PM Modi pushes for tourism development in Himachal Pradesh
To promote tourism in Himachal, our government is committed to building the best road in Himachal: PM
People of Himachal Pradesh are ready to teach Congress a lesson in these elections; says PM
PM Modi says 'storm' is raging against Congress' corrupt regime in Himachal
We will ensure jobs for youth, healthcare for elderly and proper education for children: PM Modi
Congress and corruption can never separate from each other, says PM Modi in Kullu
It is all because of the 125 crore Indians that India is shining in the world, says PM Modi
People in Himachal Pradesh will not only vote to elect BJP but also to punish the corrupt Congress govt: PM

 

ప్రధాని నరేంద్ర మోదీ, హిమాచల్ ప్రదేశ్లలో ఉనా, పాలంపూర్, కులు, బహిరంగ సమావేశాలకు హాజరయ్యారు. ర్యాలీలో మాట్లాడుతూ, "నేను హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో ఈ సారి చూసినందుకు ఉత్సాహంతో ముందెన్నడూ చూడలేదని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి ఇది స్పష్టమైన సూచన." అని అన్నారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి చేస్తూ, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం నేర్పించేందుకు నిర్ణయించుకున్నారని, ఇప్పుడు, ఎన్నికలు ఏకపక్షం అయ్యాయని, యుద్ధక్షేత్రంనుండి కాంగ్రెస్ పారిపోయిందని.” అయన అన్నారు.

"అధికారంలో విశ్రాంతి గడపడం కాంగ్రెస్ కు అలవాటు ఉంది కానీ బిజెపి దానికి వైవిధ్యమైన పార్టీగా ఉంది. మా మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన శాంత కుమార్ కొండప్రాంత ప్రజలకు నీటిని అందించడంలో తన పదవీకాలం గడిపారు. మరియు హిమాచల్ ప్రదేశానికి పర్యాటక రంగం ప్రోత్సహించడంపై ధుమాల్జీ కృషి గురించి అందరికి బాగా తెలుసు 'అని ఆయన అన్నారు.

అలాగే, గ్రామాలకు చేరినప్పుడు ఒక రూపాయి 15 పైసలుగా మారుతుందనే  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఉటంకిస్తూ, రాజీవ్ గాంధీ అవినీతి సమస్యను నిర్ధారించినా దాని గురించి ఏమీ చేయని వైద్యుడని ఆయన అన్నారు. అయితే, తాము నూటికి 100 పైస మొత్తాన్ని నేరుగా పేద ప్రజల జోబులోకి వెళ్ళేలా చూస్తున్నామని ఆయన అన్నారు.

భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, మాది ప్రజలకు సేవ చేయడానికి అంకితమైన ప్రభుత్వమని ప్రధానమంత్రి అన్నారు. మేము విడుదల చేసే నిధులు, పూర్తిగా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేలా మేము చూస్తున్నామని అన్నారు.

అవినీతి అంతం చేయడం మరియు పేద మరియు అట్టడుగు ప్రజల సంక్షేమాన్ని  అందించడమే కేంద్ర అజెండా అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో వున్న 5 భూతాలైన 'మైనింగ్ మాఫియా', 'అటవీ మాఫియా', 'డ్రగ్ మ్యాఫియా', 'టెండర్ మాఫియా', 'బదిలీ మాఫియా'లను తరిమికొట్టాల్సిన అవసరం ఉందని ఆయన ప్రజలను కోరారు.

 

అలాగే, జిఎస్టి ప్రయోజనాల గురించి ప్రధాని మాట్లాడారు, అతను జిఎస్టి రవాణా రంగానికి ఎంతో లబ్ది చేకూర్చిందని, రాష్ట్రాల మధ్య ట్రక్కు ప్రయాణం పెరిగిందని ఆయన అన్నారు. బ్యాంకు ఖాతాలతో ఆధార్ కార్డులను అనుసంధానించడం ద్వారా మధ్యవర్తులను ఎలా తొలగించారో తెలిపారు మరియు ఇప్పుడు లబ్ధిదారులకు సబ్సిడీలు నేరుగా ఎలా చేరుతున్నాయని హైలైట్ చేశారు.

 

ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ కుమార్ ధుమాల్, పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Click Here to read full text speech at Kullu, Himachal Pradesh

Click Here to read full text speech at Palampur, Himachal Pradesh

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India at Davos: From presence to partnership in long-term global growth

Media Coverage

India at Davos: From presence to partnership in long-term global growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 జనవరి 2026
January 24, 2026

Empowered Youth, Strong Women, Healthy Nation — PM Modi's Blueprint for Viksit Bharat