In the coming years, Bihar will be among those states of the country, where every house will have piped water supply: PM Modi
Urbanization has become a reality today: PM Modi
Cities should be such that everyone, especially our youth, get new and limitless possibilities to move forward: PM Modi

‘న‌మామి గంగే’ యోజ‌న‌, ‘ఎఎంఆర్ యుటి’ (అమృత్) యోజ‌న ల‌లో భాగంగా బిహార్ లో వివిధ ప్రాజెక్టులను  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు.  ఈ రోజున ప్రారంభించిన నాలుగు ప్రాజెక్టుల్లో అమృత్ యోజ‌న లో భాగంగా ప‌ట్నా న‌గ‌రం లోని బేవూర్,  క‌రమ్-లీచక్ ల‌లో మురుగు శుద్ధి ప్లాంటుల‌తో పాటు సీవాన్‌, ఛ‌ప్రా ల‌లో జ‌ల ప‌థ‌కాలు కూడా ఉన్నాయి.  ఇవే కాకుండా న‌మామి గంగే లో భాగంగా ముంగెర్‌, జ‌మాల్‌ పుర్ ల‌లో నీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాల‌కు, ముజ‌ప్ఫర్‌ పుర్ లో రివ‌ర్ ఫ్రంట్ డెవల‌ప్‌మెంట్ స్కీము కు  శంకుస్థాప‌న లు జ‌రిగాయి.

క‌రోనా నేప‌థ్యం లో సైతం వివిధ అభివృద్ధి ప‌థ‌కాల ప‌నులు బిహార్ లో ఏ అంత‌రాయం లేకుండా పురోగ‌మిస్తున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

రాష్ట్రంలో ఇటీవ‌లి కాలంలో ప్రారంభించిన ప్రాజెక్టుల విలువ కొన్ని వంద‌ల కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ంటూ ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ ప్రాజెక్టులు మౌలిక స‌దుపాయాల విస్త‌ర‌ణ తో పాటు, బిహార్ లోని రైతుల‌కు కూడా లబ్ధిని చేకూర్చుతాయని ఆయన చెప్పారు. 

భార‌త‌దేశం లో దార్శనికుడైన ఆధునిక సివిల్ ఇంజినీరు స‌ర్ ఎం. విశ్వేశ్వ‌ర‌య్య స్మరణార్థం ఈ రోజు ను ఇంజినీర్ల దినోత్స‌వం గా జ‌రుపుకొంటున్న సంద‌ర్భం లో దేశాభివృద్ధి కి ఇంజినీర్లు అందించిన సేవ‌ల‌ను ప్ర‌ధాన మంత్రి  ప్ర‌శంసించారు.  బిహార్ సైతం ల‌క్షల కొద్దీ ఇంజినీర్ల‌ను త‌యారు చేసి దేశాభివృద్ధి లో చెప్పుకోద‌గ్గ తోడ్పాటును అందించింద‌న్నారు.  

బిహార్ అనేక చ‌రిత్రాత్మ‌క న‌గ‌రాల నిల‌య‌ం, బిహార్ కు వేల సంవ‌త్స‌రాల సుసంప‌న్న‌మైన వార‌స‌త్వం ఉంద‌ని మోదీ చెప్పారు.  స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత అనేక మంది దార్శనికత కలిగిన నేత‌లు ఇక్క‌డ దాస్య యుగం లో చోటుచేసుకొన్న వ‌క్రీక‌ర‌ణ‌లను దూరం చేయ‌డానికి వారి వంతుగా పాటుప‌డ్డార‌ని ఆయ‌న చెప్పారు.  ఆ త‌రువాతి కాలంలో ప్రాధాన్యాలు మారిపోయి, అభివృద్ధి కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమిత‌మైంది, ఫ‌లితంగా ప‌ట్ట‌ణ ప్రాంతాల మౌలిక స‌దుపాయాలు దిగ‌జారుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వ‌స‌తులు కుప్ప‌కూలాయ‌ని ఆయన అన్నారు.

ప‌రిపాల‌న కన్నా స్వార్ధ‌ప‌ర‌త్వానిదే పైచేయి అయిన‌ప్పుడు వోటు బ్యాంకు రాజ‌కీయాలు తెర మీద‌కు వ‌స్తాయని, వాటివ‌ల్ల అప్ప‌టికే నిరాద‌ర‌ణ బారిన ప‌డ్డ వ‌ర్గాలు, వంచ‌న‌కు లోనైన వ‌ర్గాలు మ‌రింతగా దెబ్బ‌తింటాయని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  బిహార్ ప్ర‌జ‌లు ఈ బాధల‌ను ద‌శాబ్దాల త‌ర‌బ‌డి స‌హిస్తూ వ‌చ్చార‌ని, ఆ కాలంలో నీటి సరఫరా, మురుగు శుద్ధి లాంటి క‌నీస అవ‌స‌రాలు కూడా తీర‌లేద‌ని ఆయ‌న అన్నారు.  గ‌త్యంత‌రం లేక శుభ్ర‌ప‌ర‌చ‌ని నీటిని తాగ‌వ‌ల‌సి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు వ్యాధులు సోకుతాయి, అలాంట‌ప్పుడు నీటి శుద్ధి కి వ్య‌క్తి త‌న సంపాద‌న లో పెద్ద మొత్తాన్ని ఖ‌ర్చు పెట్ట‌వ‌ల‌సి వ‌స్తుంది అని ప్రధాన మంత్రి చెప్పారు.  ఇలాంటి ప‌రిస్థితుల్లో బిహార్ స‌మాజంలో ఓ పెద్ద భాగం వారి నొస‌ట‌న రుణం, వ్యాధి, నిస్స‌హాయ‌త‌, నిర‌క్ష‌రాస్య‌తలే రాసి పెట్టి ఉన్నాయ‌నే భావ‌న‌కు వ‌చ్చేశార‌ని ఆయ‌న చెప్పారు.

గ‌త కొన్నేళ్ళ లో వ్య‌వ‌స్థ‌ ను సంస్కరించేందుకు కృషి జ‌రుగుతోంది, స‌మాజంలో చాలా ప్రభావితం అయిన వ‌ర్గాలలో తిరిగి విశ్వాసాన్ని కల్పించడానికి ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  పుత్రిక‌ల విద్య‌ కు పెద్ద‌ పీట వేసి, పంచాయ‌తీరాజ్ స‌హా స్థానిక సంస్థ‌ల్లో అణ‌గారిన వ‌ర్గాల వారికి ప్రాతినిధ్యం పెంచుతున్న తీరుతో వారిలో విశ్వాసం అధికమవుతోంద‌న్నారు.  2014 నుంచి, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు సంబంధించిన ప‌థ‌కాల నియంత్ర‌ణ ను ఇంచుమించు పూర్తి స్థాయి లో గ్రామ పంచాయ‌తీల‌కు లేదా స్థానిక సంస్థ‌ల‌కు అప్ప‌గించ‌డ‌ం జరిగింద‌న్నారు.  ప్ర‌స్తుతం ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న మొద‌లుకొని అమ‌లు వ‌ర‌కు, అలాగే ప‌థ‌కాల నిర్వ‌హ‌ణ స‌హా స్థానిక సంస్థ‌లు ఆయా ప్రాంతాల అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌లుగుతున్నాయి, బిహార్ లో నగర ప్రాంతాల్లో తాగునీరు, మురుగు పారుద‌ల వ్య‌వ‌స్థ లాంటి క‌నీస సౌక‌ర్యాలు నిరాఘాటం గా మెరుగుప‌డుతున్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు.  

గ‌త నాలుగైదు సంవ‌త్స‌రాల్లో మిష‌న్ అమృత్ ద్వారా, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల ద్వారా బిహార్ లోని ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో తాగునీటి స‌దుపాయాన్ని ల‌క్ష‌ల కొద్దీ కుటుంబాల అందుబాటు లోకి తీసుకురావ‌డమైంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  రాబోయే సంవ‌త్స‌రాల్లో ప్ర‌తి ఇంటికీ గొట్ట‌పు మార్గం ద్వారా నీరు స‌ర‌ఫ‌రా అయ్యే రాష్ట్రాల్లో బిహార్ కూడా స్థానాన్ని సంపాదించుకొంటుంద‌ని ఆయన తెలిపారు.  ఈ మ‌హ‌త్త‌ర ల‌క్ష్యాన్ని సాధించ‌డానికి బిహార్ ప్ర‌జ‌లు క‌రోనా సంక్షోభ కాలంలో సైతం ఎడ‌తెగ‌క శ్ర‌మించార‌ని ఆయ‌న అన్నారు. గ‌త కొన్ని నెల‌ల్లో 57 ల‌క్ష‌ల‌కు పైగా కుటుంబాల‌కు నీటి క‌నెక్ష‌న్ల‌ను అందించ‌డంలో ‘ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్‌’ ఒక ప్ర‌ముఖ పాత్ర‌ను పోషించింద‌ని  ఆయ‌న వివ‌రించారు.  దీనిలో ఇత‌ర రాష్ట్రాల నుంచి బిహార్ కు తిరిగి వ‌చ్చిన వ‌ల‌స కార్మికుల శ్రమ పాత్ర కూడా ఉంద‌న్నారు.

ఈ ‘జ‌ల్ జీవ‌న్ మిష‌న్’ బిహార్ లో చెమ‌టోడ్చుతున్న స‌హోద్యోగుల‌కు అంకితం అయింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  గ‌త ఏడాది లో దేశ‌వ్యాప్తంగా జ‌ల్ జీవ‌న్ మిష‌న్ లో రెండు కోట్ల‌కు పైగా నీటి క‌నెక్ష‌న్ల‌ను ఇవ్వ‌డ‌మైంద‌ని ఆయన తెలిపారు.  ప్ర‌స్తుతం ప్రతి రోజు ఒక ల‌క్ష పైగా గృహాల‌కు గొట్టాల ద్వారా కొత్త‌గా నీటి క‌నెక్ష‌న్ల‌ను ఇవ్వ‌డం జ‌రుగుతోంద‌న్నారు.  శుభ్ర‌మైన నీరు పేద‌ల జీవితాల‌ను మెరుగుప‌ర‌చ‌డం ఒక్క‌టే కాకుండా, అనేక తీవ్ర వ్యాధుల బారి నుండి వారిని కాపాడుతుంద‌ని చెప్పారు.  ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో సైతం బిహార్ లో 12 ల‌క్ష‌ల కుటుంబాల‌కు అమృత్ యోజ‌న ద్వారా స్వ‌చ్ఛ‌మైన నీటిని అందించే ప‌నులు శ‌ర వేగంగా అమ‌ల‌వుతున్నాయని, వీటిలో దాదాపు 6 ల‌క్ష‌ల కుటుంబాలు ఇప్ప‌టికే శుద్ధ నీటి క‌నెక్ష‌న్లను అందుకున్నాయ‌ని ఆయ‌న తెలిపారు.

ప‌ట్టణ ప్రాంతాల్లో జ‌నావాసాలు శీఘ్రంగా పెరుగుతున్నాయ‌ని, ప‌ట్ట‌ణీక‌ర‌ణ ప్ర‌స్తుతం ఒక వాస్త‌వ రూపాన్ని దాల్చుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  అయితే, అనేక ద‌శాబ్దాల పాటు, ప‌ట్ట‌ణీక‌ర‌ణ ను ఒక అడ్డంకిగా భావించార‌ని ఆయ‌న అన్నారు.  బాబా సాహెబ్ అంబేడ్క‌ర్ మాట‌ల‌ను ప్ర‌ధాన మంత్రి గుర్తు తెస్తూ, అంబేడ్క‌ర్ ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌ ను ఒక స‌మ‌స్య‌ గా భావించ‌లేద‌ని చెప్పారు.  అంబేడ్క‌ర్ నిరుపేద‌లు కూడా అవ‌కాశాల‌ను చేజిక్కించుకునే న‌గ‌రాల‌ను గురించి ఆలోచించార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. న‌గ‌రాలు ఎలా ఉండాలంటే, ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌త్యేకించి యువ‌త‌, అనంత‌మైన అవకాశాలను, కొత్త అవ‌కాశాల‌ను ద‌క్కించుకొంటూ ముంద‌డుగు వేసే ఆస్కారం ఆ నగరాల్లో ఉండాలి అని ఆయ‌న అన్నారు.  ప్ర‌తి ఒక్క కుటుంబం సంతోషంగా, సౌభాగ్యం తో జీవనం గ‌డిపే విధంగా న‌గ‌రాలు ఉండాలని ఆయ‌న అన్నారు.  పేద ప్ర‌జ‌లు, ద‌ళితులు, వెనుక‌బ‌డిన వ‌ర్గాలవారు, మ‌హిళ‌లు అందరూ గౌర‌వప్ర‌ద‌మైన జీవ‌నం గ‌డిపే విధంగా న‌గ‌రాలు ఉండాల‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

దేశం లో ప్ర‌స్తుతం ఒక నూత‌న ప‌ట్ట‌ణీక‌ర‌ణ ధోరణి ని మ‌నం చూస్తున్నామ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  న‌గ‌రాలు వాటి ఉనికిని చాటుకొంటున్నాయ‌ని కూడా ఆయ‌న వివ‌రించారు.  కొన్నేళ్ళ క్రితం వ‌ర‌కు ప‌ట్ట‌ణీక‌ర‌ణ అంటే కొన్ని ఎంపిక చేసిన న‌గ‌రాల లో ఏ కొద్ది ప్రాంతాలనో అభివృద్ధి చేయ‌డంగా భావించార‌ని, కానీ ప్ర‌స్తుతం ఈ ఆలోచ‌న మారుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. బిహార్ ప్ర‌జానీకం భార‌త‌దేశంలో కొత్త త‌ర‌హా ప‌ట్ట‌ణీక‌ర‌ణ కు వారి వంతుగా పూర్తి తోడ్పాటును అందిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.  వ‌ర్త‌మాన అవ‌స‌రాల‌కు అనుగుణంగా కాకుండా, భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా న‌గ‌రాల‌ను తీర్చిదిద్ద‌డం చాలా ముఖ్య‌మ‌ని ఆయ‌న అన్నారు.  ఈ ఆలోచ‌న‌ తోనే అమృత్ మిష‌న్ లో భాగంగా బిహార్ లోని అనేక న‌గ‌రాల్లో క‌నీస సౌక‌ర్యాల అభివృద్ధి కి ప్రాధాన్యమిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.   

బిహార్ లోని 100 కు పైగా పుర‌పాల‌క సంస్థల్లో 4.5 ల‌క్ష‌ల‌కు పైగా ఎల్ఇడి వీధి దీపాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు శ్రీ మోదీ చెప్పారు.  దీనితో మ‌న చిన్న న‌గ‌రాల్లోని వీధులలో దీపాల పరిస్థితి మెరుగుపడుతోందని, వంద‌ల కోట్ల రూపాయ‌ల విలువైన విద్యుత్తు ఆదా సాధ్య‌మవుతోంద‌ని, ప్ర‌జ‌ల జీవితాలు స‌ర‌ళ‌త‌రంగా మారుతున్నాయ‌ని ఆయన వివ‌రించారు.  రాష్ట్రంలోని సుమారు 20 పెద్ద న‌గ‌రాలు, ప్ర‌ధాన న‌గ‌రాలు, గంగాన‌ది తీర ప్రాంతాల్లోనే ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు.  గంగాన‌ది శుద్ధి వల్ల, గంగా జ‌లాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌డం వ‌ల్ల ఈ న‌గ‌రాల్లో ఉన్న కోట్లాది ప్ర‌జ‌ల‌పై ప్ర‌త్య‌క్ష ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు.  గంగాన‌ది ప‌రిశుభ్రతను దృష్టి లో పెట్టుకుని బిహార్ లో 6,000 కోట్ల రూపాయ‌ల‌కు పైగా విలువైన 50కి పైగా ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  నేరుగా గంగాన‌ది లోకి వ‌చ్చి క‌లుస్తున్న మురికి కాలువ‌ల‌ను అడ్డుకోవ‌డానికి గంగా తీరాన్ని ఆనుకొని ఉన్న అన్ని న‌గ‌రాల్లో అనేక నీటిశుద్ధి ప్లాంటుల‌ను ఏర్పాటుచేసేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. 

ఈ రోజు ప‌ట్నా లో ప్రారంభించిన బేవూర్‌, క‌ర‌మ్‌-లీచక్  ప‌థ‌కం ఈ ప్రాంతంలో ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల‌కు ప్రయోజనాలను అందిస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  దీనితో పాటు గంగాన‌ది ఒడ్డున ఉన్న ప‌ల్లెలను కూడా ‘గంగా గ్రామ్‌’ లుగా తీర్చిద‌ద్ద‌డం జ‌రుగుతోందని ఆయ‌న వివ‌రించారు.

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era

Media Coverage

India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s remarks during inauguration of Swaminarayan Hindu Temple in Paris
September 06, 2026

पूज्य महंत स्वामी, फ्रांस सरकार के सम्मानित प्रतिनिधिगण, उपस्थित अतिथिगण, इंडियन कम्युनिटी के मेरे साथी, देश दुनिया से जुड़े सभी हरि भक्त, देवियों और सज्जनों, जय स्वामीनारायण!

आज फ्रांस की राजधानी पेरिस में भव्य स्वामीनारायण मंदिर का लोकार्पण हो रहा है। यह लोकार्पण भारत और फ्रांस के सांस्कृतिक संबंधों का नया युग स्तंभ है। पूज्य संत जनों और सनातन परंपरा के श्रेष्ठ जनों के आशीर्वाद के साथ आज इस लोकार्पण का मंच ‘वसुधैव कुटुम्बकम’ के भाव का मंच बन गया है। भगवान स्वामीनारायण की कृपा और हमारे संतों का स्नेह, संतों का आशीर्वाद, मेरा सौभाग्य है कि मुझे ऐसे पुण्य अवसरों से जुड़ने का अवसर हमेशा मिलता रहता है। आज भी मैं भले ही पेरिस में आप सबके बीच उपस्थित नहीं हूं, लेकिन मन से और हृदय से, मैं स्वयं को आपके बीच ही अनुभव कर रहा हूं।

साथियों,

आज इस अवसर पर मैं परम पूज्य प्रमुख स्वामी जी महाराज का भी श्रद्धापूर्वक स्मरण करता हूं। प्राचीन काल में भारत का जो सांस्कृतिक आध्यात्मिक वैभव था, उन्होंने उसके पुनर्जागरण का एक अभियान शुरू किया था। आज उसका प्रकाश यूरोप समेत पूरी दुनिया में फैल रहा है। 2024 में अबू धाबी में भव्य मंदिर का लोकार्पण हुआ था। आज वहां हजारों लोग दर्शन करने जाते हैं और अब यहां पेरिस में स्वामीनारायण मंदिर का निर्माण सृजन की यह निरंतरता, यह संतों की संकल्प शक्ति का ही प्रमाण है। मैं पुनीत कार्य के लिए पूज्य महंत स्वामी का आभार प्रकट करता हूं, मैं उनके चरणों में प्रणाम करता हूं। मैं BAPS स्वामीनारायण संस्था को और करोड़ों हरि भक्तों को इस अवसर पर हृदय की गहराई से बधाई देता हूं।

साथियों,

BAPS के माध्यम से जब अलग-अलग देश में मंदिरों की प्राण प्रतिष्ठा होती है, तो वहां भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ-साथ ही जाते हैं और भारत का विचार कहता है ‘समानं मनः सह चित्तमेषाम्’ अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े। इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है, यह फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही, इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी।

साथियों,

बीते वर्षों में भारत और फ्रांस के संबंध नई ऊंचाइयों तक पहुंचे हैं। मेरे मित्र, प्रेसिडेंट मैक्रों के साथ मिलकर दोनों देश एक Special Global Strategic Partnership बना रहे हैं। Technology, AI और Defence से लेकर Space और Climate Action तक हम एक नई गति और नई ऊर्जा के साथ मिलकर के आगे बढ़ रहे हैं। हम 2026 को India-France Year of Innovation के रूप में भी सेलिब्रेट कर रहे हैं। भारत-फ्रांस की ये Strategic Partnership इसलिए भी खास है, क्योंकि ये हमारे पुराने सांस्कृतिक-राजनैतिक सम्बन्धों की मजबूत बुनियाद पर टिकी है। इतिहास गवाह है, फ्रांस में भारतीय सैनिकों के बलिदान का इतिहास आज भी मन-मंदिर में जीवित है। भाषा से जुड़े विषयों में रुचि रखने वाले लोग यह भी जानते हैं कि फ्रेंच स्कॉलर्स ने संस्कृत को लोकप्रिय बनाने में कितनी अहम भूमिका निभाई है। रामकृष्ण परमहंस और स्वामी विवेकानंद पर रोमाँ रोलाँ की की लेखनी हमारी सोसाइटीज़ को और करीब लाई है। पेरिस से पुडुचेरी के अरबिंदो आश्रम तक 'The mother' की spiritual journey, उसने कितने ही भारतीय और फ्रेंच साधकों को inspire किया है।

साथियों,

दशकों पहले श्रील प्रभुपाद स्वामी भी फ्रांस आए थे। इस्कॉन के जरिए भारत फ्रांस के बीच आध्यात्मिक सम्बन्धों का नया अध्याय उन्होंने शुरू किया था। आज योग भी भारत-फ्रांस के people to people कनेक्ट का एक माध्यम बन चुका है। 'इंटरनेशनल योगा डे' पर एफिल टॉवर के सामने से आने वाली तस्वीरें फ्रांस में योग की लोकप्रियता का उदाहरण बनती हैं और अब BAPS के इस भव्य मंदिर के जरिए, हमारे उन सांस्कृतिक सम्बन्धों में एक नया अध्याय जुड़ रहा है।

साथियों,

इन दिनों, भारत फ्रांस Joint Ventures की संभावनाओं पर बातें होती हैं। स्वामीनारायण मंदिर ने इस संभावना में भी एक नया आयाम जोड़ा है। यह मंदिर 'मेड इन इंडिया' है और 'बिल्ट इन फ्रांस' है। इसके काफी पत्थरों को भारत में तराशा गया है। भारत की प्राचीन प्रतिभा यहाँ फ्रांस में आधुनिक इंजीनियरिंग से आकर जुड़ चुकी है। पेरिस में इस भव्य मंदिर ने आकार लिया है। इसलिए, मैं आशा करता हूँ, यह मंदिर सदियों तक भारत और फ्रांस के बीच सहयोग और संभावनाओं का भी प्रतीक बनकर उभरेगा।

साथियों,

स्वामीनारायण मंदिर हमेशा से भक्ति के साथ-साथ सेवा का माध्यम भी रहे हैं। मुझे बताया गया है, यह मंदिर भी सेवा प्रकल्पों का वैसा ही केंद्र बनेगा। मुझे विश्वास है कि यहाँ से भारतीय संस्कृति के जो स्वर निकलेंगे, उनका लाभ पूरे यूरोप में लोगों को मिलेगा। भविष्य में मुझे जब भी समय मिलेगा, मैं इस मंदिर में दर्शन करने का प्रयास अवश्य करूंगा। इन्हीं शब्दों के साथ, एक बार फिर आज के इस लोकार्पण समारोह में सम्मिलित सभी अतिथिगणों को, सभी परिवारों को, सभी हरि भक्तों को और पूरी Indian Diaspora को मेरी ओर से इस शुभारंभ पर्व की ढेरों शुभकामनाएं!

बहुत-बहुत धन्यवाद!

मर्सी बोकू!

जय स्वामीनारायण!