హిందీ భాష లో ప్రముఖ సాహితీవేత్త పండిత్ శ్రీ హరిరామ్ ద్వివేది మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ‘అంగనయియా’ మరియు ‘జీవనదాయిని గంగ’ ల వంటి కవితా సంకలనాలు, ఇంకా తన విభిన్నమైనటువంటి రచన ల ద్వారా మన జీవనం లో ఒక భాగం గా పండిత్ హరిరామ్ ద్వివేదీ సదా నిలచిపోతారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘హిందీ సాహిత్యం లో శీర్ష రచయిత మరియు కాశీ వాస్తవ్యుడు పండిత్ శ్రీ హరిరామ్ ద్వివేది గారు మన మధ్య నుండి నిష్క్రమించారని విని దుఃఖించాను. ‘అంగనయియా’ మరియు ‘జీవనదాయిని గంగ’ ల వంటి కవితా సంకలనాలు మరియు ఆయన యొక్క విభిన్న రచన ల ద్వారా మన జీవనం లో ఎల్లప్పటికీ ఆయన నిలచిపోతారు. ఆయన కు ప్రభువు యొక్క శ్రీచరణాల లో స్థానం లభించుగాక అంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
हिंदी साहित्य के मूर्धन्य रचनाकार और काशी के निवासी पंडित हरिराम द्विवेदी जी के निधन से दुखी हूं। अंगनइया और जीवनदायिनी गंगा जैसे कविता संग्रहों और अपनी विभिन्न रचनाओं के साथ, वे हमेशा हमारे जीवन में उपस्थित रहेंगे।
— Narendra Modi (@narendramodi) January 9, 2024
उन्हें श्रीचरणों में स्थान मिले, ईश्वर से मेरी यही प्रार्थना…


