India & Portugal have built modern bilateral partnership on the foundation of a shared historical connect: PM
Our partnership is also strengthened by a strong convergence on global issues, including at the United Nations: PM
Expansion and deepening of trade, investment and business partnerships between India-Portugal is our shared priority: PM
Partnership being forged between Start-up Portugal and Start-up India will help us in our mutual quest to innovate and progress: PM
PM Modi thanks PM Antonio Costa of Portugal for consistent support for India’s permanent membership of the UN Security Council

 

విశిష్టుడైన ప్ర‌ధాని శ్రీ ఏంటోనియో కోస్టా,
మీడియా ప్ర‌ముఖులు,
మిత్రులారా,
మీ అంద‌రికీ ఈ సాయంత్ర వేళ శుభాభినంద‌న‌లు.

విశిష్ట మ‌హోద‌యా,

మీకు, మీ ప్ర‌తినిధివ‌ర్గం స‌భ్యుల‌కు భార‌తదేశానికి స్వాగ‌తం ప‌ల‌క‌డం నాకు గొప్ప సంతోషాన్నిస్తోంది. ఇది భార‌త్ కు మీ తొలి ఆధికారిక ప‌ర్య‌ట‌న కావ‌చ్చు గాని, భార‌త‌దేశానికి మీరు కొత్త వ్య‌క్తి కానే కాదు. అలాగే భార‌తదేశం కూడా మీకు తెలియ‌ని దేశం కాదు. చ‌లిగాలుల‌తో కూడిన ఈ సాయంత్ర వేళ‌లో మీకు హార్దిక‌ స్వాగ‌తం ప‌లుకుతున్నాను. తిరిగి స్వాగతం అని నేను చెప్పాలి. బెంగళూరులో జ‌రుగుతున్న ప్రవాసీ భార‌తీయ దివ‌స్ కు అతిథిగా మీకు పంపిన ఆహ్వానాన్ని ఆమోదించ‌డం మాకు చాలా గౌర‌వ‌ప్రదం. భార‌తదేశం లోనే కుటుంబ మూలాలు గల విశిష్ట నాయ‌కునిగా మీరు సాధించిన విజ‌యాలను రేపు పండుగగా జరుపుకోవడం మాకు ప్ర‌త్యేక గౌర‌వం. ప్ర‌ధానిగా మీ నాయ‌క‌త్వంలో పోర్చుగ‌ల్ సాధించిన ప‌లు విజ‌యాల‌కుగాను నేను అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నాను. మీ నాయ‌క‌త్వంలో పోర్చుగీస్ ఆర్థిక వ్య‌వ‌స్థ స‌రైన దిశ‌లో నిల‌క‌డ‌గా ముందుకు సాగుతోంది.

మిత్రులారా,

భార‌త‌దేశం, పోర్చుగ‌ల్ లు ఉమ్మ‌డి చారిత్ర‌క అనుసంధానం పునాదుల‌పై ఆధునిక ద్వైపాక్షిక బంధాన్నినిర్మించుకొన్నాయి. ఐక్య‌ రాజ్య‌ స‌మితితో స‌హా ప‌లు ప్ర‌పంచ స‌మ‌స్య‌ల‌పై బ‌ల‌మైన ఏకీభావం మ‌న భాగ‌స్వామ్యంలో బ‌లం.

ప్ర‌ధాని శ్రీ కోస్టాతో ఈ రోజు నేను జ‌రిపిన విస్తృత చ‌ర్చ‌లలో వివిధ రంగాలలో భార‌త‌- పోర్చుగ‌ల్ సంబంధాల‌పై పూర్తి స్థాయిలో స‌మీక్షించాం. ఉభ‌య దేశాల‌ భాగ‌స్వామ్యంలోని ఆర్థిక‌ప‌ర‌మైన అవ‌కాశాల‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు కార్యాచ‌ర‌ణ ఆధారిత చ‌ర్య‌ల‌పై దృష్టి సారించాల‌ని ఉభ‌యులం అంగీకారానికి వ‌చ్చాం. ఆ దిశ‌గా మా ఉమ్మ‌డి తీర్మానానికి సంకేత‌మే ఈ రోజు సంత‌కాలు పూర్తి అయిన ఒప్పందాలు.

మిత్రులారా,

ఉభ‌య దేశాల మ‌ధ్య వాణిజ్య‌, వ్యాపార‌, పెట్టుబ‌డి భాగ‌స్వామ్యాల‌ను మ‌రింత లోతుగా, మ‌రింత విస్తారంగా పెంచుకోవ‌డం మా ఉమ్మ‌డి ప్రాధాన్య‌ం. మౌలిక వ‌స‌తులు, వ్య‌ర్థాలు, వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, సౌర‌ విద్యుత్తు, ప‌వ‌న విద్యుత్తు, న‌వ‌క‌ల్ప‌న‌ లు ఉభ‌య దేశాల మ‌ధ్య బ‌లీయ‌మైన వాణిజ్య బంధానికి పూర్తి స్థాయి అవ‌కాశాలు ఉన్న రంగాలు. స్టార్ట్- అప్ ల‌కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డంలో మా అనుభ‌వం ఈ ద్వైపాక్షిక ఒప్పందంలో ఆస‌క్తిక‌ర‌మైన అంశం. ఇది మ‌న ఉభ‌య దేశాల యువ వ్యాపార‌వేత్తలు, యువ పారిశ్రామిక‌వేత్త‌లు లాభ‌దాయ‌క‌మైన భాగ‌స్వామ్యాలు ఏర్పాటు చేసుకొనేందుకు, రెండు స‌మాజాల‌కు విలువ‌, సంప‌ద స‌మ‌కూర్చేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. ‘స్టార్ట్- అప్ పోర్చుగ‌ల్’, ‘స్టార్ట్- అప్ ఇండియా’ ల మ‌ధ్య కుదిరిన ఈ భాగ‌స్వామ్యం న‌వ‌క‌ల్ప‌న‌లు, పురోగ‌తిలో ముందుకు సాగాల‌న్న ఉభ‌యుల కోరిక సాకారం కావ‌డానికి స‌హాయ‌కారిగా నిలుస్తుంద‌న్న న‌మ్మ‌కం నాకుంది. ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త రంగాలలో కూడా భాగ‌స్వామ్యం మ‌రింత లోతుగా విస్త‌రించుకోవాల‌ని ప్ర‌ధాని శ్రీ కోస్టా, నేను అంగీకారానికి వ‌చ్చాం. ఈ రోజు సంత‌కాలు జరిగిన ర‌క్ష‌ణ శాఖ‌లో స‌హ‌కారానికి సంబంధించిన‌ అవ‌గాహ‌న పూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) ప‌ర‌స్ప‌రం లాభ‌దాయ‌క‌మైన రీతిలో ఉభ‌యుల‌కు గ‌ల బ‌లాల‌ను క్రోడీక‌రించుకోవ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. ద్వైపాక్షిక సంబంధాల‌కు మ‌రింత భ‌రోసాను ఇచ్చే మ‌రో రంగం క్రీడ‌లు. విశిష్ట మ‌హోద‌యా, మీకు సాక‌ర్ అత్యంత అభిమాన‌పాత్ర‌మైన క్రీడ అన్న విష‌యం మాకు తెలుసు. ఫుట్ బాల్ లో పోర్చుగ‌ల్ కు గ‌ల ఈ బ‌లం, భార‌తదేశం లో ఈ క్రీడ త్వ‌రిత‌గ‌తిన అభివృద్ధి చెందుతూ ఉండ‌డం.. క్రీడారంగంలో మ‌న భాగ‌స్వామ్యానికి మూలంగా నిలువగలుగుతుంది.

మిత్రులారా,

ప‌లు అంత‌ర్జాతీయ అంశాలలో భార‌తదేశం, పోర్చుగ‌ల్ లు ఒకే ర‌క‌మైన ఉమ్మ‌డి అభిప్రాయాలను క‌లిగివున్నాయి. ఐక్య‌ రాజ్య‌ స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌తదేశం శాశ్వ‌త స‌భ్య‌త్వం కోసం నిరంత‌రం గ‌ట్టి మ‌ద్ద‌తు ఇస్తున్నందుకు  ప్ర‌ధాని శ్రీ కోస్టాకు నేను ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను. అలాగే క్షిప‌ణి సాంకేతిక ప‌రిజ్ఞానం అదుపు వ్య‌వ‌స్థ‌ లోను, పరమాణు స‌ర‌ఫ‌రాదారుల బృందం లోను భార‌త స‌భ్య‌త్వం కోసం ఎడ‌తెగ‌ని మ‌ద్ద‌తు ఇస్తున్నందుకు పోర్చుగ‌ల్ కు మేం హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేస్తున్నాం. నానాటికీ పెరిగిపోతున్న హింసాత్మక, ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను నిలువ‌రించేందుకు అంత‌ర్జాతీయ స‌మాజం స‌త్వ‌రం ప‌టిష్ఠ‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రంపై కూడా మేం చ‌ర్చించాం.

విశిష్ట మ‌హోద‌యా,

భార‌త‌దేశం, పోర్చుగ‌ల్ లు రెండింటికీ ఉమ్మ‌డి సాంస్కృతిక నేప‌థ్యం ఉంది. మీ తండ్రి గారు శ్రీ ఆర్లాండో కోస్టా ఈ రంగానికి, గోవా, భార‌త‌- పోర్చుగీస్ సాహిత్యానికి  చేసిన సేవ‌ల‌ను మేం ప్ర‌శంసిస్తున్నాం. ఈ రోజు మ‌నం రెండు నాట్య‌ రీతుల‌కు సంబంధించిన స్మార‌క త‌పాలా బిళ్ళ‌లను విడుద‌ల చేశాం. ఒక‌టి పోర్చుగీసుకు, మ‌రొక‌టి భార‌త్ కు చెందిన ఈ నాట్య‌ రీతులు మ‌న సాంస్కృతిక బంధానికి అద్భుత‌మైన ఉదాహ‌ర‌ణ‌లు.

విశిష్ట మ‌హోద‌యా,

రానున్న రెండు రోజులలో మీరు భార‌తదేశం లో పలు ప్రాంతాలు సంద‌ర్శించి ప‌లు కార్య‌క్ర‌మాలలో పాలుపంచుకోబోతున్నారు. బెంగ‌ళూరు, గుజ‌రాత్, గోవా సంద‌ర్శ‌న‌లు మీకు, మీ ప్ర‌తినిధి వ‌ర్గానికి అద్భుత‌మైన అనుభూతిని అందించాల‌ని నేను ఆకాంక్షిస్తున్నాను. మీ గోవా సంద‌ర్శ‌న చిర‌కాలం గుర్తుండిపోయేది కావాల‌ని, మీ పూర్వికుల‌తో మిమ్మ‌ల్ని తిరిగి క‌లిపేదిగా నిల‌వాల‌ని నేను ప్ర‌త్యేకంగా ఆకాంక్షిస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు.
మీకు మ‌రీ మరీ ధ‌న్య‌వాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x

Media Coverage

India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26, 2026
దేశంలో క్రీడలు.. యువ నాయకత్వం.. పౌర బాధ్యత.. స్వచ్ఛంద సేవ.. దారుఢ్యం.. దేశ ప్రగతి వంటి అంశాలను ఈ చర్చలు ఒకే వేదికపైకి తెస్తాయి
ఈ చర్చలు ప్రధానంగా క్రీడలు.. ఒలింపిక్స్‌ ఆకాంక్షలు.. యువ నేతృత్వం.. వికిసిత భారత్.. మాదకద్రవ్య రహిత యువతరంపై దృష్టి సారిస్తాయి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026లో భాగంగా ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోగల రెండు కళాశాలల్లో యువతరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రగతి కార్యకలాపాల్లో యువత ఆకాంక్షలకు కీలక స్థానమిస్తూ ఆరోగ్యకర, క్రమశిక్షణాయుత. క్రీడాస్ఫూర్తి గల దేశానికి రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో క్రీడలు, యువ నాయకత్వం, పౌర కర్తవ్యం, స్వచ్ఛంద సేవ, దారుఢ్యం, దేశ పురోగమనం తదితర అంశాలన్నిటిపైనా చర్చను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తెస్తుంది. దేశ క్రీడారంగ పురోగమన ఆకాంక్షలతో యువత మమేకమయ్యే ప్రత్యక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. దేశ యువతరం, క్రీడా వ్యవస్థపై చర్చల సందర్భంగా వారి ఆలోచనలు, దృక్కోణాలను పంచుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమం అనంతరం యువ భాగస్వాములు, మై భారత్ వలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో చర్చలు సాగుతాయి. క్రీడాసక్తి గల యువత, ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతల మధ్య ప్రత్యక్ష ఇష్టాగోష్ఠి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో ‘యువతరం చర్చలు’ ప్రధానాంశంగా ఉంటాయి. యువ భాగస్వాములు తమ ఆలోచనలు, దృక్కోణాలు, ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఈ చర్చలు ప్రధానంగా దిగువ పేర్కొన్న 5 అంశాలపై కేంద్రీకృతమవుతాయి:

· మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, క్రీడా విజ్ఞానం, సార్వజనీన భాగస్వామ్యంతో జాతీయ క్రీడా వ్యవస్థ మెరుగుదల.

· శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపు, పారదర్శక ఎంపిక, దీర్ఘకాలిక క్రీడా వికాసం ద్వారా 2036లో ఒలింపిక్స్ దిశగా ప్రతిభకు పదును పెట్టడం.

· పరిపాలన వేదికలు, మై భారత్ నేతృత్వంలోని స్వచ్ఛంద సేవ ద్వారా యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం.

· పౌర చైతన్యం, భవిష్యత్‌ సంసిద్ధ నైపుణ్యం, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం, ద్వారా వికసిత భారత్ ప్రస్థానం వైపు యువతరానికి సాధికారత కల్పన.

· ఈ నెల 2న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి 100 వారాల ప్రచారం’లో భాగంగా వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య వినియోగంపై పోరులో క్రీడలు సహా, సహ రంగాల్లోని వివిధ బృందాల సేవల ద్వారా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ధ్యేయం.