Shri Narendra Modi campaigns in Srinagar & Pithoragarh districts of Uttarakhand
Congress has turned ‘Dev Bhoomi’ into “Loot Bhoomi: Shri Modi
Samajwadi party & Congress ruined Uttarakhand. They played with aspirations of people here: PM
Dev Bhoomi can attract tourists from all over the country. This land has so much potential for tourism sector to flourish: PM
Congress did not even note the difficulties our ex-servicemen faced: PM Modi
Why development projects are stalled in Uttarakhand? This has badly hit progress of the state: PM

ఉత్తరాఖండ్లో శ్రీనగర్, పితోరాగర్ బహిరంగ సభల్లో నేడు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.

ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ,  ఉత్తరాఖండ్ ఏర్పడటానికి మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి యొక్క సహకారం గుర్తుచేసుకున్నారు. “అటల్ జీ మూడు రాష్ట్రాలు - ఛత్తీస్గఢ్, జార్ఖండ్ & ఉత్తరాఖండ్ లను రూపొందించారు. బిజెపి పాలనలో ఛత్తీస్గఢ్ & ఝార్ఖండ్ పురోగతి సాధించాయి.” అని అన్నారు.

ప్రతిపక్ష పార్టీలపై దాడి ప్రధాని చేస్తూ, "సమాజ్వాది పార్టీ & కాంగ్రెస్ ఉత్తరాఖండ్ ను నాశనం చేయాయి. వారు ఇక్కడి ప్రజల ఆకాంక్షలతో ఆడుకున్నారు." అని అన్నారు.

ఉత్తరాఖండ్ పర్యాటకానికి యొక్క పరిధిని గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, "దైవభూమి దేశం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ భూమికి పర్యాటక రంగంగా వర్ధిల్లగలిగే శక్తి ఉంది.” అని అన్నారు.

మంచి రోడ్లు తో చార్ ధామ్ అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.12,000 కోట్లు కేటాయించిందని  శ్రీ మోదీ చెప్పారు. “ఉత్తరాఖండ్ అన్ని వాతావరణాల రోడ్లకు తో మొత్తం దేశం తో అనుసంధానమవ్వాలని మేము కోరుకున్నాము. చార్ ధామ్ కోసం రూ.12,000 కోట్లు కేటాయించాము.” అని అన్నారు.   

ఉత్తరాఖండ్ మరియు దాని ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి  తమ ప్రభుత్వానికి కీలకమని ప్రధాని మోదీ అన్నారు. “ ఎవరైనా యోగ గురించి ఆలోచించినట్లయితే, అతను లేదా ఆమె హరిద్వార్ & రిషికేశ్ గుర్తుచేసుకుంటారు. సరైన అవస్థాపన అభివృద్ధి ద్వారా ఆ రంగానికి మేము ప్రోత్సాహమిస్తాము.”అని అభిప్రాయపడ్డారు. “ప్రపంచం సంపూర్ణ ఆరోగ్యం వైపుకు కదులుతుంది. ఈ రంగానికి సహయాపడ గలిగే శక్తి ఉత్తరాఖండ్ కు వుంది.” అని ప్రధాని అన్నారు.

మన సైనికులకు మునుపటి ప్రభుత్వం ఏమీ చేయలేదని శ్రీ మోదీ పేర్కొన్నారు. మన మాజీ సైనికులు ఎరుదుర్కునే ఇబ్బందులను కాంగ్రెస్ పట్టించుకోలేదని ప్రధాని అన్నారు. దేశం కోసం పోరాడిన వారు దానిని ఎలా ఒప్పుకోగలరు? వన్ ర్యాంక్, వన్ పెన్షన్ పథకంను కాంగ్రెస్ పరిహాసం చేసింది. మేము అధికారంలోకి వచ్చిన తరువాతే, ఆ పథకం అమలుజరిగింది."

కాంగ్రెస్ 70 సంవత్సరాలుగా దేశాన్ని దోచుకుందని మరియు అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం నిరంతరం ఉంటుందని ఉద్ఘాటించారు. “అవినీతికి వ్యతిరేకంగా మేము బలమైన చర్యలు చేపట్టాము మరియు అది కొంతమందికి సెగ తగిలింది. దేశంను లూటీ చేసిన వారు తప్పించుకోలేరు,” అని ప్రధాని అన్నారు. "పేదలకు ప్రయోజనకరమైయ్యే నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడను. ఎన్ని కష్టాలైనా ఏర్డుర్కుంటాను కాని పేదల జీవితాలతో ఎవ్వరినీ ఆడుకోనివ్వను,” అని ప్రద్ధాని అన్నారు.

ఉత్తరాఖండ్ ప్రజలకు మెరుగైన జీవితం ఇవ్వడంకోసం తమ ప్రభుత్వం అంకితమైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. “మా ప్రభుత్వం పేదలకు సేవచేసేందుకు అంకితమైంది. మేము పేదలకు గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నాము. ఇది అనేక గ్రామీణ గృహాలకు లబ్దిచేకూర్చింది." అని అన్నారు.

ఉత్తరాఖండ్ కు అభివృద్ధి కావాలి కానీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దానికోసం ఏమిచేయడం లేదని ప్రధాని మోదీ అన్నారు, “కొంతమంది హర్డా పన్ను గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తుంది! కాని అభివృద్ధి ప్రాజెక్ట్లు ఎందుకు ఆగిపోయాయి? ఇది రాష్ట్ర పురోగతిపై తీవ్రప్రభావం చూపింది,” అని అన్నారు.

అనేకమంది బిజెపి కార్యకర్తలు మరియు నాయకులు హాజరయ్యారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
One App For 2,400-Plus Government Services: How UMANG Is Changing Access In India

Media Coverage

One App For 2,400-Plus Government Services: How UMANG Is Changing Access In India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister witnesses Surya Tilak at Shri Ram Janmabhoomi Mandir
March 27, 2026

The Prime Minister, Shri Narendra Modi, today, witnessed Surya Tilak at the Shri Ram Janmabhoomi Mandir, Ayodhya. “May the blessings of Prabhu Shri Ram always remain upon us”, Shri Modi stated.

Shri Modi posted on X:

“Earlier today, witnessed the Surya Tilak that took place at the Shri Ram Janmabhoomi Mandir, Ayodhya. May the blessings of Prabhu Shri Ram always remain upon us.”