కాశీ నివాసి, యోగా సాధకుడు శ్రీ శివానంద బాబా మృతిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
“యోగా సాధకుడు, కాశీ నివాసి శివానంద బాబా గారి మరణం అత్యంత విచారకరం. యోగా, ధ్యానానికి అంకితమైన ఆయన జీవితం దేశంలోని ప్రతి తరానికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. యోగా ద్వారా సమాజానికి సేవలందించిన ఆయనకు పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది.
శివానంద బాబా శివలోక ప్రయాణం కాశీ నివాసితులందరికి, ఆయన నుంచి ప్రేరణ పొందే లక్షలాది మందికి తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో ఆయనకు నివాళి అర్పిస్తున్నాను.’’
योग साधक और काशी निवासी शिवानंद बाबा जी के निधन से अत्यंत दुख हुआ है। योग और साधना को समर्पित उनका जीवन देश की हर पीढ़ी को प्रेरित करता रहेगा। योग के जरिए समाज की सेवा के लिए उन्हें पद्मश्री से सम्मानित भी किया गया था।
— Narendra Modi (@narendramodi) May 4, 2025
शिवानंद बाबा का शिवलोक प्रयाण हम सब काशीवासियों और उनसे… pic.twitter.com/nm9fI3ySiK


