“The people of India have reposed faith in our government’s track record over the past 10 years and have given us the opportunity to continue good governance for the third time”
“People saw our commitment to serving the citizens with the belief of ‘Jan Seva hi Prabhu Seva’, i.e. Service to humanity is service to God”
“People rewarded the zero tolerance for corruption”
“We worked for Santushtikaran instead of Tushtikaran - for saturation rather than appeasement”
“Belief, expectations and trust of 140 crore citizens become a driving force for development”
“Nation First is our only goal”
“When a country develops, a strong foundation is laid to fulfill the dreams of future generations”
“In the third term, we will work at three times the speed, apply three times the energy and deliver three times the results”

గౌరవనీయులైన సభాపతి గారు,

రాష్ట్రపతి ప్రసంగానికి నా కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఇక్కడకు వచ్చాను.

గౌరవనీయులైన సభాపతి గారు,

మన గౌరవనీయ రాష్ట్రపతి తన ప్రసంగంలో అభివృద్ధి చెందిన భారతదేశ భావనను వివరించారు. గౌరవనీయులైన రాష్ట్రపతి ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. గౌరవనీయులైన రాష్ట్రపతి మనందరికీ మరియు దేశానికి అందించిన మార్గదర్శకానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

గౌరవనీయులైన సభాపతి గారు,

రాష్ట్రపతి ప్రసంగంపై నిన్న, నేడు పలువురు గౌరవ సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నేను, ముఖ్యంగా మొదటిసారి ఎంపీలుగా మన మధ్యకు వచ్చిన, పార్లమెంటు లోని అన్ని నియమాలను పాటిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచిన గౌరవనీయులైన సహచరుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నాను. అనుభవజ్ఞులైన పార్లమెంటేరియన్ లాగా వారి ప్రవర్తన ఉంది. తొలిసారి ఇక్కడికి వచ్చినప్పటికీ సభా గౌరవాన్ని ఇనుమడింపజేసి తమ అభిప్రాయాలతో ఈ చర్చను మరింత విలువైనదిగా చేశారు.

గౌరవనీయులైన సభాపతి గారు,

విజయవంతమైన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం ద్వారా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రచారమని దేశం ప్రపంచానికి చూపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రచారంలో దేశ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు.

గౌరవనీయులైన సభాపతి గారు,

నిరంతరం అసత్యాలు ప్రచారం చేసినా, తాము ఘోర పరాజయాన్ని చవిచూశామని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ మూడోసారి దేశానికి సేవ చేసే అవకాశాన్ని భారత ప్రజలు మాకు ఇచ్చారనే కొందరి బాధను నేను అర్థం చేసుకోగలను సభాపతి గారు . ప్రజాస్వామ్య ప్రపంచానికి ఇది చాలా ముఖ్యమైన సంఘటన, ఇది చాలా గర్వించదగిన సంఘటన.

 

గౌరవనీయులైన సభాపతి గారు,

ప్రతి పరీక్షలోనూ మమ్మల్ని పరీక్షించిన తర్వాత దేశ ప్రజలు ఈ తీర్పును ఇచ్చారు. పదేళ్ల మా ట్రాక్ రికార్డును ప్రజలు చూశారు. పేదల సంక్షేమం కోసం అంకితభావంతో చేసిన కృషి వల్ల ప్రజాసేవే ప్రథమ సేవ అనే నినాదంతో చేసిన కృషి వల్ల పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడడం ప్రజలు చూశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి కాలంలో ఇంత తక్కువ  సమయంలో ఇంతమందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి చేసిన ఈ విజయవంతమైన ప్రయత్నం ఈ ఎన్నికల్లో మాకు ఆశీర్వాదం గా మారింది.

గౌరవనీయ సభాపతి గారు,

2014లో తొలిసారి గెలిచినప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా అవినీతిని సహించేది లేదని చెప్పాం. అవినీతి దేశాన్ని చెద పురుగుల్లా తుడిచిపెట్టేసింది. అవినీతి కారణంగా ఇబ్బందులు పడుతున్న దేశంలోని సామాన్యులకు ఈ రోజు మా ప్రభుత్వం ఒక సందేశం ఇచ్చినందుకు నేను గర్వపడుతున్నాను.  అటువంటి పరిస్థితిలో, అవినీతి పట్ల మా జీరో టాలరెన్స్ విధానానికి, ఈ రోజు దేశం మమ్మల్ని ఆశీర్వదించింది.

గౌరవనీయ సభాపతి గారు,

నేడు ప్రపంచవ్యాప్తంగా భారత్ ఖ్యాతి పెరిగింది. నేడు, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడుతోంది మరియు ప్రపంచం భారతదేశం వైపు చూస్తున్న తీరుకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు.

గౌరవనీయ సభాపతి గారు,

మా ఏకైక లక్ష్యం దేశం ప్రథమం , దేశమే సర్వ ప్రథమం అని దేశ ప్రజలు చూశారు. మన ప్రతి విధానం, మన ప్రతి నిర్ణయం, మన ప్రతి చర్య అదే కొలమానాన్ని కలిగి ఉంది, భారతదేశమే తొలి ప్రాధాన్యం అనే స్ఫూర్తితో, మేము దేశంలో అవసరమైన సంస్కరణలను కొనసాగించాము. గత 10 సంవత్సరాలలో, మా ప్రభుత్వం 'సబ్కా సాథ్ సబ్కా వికాస్' మంత్రంతో దేశంలోని ప్రజలందరి సంక్షేమం కోసం నిరంతరం ప్రయత్నిస్తోంది.

గౌరవనీయ సభాపతి గారు,

భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం, అన్ని మతాల సమానత్వ భావన. స్ఫూర్తిని పాటిస్తూ, దేశానికి సేవ చేస్తూ భారత రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉన్నాం.

గౌరవనీయ సభాపతి గారు,

ఈ దేశం చాలా కాలంగా బుజ్జగింపు రాజకీయాలను చూసింది. ఈ దేశం చాలా కాలంగా బుజ్జగింపు యొక్క పాలనా నమూనాను చూసింది. మొదటిసారిగా సంపూర్ణ లౌకికవాదానికి ప్రయత్నించాం, బుజ్జగింపు కాదు, సంతృప్తి. మనం సంతృప్తి గురించి మాట్లాడినప్పుడు, ఇది ప్రతి పథకం యొక్క సంతృప్తత అని అర్థం. పాలన చిట్టచివరి వ్యక్తికి చేరుతుందన్న మా భావన దీని ద్వారా నెరవేరుతుంది. మనం సంతృప్త సూత్రాన్ని అనుసరించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం లభిస్తుంది. నిజమైన లౌకికవాదం సంతృప్తత ద్వారా సాధించబడుతుంది, అందుకే దేశ ప్రజలు మమ్మల్ని మూడవ సారి ఎన్నుకొని వారి తీర్పును తెలియజేశారు.

గౌరవనీయ సభాపతి గారు,

బుజ్జగింపు ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది, అందుకే అందరికీ న్యాయం, ఎవరినీ బుజ్జగించకూడదనే సూత్రాన్ని అనుసరించాం.

గౌరవనీయ సభాపతి గారు,

మా పదేళ్ల కృషిని గమనించి, అంచనా వేసిన తర్వాత భారత ప్రజలు మమ్మల్ని ఆదరించారు.

గౌరవనీయ సభాపతి గారు,

దేశంలోని 140 కోట్ల మంది పౌరులకు సేవ చేసే అవకాశం మాకు మరోసారి లభించింది.

గౌరవనీయ సభాపతి గారు,

భారత్ ప్రజలు ఎంత పరిణతితో ఉన్నారో, ఎంత న్యాయంగా, ఉన్నతమైన ఆదర్శాలతో తమ విజ్ఞతను ఉపయోగిస్తారో ఈ ఎన్నికలు రుజువు చేశాయి. తత్ఫలితంగా, మేము మీ ముందు ఉన్నాము, మూడోసారి దేశ ప్రజలకు సేవ చేసేందుకు వినమ్రంగా సిద్ధంగా ఉన్నాం.

 

 

గౌరవనీయ సభాపతి గారు,

దేశ ప్రజలు మా విధానాలను చూశారు. ప్రజలు మా ఉద్దేశాలను, మా అంకితభావాన్ని విశ్వసించారు.

గౌరవనీయ సభాపతి గారు,

ఈ ఎన్నికల్లో గొప్ప సంకల్పంతో ప్రజల మధ్యకు వెళ్లి వారి ఆశీస్సులు తీసుకున్నాం. మా 'వికసిత్ భారత్' సంకల్పానికి ఆశీస్సులు కోరాం. సదుద్దేశంతో, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా 'వికసిత్ భారత్'ను నిర్మించాలన్న నిబద్ధతతో ప్రజల్లోకి వెళ్లాం. 'వికసిత్ భారత్' కోసం మా సంకల్పాన్ని ప్రజలు ఆమోదించి, మరోసారి దేశానికి సేవ చేసే అవకాశాన్ని మాకు ఇచ్చారు.

గౌరవనీయ సభాపతి గారు,

దేశం అభివృద్ధి చెందితే కోట్లాది ప్రజల కలలు నెరవేరుతాయి. దేశం అభివృద్ధి చెందినప్పుడు కోట్లాది మంది ప్రజల తీర్మానాలు సాకారం అవుతాయి.

గౌరవనీయ సభాపతి గారు,

దేశం అభివృద్ధి చెందితే, భవిష్యత్ తరాలకు వారి కలలను నెరవేర్చడానికి బలమైన పునాది వేయబడుతుంది.

గౌరవనీయ సభాపతి గారు,

'వికసిత్ భారత్' యొక్క ప్రత్యక్ష ప్రయోజనం మన పౌరుల గౌరవంతో పాటు వారి జీవన నాణ్యతను మెరుగుపరచడం. ఇది సహజంగానే 'వికసిత్ భారత్'తో లక్షలాది మంది పౌరుల భవితవ్యం నిర్ణయింపబడుతుంది . స్వాతంత్య్రానంతరం నా దేశంలోని సామాన్య పౌరుడు వీటి కోసం పరితపించాడు.

 

గౌరవనీయ సభాపతి గారు,

భారత్ అభివృద్ధి చెందినప్పుడు, మన గ్రామాలు మరియు నగరాల పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల ఉంది. పల్లెల జీవనం గౌరవప్రదంగా, ఉన్నతంగా మారి, అభివృద్ధికి కొత్త అవకాశాలు ఆవిర్భవిస్తాయి. మన నగరాల అభివృద్ధి కూడా 'వికసిత్ భారత్'లో ఒక అవకాశంగా మారుతుందని, ప్రపంచ అభివృద్ధి ప్రయాణంలో భారత్ నగరాలు సమానంగా నిలవాలన్నది మన కల.

గౌరవనీయ సభాపతి గారు,

'వికసిత్ భారత్' అంటే లక్షలాది మంది పౌరులకు లక్షలాది అవకాశాలు లభిస్తాయి. అనేక అవకాశాలు లభిస్తాయి, మరియు వారు వారి నైపుణ్యాలు, సామర్థ్యాలు,వనరులను బట్టి అభివృద్ధి కొత్త సరిహద్దులను చేరుకోగలరు.

 

గౌరవనీయ సభాపతి గారు,

గౌరవనీయ సభాపతి గారు,

గౌరవనీయ సభాపతి గారు,

పూర్తి అంకితభావం, నిజాయితీతో 'వికసిత్ భారత్' సంకల్పాన్ని నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని ఈ రోజు నేను మీ ద్వారా దేశప్రజలకు హామీ ఇస్తున్నాను. మన కాలపు ప్రతి క్షణం, మన శరీరంలోని ప్రతి కణం మన దేశ ప్రజల 'వికసిత్ భారత్' కలను సాకారం చేయడానికి అంకితం చేయబడతాయి. 2047 నాటికి దేశ ప్రజలకు 24 బై 7 పని చేస్తామని హామీ ఇచ్చాం. ఈ పనిని మనం తప్పకుండా పూర్తి చేస్తామని ఈ రోజు నేను ఈ సభలో పునరుద్ఘాటిస్తున్నాను.

గౌరవనీయ సభాపతి గారు,

2014 నాటి రోజులను గుర్తు చేసుకోండి. 2014 నాటి రోజులను స్మరించుకుంటే దేశ ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోయారని, దేశం నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిందని అర్థమవుతుంది. 2014కు ముందు దేశం ఎదుర్కొన్న అతి పెద్ద నష్టం పౌరుల విశ్వాసాన్ని కోల్పోవడం. నమ్మకం, ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడు ఒక వ్యక్తి, సమాజం లేదా దేశం నిలబడటం కష్టమవుతుంది. ఆ సమయంలో సామాన్యుడి పల్లవి ఏంటంటే.. ఈ దేశంలో ఏమీ చేయలేం. 2014కు ముందు 'ఈ దేశంలో ఏమీ చేయలేం' అనే ఏడు మాటలు ఎక్కడ చూసినా వినిపించాయి. ఆ మాటలు 2014కు ముందు భారత్ కు ఐడెంటిటీగా మారాయి. ప్రతిరోజూ వందల కోట్ల రూపాయల కుంభకోణాల వార్తలతో వార్తాపత్రికలు నిండిపోయాయి. పాత వాటితో పోటీ పడి కుంభకోణాలపై వార్తలు. మోసగాళ్లు చేస్తున్న కుంభకోణాల కాలం ఇది. ఢిల్లీ నుంచి పంపే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే గమ్యస్థానానికి చేరుకున్నాయన్న వాస్తవాన్ని సిగ్గులేని అంగీకారం తెలిపింది. ప్రతి రూపాయిలో 85 పైసల కుంభకోణం జరిగింది. ఈ అవినీతి యుగం దేశాన్ని నిరాశా నిస్పృహల్లోకి నెట్టింది. విధానపరమైన పక్షవాతం వచ్చింది. బంధుప్రీతి ఎంత విస్తృతంగా ఉందంటే, తమను సిఫారసు చేయడానికి ఎవరైనా లేకపోతే, తమ జీవితాలు ఇరుకున పడతాయని భావించి ఆశలు వదులుకున్నారు. ఇదీ పరిస్థితి. పేదలు ఇల్లు కావాలంటే వేలల్లో లంచాలు ఇవ్వాల్సి వచ్చేది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12

Media Coverage

Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 ఆగష్టు 2026
August 12, 2026

India Rising on Every Front: Economic Strength, Global Recognition & Self-Reliance Under PM Modi’s Vision