Projects will significantly boost infrastructure development, enhance connectivity and give an impetus to ease of living in the region
PM inaugurates Deoghar Airport; to provide direct air connectivity to Baba Baidyanath Dham
PM dedicates in-patient Department and Operation Theatre services at AIIMS, Deoghar
“We are working on the principle of development of the nation by the development of the states”
“When a holistic approach guides projects, new avenues of income come for various segments of the society”
“We are taking many historic decisions for converting deprivation into opportunities”
“When steps are taken to improve the ease of life for common citizens, national assets are created and new opportunities of national development emerge”

జార్ఖండ్ గవర్నర్ శ్రీ రమేష్ బైస్ జీ, ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు  శ్రీ జ్యోతిరాదిత్య సింధియా జీ, జార్ఖండ్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీ నిషికాంత్ జీ, ఇతర ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు, మహిళలు మరియు పెద్దమనుషులు,

బాబా ధామ్ ను సందర్శించిన తరువాత ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. ఈ రోజు డియోఘర్ నుండి జార్ఖండ్ అభివృద్ధికి ఊతమిచ్చే అదృష్టం మనందరికీ దక్కింది. బాబా బైద్యనాథ్ ఆశీస్సులతో నేడు 16,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం లేదా వాటికి పునాదిరాళ్లు వేయడం జరిగింది. ఇవి జార్ఖండ్ యొక్క ఆధునిక కనెక్టివిటీ, శక్తి, ఆరోగ్యం, విశ్వాసం మరియు పర్యాటకానికి చాలా ప్రేరణను ఇవ్వబోతున్నాయి. డియోఘర్ విమానాశ్రయం మరియు డియోఘర్ ఎయిమ్స్ గురించి మేము చాలా కాలంగా కలలు కంటున్నాము. ఈ కల కూడా ఇప్పుడు సాకారమవుతోంది.

మిత్రులారా,

 

ఈ పథకాలు జార్ఖండ్ లోని లక్షల మంది ప్రజల జీవితాలను సులువు చేయడమే కాకుండా, వ్యాపారం, వాణిజ్యం, ప ర్యాటక రంగం, ఉపాధి మ రియు స్వయం ఉపాధికి అనేక కొత్త అవకాశాలను కల్పించనున్నాయి. ఈ అభివృద్ధి పథ కాలన్నింటికీ జార్ఖండ్ ప్రజలందరికీ నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్టులు జార్ఖండ్ లో ప్రారంభించబడుతున్నాయి, కానీ జార్ఖండ్ తో పాటు బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ లోని అనేక ప్రాంతాలు కూడా నేరుగా ప్రయోజనం పొందుతాయి. ఒక రకంగా చెప్పాలంటే, ఈ ప్రాజెక్టులు తూర్పు భారతదేశం యొక్క అభివృద్ధికి కూడా ప్రేరణను ఇస్తాయి.

మిత్రులారా,

 

గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రాల అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధికి సంబంధించిన ఈ విధానంతో దేశం పనిచేస్తోంది. ఝార్ఖండ్ ను హైవేలు, రైల్వేలు, వాయుమార్గాలు, జలమార్గాలతో అనుసంధానం చేసే మా ప్రయత్నంలో గత ఎనిమిదేళ్లలో ఇదే స్ఫూర్తి ప్రధానమైనది. 13  హైవే ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి లేదా వాటికి పునాదిరాయి వేయబడ్డాయి, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ లతో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో జార్ఖండ్ యొక్క కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. మీర్జాచౌకి మరియు ఫరక్కా మధ్య నిర్మిస్తున్న నాలుగు వరుసల రహదారి మొత్తం సంతాల్ పరగణాకు ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది. రాంచీ-జంషెడ్పూర్ హైవే ఇప్పుడు రాష్ట్ర రాజధాని మరియు పారిశ్రామిక నగరం మధ్య ప్రయాణ సమయం మరియు రవాణా ఖర్చు రెండింటినీ గణనీయంగా తగ్గిస్తుంది. పాల్మా గుమ్లా విభాగం నుండి ఛత్తీస్ గఢ్ కు మెరుగైన ప్రాప్యత ఉంటుంది మరియు పారాదీప్ పోర్ట్ మరియు హల్దియా నుండి జార్ఖండ్ కు పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేయడం కూడా సులభం మరియు చౌకగా మారుతుంది. ఈ రోజు రైలు నెట్ వర్క్ లో విస్తరణ ఈ ప్రాంతం అంతటా కొత్త రైళ్లకు మార్గాలను కూడా తెరిచింది మరియు రైలు రవాణాను వేగవంతం చేసింది. ఈ సౌకర్యాలన్నీ జార్ఖండ్ పారిశ్రామిక అభివృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.

మిత్రులారా,

 

నాలుగు సంవత్సరాల క్రితం దేవ్‌గఢ్‌ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసే అదృష్టం నాకు లభించింది. కరోనా నేపథ్యంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ ప్రాజెక్టుపై త్వరితగతిన పురోగతి సాధించామని, నేడు జార్ఖండ్ కు రెండో విమానాశ్రయం లభిస్తోందన్నారు. డియోఘర్ విమానాశ్రయం ప్రతి సంవత్సరం సుమారు ఐదు లక్షల మంది ప్రయాణీకులను నిర్వహించగలదు. ఇది చాలా మందికి బాబా యొక్క 'దర్శనం' చేసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.

మిత్రులారా,

 

హవాయి చప్పల్స్ ధరించిన వారు కూడా విమాన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చనే ఆలోచనతో మన ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని ప్రారంభించిందని జ్యోతిరాదిత్య గారు పేర్కొన్నారు. నేడు ప్రభుత్వ ప్రయత్నాల ప్రయోజనాలు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఉడాన్ పథకం కింద, గత ఐదారు సంవత్సరాలలో విమానాశ్రయాలు, హెలిపోర్టులు లేదా వాటర్ ఏరోడ్రోమ్లతో 70 కి పైగా కొత్త ప్రదేశాలు అనుసంధానించబడ్డాయి. నేడు, సాధారణ పౌరులు 400కు పైగా కొత్త మార్గాల్లో విమాన ప్రయాణ సదుపాయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్పటివరకు ఒక కోటి మంది ప్రయాణీకులు ఉడాన్ పథకం కింద చాలా తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. వీరిలో లక్షలాది మంది విమానాశ్రయాన్ని మొదటిసారిగా చూసి, మొదటిసారిగా విమానం ఎక్కారు. ఒకప్పుడు ప్రయాణాలకు బస్సులు, రైలు మార్గాలపై ఆధారపడిన నా పేద, మధ్యతరగతి సోదర సోదరీమణులు ఇప్పుడు విమానాల్లో సీట్ బెల్ట్ ధరించడం నేర్చుకున్నారు. ఈ రోజు డియోఘర్ నుండి కోల్ కతాకు విమానం ప్రారంభమైనందుకు నేను సంతోషిస్తున్నాను. రాంచీ, పాట్నా మరియు ఢిల్లీకి వీలైనంత త్వరగా విమానాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డియోఘర్ తర్వాత బొకారో, దుమ్కాలో విమానాశ్రయాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అంటే సమీప భవిష్యత్తులో జార్ఖండ్ లో కనెక్టివిటీ మరింత మెరుగ్గా ఉండబోతోంది.

మిత్రులారా,

కనెక్టివిటీతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలోని విశ్వాసం మరియు ఆధ్యాత్మికతకు సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలలో మెరుగైన సౌకర్యాలపై నొక్కి చెబుతోంది. బాబా బైద్యనాథ్ ధామ్ లో కూడా ప్రసాద్ పథకం కింద ఆధునిక సౌకర్యాలు విస్తరించబడ్డాయి. ఒక సమగ్ర విధానంతో పని చేసినప్పుడు, సమాజంలోని ప్రతి విభాగం మరియు రంగం పర్యాటకం రూపంలో కొత్త ఆదాయ మార్గాలను పొందుతుంది. గిరిజన ప్రాంతంలో ఇలాంటి ఆధునిక సౌకర్యాలు ఈ ప్రాంత తలరాతను మార్చబోతున్నాయి.

మిత్రులారా,

గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా దేశం చేసిన ప్రయత్నాలు కూడా గత ఎనిమిదేళ్లలో జార్ఖండ్ కు ఎంతో ప్రయోజనం చేకూర్చాయి. తూర్పు భారతదేశంలో ఉన్న మౌలిక సదుపాయాల దృష్ట్యా గ్యాస్ ఆధారిత జీవితం మరియు పరిశ్రమ ఇక్కడ అసాధ్యమని భావించబడింది. కానీ ప్రధానమంత్రి ఉర్జా గంగా యోజన పాత ఇమేజ్ ను మారుస్తోంది. కొరతను అవకాశాలుగా మార్చడానికి మేము అనేక కొత్త మైలురాయి నిర్ణయాలు తీసుకుంటున్నాము. నేడు బొకారో-అంగుల్ విభాగాన్ని ప్రారంభించడం ద్వారా జార్ఖండ్, ఒడిశాలోని 11 జిల్లాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ విస్తరించనుంది. ఇది ఇళ్లలో పైపుల నుండి చౌకైన వాయువును అందించడమే కాకుండా, సిఎన్జి ఆధారిత రవాణా, విద్యుత్తు మరియు ఎరువులు, ఉక్కు, ఆహార ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీ మొదలైన వాటితో సహా అనేక పరిశ్రమలకు కూడా ప్రేరణను అందిస్తుంది.

మిత్రులారా,

మేము సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మరియు సబ్ కా ప్రయాస్ యొక్క మంత్రాన్ని అనుసరిస్తున్నాము. మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అభివృద్ధి, ఉపాధి మరియు స్వయం ఉపాధికి కొత్త మార్గాలు కనుగొనబడుతున్నాయి. ఆకాంక్షాత్మక జిల్లాలపై దృష్టి సారించడం ద్వారా అభివృద్ధి ఆకాంక్షకు మేము ప్రాధాన్యత ఇచ్చాము. ఈ రోజు జార్ఖండ్ లోని అనేక జిల్లాలు దీని ఫలితంగా ప్రయోజనం పొందుతున్నాయి. అడవులు, పర్వతాలతో ఆవరించి ఉన్న గిరిజన ప్రాంతాలపై, కష్టంగా భావించే ప్రాంతాలపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన అనేక దశాబ్దాల తరువాత విద్యుత్తును పొందిన 18,000 గ్రామాలలో ఎక్కువ భాగం చేరుకోలేని ప్రాంతాల నుండి వచ్చాయి. మంచి రోడ్లు లేని ప్రాంతాలలో కూడా గ్రామీణ, గిరిజన మరియు చేరుకోలేని ప్రాంతాల వాటా అత్యధికంగా ఉంది. గత ఎనిమిదేళ్లలో చేరుకోలేని ప్రాంతాల్లో గ్యాస్, నీటి కనెక్షన్లు అందించేందుకు మిషన్ మోడ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇంతకు ముందు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం అయ్యాయో మనమందరం చూశాము. ఇప్పుడు ఎయిమ్స్ యొక్క ఆధునిక సౌకర్యాలు జార్ఖండ్ తో పాటు బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ లోని పెద్ద గిరిజన ప్రాంతాలకు అందుబాటులో ఉన్నాయి. ప్రజల సౌకర్యార్థం మనం చర్యలు తీసుకున్నప్పుడు దేశ సంపద సృష్టించబడి, అభివృద్ధికి కొత్త అవకాశాలు కూడా ఏర్పడతాయనడానికి ఈ ప్రాజెక్టులే నిదర్శనం. ఇదే నిజమైన అభివృద్ధి. మనందరం కలిసి అటువంటి అభివృద్ధి యొక్క వేగాన్ని వేగవంతం చేయాలి. జార్ఖండ్ ను మ రోసారి నేను ఎంతో అభినందిస్తున్నాను. నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

చాలా ధన్యవాదాలు!

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India vehicle retail sales seen steady in December as tax cuts spur demand: FADA

Media Coverage

India vehicle retail sales seen steady in December as tax cuts spur demand: FADA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 డిసెంబర్ 2025
December 09, 2025

Aatmanirbhar Bharat in Action: Innovation, Energy, Defence, Digital & Infrastructure, India Rising Under PM Modi