రబీ సీజను 2025-26కు (01.10.2025 నుంచి 31.03.2026 వరకు వర్తించే) ఫాస్ఫేట్, పొటాష్ (పీ అండ్ కే) ఎరువులపై పోషకాధారిత రాయితీ (ఎన్బీఎస్) రేట్లను ఖరారు చేయాలన్న ఎరువుల విభాగం ప్రతిపాదనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. దీనికి తాత్కాలికంగా సుమారు రూ.37,952.29 కోట్ల మేరకు నిధులను బడ్జెటు నుంచి సమకూర్చాల్సి ఉంటుంది. ఇది ఖరీఫ్ సీజను 2025కు అవసరమైన బడ్జెటు నిధుల కన్నా, దాదాపు రూ.736 కోట్లు ఎక్కువ.
డై అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ), ఎన్పీకేఎస్ (నత్రజని, భాస్వరం, పొటాష్, గంధకం) గ్రేడ్లు సహా పీ అండ్ కే ఎరువులపై రాయితీని రబీ సీజను 2025-26లో (01.10.2025 నుంచి 31.03.2026 వరకు) ఆమోదించిన రేట్లకు అందిస్తారు. ఈ ఎరువులను రైతులకు అందుబాటు ధరలకు సమకూర్చడం ఈ చర్యలో ముఖ్యోద్దేశం.
ప్రయోజనాలు:
• రైతులకు ఎరువులు రాయితీతో, సరసమైన ధరలకు, సహేతుకమైన ధరలకు అందుబాటులోకొస్తాయి.
• ఎరువులు, పంట ఉత్పాదక పెట్టుబడుల (ఇన్పుట్స్) ధరల్లో అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల చోటుచేసుకున్న ధోరణులను దృష్టిలో పెట్టుకొని పీ అండ్ కే ఎరువులపై రాయితీని సక్రమంగా వ్యవస్థీకరిస్తున్నారు.
నేపథ్యం:
हम देशभर के अपने किसान भाई-बहनों के कल्याण के लिए प्रतिबद्ध हैं। इसी दिशा में हमारी सरकार ने एक बड़ा कदम उठाते हुए 2025-26 के रबी सीजन के लिए फॉस्फोरस और पोटाश उर्वरकों पर सब्सिडी को मंजूरी दी है। इससे जहां अन्नदाताओं को किफायती दर पर उर्वरक उपलब्ध हो सकेंगे, वहीं उनकी कमाई भी…
— Narendra Modi (@narendramodi) October 28, 2025


