ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నేపాల్ పూర్వ ప్రధాని, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ కో-చైర్ మన్ శ్రీ పుష్ప కమల్ దాహల్ ‘ప్రచండ’ ఈ రోజు సమావేశమయ్యారు.
ఇరువురు నేతలు భారతదేశం-నేపాల్ సంబంధాల లో పురోగతి తో పాటు పరస్పర ప్రయోజనం ముడిపడివున్న ఇతర అంశాలను గురించి కూడా చర్చించారు.

ప్రధాన మంత్రి తమ ఇదివరకటి సమావేశాలను ఎంతో ఆప్యాయంగా గుర్తుకు తెచ్చుకొన్నారు; భారతదేశం- నేపాల్ సంబంధాలను బలోపేతం చేయడం లో విలువైన తోడ్పాటు ను అందించిన శ్రీ దాహల్ కు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సంవత్సరం లో నేపాల్ ను తాను రెండుసార్లు సందర్శించడాన్ని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొంటూ ఉన్నత స్థాయి సమావేశాలు తరచుగా చోటుచేసుకొంటుండడంతో భారతదేశం- నేపాల్ సంబంధాలు ఓ నూతనోత్తేజాన్ని అందుకొన్నాయన్నారు.


