షేర్ చేయండి
 
Comments

‘భార‌తదేశానికే తొలి ప్రాధాన్యం’ అనే సూత్రం.. ప్ర‌ధాన‌ మంత్రి దృఢంగా దృష్టి సారించిన నేప‌థ్యంలో.. అది ప్ర‌పంచ‌ం అంత‌టా ప్ర‌తిధ్వ‌నించింది. ప్ర‌పంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) వ్యాపార సౌల‌భ్య ఒప్పందం (టిఎఫ్ఎ)పై చ‌ర్చిస్తున్న స‌మ‌యంలో దానిపై త‌న అభ్యంత‌రాల‌ను భార‌తదేశం సుస్ప‌ష్టంగా వినిపించింది. ఆహార‌ భ‌ద్ర‌త క‌ల్ప‌న‌కు  నిబద్ధ‌త విష‌యంలో రాజీ ప‌డేది లేదని భార‌తదేశం స్ప‌ష్టం చేసింది. పేద‌ల‌కు ఆహార భ‌ద్ర‌త త‌మ‌కు ఒక విశ్వాస‌పూర్వ‌క నిర్దేశ‌మ‌ని, దీనికి ప్ర‌ధాన‌ మంత్రి వ్య‌క్తిగ‌తంగా క‌ట్టుబ‌డి ఉన్నార‌ంటూ కుండ‌ బ‌ద్ద‌లు కొట్టింది.

ఆహార‌ ధాన్యాలను నిల్వ చేయ‌డంపై శాశ్వ‌త ప‌రిష్కారం అన్వేషించాల‌ని డిమాండ్ చేసింది. ప్ర‌పంచ రంగస్థలంపై భార‌తదేశపు గ‌ళానికి వివిధ దేశాల మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో, ఆ వైఖ‌రికి బ‌లం చేకూరింది. అంతిమంగా ఆహార‌ భ‌ద్ర‌త‌పై రాజీకి తావే లేద‌న్న భార‌తదేశం వాద‌న నెగ్గింది. అదే స‌మ‌యంలో అంత‌ర్జాతీయ స‌మాజంతో ద‌శ‌ల‌వారీ చ‌ర్చ‌లకు ద్వారాలు తెరిచి ఉంచింది.

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
UPI transactions surged to 9.3 billion in June 2023, driven by P2M, says Worldline report

Media Coverage

UPI transactions surged to 9.3 billion in June 2023, driven by P2M, says Worldline report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
షేర్ చేయండి
 
Comments

5 మే 2017, దక్షిణాసియా సహకారం బలమైన ప్రోత్సాహాన్ని పొందిన రోజుగా చరిత్రలో నిలిచిపోతుంది – అది దక్షిణ ఆసియా ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన రోజు, భారతదేశం రెండు సంవత్సరాల క్రితం చేసిన నిబద్ధతను నెరవేర్చింది.

దక్షిణాసియా ఉపగ్రహాలతో దక్షిణాసియా దేశాలు తమ సహకారాన్ని అంతరిక్షంలోకి విస్తరించాయి!

ఈ చారిత్రాత్మక ఘటనను తిలకించడానికి, భారతదేశం, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్ మరియు శ్రీలంక నాయకులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణాసియా ఉపగ్రహాన్ని సాధించే సామర్ధ్యం గురించి పూర్తి వివరాలను సమర్పించారు.

ఈ ఉపగ్రహం సుదూర ప్రాంతాలకు మంచి పాలన, సమర్థవంతమైన కమ్యూనికేషన్, మెరుగైన బ్యాంకింగ్, విద్య, ఉపగ్రహ వాతావరణం, టెలీ మెడిసిన్తో ప్రజలను కలుపుతూ, మంచి చికిత్సకు భరోసా కల్పించడం వంటివి చేసేందుకు సహాయపడుతుందని ఆయన చెప్పారు.

"మనము చేతులు కలిపి, పరస్పర జ్ఞానం, సాంకేతికత మరియు పెరుగుదల పట్ల పంచుకున్నప్పుడు, మన అభివృద్ధి మరియు శ్రేయస్సును వేగవంతం చేయవచ్చు." అని శ్రీ మోదీ అన్నారు.