PM Modi, PM Key recognize need for greater economic engagement to effectively respond to growing uncertainties in global economy
Food processing, dairy, agriculture & related areas in their supply chain are areas of particular potential for Ind-NZ cooperation: PM
India and New Zealand agree to work closely towards an early conclusion of balanced & mutually beneficial CECA
Ind-NZ to strengthen security & intelligence cooperation against terror & radicalization including in cyber security
Thankful for New Zealand’s support to India joining a reformed UN Security Council as a permanent member: PM Modi
New Zealand backs India’s membership of the Nuclear Suppliers Group

ప్ర‌ధాని మ‌హోద‌యులు శ్రీ జాన్ కీ,

ప్ర‌తినిధివ‌ర్గం స‌భ్యులు,

ప్రసార మాధ్యమాల సభ్యులారా,

మహోదయుడు శ్రీ జాన్ కీ ని భార‌తదేశానికి ఆహ్వానిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది.

న్యూజీలాండ్ పార్ల‌మెంటు దీపావ‌ళి ప‌ర్వ‌దినం వేడుక‌లను క్ర‌మం త‌ప్ప‌కుండా నిర్వ‌హిస్తున్నద‌ని, ఆ వేడుక‌లలో మీరంతా భాగ‌స్వాముల‌ు అవుతార‌ని నాకు తెలిసింది. ఈ నేప‌థ్యంలో భారతదేశంలో దీపావ‌ళి ప‌ర్వ‌దిన వేడుక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో మరీముఖ్యంగా మిమ్మ‌ల్ని ఆహ్వానించ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది.

 

మిత్రులారా,

ఎన్నో బ‌హుళ పాక్షిక శిఖ‌రాగ్ర స‌మావేశాల సంద‌ర్భంగా శ్రీ జాన్ కీ, నేను ప‌లుమార్లు భేటీ అయ్యాము. ఇప్పుడు శ్రేష్ఠుడు శ్రీ కీ ని ఈ ద్వైపాక్షిక ప‌ర్య‌ట‌న‌కు ఆహ్వానించడం మాకు దక్కిన గౌర‌వం.

మ‌రి కాసేపట్లో మ‌న ఉభ‌య దేశాల క్రికెట్ జట్లు నాలుగో వన్ డే ఇంట‌ర్ నేష‌న‌ల్ మ్యాచ్ కోసం రాంచీలో మైదానంలో ప్ర‌వేశించ‌బోతున్నాయి. క్రికెట్ ప‌ద‌జాలంలో కూడా చాలా ప‌దాలు మ‌న ద్వైపాక్షిక బంధంలో పురోగ‌తికి ద‌ర్ప‌ణం ప‌డ‌తాయి. మ‌నం లాంగ్ ఆఫ్ లో ఫీల్డింగ్ నుండి బ్యాటింగ్ పిచ్ లో ఫ్రెష్ గార్డ్ ద‌శ‌కు ద్వైపాక్షిక బంధంలో ఎదిగాము. రక్షణాత్మకమైన ఆట తీరు కాస్తా దూకుడైన బ్యాటింగ్ తీరుకు బాట‌ పరచింది.

మిత్రులారా,

ప్ర‌ధాని శ్రీ కీ, నేను మ‌న ద్వైపాక్షిక స‌హ‌కారం, బ‌హుళ పాక్షిక స‌హ‌కారానికి సంబంధించిన భిన్న కోణాల‌పై స‌వివ‌ర‌మైన, ఉత్పాద‌క‌మైన చ‌ర్చ‌లు జ‌రిపాము.

వాణిజ్య, పెట్టుబ‌డుల బంధం మా చ‌ర్చ‌లలో ప్ర‌ధానాంశంగా నిలచింది. అంత‌ర్జాతీయ ఆర్థిక రంగంలో నానాటికీ పెరిగిపోతున్న అనిశ్చితిని దీటుగా ఎదుర్కోవడానికి ఆర్థిక స‌హ‌కారం మ‌రింత‌గా విస్త‌రించుకోవ‌ల‌సిన అవ‌స‌రం మేమిద్ద‌రమూ గుర్తించాము. అందుకే మ‌న భాగ‌స్వామ్యంలో వ్యాపార‌, వాణిజ్య బంధం విస్త‌ర‌ణ అత్యంత కీల‌క‌మైంద‌ని అంగీక‌రించాము. ప్ర‌ధాని శ్రీ కీ వెంట వ‌చ్చిన‌ భారీ వ్యాపార ప్ర‌తినిధివ‌ర్గం భార‌తదేశ వృద్ధి గాథ‌లో పెట్టుబ‌డి అవ‌కాశాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని తెలుసుకొంది. ఈ చ‌ర్చ‌లు మ‌న ఉభ‌య దేశాల మ‌ధ్య స‌రి కొత్త వాణిజ్య బంధాన్ని నిర్మిస్తాయి. మ‌న ద్వైపాక్షిక స‌హ‌కారంలో ఫుడ్ ప్రాసెసింగ్‌, పాడి పరిశ్రమ, వ్య‌వ‌సాయం, స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ లకు చెందిన‌ అనుబంధ రంగాలలో అపార అవ‌కాశాలు ఉన్నాయ‌ని వారికి నేను నివేదిస్తున్నాను. ఈ విభాగంలో న్యూజీలాండ్ కు గ‌ల బ‌లం, సామ‌ర్థ్యాలు, భార‌తదేశ సాంకేతిక విజ్ఞాన అవ‌స‌రాలు ఉభ‌య స‌మాజాల‌కు లాభ‌దాయ‌కంగా నిలుస్తాయి.

ఉభ‌య ప్ర‌భుత్వాలు తీసుకొనే చ‌ర్య‌లు వ్యాపార అనుసంధానాన్ని పెంచ‌డంతో పాటు నిపుణుల ప‌ర్య‌ట‌న‌ల‌కు కూడా అవ‌కాశం క‌ల్పించాల‌ని ఉభ‌యులమూ అంగీక‌రించాము. ఈ ప్ర‌య‌త్నంలో భాగంగా ఉభ‌యుల‌కు లాభ‌దాయ‌క‌మైన‌ స‌మ‌గ్ర ఆర్థిక స‌హ‌కార ఒప్పందానికి త్వ‌ర‌లో తుది రూపం ఇచ్చి ఆచ‌ర‌ణీయం చేయాల‌ని మేం నిర్ణ‌యించాము.

 

మిత్రులారా,

ద్వైపాక్షిక స‌హ‌కారం ఒక్క‌టే కాదు…అంత‌ర్జాతీయ రంగస్థలం మీద కూడా మ‌నం స‌న్నిహితంగా స‌హ‌క‌రించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. తూర్పు ఆసియా శిఖ‌రాగ్రంతో పాటు ప్రాంతీయ ప్రాధాన్యం గ‌ల అంశాల్లో స‌హ‌కారం పెంచుకోవాల‌ని మేము అంగీకారానికి వ‌చ్చాము. అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల‌ను ప‌రిశీలించే సంస్థ‌లలో సంస్క‌ర‌ణ‌లు ఉభ‌యుల‌కు ఆస‌క్తి గ‌ల ప్రాధాన్య‌తాంశం. సంస్క‌రించిన ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌త మండ‌లిలో భార‌తదేశ శాశ్వ‌త స‌భ్య‌త్వానికి మ‌ద్ద‌తు ఇచ్చినందుకు న్యూజీలాండ్ కు ధ‌న్య‌వాదాలు. ప‌సిఫిక్ ద్వీప‌క‌ల్ప దేశాల అభివృద్ధికి చేస్తున్న కృషిలో న్యూజీలాండ్ తో స‌న్నిహితంగా సంప్ర‌దించ‌డంతో పాటు ఉభ‌యుల ప్ర‌య‌త్నాల‌కు స‌హ‌కారం అందించుకోవాల‌ని మేము భావిస్తున్నాము.

పరమాణు స‌ర‌ఫ‌రా దేశాల బృందంలో భార‌తదేశం స‌భ్య‌త్వానికి నిర్మాణాత్మ‌కంగా స‌హ‌క‌రించాల‌న్న ప్ర‌ధాని శ్రీ కీ నిశ్చ‌యానికి ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను.

మిత్రులారా,

అంత‌ర్జాతీయ శాంతి- భ‌ద్ర‌త‌ల‌కు పెను స‌వాలు విసరుతున్న ప్ర‌ధాన సమస్యలలో ఉగ్ర‌వాదం ఒక‌టి. ఆర్థిక‌, లాజిస్టిక్స్, స‌మాచార నెట్ వ‌ర్క్ ల నుండి ఉగ్ర‌వాదం ఈ రోజు ప్ర‌పంచం అంతటికీ వ్యాపించింది. భౌగోళిక‌మైన హ‌ద్దులు ఈ ఉగ్ర‌వాదాన్ని, తీవ్ర‌వాదాన్ని ఏ మాత్రం నిలువ‌రించ‌డంలేదు. ఈ ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు మాన‌వ‌త్వంపై విశ్వాసం ఉన్న దేశాల‌న్నీ స‌హ‌క‌రించుకోవ‌లసిన అవ‌స‌రం ఉంది.

ఉగ్ర‌వాదం, తీవ్ర‌వాదం, సైబ‌ర్ సెక్యూరిటీ విభాగాలలో భ‌ద్ర‌త‌, గూఢ‌చ‌ర్య స‌హ‌కారం ప‌టిష్ఠం చేసుకోవాల‌ని ప్ర‌ధాని శ్రీ కీ, నేను అంగీకారానికి వ‌చ్చాము.

మ‌హోద‌యా,

మీ నాయ‌క‌త్వం ప‌ట్ల న్యూజీలాండ్ ప్ర‌జ‌లు మ‌రోసారి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అందుకు కార‌ణం నాకు తెలుసు.

మ‌న ద్వైపాక్షిక భాగ‌స్వామ్యాన్ని మ‌రింత ముందుకు న‌డిపించేందుకు, స్నేహ‌బంధాన్ని ప‌టిష్ఠం చేసుకొనేందుకు, ఉభ‌య దేశాల మ‌ధ్య ప్ర‌జాసంబంధాన్ని విస్త‌రించుకొనేందుకు మీరు వ్య‌క్తిగ‌తంగా వచనబద్ధతను ప్ర‌క‌టించినందుకు ధ‌న్య‌వాదాలు.

మ‌రోసారి మీకు, మీ ప్ర‌తినిధివ‌ర్గానికి హార్దిక స్వాగ‌తం ప‌లుకుతున్నాను. మీ ప‌ర్య‌ట‌న సఫలం, విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షిస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు.

మీకు అందరికీ అనేకానేక ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x

Media Coverage

India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26, 2026
దేశంలో క్రీడలు.. యువ నాయకత్వం.. పౌర బాధ్యత.. స్వచ్ఛంద సేవ.. దారుఢ్యం.. దేశ ప్రగతి వంటి అంశాలను ఈ చర్చలు ఒకే వేదికపైకి తెస్తాయి
ఈ చర్చలు ప్రధానంగా క్రీడలు.. ఒలింపిక్స్‌ ఆకాంక్షలు.. యువ నేతృత్వం.. వికిసిత భారత్.. మాదకద్రవ్య రహిత యువతరంపై దృష్టి సారిస్తాయి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026లో భాగంగా ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోగల రెండు కళాశాలల్లో యువతరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రగతి కార్యకలాపాల్లో యువత ఆకాంక్షలకు కీలక స్థానమిస్తూ ఆరోగ్యకర, క్రమశిక్షణాయుత. క్రీడాస్ఫూర్తి గల దేశానికి రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో క్రీడలు, యువ నాయకత్వం, పౌర కర్తవ్యం, స్వచ్ఛంద సేవ, దారుఢ్యం, దేశ పురోగమనం తదితర అంశాలన్నిటిపైనా చర్చను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తెస్తుంది. దేశ క్రీడారంగ పురోగమన ఆకాంక్షలతో యువత మమేకమయ్యే ప్రత్యక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. దేశ యువతరం, క్రీడా వ్యవస్థపై చర్చల సందర్భంగా వారి ఆలోచనలు, దృక్కోణాలను పంచుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమం అనంతరం యువ భాగస్వాములు, మై భారత్ వలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో చర్చలు సాగుతాయి. క్రీడాసక్తి గల యువత, ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతల మధ్య ప్రత్యక్ష ఇష్టాగోష్ఠి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో ‘యువతరం చర్చలు’ ప్రధానాంశంగా ఉంటాయి. యువ భాగస్వాములు తమ ఆలోచనలు, దృక్కోణాలు, ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఈ చర్చలు ప్రధానంగా దిగువ పేర్కొన్న 5 అంశాలపై కేంద్రీకృతమవుతాయి:

· మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, క్రీడా విజ్ఞానం, సార్వజనీన భాగస్వామ్యంతో జాతీయ క్రీడా వ్యవస్థ మెరుగుదల.

· శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపు, పారదర్శక ఎంపిక, దీర్ఘకాలిక క్రీడా వికాసం ద్వారా 2036లో ఒలింపిక్స్ దిశగా ప్రతిభకు పదును పెట్టడం.

· పరిపాలన వేదికలు, మై భారత్ నేతృత్వంలోని స్వచ్ఛంద సేవ ద్వారా యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం.

· పౌర చైతన్యం, భవిష్యత్‌ సంసిద్ధ నైపుణ్యం, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం, ద్వారా వికసిత భారత్ ప్రస్థానం వైపు యువతరానికి సాధికారత కల్పన.

· ఈ నెల 2న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి 100 వారాల ప్రచారం’లో భాగంగా వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య వినియోగంపై పోరులో క్రీడలు సహా, సహ రంగాల్లోని వివిధ బృందాల సేవల ద్వారా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ధ్యేయం.