Tagline of #AdvantageAssam is not just a statement, but a holistic vision says PM Modi
#AyushmanBharat is the world’s largest healthcare program designed for the poor: PM Modi
The formalisation of businesses of MSMEs due to introduction of GST, will help MSMEs to access credit from financial sector, says the PM
Government will contribute 12% to EPF for new employees in all sectors for three years: PM
Our Govt has taken up many path breaking economic reforms in last three years, which have simplified procedures for doing business: PM Modi

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అస్సాం లోని గువాహాటీ లో జరిగిన ‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రసంగించారు.

ప్రధాన మంత్రి ఈ శిఖర సమ్మేళనానికి విచ్చేసినటువంటి ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు గుండెకాయ వంటివి అన్నారు. ప్రజలకు- ప్రజలకు మధ్య సంబంధాలను, వ్యాపార సంబంధాలను పెంపొందించడం తో పాటు ఆసియాన్ సభ్యత్వ దేశాలతో ఇతర సంబంధాలను సైతం వర్ధిల్లేటట్లు చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని యాక్ట్ ఈస్ట్ పాలిసీ రూపొందిందని ఆయన వివరించారు.

ఆసియాన్ కు, భారతదేశానికి మధ్య నెలకొన్న భాగస్వామ్యానికి 25 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో ఇటీవలే ఆసియాన్- ఇండియా కమెమరేటివ్ సమిట్ ను నిర్వహించుకొన్న సంగతిని ప్రధాన మంత్రి గుర్తుచేశారు. భారతదేశానికి, ఆసియాన్ దేశాలకు మధ్య బంధం వేల సంవత్సరాల నాటిది అని ఆయన చెప్పారు. 10 ఆసియాన్ దేశాల నేతలకు న్యూ ఢిల్లీ లో నిర్వహించిన గణతంత్ర దిన వేడుకలలో గౌరవ అతిథులుగా ఆతిథ్యం ఇవ్వడం భారతదేశానికి దక్కిన విశేషాధికారం అని ఆయన అన్నారు.

ఈశాన్య ప్రాంతంలో సమతులమైన మరియు శరవేగంతో కూడిన వృద్ధి చోటు చేసుకొన్నప్పుడు భారతదేశ వృద్ధి గాథ మరింత శక్తిని పుంజుకోగలుగుతుందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల జీవనంలో ఒక గుణాత్మకమైన మార్పును తీసుకురావడమే ప్రధానంగా రూపొందాయని ఆయన తెలిపారు. ధ్యేయమల్లా జీవనంలో సరళత్వాన్ని మెరుగుపరచడమే అని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెటులో ప్రకటించిన ‘‘ఆయుష్మాన్ భారత్’’ పథకం ప్రపంచంలో ఉన్నటువంటి ఆ తరహా పథకాలన్నింటిలోకెల్లా అతి పెద్దది అని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ ఆరోగ్య సంరక్షణ పథకం సుమారు 45 నుండి 50 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చగలదని ఆయన అన్నారు. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇతర చర్యలను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

ఇన్ పుట్ వ్యయాలను తగ్గించడం, ఇంకా వ్యవసాయదారులకు వారి పంటలకు తగిన ధర దక్కేలా చూడడం ద్వారా వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వ్యవసాయదారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్న ఇతర చర్యలను గురించి కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు.

ప్రజలకు తక్కువ వ్యయంతో కూడిన గృహ‌ వసతి కల్పన కోసం చర్యలు తీసుకొన్నామని ప్రధాన మంత్రి చెప్పారు. ఎల్ ఇడి బల్బులను పంపిణీ చేయడం కోసం ఉజ్జ్వల యోజనను తీసుకువచ్చామని, ఈ పథకం ద్వారా కుటుంబాల విద్యుత్తు బిల్లులలో చెప్పుకోదగ్గ ఆదా సాధ్యపడుతోందని ఆయన వివరించారు. పునర్ వ్యవస్థీకరించిన నేషనల్ బ్యాంబూ మిషన్ ప్రత్యేకించి ఈశాన్య ప్రాంతానికి గణనీయమైన ప్రాముఖ్యం కలిగిన కార్యక్రమమని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం లోని పాలన యంత్రాంగ స్వరూపాలను పునర్ వ్యవస్థీకరించిన కారణంగా ప్రాజెక్టుల అమలు బాగా వేగవంతం అయినట్లు ప్రధాన మంత్రి వివరించారు.

ముద్ర యోజన లో భాగంగా నవ పారిశ్రామికవేత్తలకు పూచీకత్తు లేని రుణాలను అందించేందుకు తీసుకొన్న చర్యలను గురించి ప్రధాన మంత్రి ఏకరువు పెట్టారు. ఎమ్ఎస్ఎమ్ఇ లకు పన్ను రాయితీ ఇచ్చేందుకు కేంద్ర బడ్జెటులో చేపట్టిన చర్యలను ఆయన ప్రస్తావించారు.

అవినీతిని మరియు నల్లధనాన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం నిబద్ధురాలై ఉందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. గత మూడు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం అనేక పరివర్తనాత్మక ఆర్థిక సంస్కరణలను అమలుచేసిందని, ఈ సంస్కరణలు వ్యాపార ప్రక్రియలను సులభతరంగా మార్చాయని ఆయన చెప్పారు. ఈ సంస్కరణల ఫలితంగా, ప్రపంచ బ్యాంకు యొక్క డూయింగ్ బిజినెస్ రిపోర్టు లో భారతదేశం 42 మెట్లు పైకి ఎగబాకి 190 దేశాలలో ప్రస్తుతం 100వ స్థానంలో నిలచిందని ఆయన అన్నారు.

అస్సామ్ కు చెందిన గొప్ప సంగీత విద్వాంసుడు శ్రీ భూపేన్ హజారికా ను గురించి ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ, మన స్వాతంత్ర్య సమర యోధులు కన్న కలలను మరియు వారి దార్శనికతను సాకారం చేయడంతో పాటు 2022 కల్లా ఒక న్యూ ఇండియా ను ఆవిష్కరించడం కూడా మన అందరి బాధ్యత అన్నారు.

ఈశాన్య ప్రాంతంలో ఒక కొత్త రవాణా సంబంధ మౌలిక సదుపాయాల వ్యవస్థ ను నిర్మించేందుకు చేసిన కృషిని గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

అస్సాం లో వ్యాపారానికి, అభివృద్ధికి అనుకూలించే వాతావరణాన్ని అస్సాం ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఆవిష్కరిస్తున్నారంటూ ఆయనను ప్రధాన మంత్రి అభినందించారు.

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era

Media Coverage

India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s remarks during inauguration of Swaminarayan Hindu Temple in Paris
September 06, 2026

पूज्य महंत स्वामी, फ्रांस सरकार के सम्मानित प्रतिनिधिगण, उपस्थित अतिथिगण, इंडियन कम्युनिटी के मेरे साथी, देश दुनिया से जुड़े सभी हरि भक्त, देवियों और सज्जनों, जय स्वामीनारायण!

आज फ्रांस की राजधानी पेरिस में भव्य स्वामीनारायण मंदिर का लोकार्पण हो रहा है। यह लोकार्पण भारत और फ्रांस के सांस्कृतिक संबंधों का नया युग स्तंभ है। पूज्य संत जनों और सनातन परंपरा के श्रेष्ठ जनों के आशीर्वाद के साथ आज इस लोकार्पण का मंच ‘वसुधैव कुटुम्बकम’ के भाव का मंच बन गया है। भगवान स्वामीनारायण की कृपा और हमारे संतों का स्नेह, संतों का आशीर्वाद, मेरा सौभाग्य है कि मुझे ऐसे पुण्य अवसरों से जुड़ने का अवसर हमेशा मिलता रहता है। आज भी मैं भले ही पेरिस में आप सबके बीच उपस्थित नहीं हूं, लेकिन मन से और हृदय से, मैं स्वयं को आपके बीच ही अनुभव कर रहा हूं।

साथियों,

आज इस अवसर पर मैं परम पूज्य प्रमुख स्वामी जी महाराज का भी श्रद्धापूर्वक स्मरण करता हूं। प्राचीन काल में भारत का जो सांस्कृतिक आध्यात्मिक वैभव था, उन्होंने उसके पुनर्जागरण का एक अभियान शुरू किया था। आज उसका प्रकाश यूरोप समेत पूरी दुनिया में फैल रहा है। 2024 में अबू धाबी में भव्य मंदिर का लोकार्पण हुआ था। आज वहां हजारों लोग दर्शन करने जाते हैं और अब यहां पेरिस में स्वामीनारायण मंदिर का निर्माण सृजन की यह निरंतरता, यह संतों की संकल्प शक्ति का ही प्रमाण है। मैं पुनीत कार्य के लिए पूज्य महंत स्वामी का आभार प्रकट करता हूं, मैं उनके चरणों में प्रणाम करता हूं। मैं BAPS स्वामीनारायण संस्था को और करोड़ों हरि भक्तों को इस अवसर पर हृदय की गहराई से बधाई देता हूं।

साथियों,

BAPS के माध्यम से जब अलग-अलग देश में मंदिरों की प्राण प्रतिष्ठा होती है, तो वहां भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ-साथ ही जाते हैं और भारत का विचार कहता है ‘समानं मनः सह चित्तमेषाम्’ अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े। इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है, यह फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही, इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी।

साथियों,

बीते वर्षों में भारत और फ्रांस के संबंध नई ऊंचाइयों तक पहुंचे हैं। मेरे मित्र, प्रेसिडेंट मैक्रों के साथ मिलकर दोनों देश एक Special Global Strategic Partnership बना रहे हैं। Technology, AI और Defence से लेकर Space और Climate Action तक हम एक नई गति और नई ऊर्जा के साथ मिलकर के आगे बढ़ रहे हैं। हम 2026 को India-France Year of Innovation के रूप में भी सेलिब्रेट कर रहे हैं। भारत-फ्रांस की ये Strategic Partnership इसलिए भी खास है, क्योंकि ये हमारे पुराने सांस्कृतिक-राजनैतिक सम्बन्धों की मजबूत बुनियाद पर टिकी है। इतिहास गवाह है, फ्रांस में भारतीय सैनिकों के बलिदान का इतिहास आज भी मन-मंदिर में जीवित है। भाषा से जुड़े विषयों में रुचि रखने वाले लोग यह भी जानते हैं कि फ्रेंच स्कॉलर्स ने संस्कृत को लोकप्रिय बनाने में कितनी अहम भूमिका निभाई है। रामकृष्ण परमहंस और स्वामी विवेकानंद पर रोमाँ रोलाँ की की लेखनी हमारी सोसाइटीज़ को और करीब लाई है। पेरिस से पुडुचेरी के अरबिंदो आश्रम तक 'The mother' की spiritual journey, उसने कितने ही भारतीय और फ्रेंच साधकों को inspire किया है।

साथियों,

दशकों पहले श्रील प्रभुपाद स्वामी भी फ्रांस आए थे। इस्कॉन के जरिए भारत फ्रांस के बीच आध्यात्मिक सम्बन्धों का नया अध्याय उन्होंने शुरू किया था। आज योग भी भारत-फ्रांस के people to people कनेक्ट का एक माध्यम बन चुका है। 'इंटरनेशनल योगा डे' पर एफिल टॉवर के सामने से आने वाली तस्वीरें फ्रांस में योग की लोकप्रियता का उदाहरण बनती हैं और अब BAPS के इस भव्य मंदिर के जरिए, हमारे उन सांस्कृतिक सम्बन्धों में एक नया अध्याय जुड़ रहा है।

साथियों,

इन दिनों, भारत फ्रांस Joint Ventures की संभावनाओं पर बातें होती हैं। स्वामीनारायण मंदिर ने इस संभावना में भी एक नया आयाम जोड़ा है। यह मंदिर 'मेड इन इंडिया' है और 'बिल्ट इन फ्रांस' है। इसके काफी पत्थरों को भारत में तराशा गया है। भारत की प्राचीन प्रतिभा यहाँ फ्रांस में आधुनिक इंजीनियरिंग से आकर जुड़ चुकी है। पेरिस में इस भव्य मंदिर ने आकार लिया है। इसलिए, मैं आशा करता हूँ, यह मंदिर सदियों तक भारत और फ्रांस के बीच सहयोग और संभावनाओं का भी प्रतीक बनकर उभरेगा।

साथियों,

स्वामीनारायण मंदिर हमेशा से भक्ति के साथ-साथ सेवा का माध्यम भी रहे हैं। मुझे बताया गया है, यह मंदिर भी सेवा प्रकल्पों का वैसा ही केंद्र बनेगा। मुझे विश्वास है कि यहाँ से भारतीय संस्कृति के जो स्वर निकलेंगे, उनका लाभ पूरे यूरोप में लोगों को मिलेगा। भविष्य में मुझे जब भी समय मिलेगा, मैं इस मंदिर में दर्शन करने का प्रयास अवश्य करूंगा। इन्हीं शब्दों के साथ, एक बार फिर आज के इस लोकार्पण समारोह में सम्मिलित सभी अतिथिगणों को, सभी परिवारों को, सभी हरि भक्तों को और पूरी Indian Diaspora को मेरी ओर से इस शुभारंभ पर्व की ढेरों शुभकामनाएं!

बहुत-बहुत धन्यवाद!

मर्सी बोकू!

जय स्वामीनारायण!