This budget session will be historic as it will see merger of the general and the rail budgets: PM
Hope budget session would be fruitful and all parties would debate on issues that would benefit the country: PM

పార్లమెంట్ 2017 సంవత్సర బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుండి ఆరంభం అవుతున్నాయి. ఈ సమావేశాలలో భాగంగా పార్లమెంట్ ను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ సమర్పణ లతో పాటు అనేక అంశాలపైన సమగ్ర చర్చ చోటు చేసుకోనున్నాయి.

ఇటీవలి కాలంలో రాజకీయ పక్షాలతో విడివిడిగా, సమష్టిగా చర్చలు జరిగాయి. విశాల ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశాలను నిర్మాణాత్మకమైన చర్చ కోసం వినియోగించుకోవాలి. అదే తరుణంలో, బడ్జెట్ పైన క్షుణ్ణమైన చర్చ జరగాలి.

మొట్టమొదటిసారిగా, కేంద్ర బడ్జెటును ఫిబ్రవరి 1వ తేదీ నాడు ప్రవేశపెట్టడం జరుగుతోంది. ఇంతకు ముందు కేంద్ర బడ్జెటును సాయంత్రం పూట 5 గంటలకు సమర్పించే వారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బడ్జెట్ ను సమర్పించే సమయాన్ని ఉదయం పూటకు మార్చడమైంది; బడ్జెటును పార్లమెంట్ సమావేశాలు మొదలైన వెంటనే సమర్పించారు.

మరొక కొత్త సంప్రదాయం కూడా ఈ రోజు నుండి అమలులోకి వస్తోంది. ఒక నెల ముందే బడ్జెట్ ను సమర్పిస్తున్నారు; అంతే కాకుండా, రైల్ బడ్జెటు ఇప్పుడు కేంద్ర బడ్జెటులో ఒక భాగమైంది. ఈ అంశంపై పార్లమెంట్ లో విస్తృత‌మైన‌ చర్చ జరగవచ్చు; అలాగే, ఈ నిర్ణయం నుండి అందే లాభాలు రానున్న రోజులలో కనిపించగలవు. అన్ని రాజకీయ పక్షాలు విశాల జనహితాన్ని ఆశించి, పార్లమెంట్ లో ఆరోగ్యకరమైన చర్చ జరగడంలో చేతులు కలుపుతాయన్న ఆశాభావంతో నేనున్నాను.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's services exports rise by 12.7 pc in April despite West Asia crisis: RBI

Media Coverage

India's services exports rise by 12.7 pc in April despite West Asia crisis: RBI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 మే 2026
May 30, 2026

Viksit Bharat in Motion: How PM Modi is Building a Self-Reliant Global India”