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ల‌ఖ‌ప‌తి దీదీ ప‌థ‌కాల గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఈ సంవ‌త్స‌రం బ‌డ్జెట్ కింద వారి సంఖ్య‌ను 3 కోట్ల‌కు పెంచే కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు 1 కోటి మంది మ‌హిళ‌లు ల‌ఖ‌ప‌తి దీదీలుగా మారార‌ని ప్ర‌ధాన మంత్రి తెలియ జేశారు. న‌మో డ్రోన్ దీదీ ప‌థ‌కంపై కూడా ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు, ఇందులో మ‌హిళ‌ల స‌ముదాయాలు సేద్యంలో ఉప‌యోగించుకునేలా న‌మోదు చేయ‌డం ద్వారా వారికి అద‌న‌పు ఆదాయాన్ని క‌ల్పించేందుకు శిక్షణ ఇస్తున్నారు.

"హర్యానా అద్భుతమైన అవకాశాల రాష్ట్రం", హర్యానా మొదటి సారి ఓటర్లకు ఉజ్వల భవిష్యత్తును ఉద్ఘాటిస్తూ ప్రధాన మంత్రి అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం హర్యానాను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తోందని, సాంకేతికత లేదా వస్త్ర, పర్యాటక లేదా వాణిజ్యం వంటి ప్రతి రంగంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు కృషి చేస్తోందని ఆయన నొక్కి చెప్పారు. “హర్యానా పెట్టుబడులకు మంచి రాష్ట్రంగా ఎదుగుతోంది, పెట్టుబడులు పెరగడం అంటే కొత్త ఉద్యోగావకాశాలు పెరగడం” అని ప్రధాన మంత్రి చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు.

 

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం 

దాదాపు 5,450 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్న గురుగ్రామ్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. మొత్తం 28.5 కి.మీ పొడవుతో ఈ ప్రాజెక్ట్, మిలీనియం సిటీ సెంటర్‌ను ఉద్యోగ్ విహార్ ఫేజ్-5కి కలుపుతుంది. సైబర్ సిటీకి సమీపంలోని మౌల్సారి అవెన్యూ స్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న రాపిడ్ మెట్రో రైల్ గురుగ్రామ్ మెట్రో నెట్‌వర్క్‌లో విలీనం అవుతుంది. ప్రపంచ స్థాయి పర్యావరణ అనుకూలమైన సామూహిక శీఘ్ర పట్టణ రవాణా వ్యవస్థలను పౌరులకు అందించాలనే ప్రధాన మంత్రి దార్శనికతను సాకారం చేయడంలో ఈ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన అడుగు.

దేశవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా, హర్యానాలోని రేవారిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి శంకుస్థాపన జరుగుతోంది. దాదాపు రూ. 1650 కోట్లతో ఎయిమ్స్ రేవారీని రేవారిలోని మజ్రా ముస్తిల్ భాల్ఖి గ్రామంలో 203 ఎకరాల స్థలంలో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 720 పడకలతో హాస్పిటల్ కాంప్లెక్స్, 100 సీట్లతో మెడికల్ కాలేజీ, 60 సీట్లతో నర్సింగ్ కాలేజీ, 30 పడకలతో ఆయుష్ బ్లాక్, అధ్యాపకులు, సిబ్బందికి నివాస వసతి, యుజి మరియు పిజి విద్యార్థులకు హాస్టల్ వసతి, నైట్ షెల్టర్, గెస్ట్ హౌస్, ఆడిటోరియం వంటి సౌకర్యాలు ఉంటాయి. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) కింద స్థాపించిన ఎయిమ్స్ రేవారి హర్యానా ప్రజలకు సమగ్రమైన, నాణ్యమైన మరియు సంపూర్ణమైన తృతీయ సంరక్షణ ఆరోగ్య సేవలను అందిస్తుంది. కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ఎండోక్రినాలజీ, బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీతో సహా 18 స్పెషాలిటీలు, 17 సూపర్ స్పెషాలిటీలలో పేషెంట్ కేర్ సేవలు ఈ సౌకర్యాలలో ఉన్నాయి. ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఎమర్జెన్సీ, ట్రామా యూనిట్, పదహారు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్‌లు, డయాగ్నోస్టిక్ లాబొరేటరీలు, బ్లడ్ బ్యాంక్, ఫార్మసీ మొదలైన సదుపాయాలు కూడా ఉంటాయి. హర్యానాలో ఎయిమ్స్ స్థాపన సమగ్ర, నాణ్యత, సంపూర్ణమైన తృతీయ సంరక్షణ ఆరోగ్యాన్ని ప్రజలకు అందించడంలో ముఖ్యమైన మైలురాయి. 

 

నూతనంగా నిర్మించిన అనుభవ కేంద్ర జ్యోతిసర్, కురుక్షేత్రాన్ని ప్రధాని ప్రారంభించారు. దాదాపు 240 కోట్ల వ్యయంతో ఈ ప్రయోగాత్మక మ్యూజియం నిర్మించారు. మ్యూజియం 17 ఎకరాలలో విస్తరించి ఉంది, 100,000 చదరపు అడుగుల ఇండోర్ స్థలాన్ని కలిగి ఉంది. ఇది మహాభారత ఇతిహాస కథనాన్ని, గీతా బోధనలను స్పష్టంగా జీవం పోస్తుంది. సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), 3డి లేజర్, ప్రొజెక్షన్ మ్యాపింగ్‌తో సహా అత్యాధునిక సాంకేతికతను కూడా మ్యూజియం ఉపయోగించుకుంటుంది. జ్యోతిసార్, కురుక్షేత్రం శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత శాశ్వతమైన జ్ఞానాన్ని అందించిన పవిత్ర స్థలం.

 

ప్రధాన మంత్రి బహుళ రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. రేవారీ-కతువాస్ రైలు మార్గాన్ని (27.73 కి.మీ) డబ్లింగ్ చేయడంతోపాటు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు; కతువాస్-నార్నాల్ రైలు మార్గం (24.12 కి.మీ) రెట్టింపు; భివానీ-దోభ్ భాలి రైలు మార్గం రెట్టింపు (42.30 కి.మీ); మన్హేరు-బవానీ ఖేరా రైలు మార్గం (31.50 కి.మీ) రెట్టింపు. ఈ రైల్వే లైన్లను రెట్టింపు చేయడం వల్ల ఈ ప్రాంతంలో రైలు మౌలిక సదుపాయాలు పెంపొందుతాయి. ప్యాసింజర్, సరకు రైళ్లను సకాలంలో నడపడంలో సహాయపడుతుంది. రోహ్‌తక్, హిస్సార్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే రోహ్‌తక్-మెహమ్-హన్సి రైలు మార్గాన్ని (68 కి.మీ) ప్రధాని జాతికి అంకితం చేశారు. రోహ్‌తక్-మెహమ్-హన్సి సెక్షన్‌లో రైలు సేవలను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఇది రోహ్‌తక్,  హిసార్ ప్రాంతంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది, రైలు ప్రయాణీకులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Auto sector reports strong sales momentum; SUVs and exports drive growth across industry

Media Coverage

Auto sector reports strong sales momentum; SUVs and exports drive growth across industry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
First Deputy PM of Russia Denis Manturov calls on PM Modi
April 02, 2026
First Deputy PM Manturov briefs PM on progress in trade, fertilizers, connectivity and people-to-people ties
PM recalls the successful visit of President Putin to India in December 2025
PM expresses satisfaction at the sustained efforts towards implementation of the Summit outcomes
PM extends warm greetings to President Putin

The First Deputy Prime Minister of the Russian Federation, H.E. Denis Manturov, called on Prime Minister Shri Narendra Modi today.

First Deputy PM Manturov briefed PM on the progress in various areas of mutually beneficial cooperation, including trade and economic partnership, fertilizers, connectivity and people-to-people ties.

PM recalled the successful visit of President Putin to India in December 2025 for the 23rd India-Russia Annual Summit.

He expressed satisfaction at the sustained efforts being made by both sides towards implementation of the outcomes from the Annual Summit, aimed at further strengthening the India- Russia Special and Privileged Strategic Partnership.

PM extended warm greetings to President Putin and said that he looked forward to their continued exchanges.