ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు నటుడు రామ్ చరణ్, ఆయన భార్య శ్రీమతి ఉపాసన కొణిదెల, శ్రీ అనిల్ కామినేనితో సమావేశమయ్యారు.

ప్రపంచంలోనే మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ద్వారా విలువిద్యను ప్రోత్సహించేందుకు వారు చేపట్టిన సమష్టి యత్నాలను ప్రధానమంత్రి కొనియాడారు.

ఈ తరహా కార్యక్రమాలు విలువిద్య సంప్రదాయాన్ని పరిరక్షిస్తాయని, మరింత మంది యువత ఈ క్రీడ పట్ల ఆకర్షితులయ్యేలా స్ఫూర్తినిస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘ఉపాసన, అనిల్ కామినేని గారూ... మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఆర్చరీకి మరింత ప్రాచుర్యాన్ని కల్పించేందుకు మీరు చేపడుతున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. ఇవి యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి’’.

@AlwaysRamCharan

@upasanakonidela”

 

 

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Textile exports to 111 countries see growth in Apr-Sept; supplies to 38 countries see more than 50% jump

Media Coverage

Textile exports to 111 countries see growth in Apr-Sept; supplies to 38 countries see more than 50% jump
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 నవంబర్ 2025
November 12, 2025

Bonds Beyond Borders: Modi's Bhutan Boost and India's Global Welfare Legacy Under PM Modi