ఈ రోజు ఛఠ్ పూజలో భాగంగా సంధ్య వేళ సూర్యునికి అర్ఘ్యాన్నిచ్చే ఆచారాన్ని దేశ ప్రజానీకం పాటించనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు.
ఛఠీ మాతకు అంకితమిచ్చిన భక్తి గీతాలను కూడా శ్రీ మోదీ ప్రజలతో పంచుకున్నారు.
‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా రాశారు:
‘‘దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులకు ఛఠ్ మహాపర్వం లోని సంధ్యా అర్ఘ్య ఘట్టానికి గాను అనేకానేక శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో, సంజె కాలంలో సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం చాలా విశిష్ట సంప్రదాయం. సూర్యదేవుని కృపతో అందరికీ శుభాలు కలగాలని, అందరి జీవనంలో సుఖసంపదలు, విజయం సిద్ధించాలని నేను అభిలాషిస్తున్నాను. జయ్ ఛఠీ మాతా.
https://m.youtube.com/watch?v=er0EO-Zp904
https://m.youtube.com/watch?v=OrlnX9zM5-k&pp=0gcJCR4Bo7VqN5tD”
देशभर के अपने परिवारजनों को महापर्व छठ के संध्या अर्घ्य की अनंत शुभकामनाएं। इस पावन अवसर पर अस्ताचलगामी सूर्य को अर्घ्य अर्पित करने की हमारी परंपरा बहुत विशिष्ट है। सूर्यदेव की कृपा से सबका कल्याण हो, सबको जीवन में सुख-संपदा और सफलता की प्राप्ति हो, यही कामना है। जय छठी मइया!…
— Narendra Modi (@narendramodi) October 27, 2025


