రాజస్థాన్లోని దౌసాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విచారం వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
‘‘రాజస్థాన్లోని దౌసాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో తమ వాళ్లను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.
మరణించిన వారికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి అందిస్తాం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ’’
Deeply saddened by the loss of lives in an accident in Dausa, Rajasthan. Condolences to the families who have lost their loved ones. Praying for the speedy recovery of the injured.
— PMO India (@PMOIndia) August 13, 2025
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The…


