స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ ను ప్రభావవంతంగా, భారత నారీ శక్తికి ప్రయోజనకరంగా ఉండేలా అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు.
ప్రజల భాగస్వామ్యమైన జన్ భాగీదారీకి ఈ కార్యక్రమాన్ని ఓ అద్భుత ఉదాహరణగా అభివర్ణించిన ప్రధానమంత్రి.. ప్రజల జీవనాన్ని మెరుగుపరచడానికి, ఆరోగ్యకరమైన, సాధికారత కలిగిన సమాజాన్ని నిర్మించడానికి ఇటువంటి సమష్టి చర్యలు అత్యావశ్యకమని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ జె.పి. నడ్డా చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“అద్భుత కృషి! ఈ కార్యక్రమాన్ని చాలా ప్రభావవంతంగా, మన నారీ శక్తికి ప్రయోజనకరంగా ఉండేలా క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి అభినందనలు. జన్ భాగీదారితో ప్రజా జీవితాల మెరుగుదలకు ఇది గొప్ప ఉదాహరణ.”
Commendable effort! Compliments to those who have worked on the ground to make it so impactful and beneficial to our Nari Shakti. This is a great example of Jan Bhagidari to improve lives. https://t.co/xCWWyjKvRf
— Narendra Modi (@narendramodi) October 4, 2025


