For the last four years, efforts are being made to develop Kashi in accordance with the requirements of the 21st century: PM
New Banaras - a blend of spirituality and modernity - is being developed, for a New India: PM Modi
Kashi is emerging as an important international tourist destination, says PM Modi
Work is in full swing for an Integrated Command and Control Centre, that would make Varanasi a Smart City: PM
Smart City Initiative is not just a mission to improve infrastructure in cities, but also a mission to give India a new identity: PM Modi

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు (జూలై 14,2018) వార‌ణాసిలో సుమారు 900 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల ప‌లు ప్ర‌ధాన ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌,ప్రారంభోత్స‌వాలు చేశారు. ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించిన ప్రాజెక్టుల‌లో వార‌ణాసి సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టు, వార‌ణాసి- బాలియా మెమూ రైలు ప్రాజెక్టు ఉన్నాయి.శంకుస్థాప‌న చేసిన వాటిలో పంచ‌కోషి ప‌రిక్ర‌మ మార్గ్ ,  స్మార్ట్‌సిటీ మిష‌న్‌, న‌మామి గంగే ప‌థ‌కం కింద చేప‌ట్టిన ప‌లు ఇత‌ర ప్రాజెక్టులు ఉన్నాయి. వార‌ణాసిలో అంత‌ర్జాతీయ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌కు కూడా ప్ర‌ధాన‌మంత్ర శంకుస్థాప‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ ప్ర‌ధాని, ముందుగా యువ క్రీడాకారిణి హిమాదాస్  , అండ‌ర్ 20,వ‌ర‌ల్డ్ అథ్లెటిక్ ఛాంపియ‌న్‌షిప్ 400 మీట‌ర్ల ఈవెంట్‌లో స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించినందుకు అభినంద‌న‌లు తెలిపారు.  

కాశీ ప్రాచీన గుర్తింపున‌కు ఏమాత్రం భంగ‌కరం కాని రీతిలో ,21 శ‌తాబ్ద‌పు అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని కాశీని  అభివృద్ధి చేయ‌డానికి గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఆథ్యాత్మిక‌త‌, ఆధునిక‌త‌ల మేళ‌వింపుతో నూత‌న బ‌నార‌స్‌ను నూత‌న భార‌తావ‌నికోసం అభివృద్ధి చేయ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న చెప్పారు.
ఈ నూత‌న బ‌నార‌స్ ప్ర‌స్తుతం చుట్టూరా కంటికి క‌నిపిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.గ‌త నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో వార‌ణాసి అభివృద్ధికి చెప్పుకోద‌గిన స్థాయిలో ఖ‌ర్చుపెట్ట‌డం జ‌రిగింద‌ని  ఆయ‌న అన్నారు. సుమారు 1000 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభించ‌డ‌మో లేక శంకుస్థాప‌న చేయ‌డ‌మో జ‌రిగిందని, ఇది వార‌ణాసి అభివృద్ధికి కొన‌సాగుతున్న‌ప్ర‌క్రియ‌లో భాగంగా చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు.
ర‌వాణా రంగం అభివృద్ధి ద్వారా మార్పున‌కు సంబంధించిన దార్శ‌నిక‌త గురించి ప్ర‌ధాన‌మంత్రి వివ‌రించారు. ఈరోజు అజాంఘ‌డ్ వ‌ద్ద‌ శంకుస్థాప‌న చేసిన పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు ఈ దర్య‌ల‌లో భాగ‌మేన‌ని ఆయ‌న అన్నారు.
వార‌ణాసి ఈ ప్రాంతంలో మెడిక‌ల్ సైన్స్ కు కేంద్రంగా అవ‌త‌రిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. బి.హెచ్‌.యు ఎయిమ్స్‌తో క‌లిసి ప్ర‌పంచ ప్ర‌మాణాలు క‌లిగిన హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేయ‌నున్న‌ట్టు ప్ర‌ధాని చెప్పారు.
వార‌ణాసి, ఈ ప్రాంతంలో మెరుగైన అనుసంధాన‌త‌కు చేప‌ట్టిన చ‌ర్య‌ల గురించి ప్ర‌ధాని వివ‌రించారు. కాశీ ప్ర‌ధాన‌మైన అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌క గ‌మ్య‌స్థానంగా రూపుదిద్దుకుంటున్న‌ద‌ని ప్ర‌ధాని అన్నారు. ఈ నేప‌థ్యంలో తాను ఈరోజు శంకుస్థాప‌న చేసిన‌ అంత‌ర్జాతీయ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. వార‌ణాసి ప్ర‌జ‌ల‌కు బ‌హుమ‌తిగా దీనిని స‌మ‌కూరుస్తున్న జ‌పాన్ ప్ర‌ధాన‌మంత్రి షింజో అబేకు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప‌ర్యాట‌క రంగం, స్వ‌చ్చ‌భార‌త్ అభియాన్‌కు సంబంధించి ప్ర‌జలు, రాష్ట్ర‌ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌ను ఆయ‌న అభినందించారు. నాలుగు సంవ‌త్స‌రాల క్రితం  వార‌ణాసిలో రోడ్లు, మౌలిక స‌దుపాయాలు స‌క్ర‌మంగా ఉండేవి కావ‌ని ఆయ‌న అన్నారు. వార‌ణాసి న‌గ‌రం నుంచి వ‌చ్చే వ్య‌ర్థాలు గంగా న‌దిలో క‌లిసేవ‌ని అన్నారు. కాని నేడు ప‌రిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంద‌ని, గంగాన‌దిని గంగోత్రినుంచి, అది స‌ముద్రంలో క‌లిసే వ‌ర‌కు ప‌రిశుభ్రంగా ఉంచ‌డానికి చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. గంగా ప్ర‌క్షాళ‌న‌కు మురుగునీటి శుద్ధికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల‌ను ఆయ‌న వివ‌రించారు. భ‌విష్య‌త్తులో ఈచ‌ర్య‌లు స‌త్ఫ‌లితాల‌నివ్వ‌నున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ఇంటిగ్రేటెడ్ క‌మాంండ్ , కంట్రోల్ వ్య‌వ‌స్థ ఏర్పాటుకు ప‌నులు వ‌ర‌వేగంతో జ‌రుగుతున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. అది వార‌ణాసిని స్మార్ట్ సిటీగా చేస్తుంద‌న్నారు.

 స్మార్ట్ సిటీల అభివృద్ధికి సంబంధించిన చ‌ర్య‌లు కేవ‌లం ఆయా న‌గ‌రాల‌లో మౌలిక స‌దుపాయాల అబివృద్ధికి సంబంధించిన‌వి మాత్ర‌మే కావ‌ని, ఇవి భార‌త‌దేశానికి కొత్త గుర్తింపును తెచ్చిపెట్టేవ‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వ పారిశ్రామిక విధానాన్ని ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శంసించారు. రాష్ట్రంలో పెట్టుబ‌డుల వాతావర‌ణం క‌ల్పించినందుకు అభినంద‌న‌లు తెలిపారు. వీటికి సంబంధించిన ఫ‌లితాలు మొద‌ల‌య్యాయ‌ని ఆయ‌న అన్నారు. ఇటీవ‌ల నోయిడాలో ప్రారంభ‌మైన శాంసంగ్ మొబైల్ ఫోన్ల త‌యారీ యూనిట్ గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. మొబైల్ త‌యారీ యూనిట్లు ల‌క్ష‌లాది ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాయ‌ని అన్నారు.
వార‌ణాసి న‌గ‌ర గ్యాస్ పంపిణీ ప్రాజెక్టు గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, వార‌ణాసిలోని 8000 ఇళ్ల‌కు పైపు ద్వారా వంట గ్యాస్ అందుతోంద‌ని చెప్పారు. న‌గ‌రంలో ప్ర‌జార‌వాణా వ్య‌వ‌స్థ‌కు సిఎన్‌జి వాడ‌కం గురించి కూడా ప్ర‌ధాని ప్ర‌స్తావించారు.
వార‌ణాసి న‌గ‌రం జ‌పాన్ ప్ర‌ధాన‌మంత్రి షింజో అబేకు, ఫ్రెంచ్ అధ్య‌క్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌ల‌కు ఎలా స్వాగ‌తం ప‌లికిందో ప్ర‌ధాని ఒక‌సారి గుర్తుచేశారు.  ఆతిథ్యానికి సంబంధించి త‌న గొప్ప‌త‌నాన్నిప్ర‌ద‌ర్శించే మ‌రో అవ‌కాశం, 2019 జ‌న‌వ‌రిలో జ‌ర‌గ‌నున్న‌ ప్ర‌వాసి భార‌తీయ దివ‌స్ రూపంలో త్వ‌ర‌లోనే ఈ న‌గ‌రానికి రానున్న‌ద‌ని ఆయ‌న అన్నారు.
  

 

 
Click here to read PM's speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Why The SHANTI Bill Makes Modi Government’s Nuclear Energy Push Truly Futuristic

Media Coverage

Why The SHANTI Bill Makes Modi Government’s Nuclear Energy Push Truly Futuristic
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Gujarat meets Prime Minister
December 19, 2025

The Chief Minister of Gujarat, Shri Bhupendra Patel met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister’s Office posted on X;

“Chief Minister of Gujarat, Shri @Bhupendrapbjp met Prime Minister @narendramodi.

@CMOGuj”