షేర్ చేయండి
 
Comments
“మార్పు దిశగా మన గిరిజన సోదరసోదరీమణులసహకారం.. ప్రభుత్వం నుంచి వీలైనంత తోడ్పాటు”;
“అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థలకు ప్రతిరూపంగా గోద్రాలోనిగోవింద్ గురు... నర్మదాలోని బిర్సా ముండా విశ్వవిద్యాలయాలు”;
“ప్రగతి.. విధాన రూపకల్పనలో తమకూ భాగస్వామ్యంఉందని గిరిజన సమాజం భావిస్తుండటం ఇదే తొలిసారి”;
“గిరిజనులు గర్వించే స్థలాలు.. విశ్వాస ప్రదేశాలఅభివృద్ధితో పర్యాటక రంగానికి ప్రోత్సాహం”

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని జంబుఘోడా, పంచమహల్‌లో రూ.860 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నిటిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- గుజ‌రాత్‌లోని ఆదివాసీ, గిరిజన సమాజాలకు ఇదొక చిరస్మరణీయ దినమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, తాను మాన్‌గఢ్‌ను సందర్శించి భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన గోవింద్ గురుసహా వేలాది గిరిజన సమరయోధులకు నివాళులర్పించానని ప్రధాని గుర్తుచేశారు. ఆ ప్రాంతంతో తన దీర్ఘకాల అనుబంధాన్ని ప్రధాని గుర్తుకు తెచ్చుకుంటూ- దేశంలోని గిరిజన సమాజ చేసిన ఎనలేని త్యాగాలకు సాక్షిగా నిలిచిన జంబుఘోడలో ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. “ఇవాళ మనమంతా గర్వంతో ఉప్పొంగుతున్నాం. షహీద్ జోరియా పరమేశ్వర్, రూప్‌సింగ్‌ నాయక్, గలాలియా నాయక్, రవ్జిదా నాయక్, బబరియా గల్మా నాయక్ వంటి అమర యోధులకు శిరసాభివందనం చేస్తున్నాం” అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

    ప్రాంతమంతటా నేడు ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి సంబంధిత రూ.వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసుకుంటున్నామని ప్రధాని చెప్పారు. గోవింద్ గురు విశ్వవిద్యాలయం, కేంద్రీయ విద్యాలయాల కొత్త పాలన భవన ప్రాంగణాల గురించి ప్రస్తావిస్తూ- ఈ ప్రాజెక్టులు మన గిరిజన యువతరం ప్రగతికి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. జంబుఘోడాను ప్రధానమంత్రి పవిత్ర క్షేత్రంగా అభివర్ణించారు. గిరిజనుల శౌర్యం, స్వాతంత్ర్యం కోసం పోరులో ఆ సమాజం అద్భుత చరిత్రను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా 1857 విప్లవానికి ఊతమిచ్చిన నైక్డా ఉద్యమం గురించి ప్రస్తావించారు. పరమేశ్వర్ జోరియా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయగా, రూప్ సింగ్ నాయక్ ఆయనతో భుజం కలిపారని గుర్తుచేశారు. వారిద్దరూ 1857నాటి తిరుగుబాటులో కీలక పాత్ర పోషించిన తాత్యా తోపేతో కలసి పరాయి పాలకులతో తలపడ్డారని వివరించారు. బ్రిటిష్ పాలకులు ఈ సాహసులను ఉరితీసిన వృక్షం ముందు నిలుచుని ఆ వీరులకు శిరసాభివందనం చేసే అదృష్టం 2012లో లభించిందని, ఆ రోజున ఒక పుస్తకావిష్కరణ కూడా చేశామని ప్రధాని గుర్తుచేసుకున్నారు.

   గుజరాత్‌లో పాఠశాలలకు అమరవీరుల పేరుపెట్టే సంప్రదాయం చాలాకాలం కిందటే మొదలైందని ప్రధాని గుర్తుచేశారు. తదనుగుణంగా వాడేక్, దాండియాపుర ప్రాథమిక పాఠశాలలకు ‘సంత్ జోరియా పరమేశ్వర్’, ‘రూప్ సింగ్ నాయక్’ల పేరుపెట్టారు. ఈ పాఠశాలలు నేడు సరికొత్త రూపం సంతరించుకున్నాయని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ పాఠశాలల్లో ఇద్దరు గొప్ప గిరిజన వీరుల విగ్రహాలను ఆవిష్కరించామని, అవి ఇవాళ విద్యారంగం, స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన సమాజ సహకారానికి రెండు ప్రధాన కేంద్రాలుగా మారాయని ఆయన చెప్పారు.

   గుజరాత్‌ ప్రజలకు సేవచేసే అదృష్టం తనకు రెండు దశాబ్దాల కిందట లభించే నాటికి మునుపటి ప్రభుత్వం సృష్టించిన అభివృద్ధి అంతరం వారసత్వంగా రావడాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆనాడు గిరిజన ప్రాంతాల్లో విద్య, పౌష్టికాహారం, నీరు వంటి మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉండేదని చెప్పారు. “ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి మేము ‘సబ్‌ కా ప్రయాస్’   స్ఫూర్తితో కృషి చేశాం. ఆ సమయంలో మార్పు దిశగా మన గిరిజన సోదరసోదరీమణులు ఎంతో బాధ్యతతో సహకరించారు. ప్రభుత్వం కూడా వారికి స్నేహ హస్తం అందించి, సాధ్యమైనంత మేర అన్నివిధాలా సహాయం చేసింది” అని ప్రధాని తెలిపారు. ఈ మార్పు ఏదో ఒక్కరోజు కృషితో వచ్చింది కాదని, లక్షలాది గిరిజన కుటుంబాల నిరంతర శ్రమతోనే సాధ్యమైందని ప్రధాని పేర్కొన్నారు. ఈ గిరిజన ప్రాంతంలో ప్రాథమిక స్థాయి నుంచి మాధ్యమిక స్థాయి వరకు ప్రారంభమైన 10 వేల కొత్త పాఠశాలలు, డజన్ల కొద్దీ ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు, బాలికల కోసం ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు, ఆశ్రమశాలలే ఇందుకు నిదర్శనాలని ప్రధాని ఉదాహరించారు. బాలికలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, పాఠశాలల్లో పౌష్టికాహార లభ్యతను కూడా ప్రధానమంత్రి గుర్తుచేశారు.

   ప్రజలు తమ కుమార్తెలను పాఠశాలకు పంపేవిధంగా అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో భాగంగా ‘కన్యా శిక్షా (విద్య) రథం’ వంటి కార్యక్రమాలను చేపట్టడాన్ని గుర్తుచేశారు. పాఠశాలలో శాస్త్రీయ విద్య లభించకపోవడం గిరిజన ప్రాంతానికి  మరో సవాలుగా మారిందని ఆయన ఎత్తిచూపారు. ఇటువంటి పరిస్థితుల నడుమ గత రెండు దశాబ్దాలలోనే గిరిజన జిల్లాల్లో 11 సైన్స్, 11 వాణిజ్య, 23 ఆర్ట్స్ కళాశాలలతోపాటు వందలాది హాస్టళ్లు ప్రారంభించబడ్డాయని తెలిపారు. సుమారు 20-25 ఏళ్ల కిందట గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల కొరత తీవ్రంగా ఉండేదని ప్రధాని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి నుంచి “ఇవాళ గోద్రాలో గోవింద్‌ గురు, నర్మదాలో బిర్సా ముండా విశ్వవిద్యాలయాల రూపంలో రెండు అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థలు రూపుదిద్దుకున్నాయి” అని ఆయన వివరించారు. కొత్త ప్రాంగణం ప్రారంభోత్సవం తర్వాత గోవింద్ గురు విశ్వవిద్యాలయంలో సౌకర్యాలను మరింత విస్తరిస్తామని ప్రధాని వెల్లడించారు. అహ్మదాబాద్‌లోని నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణం పంచమహల్‌సహా అన్ని గిరిజన ప్రాంతాల యువతకూ ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. “డ్రోన్ పైలట్ లైసెన్స్ మంజూరు చేసేందుకు దేశంలో గుర్తింపు పొందిన తొలి విశ్వవిద్యాలయం ఇదే”నని అని శ్రీ మోదీ నొక్కిచెప్పారు.

   డచిన దశాబ్దాల్లో గిరిజన జిల్లాల సర్వతోముఖాభివృద్ధి దిశగా కీలక పాత్ర పోషించిన ‘వనబంధు కల్యాణ్‌ యోజన’ గురించి ప్రధాని ప్రస్తావించారు. గిరిజన ప్రాంతాల్లో ఈ పథకం కింద 14-15 ఏళ్ల కాలంలో రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చుచేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో గుజరాత్ ప్రభుత్వం మరో రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నదని ఆయన వెల్లడించారు. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధి గురించి వివరిస్తూ- పైపుల ద్వారా నీటి సరఫరా, సూక్ష్మ-నీటి పారుదల, గిరిజన ప్రాంతాల్లో పాడి పరిశ్రమకు ప్రాధాన్యం తదితరాలను ఉదాహరించారు. అలాగే గిరిజన సోదరీమణులకు సాధికారత కల్పించి, వారి ఆదాయం  పెంచడానికి ‘సఖి మండళ్ల’ (మహిళా సంఘాల)ను ఏర్పాటు చేశామన్నారు. గుజరాత్‌లో వేగం పుంజుకున్న పారిశ్రామికీకరణ ప్రయోజనాలను గిరిజన యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అనేక ఆధునిక వృత్తివిద్యా కేంద్రాలు, ఐటీఐలు, కిసాన్‌ వికాస కేంద్రాలను ప్రారంభించామని ప్రధానమంత్రి గుర్తుచేశారు. దాదాపు 18 లక్షల మంది గిరిజన యువత శిక్షణ పొంది, ఉద్యోగాలు సాధించడంలో ఇవి ఎంతగానో తోడ్పడ్డాయని పేర్కొన్నారు.

   రాష్ట్రంలో 20-25 ఏళ్ల కిందట ‘సికిల్ సెల్’ వ్యాధి ముప్పును గిరిజనులు ఎదుర్కొన్నారని ప్రస్తావిస్తూ- ఆనాడు గిరిజన జిల్లాల్లో వైద్యశాలలు లేకపోవడమేగాక పెద్ద ఆసుపత్రులు, వైద్య కళాశాలలు కనీస సంఖ్యలో కూడా ఉండేవి కావని ప్రధాని గుర్తుచేశారు. అలాంటిది “ఇవాళ రెండు ఇంజన్ల ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో వందలాది చిన్న ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. గిరిజన ప్రాంతాల్లో 1400కుపైగా ఆరోగ్య-శ్రేయో కేంద్రాలను ప్రారంభించింది. గోద్రా వైద్య కళాశాల కొత్త భవనం పనులు మొదలైన నేపథ్యంలో దాహోద్, బనస్కాంత, వల్సాద్‌లలోని వైద్య కళాశాలలపై ఒత్తిడి తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

   “అందరి కృషి’తో గిరిజన జిల్లాల్లోని ప్రతి గ్రామానికీ 24 గంటల విద్యుత్‌ సౌకర్యంసహా చక్కని రహదారులు ఏర్పడ్డాయి” అని ప్రధాని తెలిపారు. గుజరాత్‌లో 24 గంటల విద్యుత్‌ సదుపాయంగల తొలి జిల్లాగా డాంగ్‌ గిరిజన జిల్లా నిలిచిందని, దీంతో గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు విస్తరించాయని ఆయన చెప్పారు. “గుజరాత్‌లోని స్వర్ణ కారిడార్‌తోపాటు జంట నగరాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ మేరకు హలోల్-కలోల్‌లో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా సాగుతోంది” అని ఆయన తెలిపారు.

    ఇరవై, ఇరవై అయిదు సంవత్సరాల కిందట కంటక భూతం గా ఉన్న సికిల్ సెల్ డిజీజ్ ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావిస్తూ, ఆదివాసి జనాభా అధికం గా నివసించే జిల్లాల లో ఔషధశాల లు లేకపోవడమే కాక పెద్ద ఆసుపత్రులు మరియు వైద్య కళాశాల ల సంబంధి సదుపాయాలు అంతంత మాత్రం గానే ఉండేవి అని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం, డబల్ ఇంజిన్ ప్రభుత్వం వందల కొద్ది చిన్న ఆసుపత్రుల ను గ్రామాల స్థాయి లో నెలకొల్పడం తో పాటు గా 1400 కు పైగా హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ లను ఆదివాసీ ప్రాంతాల లో ఏర్పాటు చేసింది’’ అని ఆయన అన్నారు. గోధ్రా మెడికల్ కాలేజి కొత్త భవనం నిర్మాణం పూర్తి అయిందంటే గనక దాహోద్ లో, బనాస్ కాంఠా లో మరియు వల్ సాద్ లో నిర్మాణం జరిగిన వైద్య కళాశాలల భారాన్ని తగ్గిస్తుంది అని ఆయన తెలిపారు.

     సబ్ కా ప్రయాస్ వల్ల, మంచి రహదారులు ఆదివాసి జిల్లాల లో ప్రతి ఒక్క పల్లె కు చేరాయి, 24 గంటలు విద్యుత్తు సమకూరింది అని ఆయన అన్నారు. దాంగ్ జిల్లా గుజరాత్ లో 24 గంటల విద్యుత్తు సౌకర్యం కలిగివున్న ఒకటో జిల్లా , దీనితో ఆదివాసి ప్రాంతాల లో పరిశ్రమలు విస్తరణ కు అవకాశం కలిగింది అని ఆయన తెలిపారు. ‘‘గుజరాత్ లో గోల్డెన్ కారిడోర్ తో పాటు గా, జంట నగరాల ను అభివృద్ధిపరచడం జరుగుతోంది. హలోల్ - కలోల్ లో పారిశ్రామిక అభివృద్ధి శరవేగంగా చోటు చేసుకొంటోంది’’, అని ఆయన వెల్లడించారు.

      భారతదేశం లో ఆదివాసి సమాజాల అభ్యున్నతి పరం గా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయాసల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా చెబుతూ, మొట్టమొదటి సారి గా ఆదివాసి సమాజానికి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వశాఖ ను ఏర్పాటు చేసింది బిజెపి ప్రభుత్వం. అంతేకాక, వన్ ధన్ వంటి ఒక సఫలమైన పథకాన్ని అమలుపరచడం జరిగింది అని కూడా అన్నారు. బ్రిటిషు కాలం నుండి ఉంటూ వచ్చిన వెదురు సాగు ను మరియు విక్రయాన్ని నిషేధించే చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని, అటవీ ఉత్పాదనల ను అదే పని గా నిర్లక్ష్యం చేస్తూ రావడాన్ని అంతమొందించడమైందని, 80 కి పైగా వేరు వేరు వన ఉత్పాదనల కు ఎమ్ఎస్ పి తాలూకు ప్రయోజనాన్ని అందించడమైందని, అలాగే ఆదివాసి వ్యక్తులు గర్వం గా జీవించే విధం గా పాటుపడుతుండడం తో పాటు గా వారి జీవనాన్ని సులభతరం చేసేందుకు కూడాను కృషి చేస్తోందని ప్రధాన మంత్రి కొన్ని ఉదాహరణల ను ప్రస్తావించారు. ‘‘తొలి సారి గా, ఆదివాసి సమాజం అభివృద్ధి లోను, విధాన రూపకల్పన లోను వారి భాగస్వామ్యం పెరుగుతోందన్న భావన లో ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భగవాన్ బిర్ సా ముండా యొక్క జయంతి ని జన్ జాతీయ గౌరవ్ దివస్ గా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.

       పేదలు, అణచివేత బారిన పడ్డ వర్గాలు, వెనుకబడ్డ వర్గాలు మరియు ఆదివాసి సముదాయాల కోసం డబల్ ఇంజిన్ ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయాస ను గురించి కూడా ప్రధాన మంత్రి వివరించ సాగారు. ఆహార పదార్థాల ను, కోవిడ్ టీకామందు ను ఉచితం గా సమకూర్చడం, పేదల కు 5 లక్షల రూపాయల వరకు చికిత్స సదుపాయాల ను ఉచితం గా అందిస్తుండడం, గర్భవతులు పుష్టికరమైనటువంటి ఆహారాన్ని తీసుకొనేటట్లు గా వారికి సాయపడడం, చిన్న రైతులు ఎరువులు, విత్తనాలు, ఎలక్ట్రిసిటి బిల్లుల వంటి వాటి కోసం రుణాల ను పొందేలాగా పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి యోజన ను ప్రవేశపెట్టడం మొదలైన ఉదాహరణల ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘‘నేరుగా అందించే సాయం కావచ్చు, లేదా పక్కా ఇళ్లు, స్నానాల గదులు, గ్యాస్ కనెక్శన్ లు, నీటి కనెక్శన్ లు వంటి సదుపాయాలు కావచ్చు.. వీటి తాలూకు ప్రధాన లబ్ధిదారులు గా దళితులు మరియు వెనుకబడిన కుటుంబాలు ఉన్నాయి అని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.

       భారతదేశం యొక్క సంస్కృతి ని మరియు ధర్మాన్ని కాపాడడం లో ఒక ప్రధానమైన పాత్ర ను పోషించిన ఆదివాసి వీరుల చరిత్ర ను ప్రధాన మంత్రి చెబుతూ, చంపానె, పావాగఢ్, సోమనాథ్, ఇంకా హల్డీఘాటీ ల తాలూకు ఉదాహరణల ను ఇచ్చారు. ‘‘ఇప్పుడు పావాగఢ్ దేవాలయాన్ని పునర్ నవీకరించడం జరిగింది, మరి జెండా ను పూర్తి వైభవం తో ఎగరేయడమైంది. అలాగే, అది అంబాజీ మాత యొక్క ధామం కావచ్చు, లేదా దేవ్ మొగ్రా మాత దేవాలయం కావచ్చు.. వాటి అభివృద్ధి కి సైతం నిరంతర ప్రయాస లు చేపట్టడం జరుగుతున్నది.’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

        ఉపాధి కి ఊతాన్ని ఇవ్వడం కోసం పర్యటన రంగం పోషించిన కీలకమైన భూమిక ను ప్రధాన మంత్రి గుర్తించారు. పర్యటన పరం గా చాలా సంపన్నమైనది అయినటువంటి పంచ్ మహల్ వంటి స్థలాల ను గురించి, ప్రాచీన వాస్తుకళ కు పేరు గాంచిన చంపానెర్-పావాగఢ్ గురించి, జంబుఘోడా లో వన్యప్రాణి సంతతి ని గురించి హథ్ నీ మాత జలపాతాన్ని గురించి, ధన్ పురి లో ఇకో-టూరిజమ్ స్థలాలు, కాడా ఆనకట్ట, ధనేశ్వరి మాత దేవాలయం, ఇంకా జండ్ హనుమాన్ జీ ని గురించి ఆయన ప్రస్తావించి, రాబోయే రోజుల లో ఈ స్థలాల ను ఒక టూరిస్ట్ సర్క్యూట్ గా తీర్చిదిద్దడం జరుగుతుందని, అవి కొత్త ఉద్యోగ అవకాశాల ను అందిస్తాయన్నారు. ‘‘ఆదివాసి వ్యక్తులు గర్వపడేటటువంటి స్థలాల ను, ధార్మిక స్థలాల ను అభివృద్ధి పరచడం అనేది పర్యటన కు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది’’ అని ఆయన అన్నారు.

          డబల్ ఇంజిన్ ప్రభుత్వం లో అభివృద్ధి తాలూకు విస్తారమైనటువంటి పరిధి ని ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో ప్రశంసిస్తూ, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరి కి అందుతున్నాయన్నారు. ‘‘మా ఉద్దేశం స్పష్టంగా ఉంది, కఠోర శ్రమ తోను, అంకిత భావం తోను క్షేత్ర స్థాయి లో మార్పు ను తీసుకురావాలన్నదే అది. మనం కలిసికట్టుగా అభివృద్ధి చెందిన ఒక గుజరాత్ ను మరియు అభివృద్ధి చెందిన ఒక భారతదేశాన్ని నిర్మిద్దాం’’, అని ఆయన అన్నారు.

         ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంట్ సభ్యులు మరియు గుజరాత్ ప్రభుత్వం లో మంత్రులు గా ఉన్న వారు తదితరులు ఉన్నారు.

పూర్వరంగం

ప్రధాన మత్రి దాదాపు గా 860 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ను జంబుఘోడా, పంచ్ మహల్ లో దేశ ప్రజల కు అంకితం చేయడం మరియు శంకుస్థాపన లు చేశారు. ఆయన గోధ్రా లో శ్రీ గోవింద్ గురు విశ్వవిద్యాలయం నూతన భవన సముదాయాన్ని, సంత్ జోడియా పరమేశ్వర్ ప్రాథమిక పాఠశాల ను, వదేక్ గ్రామం లో నెలకొన్న స్మారకాన్ని, ఇంకా దాండియాపుర గ్రామం లో ఏర్పాటైన రాజా రూప్ సింహ్ నాయక్ ప్రాథమిక పాఠశాల మరియు స్మారక భవనాన్ని దేశ ప్రజల కు అంకితమిచ్చారు.

గోధ్రా లో కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. గోధ్రా మెడికల్ కాలేజి అభివృద్ధి పనుల కు మరియు 680 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువ కలిగిన స్కిల్ యూనివర్సిటి ‘కౌశల్య’ కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.

 

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
Minister of Railways, Communications and Electronics & IT Ashwini Vaishnaw writes: Technology at your service

Media Coverage

Minister of Railways, Communications and Electronics & IT Ashwini Vaishnaw writes: Technology at your service
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles demise of noted actor and former MP Shri Innocent Vareed Thekkethala
March 27, 2023
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the demise of noted actor and former MP Shri Innocent Vareed Thekkethala.

In a tweet, the Prime Minister said;

“Pained by the passing away of noted actor and former MP Shri Innocent Vareed Thekkethala. He will be remembered for enthralling audiences and filling people’s lives with humour. Condolences to his family and admirers. May his soul rest in peace: PM @narendramodi”