ఆదివాసుల అతి పెద్ద పండుగల లో ఒకటైనటువంటి సమ్మక్క-సారక్క మేడారం జాతర ఆరంభం అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు. సమ్మక్క కు మరియు సారక్క కు శ్రీ నరేంద్ర మోదీ నివాళుల ను అర్పించారు. ఏకత్వ భావన మరియు పరాక్రమ భావన మూర్తీభవించిన ఆ ఇరువురి ని ఆయన స్మరించుకొన్నారు కూడా.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
“గిరిజనులు జరుపుకొనే అతి పెద్ద పండుగల లో ఒకటైనటువంటి, మన సాంస్కృతిక వారసత్వాని కి చిరకాలిక స్ఫూర్తి గా నిలచేటటువంటి మరియు చైతన్య శక్తి కి అద్దం పట్టే టటువంటి సమ్మక్క- సారక్క మేడారం జాతర ఆరంభం అయిన సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం మరియు సాముదాయిక భావన ల యొక్క మహా సమ్మేళనం అని చెప్పాలి. సమ్మక్క- సారక్కల కు ప్రణామాల ను ఆచరించుదాం; ఏకత్వానికి మరియు పరాక్రమానికి ప్రతీకలు గా నిలచినటువంటి సమ్మక్క, సారక్క లను మనం ఈ సందర్భం లో మరోమారు గుర్తు తెచ్చుకొందాం.” అని పేర్కొన్నారు.
Greetings on the start of the Sammakka-Sarakka Medaram Jathara, one of the largest tribal festivals, and a vibrant manifestation of the enduring spirit of our cultural heritage. This Jathara is a great fusion of devotion, tradition and community spirit. We bow to Sammakka-Sarakka…
— Narendra Modi (@narendramodi) February 21, 2024
గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు…
— Narendra Modi (@narendramodi) February 21, 2024


