ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) 2025-26 మార్కెటింగ్ సీజన్లో అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు (ఎంఎస్‌పీ)నకు ఆమోదం తెలిపింది.

పంట ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను రైతులకు అందించేందుకు గాను 2025-26 మార్కెటింగ్ సీజన్లో రబీ పంటలకు ఎంఎస్‌పీను కేంద్రం పెంచింది. ఆవాలు, ర్యాప్‌సీడ్ (ఆవజాతికి సంబంధించినది) పంటకు క్వింటాల్ కు రూ.300, కందుల (మసూర్)కు క్వింటాలుకు రూ.275 చొప్పున అత్యధికంగా మద్ధతు ధర పెరిగింది. పప్పు ధాన్యాలు, గోధుమలు, కుసుమలు, బార్లీకి వరుసగా క్వింటాలుకు రూ. 210, రూ.150, రూ. 140, రూ 130 చొప్పున పెరిగాయి.

2025-26 మార్కెటింగ్ సీజన్లో రబీ పంటలకు అందించిన కనీస మద్ధతు  ధర(రూ. క్వింటాల్  కు)

 

క్రమసంఖ్య

పంటలు

ఎంఎస్‌పీ ఆర్ఎంఎస్ 2025-26

ఉత్పత్తి వ్యయం* ఆర్ఎంఎస్

2025-26

పెట్టుబడిపై మిగులు

(శాతంలో)

ఎంఎస్‌పీ ఆర్ఎంఎస్ 2024-25

మద్ధతు ధరలో పెరుగుదల

(మొత్తంగా)

1

గోధుమ

2425

1182

105

2275

150

2

బార్లీ

1980

1239

60

1850

130

3

పప్పుధాన్యాలు

5650

3527

60

5440

210

4

కందులు 

6700

3537

89

6425

275

5

ర్యాప్‌సీడ్, ఆవాలు

5950

3011

98

5650

300

6

కుసుమలు

5940

3960

50

5800

140

 

*  కూలీలు, ఎద్దులు, యంత్రాల కిరాయి, కౌలు చెల్లింపులు, విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల కోసం అయ్యే ఖర్చులు, పనిముట్లు, వ్యవసాయ నిర్వహణ వ్యయాలు, పెట్టుబడిపై వడ్డీలు, పంపుసెట్ల నిర్వహణకు డీజిల్, విద్యుత్ ఖర్చులు, ఇతర చెల్లింపులు, కుటుంబ శారీరక శ్రమ విలువతో కలిపి
 

2025-26 మార్కెటింగ్ సీజన్లో తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధరలో పెరుగుదల 2018-19 కేంద్ర బడ్జెట్లో సూచించిన విధంగా దేశం మొత్తం సరాసరి ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు ఎక్కువ ఉండేలా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా గణించిన సరాసరి ఉత్పత్తి వ్యయం ఆధారంగా అంచనా వేసిన లాభం గోధుమలకు 105 శాతంగా ఉంది.  దాని తర్వాత రాప్‌సీడ్, ఆవాలకు 98 శాతం, కందులకు 89 శాతం, పప్పుధాన్యాలకు 60 శాతం,  బార్లీకి 60 శాతం, కుసుమలకు 50 శాతంగా ఉంది. పెరిగిన ధరలు రైతులకు లాభాలను అందించడంతో పాటు పంటల సాగులో వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves

Media Coverage

Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26, 2026
దేశంలో క్రీడలు.. యువ నాయకత్వం.. పౌర బాధ్యత.. స్వచ్ఛంద సేవ.. దారుఢ్యం.. దేశ ప్రగతి వంటి అంశాలను ఈ చర్చలు ఒకే వేదికపైకి తెస్తాయి
ఈ చర్చలు ప్రధానంగా క్రీడలు.. ఒలింపిక్స్‌ ఆకాంక్షలు.. యువ నేతృత్వం.. వికిసిత భారత్.. మాదకద్రవ్య రహిత యువతరంపై దృష్టి సారిస్తాయి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026లో భాగంగా ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోగల రెండు కళాశాలల్లో యువతరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రగతి కార్యకలాపాల్లో యువత ఆకాంక్షలకు కీలక స్థానమిస్తూ ఆరోగ్యకర, క్రమశిక్షణాయుత. క్రీడాస్ఫూర్తి గల దేశానికి రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో క్రీడలు, యువ నాయకత్వం, పౌర కర్తవ్యం, స్వచ్ఛంద సేవ, దారుఢ్యం, దేశ పురోగమనం తదితర అంశాలన్నిటిపైనా చర్చను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తెస్తుంది. దేశ క్రీడారంగ పురోగమన ఆకాంక్షలతో యువత మమేకమయ్యే ప్రత్యక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. దేశ యువతరం, క్రీడా వ్యవస్థపై చర్చల సందర్భంగా వారి ఆలోచనలు, దృక్కోణాలను పంచుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమం అనంతరం యువ భాగస్వాములు, మై భారత్ వలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో చర్చలు సాగుతాయి. క్రీడాసక్తి గల యువత, ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతల మధ్య ప్రత్యక్ష ఇష్టాగోష్ఠి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో ‘యువతరం చర్చలు’ ప్రధానాంశంగా ఉంటాయి. యువ భాగస్వాములు తమ ఆలోచనలు, దృక్కోణాలు, ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఈ చర్చలు ప్రధానంగా దిగువ పేర్కొన్న 5 అంశాలపై కేంద్రీకృతమవుతాయి:

· మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, క్రీడా విజ్ఞానం, సార్వజనీన భాగస్వామ్యంతో జాతీయ క్రీడా వ్యవస్థ మెరుగుదల.

· శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపు, పారదర్శక ఎంపిక, దీర్ఘకాలిక క్రీడా వికాసం ద్వారా 2036లో ఒలింపిక్స్ దిశగా ప్రతిభకు పదును పెట్టడం.

· పరిపాలన వేదికలు, మై భారత్ నేతృత్వంలోని స్వచ్ఛంద సేవ ద్వారా యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం.

· పౌర చైతన్యం, భవిష్యత్‌ సంసిద్ధ నైపుణ్యం, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం, ద్వారా వికసిత భారత్ ప్రస్థానం వైపు యువతరానికి సాధికారత కల్పన.

· ఈ నెల 2న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి 100 వారాల ప్రచారం’లో భాగంగా వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య వినియోగంపై పోరులో క్రీడలు సహా, సహ రంగాల్లోని వివిధ బృందాల సేవల ద్వారా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ధ్యేయం.