Published By : Admin |
September 26, 2025 | 11:30 IST
Share
ఈ నెల ప్రారంభంలో జీవికా నిధి క్రెడిట్ కోపరేటివ్ సొసైటీని ప్రారంభించే అవకాశం నాకు లభించింది..
ఈ బలం తోడుగా ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ మరింత విజయవంతమవుతుంది
ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనతో
మరింత బలోపేతం కానున్న కేంద్ర ప్రభుత్వ లఖ్పతి దీదీ ప్రచారం
సమాజంలోని ఇతర వర్గాలకూ మహిళా పథకాల ప్రయోజనాలు
ఉజ్వల యోజన పరివర్తన ప్రభావాన్ని ప్రపంచం గుర్తించిందన్న ప్రధాని
ప్రజలందరికీ శుభాకాంక్షలు!
ఈ నవరాత్రి పర్వదిన సమయాన ఇవాళ బీహార్ రాష్ట్ర నారీశక్తి ఆనందంలో పాలుపంచుకునే అదృష్టం నాకు దక్కింది. ఇక్కడ టీవీ తెరపై లక్షలాదిగా తల్లులు..చెల్లెమ్మలు నాకు కనిపిస్తున్నారు. ఈ పండుగ వేళ మీ ఆశీస్సులే మాకు ఎనలేని ఉత్సాహాన్నిస్తాయి. ఇందుకుగాను మీకందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను. రాష్ట్రంలో “ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం” నేటి నుంచి అమలులోకి వచ్చింది. నాకు లభించిన సమాచారం ప్రకారం... ఇప్పటికే 75 లక్షల మంది అక్కచెల్లెళ్లు ఈ పథకంలో చేరగా, ఇప్పుడు వారందరి బ్యాంకు ఖాతాలకు ఏకకాలంలో తలా రూ.10,000 వంతున నగదు జమ చేశారు.
మిత్రులారా!
ఈ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో నా ఆలోచన రెండు అంశాలపై కేంద్రీకృతమైంది. మొదటిది... శ్రీ నితీష్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లకు ప్రయోజనం కల్పిస్తూ కీలక చర్యలు చేపట్టింది. ఒక సోదరి లేదా కుమార్తె ఉపాధి లేదా స్వయం ఉపాధి పొందినప్పుడు వారి కలలు కొత్త రెక్కలు తొడుక్కుంటాయి... సమాజంలో వారికి గౌరవం కూడా పెరుగుతుంది. ఇక రెండో అంశం... మీరు 11 ఏళ్ల కిందట నన్ను ‘ప్రధాన సేవకుడు’గా ఎంచుకున్నారు. అప్పుడు జన్ధన్ పథకంపై మేం ప్రతినబూని ఉండకపోతే... 30 కోట్ల మందికిపైగా అక్కచెల్లెళ్లు బ్యాంకు ఖాతాలు తెరిచి ఉండకపోతే.. ఈ ఖాతాలను మీ మొబైల్-ఆధార్తో అనుసంధానించి ఉండకపోతే, ఈ రోజున మీ ఖాతాలకు నేరుగా ఇంత డబ్బు పంపగలిగే వాళ్లం కాదు. కచ్చితంగా ఇది సాధ్యమయ్యేది కాదు! గతంలో ఒక పార్టీ పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఏలినపుడు ప్రజాధనం స్వాహా గురించి సాక్షాత్తూ ప్రధానమంత్రే వ్యాఖ్యానించారు. తాము ఢిల్లీ నుంచి ఒక రూపాయి విడుదల చేస్తే, ప్రజలకు చేరుతున్నది కేవలం 15 పైసలు మాత్రమేనని స్వయంగా వెల్లడించారు. మిగిలిన 85 పైసలు దళారుల ‘హస్త’గతం అయ్యేవని కూడా ఆయన చెప్పారు. కానీ, ఈ రోజున మేం పంపిన డబ్బు (రూ.10వేలు) పూర్తిగా మీ ఖాతాలో జమ అవుతుంది. ఎవరూ ఒక్క పైసా కూడా స్వాహా చేయలేరు... మరి ఇంతకుముందు దళారులు ఎంతగా దోచుకున్నారో... మీకెంతటి అన్యాయం చేశారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
మిత్రులారా!
ఒక సహోదరి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండటం కోసం ఒక సోదరుడు శక్తివంచన లేకుండా శ్రమించగలడు. ఆమె కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటే ఎంతో సంతోషిస్తాడు. అయితే, ఇప్పుడు మీ సౌభాగ్యం, ఆత్మగౌరవం దిశగా మీ సేవలో ఇద్దరు సోదరులు... నరేంద్ర, నితీష్ కలసికట్టుగా కృషి చేస్తున్నారు. నేటి కార్యక్రమమే ఇందుకు తిరుగులేని నిదర్శనం.
అమ్మలు.. చెల్లెమ్మల్లారా!
ఈ పథకం గురించి విన్నపుడు, అందులోని దూరదృష్టి నన్నెంతో ఆకట్టుకుంది. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు దీనిద్వారా కచ్చితంగా లబ్ధి చేకూరుతుంది. ఆరంభ సాయంగా అందే రూ.10,000 సొమ్మును స్వయం ఉపాధికి.. వీలైతే మరికొందరికి ఉపాధినిచ్చేందుకు సద్వినియోగం చేస్తే మరింత ప్రోత్సాహం లభిస్తుంది. అంటే- ఏదైనా వ్యాపారం ప్రారంభించడం లేదా తమ చేతివృత్తి పరిధిని విస్తరించడం వంటివి విజయవంతంగా కొనసాగిస్తే రూ.2 లక్షల దాకా అదనపు ఆర్థిక సహాయం అందుతుంది. ఇలా లభించే ఆర్థిక సహాయాన్ని కార్పొరేట్ ప్రపంచంలో ‘బీజ ధనం’ (సీడ్ మనీ) అంటారు. కాబట్టి, దీని గురించి మీరంతా బాగా ఆలోచించండి... ఇది మీకు అందుబాటులోకి రావడం ఎంత కీలక విజయమో గుర్తించండి. ఈ పథకం చేయూతతో బీహార్లోని అక్కచెల్లెళ్లు కిరాణా, వంట పాత్రలు, సౌందర్య సాధనాలు, బొమ్మలు, స్టేషనరీ వంటి చిన్న దుకాణాల రూపంలో సొంత వ్యాపారం ప్రారంభించగలరు. అంతేకాకుండా ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపల పెంపకం వంటి కార్యకలాపాలు చేపట్టవచ్చు. అయితే, ఇలాంటి అనేక వ్యాపారాలలో ముందంజ వేయాలంటే కొంత శిక్షణ కూడా అవసరం. ఈ నేపథ్యంలో మీకు డబ్బు మాత్రమే అందిందని, దీనితో ఇదంతా ఎలా చేయగలమని మీరు ఆందోళన పడవచ్చు. అయితే, మీరు ఏ పని.. ఎలా చేయాలో శిక్షణ కూడా ఇస్తారు. ఇందుకోసం ‘జీవిక’ స్వయం సహాయ సంఘం వంటి అద్భుత, సుస్థిర వ్యవస్థ కింద బీహార్లో ఇప్పటికే దాదాపు 11 లక్షల బృందాలు కృషి చేస్తున్నాయి. ఈ నెల మొదట్లోనే ‘జీవికా నిధి సఖ్ సహకారి సంఘ్’ (క్రెడిట్ కో-ఆపరేటివ్ యూనియన్)ను కూడా ప్రారంభించే అవకాశం నాకు లభించింది. ఇకపై ఈ వ్యవస్థ బలం ‘ముఖ్యమంతి మహిళా ఉపాధి పథకంతో ముడిపడి ఉంటుంది. అంటే- ఈ పథకం బీహార్ రాష్ట్రంలో నలుమూలలా, ప్రతి కుటుంబ స్థాయిలో ప్రభావశీల పాత్ర పోషిస్తుంది.
మిత్రులారా!
ఈ పథకం ‘లక్షాధికారి సోదరి’ (లఖ్పతి దీదీ) కార్యక్రమానికీ నవ్యోత్తేజమిచ్చింది. దేశంలో 3 కోట్ల మందిని ‘లక్షాధికారి సోదరి’గా తీర్చిదిద్దాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే 2 కోట్ల మందికి పైగా లక్షాధికారులయ్యారు. నేనిప్పుడు చెబుతున్నది గ్రామీణ మహిళల గురించే... వారి కృషితో కుటుంబాలు, గ్రామాలు సహా సమాజమే మారిపోయింది. ఈ విధంగా లక్షాధికారులైన మహిళలు బీహార్లోనూ ఎందరో ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని రెండు ఇంజిన్ల ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న తీరు చూస్తే- దేశంలో ‘లక్షాధికారి సోదరి’ స్థాయి సాధించిన వారి సంఖ్య బీహార్లోనే ఎక్కువగా నమోదయ్యే రోజు ఎంతో దూరం లేదని నా గట్టి నమ్మకం.
మిత్రులారా!
మరోవైపు ఉపాధి, స్వయం ఉపాధిని పెంచే ‘ముద్ర’ యోజనతోపాటు ‘డ్రోన్ సోదరి, బీమా సోదరి, బ్యాంకు సోదరి’ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా అమలులో ఉన్నాయి. మేమివాళ ఒకే ఒక లక్ష్యంతో ముందడుగు వేస్తున్నాం... అదేమిటంటే- మీ కలలు ఫలించేలా మీకు మరిన్ని అవకాశాలు అందిరావాలి... మీ కుటుంబం-పిల్లల ఉజ్వల భవిష్యత్తుపై మీ స్వప్నాలు సాకారం చేయగల గరిష్ఠ అవకాశాలు లభించాలన్నదే!
మిత్రులారా!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో అక్కచెల్లెళ్లందరికీ ఇవాళ కొత్త రంగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. మన కుటుంబాల ఆడపిల్లలు సైన్యంలో, పోలీసు శాఖలో పెద్ద సంఖ్యలోనే చేరుతున్నారు. ఏకంగా కదనరంగంలో యుద్ధవిమానాలను కూడా వారు నడుపుతుండటం మనందరికీ గర్వకారణం.
అయితే, మిత్రులారా!
బీహార్లో ఆర్జేడీ లాంతరు బుడ్డీ ప్రభుత్వ పాలన కాలాన్ని మనం ఎన్నటికీ మరచిపోలేం. అప్పట్లో ఈ రాష్ట్రంలోని తల్లులు, అక్కచెల్లెళ్లు ఎంతటి అరాచకం, అవినీతిని భరించాల్సి వచ్చిందో నాకన్నా మీకే బాగా తెలుసు. రాష్ట్రంలోని ప్రధాన రహదారులు శిథిలావస్థలో ఉండేవి... నదులు, కాలువలపై వంతెనలు ఉండేవి కావు. వాటి వల్ల ఎక్కువగా బాధపడిందీ, ఇబ్బందులు తలెత్తినప్పుడు అగచాట్లు పడేదీ కూడా మన తల్లులు, అక్కచెల్లెళ్లేనన్నది మనందరికీ తెలిసిన నిజం. ఇక వరదల సమయంలో పరిస్థితులు ఎంత దిగజారాయో కూడా మనకు తెలుసు. గర్భిణులు సకాలంలో ఆస్పత్రికి చేరుకునే పరిస్థితి ఉండేది కాదు. ప్రాణాపాయ స్థితిలో వారికి సకాలంలో, సరైన చికిత్స లభించని రోజులవి. వారి నుంచి వారసత్వంగా వచ్చిన ఈ సంక్లిష్ట పరిస్థితులను సరిదిద్దడానికి మా ప్రభుత్వం రాత్రింబవళ్లు శ్రమించింది. ఇప్పటికీ పీడిస్తున్న ఆనాటి సమస్యల నుంచి మీరంతా విముక్తులు కావాలన్న ఆకాంక్ష మేరకు మేమెంతో కృషి చేశాం. ముఖ్యంగా రెండు ఇంజిన్ల ప్రభుత్వం వచ్చాక బీహార్లో రహదారుల నిర్మాణం మొదలు కావడం మీరు చూశారు. అనుసంధానం మెరుగుదలలో మేమెంతో కృషి చేశాం కాబట్టే, నేడు రాష్ట్ర మహిళలకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
అమ్మలు..చెల్లెమ్మల్లారా!
బీహార్లో ఇప్పడు ఒక ప్రదర్శన నిర్వహిస్తున్నారు... దీన్ని కచ్చితంగా సందర్శించాలని 30 ఏళ్లలోపు యువతరానికి.. ముఖ్యంగా యువతులకు నేను సూచిస్తున్నాను. ఈ ప్రదర్శనలో భాగంగా రాష్ట్రంలో ఒకనాటి దుస్థితిపై పాత వార్తాపత్రికల పతాక శీర్షికలను ప్రదర్శిస్తున్నారు. వాటిని ఒకసారి చదివితే, అప్పట్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో యువతకు అర్థం కాకపోవచ్చుగానీ, వారికన్నా పెద్దవాళ్లకు ఆ బాధలు ఎలాంటివో తక్షణం గుర్తుకొస్తాయి. ఆర్జేడీ ప్రభుత్వ హయాంలో భయాందోళనలు ఎలా రాజ్యమేలాయో వారి మదిలో మెదలుతుంది. ఆనాడు ఒక్క కుటుంబానికీ భద్రత ఉండేది కాదు... నక్సలైట్ల బీభత్సానికి అంతు ఉండేది కాదు. ప్రధానంగా మహిళలు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. పేదల నుంచి వైద్యులు.. ఐఏఎస్ అధికారుల దాకా ఆర్జేడీ నేతల దురాగతాలను ఆనాడు ఏ ఒక్కరూ తప్పించుకోలేకపోయారు.
మిత్రులారా!
శ్రీ నితీష్ కుమార్ నాయకత్వాన చట్టబద్ధ పాలన పునరుద్ధరణతో తల్లులు.. అక్కచెల్లెళ్లకు ఎంతో ఊరట లభించింది. బీహార్లో ఆడపిల్లలు ఇవాళ ఎలాంటి భయాందోళనలు లేకుండా వెళ్లి తమ పనులు చూసుకోగలుగుతున్నారు. ఈ మేరకు కొందరు లబ్ధిదారులతో ముచ్చటించిన సందర్భంగా నలుగురు చెల్లెళ్ల అనుభవాలను నేను విన్నాను. ఈ మేరకు రంజిత, రీటా దేవి, నూర్జహాన్ ఖాతూన్, పుతుల్ దేవి ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడారు. శ్రీ నితీష్ నేతృత్వంలోని ప్రభుత్వం రాకముందు పరిస్థితి ఇలా ఉండేది కాదు... రాత్రి వేళ ఆలస్యంగా ఇంటికి రావాల్సి వస్తే భయంతో వణికిపోయే దుస్థితి ఉండేది. అయితే, నేను బీహార్ వచ్చినప్పుడల్లా పెద్ద సంఖ్యలో మహిళా పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో కనిపించడం నాకెంతో సంతృప్తినిస్తోంది. కాబట్టి, బీహార్ మళ్లీ ఆనాటి అంధకార యుగంలోకి వెళ్లకుండా చూస్తామని ప్రతినబూనాల్సిన సమష్టి బాధ్యత మనదే. మన భావితరం భవిష్యత్తు విధ్వంసం పాలుకాకుండా చూసుకోగల మార్గం ఇదొక్కటేనని గ్రహించండి.
అమ్మలు..చెల్లెమ్మల్లారా!
ఏ ప్రభుత్వమైనా మహిళా ప్రాధాన్యంతో ఏదైనా విధానాన్ని రూపొందిస్తే, తద్వారా వారి కుటుంబం మాత్రమేగాక సమాజంలోని ప్రతి వర్గానికీ ప్రయోజనం కలుగుతుంది. ఉదాహరణకు॥ ఉజ్వల యోజనతో దేశంలో వచ్చిన పెనుమార్పును యావత్ ప్రపంచం చూస్తోంది. గ్రామాలకు వంట గ్యాస్ కనెక్షన్ ఒకనాడు గగనకుసుమం వంటిది. నగరాల్లోనూ అధికశాతం ఈ దుస్థితి ఉండేది. నిరుపేదలైన నా తల్లులు, చెల్లెళ్లు పొగచూరిన వంటగదిలో ఉక్కిరిబిక్కిరై అనారోగ్యం బారినపడేవారు. ఊపిరితిత్తుల వ్యాధులు సర్వసాధారణం కాగా, దృష్టి మందగించడం వల్ల కూడా బాధపడేవారు. వంటింటి పొగ రోజుకు 400 సిగరెట్ల పొగ పీల్చడంతో సమానమని కొందరు నిపుణులు చెబుతుండటం ఈ సందర్భంగా గమనార్హం. ఇప్పుడు చెప్పండి... ఇలాంటి దుస్థితి ఉన్నపుడు కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి రాక ఏమవుతుంది? ఈ బాధలన్నిటి నుంచి మహిళల రక్షణ కోసమే మేం ఉజ్వల పథకాన్ని అమలులోకి తెచ్చి, ఇంటింటివీ గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నాం. దీంతో బీహార్లో కట్టెలమోతతో, కడబట్టిన మన అక్కచెల్లెళ్ల జీవితాల్లో ఇతరత్ర సమస్యలూ తక్కువేమీ కాదు. వర్షం పడితే నెమ్మెక్కిన కట్టెలు మండవు. వరదలొస్తే అవి తడవకుండా చూసుకోవడం ఒక ప్రళయం. పిల్లలు ఎన్నోసార్లు ఆకలితోనే నిద్రపోయేవారు లేదా వేయించిన బియ్యం నమిలి క్షుద్బాధ తీర్చుకునేవారు.
మిత్రులారా!
మహిళలు అనుభవించిన ఈ దురవస్థలు ఏదో కథల పుస్తకంలోనివి కావు. బీహార్లో దాదాపు ప్రతి ఒక్కరూ స్వయంగా అనుభవించిన కష్టనష్టాలివి. అయితే, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలు కేంద్రకంగా విధానాలు, పథకాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా పరిస్థితుల్లో మార్పు మొదలైంది. ఇవాళ ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ వచ్చింది... కోట్లాది అక్కచెల్లెళ్లు పొగ బెడద లేకుండా స్టవ్పై ప్రశాంతంగా వంట చేసుకుంటున్నారు. ఊపిరితిత్తుల వ్యాధి వంటి బాధలు తప్పాయి. పిల్లలు నిత్యం వేడివేడిగా భోజనం చేస్తారు. ఈ విధంగా బీహార్ వంటిళ్లలోనే కాకుండా మహిళల జీవితాల్లోనూ ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు వెలుగు తెచ్చాయి.
అమ్మలు..చెల్లెమ్మల్లారా!
మీ సమస్యలన్నిటి పరిష్కారం మా బాధ్యత. అందుకే, కరోనా మహమ్మారి కష్ట సమయంలో ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకం ప్రారంభించాం. ఏ ఇంట్లోనూ... ఏ ఒక్క బిడ్డా కాలే కడుపుతో నిద్రకు దూరం కావాల్సిన దుస్థితి రాకుండా చూడాలి. ఈ లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన. మీకు ఎంతగానో చేయూతనిచ్చింది. ఆ తర్వాత కూడా దీన్ని కొనసాగించాలని మేం నిర్ణయించుకున్నాం. ఆ మేరకు నేటికీ ఈ పథకం అమలువుతుండగా, బీహార్లోని 8.5 కోట్ల మందికిపైగా పేదలు ఉచిత రేషన్ పొందుతున్నారు. ఈ పథకంతో మీకు లభించి ఉపశమనం గురించి ఒక ఉదాహరణ చెబుతాను. బీహార్లో అధికశాతం ఉప్పుడు బియ్యం వినియోగిస్తుండగా, గత ప్రభుత్వాలు పచ్చి బియ్యం పంపిణీ చేస్తుండేవి. దీంతో ఆ బియ్యాన్ని మార్కెట్లో ఉప్పుడు బియ్యంతో మహిళలు మార్పిడి చేసుకోవాల్సి వచ్చేది. అయితే, ఎంతమాత్రం నిజాయితీలేని వ్యాపారులు 20 కిలోల పచ్చి బియ్యానికి 10 కిలోల ఉప్పుడు బియ్యం మాత్రమే ఇచ్చేవారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, మేమిప్పుడు నేరుగా ఉప్పుడు బియ్యమే వారికి పంపిణీ చేస్తున్నాం.
అమ్మలు..చెల్లెమ్మల్లారా!
మన సమాజంలో మహిళల పేరిట ఆస్తి హక్కు సంప్రదాయం లేదు. ఇల్లు, దుకాణం, భూమి, కారు, స్కూటర్ సహా ఏదైనా పురుషుల పేరిటే ఉంటుంది. అయితే, ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’కు శ్రీకారం చుట్టిన సందర్భంగా తల్లులు.. చెల్లెమ్మలు ఆ ఇళ్లకు యజమానులయ్యేలా నేనొక నిబంధన విధించాను. ఈ క్రమంలో బీహార్లో నిర్మించిన 50 లక్షలకుపైగా ఇళ్లలో అధికశాతం యాజమాన్య హక్కు మహిళలకే కల్పించాం... మీ ఇంటికి మీరే నిజమైన యజమానులు!
మిత్రులారా!
ఒక సోదరి ఆరోగ్యం క్షీణిస్తే, మొత్తం కుటుంబంపై ఆ ప్రభావం పడుతుందని మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ, తమ అనారోగ్య సమస్యలను బయటపెట్టేవారు కాదు. జ్వరం, కడుపునొప్పి వంటి బాధ ఎలాంటిదైనా పట్టించుకోకుండా పనిచేస్తూనే ఉంటారు. ఎందుకంటారు? కుటుంబంపై ఆర్థిక భారం పడతుందనే భయంతోనే! అయితే, ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ ద్వారా ఈ మీ కుమారుడు... మీ సోదరుడు మీ ఆందోళనకు ఊరటనిచ్చాడు. ఆ మేరకు బీహార్లో లక్షలాది మహిళలకు ఇప్పుడు ఏటా రూ.5 లక్షల విలువైన ఉచిత చికిత్స సదుపాయం లభిస్తోంది. ఇక గర్భిణులు కోసం అమలు చేస్తున్న ‘మాతృ వందన యోజన’ కింద ఆ తల్లుల ఖాతాకు నేరుగా డబ్బు వెళ్తోంది. దీంతో 9 నెలల కాలంలో ఆమెకు పోషకాహారం లభిస్తుంది.. తద్వారా గర్భస్థ శిశువు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంతేగాక ప్రసవ సమయంలో ఏ సమస్యా లేకుండా తల్లీబిడ్డలు క్షేమంగా ఉంటారు.
అమ్మలు..చెల్లెమ్మల్లారా!
మీ ఆరోగ్య పరిరక్షణే మాకు పరమావధి. అందుకే, ఈ నెల 17న విశ్వకర్మ జయంతి నాటినుంచీ “ఆరోగ్య మహిళ... సాధికార కుటుంబం’ (స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్) కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనికింద గ్రామాలు, పట్టణాల్లో 4.25 లక్షలకుపైగా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. రక్తహీనత, రక్తపోటు, మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులకు సంబంధించి ఉచిత పరీక్షలు చేపడుతున్నారు. ఇప్పటిదాకా కోటి మందికిపైగా మహిళలు ఈ పరీక్షలు చేయించుకున్న నేపథ్యంలో బీహార్లోని మహిళలు కూడా ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. పరీక్షలు చేయించుకోవడంపై కొందరు సందిగ్ధంలో ఉన్నారు... కానీ, వ్యాధిని త్వరగా గుర్తించి, సకాలంలో చికిత్స చేయించుకోవడం వారికే కాకుండా కుటుంబం మొత్తానికీ ప్రయోజనకరం.
మిత్రులారా!
ఇది పండుగల సమయం... దసరా, దీపావళి, ఛత్ పూజ వంటివి వస్తున్నాయి. ఈ వరుస వేడుకల నేపథ్యంలో మన అక్కచెల్లెళ్లు డబ్బు పొదుపు గురించి నిరంతరం ఆలోచిస్తూంటారు. అందుకే, ఎన్డీఏ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుని, ఈ నెల 22న నవరాత్రి వేడుకల తొలి రోజునుంచీ వస్తుసేవల పన్నును తగ్గించింది. ఇప్పుడు పేస్టు, సబ్బు, షాంపూ, నెయ్యి, ఆహార పదార్థాలు వగైరా రోజువారీ వస్తువులన్నీ చౌకగా లభిస్తున్నాయి. పిల్లల చదువుకు ఉపయోగపడే రాత సామగ్రి సహా దుస్తులు, బూట్లు వంటి వస్తువుల ధరలు కూడా తగ్గాయి. కుటుంబ, వంటగది బడ్జెట్ నిర్వహణలో ఇది మహిళలకు ఎంతో ఊరటనిచ్చే అంశం. ఆర్థిక భారాన్ని తగ్గించి, ఉపశమనం ఇవ్వడం ద్వారా వారు ఆనందంతో కళకళలాడేలా చూడటం తన బాధ్యతగా మా రెండు ఇంజిన్ల ప్రభుత్వం భావించింది.
మిత్రులారా!
అవకాశం లభించిన ప్రతి సందర్భంలోనూ బీహార్ మహిళలు దృఢ సంకల్పంతో, ధైర్యం ప్రదర్శిస్తూ మార్పును తెస్తున్నారు. మహిళలు పురోగమిస్తే యావత్ సమాజం ముందడుగు వేస్తుందని మీరు నిరూపించారు. ఈ నేపథ్యంలో ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ ప్రయోజనం అందుకుంటున్న బీహార్ మహిళలకు నా అభినందనలు. మీకందరికీ నా శుభాకాంక్షలు... అనేకానేక ధన్యవాదాలు.
The government places great emphasis on bringing a 'technology culture' to agriculture: PM Modi
March 06, 2026
Share
This year’s Union Budget gives a strong push to agriculture and rural transformation : PM
Government has continuously strengthened the agriculture sector ,major efforts have reduced the risks for farmers and provided them with basic economic security: PM
If we scale high-value agriculture together, it will transform agriculture into a globally competitive sector: PM
As export-oriented production increases, employment will be created in rural areas through processing and value addition: PM
Fisheries can become a major platform for export growth, a high-value, high-impact sector of rural prosperity: PM
The government is developing digital public infrastructure for agriculture through AgriStack: PM
Technology delivers results when systems adopt it, institutions integrate it, and entrepreneurs build innovations on it: PM
नमस्कार !
बजट वेबिनार सीरीज के तीसरे वेबिनार में, मैं आप सभी का अभिनंदन करता हूं। इससे पहले, टेक्नोलॉजी, रिफॉर्म्स और इकोनॉमिक ग्रोथ जैसे अहम विषयों पर दो वेबिनार हो चुके हैं। आज, Rural Economy और Agriculture जैसे अहम सेक्टर पर चर्चा हो रही है। आप सभी ने बजट निर्माण में अपने मूल्यवान सुझावों से बहुत सहयोग दिया, और आपने देखा होगा बजट में आप सबके सुझाव रिफ्लेक्ट हो रहे हैं, बहुत काम आए हैं। लेकिन अब बजट आ चुका है, अब बजट के बाद उसके full potential का लाभ देश को मिले, इस दिशा में भी आपका अनुभव, आपके सुझाव और सरल तरीके से बजट का सर्वाधिक लोगों को लाभ हो। बजट का पाई-पाई पैसा जिस हेतु से दिया गया है, उसको परिपूर्ण कैसे करें? जल्द से जल्द कैसे करें? आपके सुझाव ये वेबिनार के लिए बहुत अहम है।
साथियों,
आप सभी जानते हैं, कृषि, एग्रीकल्चर, विश्वकर्मा, ये सब हमारी अर्थव्यवस्था का मुख्य आधार है। एग्रीकल्चर, भारत की लॉन्ग टर्म डेवलपमेंट जर्नी का Strategic Pillar भी है, और इसी सोच के साथ हमारी सरकार ने कृषि सेक्टर को लगातार मजबूत किया है। करीब 10 करोड़ किसानों को 4 लाख करोड़ रुपए से अधिक की पीएम किसान सम्मान निधि मिली है। MSP में हुए Reforms से अब किसानों को डेढ़ गुना तक रिटर्न मिल रहा है। इंस्टिट्यूशनल क्रेडिट कवरेज 75 प्रतिशत से अधिक हो चुका है। पीएम फसल बीमा योजना के तहत लगभग 2 लाख करोड़ रुपए के क्लेम सेटल किए गए हैं। ऐसे अनेक प्रयासों से किसानों का रिस्क बहुत कम हुआ है, और उन्हें एक बेसिक इकोनॉमिक सिक्योरिटी मिली है। इससे कृषि क्षेत्र का आत्मविश्वास भी बढ़ा है। आज खाद्यान्न और दालों से लेकर तिलहन तक देश रिकॉर्ड उत्पादन कर रहा है। लेकिन अब, जब 21वीं सदी का दूसरा क्वार्टर शुरू हो चुका है, 25 साल बीत चुके हैं, तब कृषि क्षेत्र को नई ऊर्जा से भरना भी उतना ही आवश्यक है। इस साल के बजट में इस दिशा में नए प्रयास हुए हैं। मुझे विश्वास है, इस वेबिनार में आप सभी के बीच हुई चर्चा, इससे निकले सुझाव, बजट प्रावधानों को जल्द से जल्द जमीन पर उतारने में मदद करेंगे।
साथियों,
आज दुनिया के बाजार खुल रहे हैं, ग्लोबल डिमांड बदल रही है। इस वेबिनार में अपनी खेती को एक्सपोर्ट ओरिएंटेड बनाने पर भी ज्यादा से ज्यादा चर्चा आवश्य़क है। हमारे पास Diverse Climate है, हमें इसका पूरा फायदा उठाना है। एग्रो क्लाइमेटिक जोन, उस विषय में हम बहुत समृद्ध है। इस साल का बजट इन सब बातों के लिए अनगिनत नए अवसर देने वाला बजट है। प्रोडक्टिविटी बढ़ाने की दिशा तय करता है, और एक्सपोर्ट स्ट्रेंथ को बढ़ावा देता है। बजट में हमने high value agriculture पर फोकस किया है। नारियल, काजू, कोको, चंदन, ऐसे उत्पादों के regional-specific promotion की बात कही है, और आपको मालूम है, दक्षिण के हमारे जो राज्य हैं खासकर केरल है, तमिलनाडु है, नारियल की पैदावार बहुत करते हैं। लेकिन अब वो क्रॉप, वो सारे पेड़ इतने पुराने हो चुके हैं कि उसकी वो क्षमता नहीं रही है। केरल के किसानों को अतिरिक्त लाभ हो, तमिलनाडु के किसानों को अतिरिक्त लाभ हो। इसलिए इस बार कोकोनट पर एक विशेष बल दिया गया है, जिसका फायदा आने वाले दिनों में हमारे इन किसानों को मिलेगा।
साथियों,
नॉर्थ ईस्ट की तरफ देखें, अगरवुड बहुत कम लोगों को मालूम है, जो ये अगरबत्ती शब्द है ना, वो अगरवुड से आया हुआ है। अब हिमालयन राज्यों में टेम्परेट नट क्रॉप्स, और इन्हें बढ़ावा देने का प्रस्ताव बजट में रखा गया है। जब एक्सपोर्ट ओरिएंटेड प्रोडक्शन बढ़ेगा, तो ग्रामीण क्षेत्रों में प्रोसेसिंग और वैल्यू एडिशन के जरिए रोजगार सृजन होगा। इस दिशा में एक coordinated action कैसे हो, आप सभी स्टेकहोल्डर्स मिलकर जरूर मंथन करें। अगर हम मिलकर High Value Agriculture को स्केल करते हैं, तो ये एग्रीकल्चर को ग्लोबली कंपेटिटिव सेक्टर में बदल सकता है। एग्री experts, इंडस्ट्री और किसान एक साथ कैसे आएं, किसानों को ग्लोबल मार्केट से जोड़ने के लिए किस तरह से गोल्स सेट किए जाएं, क्वालिटी, ब्रांडिंग और स्टैंडर्ड्स, ऐसे हर पहलू, इन सबको कैसे प्रमोट किया जाए, इन सारे विषयों पर चर्चा, इस वेबिनार को, इसके महत्व को बढ़ाएंगे। मैं एक और बात आपसे कहना चाहूंगा। आज दुनिया हेल्थ के संबंध में ज्यादा कॉनशियस है। होलिस्टिक हेल्थ केयर और उसमें ऑर्गेनिक डाइट, ऑर्गेनिक फूड, इस पर बहुत रुचि है। भारत में हमें केमिकल फ्री खेती पर बल देना ही होगा, हमें नेचुरल फार्मिंग पर बल देना होगा। नेचुरल फार्मिंग से, केमिकल फ्री प्रोडक्ट से दुनिया के बाजार तक पहुंचने में हमारे लिए एक राजमार्ग बन जाता है। उसके लिए सर्टिफिकेशन, लेबोरेटरी ये सारी व्यवस्थाएं सरकार सोच रही है। लेकिन आप लोग इसमें भी जरूर अपने विचार रखिए।
साथियों,
एक्सपोर्ट बढ़ाने में एक बहुत बड़ा फैक्टर फिशरीज सेक्टर का पोटेंशियल भी है। भारत दुनिया का दूसरा सबसे बड़ा मछली उत्पादक देश भी है। आज हमारे अलग-अलग तरह के जलाशय, तालाब, ये सब मिलाकर लगभग 4 लाख टन मछली उत्पादन होता है। जबकि इसमें 20 लाख टन अतिरिक्त उत्पादन की संभावना मौजूद है। अब विचार कीजिए आप, 4 लाख टन से हम अतिरिक्त 20 लाख टन जोड़ दें, तो हमारे गरीब मछुआरे भाई-बहन हैं, उनकी जिंदगी कैसी बदल जाएगी। हमारे पास Rural Income को डायवर्सिफाई करने का अवसर है। फिशरीज एक्सपोर्ट ग्रोथ का बड़ा प्लेटफॉर्म बन सकता है, दुनिया में इसकी मांग है। इस वेबिनार से अगर बहुत ही प्रैक्टिकल सुझाव निकलते हैं, तो कैसे रिज़रवॉयर, उसकी पोटेंशियल की सटीक मैपिंग की जाए, कैसे क्लस्टर प्लानिंग की जाए, कैसे फिशरीज डिपार्टमेंट और लोकल कम्युनिटी के बीच मजबूत कोऑर्डिनेशन हो, तो बहुत ही उत्तम होगा। हैचरी, फीड, प्रोसेसिंग, ब्रांडिंग, एक्सपोर्ट, उसके लिए आवश्यक लॉजिस्टिक्स, हर स्तर पर हमें नए बिजनेस मॉडल विकसित करने ही होंगे। ये Rural Prosperity, ग्रामीण समृद्धि के लिए, वहां की हाई वैल्यू, हाई इम्पैक्ट सेक्टर के रूप में परिवर्तित करने का एक अवसर है हमारे लिए, और इस दिशा में भी हम सबको मिलकर काम करना है, और आप आज जो मंथन करेंगे, उसके लिए, उस कार्य के लिए रास्ता बनेगा।
साथियों,
पशुपालन सेक्टर, ग्रामीण इकोनॉमी का हाई ग्रोथ पिलर है। भारत आज दुनिया का सबसे बड़ा मिल्क प्रोड्यूसर है, Egg प्रोडक्शन में हम दूसरे स्थान पर है। हमें इसे और आगे ले जाने के लिए ब्रीडिंग क्वालिटी, डिजीज प्रिवेंशन और साइंटिफिक मैनेजमेंट पर फोकस करना होगा। एक और अहम विषय पशुधन के स्वास्थ्य का भी है। मैं जब One Earth One Health की बात करता हूं, तो उसमें पौधा हो या पशु, सबके स्वास्थ्य की बात शामिल है। भारत अब वैक्सीन उत्पादन में आत्मनिर्भर है। फुट एंड माउथ डिजीज, उससे पशुओं को बचाने के लिए सवा सौ करोड़ से अधिक डोज पशुओं को लगाई जा चुकी है। राष्ट्रीय गोकुल मिशन के तहत टेक्नोलॉजी का विस्तार किया जा रहा है। हमारी सरकार में अब पशुपालन क्षेत्र के किसानों को किसान क्रेडिट कार्ड का भी लाभ मिल रहा है। निजी निवेश को प्रोत्साहित करने के लिए एनिमल हसबेंड्री इंफ्रास्ट्रक्चर डेवलपमेंट फंड की शुरुआत भी की गई है, और आपको ये पता है हम लोगों ने गोबरधन योजना लागू की है। गांव के पशुओं के निकलने वाला मलमूत्र है, गांव का जो वेस्ट है, कूड़ा-कचरा है। हम गोबरधन योजना में इसका उपयोग करके गांव भी स्वच्छ रख सकते हैं, दूध से आय होती है, तो गोबर से भी आय हो सकती है, और एनर्जी सिक्योरिटी की दिशा में गैस सप्लाई में भी ये गोबरधन बहुत बड़ा योगदान दे सकता है। ये मल्टीपर्पज बेनिफिट वाला काम है, और गांव के लिए बहुत उपयोगी है। मैं चाहूंगा कि सभी राज्य सरकारें इसको प्राथमिकता दें, इसको आगे बढ़ाएं।
साथियों,
हमने पिछले अनुभवों से समझा है कि केवल एक ही फसल पर टिके रहना किसान के लिए जोखिम भरा है। इससे आय के विकल्प भी सीमित हो जाते हैं। इसलिए, हम crop diversification पर फोकस कर रहे हैं। इसके अलावा, National Mission on Edible Oils And Pulses, National Mission on Natural Farming, ये सभी एग्रीकल्चर सेक्टर की ताकत बढ़ा रहे हैं।
साथियों,
आप भी जानते हैं एग्रीकल्चर स्टेट सब्जेक्ट है, राज्यों का भी एक बड़ा एग्रीकल्चर बजट होता है, हमें राज्यों को भी निरंतर प्रेरित करना है कि वो अपना दायित्व निभाने में, हम उनको कैसे मदद दें, हमारे सुझाव उनको कैसे काम आएं। राज्य का भी एक-एक पैसा जो गांव के लिए, किसान के लिए तय हुआ है, वो सही उपयोग हो। हमें बजट प्रावधानों को जिला स्तर तक मजबूत करना होगा। तभी नई पॉलिसीज का ज्यादा से ज्यादा फायदा उठाया जा सकता है।
साथियों,
ये टेक्नोलॉजी की सदी है और सरकार का बहुत जोर एग्रीकल्चर में टेक्नोलॉजी कल्चर लाने पर भी है। आज e-NAM के माध्यम से मार्केट एक्सेस का डेमोक्रेटाइजेशन हुआ है। सरकार एग्रीस्टैक के जरिए, एग्रीकल्चर के लिए डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर विकसित कर रही है। इसके तहत डिजिटल पहचान, यानी किसान आईडी बनाई जा रही है। अब तक लगभग 9 करोड़ किसानों की किसान आईडी बन चुकी है, और लगभग 30 करोड़ भूमि पार्सलों का डिजिटल सर्वे किया गया है। भारत-विस्तार जैसे AI आधारित प्लेटफॉर्म, रिसर्च इंस्टीट्यूशंस और किसानों के बीच की दूरी कम कर रहे हैं।
लेकिन साथियों,
टेक्नोलॉजी तभी परिणाम देती है, जब सिस्टम उसे अपनाएं, संस्थाएं उसे इंटीग्रेट करें और एंटरप्रेन्योर्स उस पर इनोवेशन खड़ा करें। इस वेबिनार में आपको इससे जुड़े सुझावों को मजबूती से सामने लाना होगा। हम टेक्नोलॉजी को कैसे सही तरीके से इंटीग्रेट करें, इस दिशा में इस वेबिनार से निकले सुझावों की बहुत बड़ी भूमिका होगी।
साथियों,
हमारी सरकार ग्रामीण समृद्धि के निर्माण के लिए प्रतिबद्ध है। प्रधानमंत्री आवास योजना, स्वामित्व योजना, पीएम ग्रामीण सड़क योजना, स्वयं सहायता समूहों को आर्थिक मदद, इसने रूरल इकोनॉमी को निरंतर मजबूत किया है। लखपति दीदी अभियान की सफलता को भी हमें नई ऊंचाई देनी है। अभी तक गांव की 3 करोड़ महिलाओं को लखपति दीदी बनाने में हम सफल हो चुके हैं। अब 2029 तक, 2029 तक 3 करोड़ में और 3 करोड़ जोड़ना है, और 3 करोड़ और लखपति दीदियां बनाने का लक्ष्य तय किया गया है। ये लक्ष्य और तेजी से कैसे प्राप्त किया जाए, इसे लेकर भी आपके सुझाव महत्वपूर्ण होंगे।
साथियों,
देश में स्टोरेज का बहुत बड़ा अभियान चल रहा है। लाखों गोदाम बनाए जा रहे हैं। स्टोरेज के अलावा एग्री एंटरप्रेन्योर्स प्रोसेसिंग, सप्लाई चैन, एग्री-टेक, एग्री-फिनटेक, एक्सपोर्ट, इन सब में इनोवेशन और निवेश बढ़ाना आज समय की मांग है। मुझे विश्वास है आज जो आप मंथन करेंगे, उससे निकले अमृत से ग्रामीण अर्थव्यवस्था को नई ऊर्जा मिलेगी। आप सबको इस वेबिनार के लिए मेरी बहुत-बहुत शुभकामनाएं हैं, और मुझे पूरा विश्वास है कि जमीन से जुड़े हुए विचार, जड़ों से जुड़े हुए विचार, इस बजट को सफल बनाने के लिए, गांव-गांव तक पहुंचाने के लिए बहुत काम आएंगे। आपको बहुत-बहुत शुभकामनाएं।