సిసి క్రికెట్ ప్రపంచ కప్-2023 సెమీఫైనల్స్‌ పోరులో న్యూజిలాండ్‌ జట్టుపై అద్భుత  విజయంతో ఫైనల్స్ చేరిన భారత క్రికెట్ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ టోర్నమెంట్ తుది పోటీలోనూ నెగ్గి, విజేతగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో: 

‘‘టీమ్ ఇండియాకు అభినందనలు! భారత ఆటగాళ్లు అత్యుత్తమ ప్రతిభతో సమష్టిగా రాణించి, తిరుగులేని విజయాలతో జట్టును ఫైనల్స్‌ చేర్చారు. ఆకట్టుకునే బ్యాటింగ్, కట్టుదిట్టమైన బౌలింగ్ ద్వారా మన జట్టు ప్రత్యర్ధి జట్టుపై తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటుకుంది. ఇప్పటిదాకా ఒటమి ఎరుగని భారత జట్టు తుది పోరులోనూ విజయ పరంపరను కొనసాగించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

   అలాగే సెమీఫైనల్స్ లో భారత బౌలర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనను కూడా ప్రధాని ప్రశంసించారు. ‘‘నేటి సెమీ ఫైనల్ పోరులో మన ఆటగాళ్ల అద్భుత వ్యక్తిగత ప్రదర్శనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ మ్యాచ్ లో మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచ కప్‌లో షమీ @MdShami11 బౌలింగ్‌ ప్రతిభను రాబోయే తరాల క్రికెట్ ప్రేమికులు కూడా ఆనందిస్తారు. అద్భుతంగా ఆడావు షమీ!’’ అని ప్రధానమంత్రి కొనియాడారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India can be a massive architect in AI: Economist Danny Quah

Media Coverage

India can be a massive architect in AI: Economist Danny Quah
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ఉత్సుకత, సకారాత్మక శక్తి... ఇవి విజయాన్ని అందిస్తాయని చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
April 30, 2026

ఉత్సుకత, సకారాత్మక శక్తి... ఇవి మనుషులకు ఎప్పటికీ చురుకుగా ఉండే స్ఫూర్తిని ఇస్తాయని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
పొంగిపొరలే ఈ ఉత్సుకతే ఏ పనిని అయినా సరే, పూర్తి చేయడంలో మనిషికి విజయాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘కర్మశీలురు, శక్తిమంతులైన దేశ ప్రజలే  అన్నింటి కన్న పెద్ద శక్తి  ఏ దేశానికైనా. వారి కృషితోనే అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వారి ప్రయత్నాలతో దేశం సమృద్ధిని, స్వయంసమృద్ధిని, ప్రగతి శిఖరాన్ని అందుకొంటుంది.
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః
కరోతి సఫలం జన్తోః కర్మ యచ్చ కరోతి సః’’ అని పేర్కొన్నారు.
ఉత్సాహం, సకారాత్మక శక్తి మనుషులను వారి పనులలో నిరంతరం చురుకుగా ఉండేటట్లు ప్రేరణను అందిస్తాయి. పొంగి పొర్లుతూ ఉండే ఈ ఉత్సాహమే... మనిషి పూర్తి చేయాలనుకునే  ఏ పనిలోనైనా సాఫల్యాన్ని అందిస్తుందని  ఈ సుభాషితం బోధిస్తోంది.