1992 में एक सपना संजोया गया था। अम्बेडकर जी के प्रति आस्था रखने वाले सभी महानुभावों ने सक्रिय होकर के एक विश्व स्तरीय केंद्र बने, उस दिशा में प्रयास किए थे। सरकारी फाइलें चलती रही। विचार विमर्श होता रहा। बाबा साहब अम्बेडकर ने जो संविधान बनया था, उस संविधान के कारण जो सरकारें बनी थी, उन सरकारों को बाबा साहब को याद करने में बड़ी दिक्कत होती थी। इतने साल बीत गए, 20 साल से भी अधिक समय यह कागजों में मामला चलता रहा। जब मेरे जिम्मे काम आया, तो पीड़ा तो हुई कि भई ऐसा क्यों हुआ होगा।
लेकिन मैंने यह तय किया है भले ही 20 साल बर्बाद हुए हो लेकिन अब हम 20 महीने के भीतर-भीतर इस काम को पूरा करेंगे। कभी-कभी व्यक्तिगत रूप से मैं सोचता हूं अगर बाबा साहब अम्बेडकर न होते तो नरेंद्र मोदी कहा होते? जिस पार्श्व भूमि पर मेरा जन्म हुआ, जिस अवस्था मैं पला-बढ़ा पैदा हुआ, अगर बाबा साहब अम्बेडकर न होते, तो मैं यहां तक नहीं पहुंच पाता। समाज के दलित, पीडि़त, शोषित वंचित सिर्फ उन्हीं का भला किया है ऐसा नहीं है। और कभी-कभी मैं जब यह सुनता हूं तो मुझे पीड़ा होती है कि बाबा साहेब अम्बेडकर दलितों के देवता थे। जी नहीं, वो मानव जात के लिए थे। और न ही सिर्फ हिंदुस्तान में विश्वभर के दलित, पीडि़त, शोषित, वंचित, उपेक्षित उन सबके लिए एक आशा की किरण थे। और हमने भी गलती से भी बाबा साहब को छोटे दायरे में समेट करके उनको अपमानित करने का पाप नहीं करना चाहिए था। इतने बड़े मानव थे।
आप कल्पना किजिए वो समय.. जीवनभर हम देखें बाबा साहब को, वो सामाजिक Untouchability का शिकार तो थे ही, लेकिन मरने के बाद भी Political Untouchability का शिकार बने रहे। देश को न सामाजिक Untouchability चाहिए, देश को न राजनीतिक Untouchability चाहिए। बाबा साहब का जीवन.. और उन्होंने संदेश भी क्या दिया, आज 21वीं सदी में भी हर सरकार के लिए वहीं काम मुख्य है, जो बाबा साहब कह के गए हैं। उन्होंने क्या संदेश दिया? शिक्षित बनो, संगठित बनो, संघर्ष करो। शिक्षित बनो, आज भी भारत की सभी सरकारें.. उनके सामने ये प्रमुख काम है कि हम 100% Literacy की और कैसे आगे बढ़ें, उस लक्ष्य को कैसे प्राप्त करें। हम बाबा साहब आंबेडकर के सवा सौ साल मनाने जा रहे हैं, तब बाबा साहब ने हमें जो एक मंत्र दिया है, शिक्षित बनो.. समाज के आखिरी छोर पर बैठे हुए इंसान को अगर हम शिक्षित बनाते हैं तो बाबा साहब को उत्तम से उत्तम श्रंद्धाजलि होगी। सवा सौ साल मनाने का वो उत्तम से उत्तम तरीका होगा, क्योंकि ये वहीं लोग है जो शिक्षा से वंचित रह गए है, जिनके लिए बाबा साहब जीते थे, जीवनभर जूझते थे और इसलिए हमारे लिए एक सहज कर्त्तव्य बनता है। उस कर्त्तव्य का पालन करना है.. भारत को ऐसा संविधान मिला है, जिस संविधान में द्वेष और कटुता को कहीं जगह नहीं है।
आप कल्पना कर सकते है कि दलित मां की कोख से पैदा हुआ एक बालक, जिसने जीवनभर जाति के नाम पर कदम-कदम अपमान सहा हो, सम्मान से जीने के लिए कोई व्यवस्था न हो, ऐसे व्यक्ति के दिल में कितनी कटुता, कितना रोष, कितना बदले का भाव हो सकता था। लेकिन बाबा साहब के भीतर वो परमात्मा का रूप था, जिसने संविधान की एक धारा में भी.. खुद के जीवन पर जो बीती थी, वो यातनाएं कटुता में परिवर्तित नहीं होने दीं। बदले का भाव संविधान के किसी भी कोने में नहीं पैदा होता। इतिहास कभी तो मूल्यांकन करेगा कि जीवन की वो कौन सी ऊंचाईयां होगी इस महापुरूष में कि जिसके पास इतना बड़ा दायित्व था, वो चाहते तो उन स्थितियों में ऐसी बात करवा सकते थे, लेकिन नहीं करवाई।
मूल में कटुता, द्वेष, बदले का भाव न उनके दिल में कभी पनपने दिया, न आने वाली पीढि़यों में पनपे इसके लिए कोई जगह उन्होंने छोड़ी। मैं समझता हूं कि हम संविधान की बात करते हैं लेकिन उन पहलुओं की ओर कभी देखते नहीं है। उस सामाजिक अवस्था की ओर देखते नहीं है।
मुझे खुशी है मैं उस प्रदेश में पैदा हुआ। जहाँ Sayajirao Gaekwad ने बाबा साहब अम्बेडकर का गौरव किया था। उनको सम्मानित किया था, उनके जीवन का गर्व-भैर स्वीकार किया था। और बाबा साहब अम्बेडकर ने हमेशा न्याय-प्रियता को प्राथमिकता दी थी। आज हम सब, जैसे मैं कहता हूं कि संविधान मेरे जैसे व्यक्ति को भी कहां से कहां पहुंचा सकता है।
यह Election Commission की रचना है। बहुत कम लोगों को मालूम होगा कि उस समय निष्पक्ष चुनाव का महत्व क्या होता है, लोकतंत्र में निष्पक्ष चुनाव की ताकत क्या होती है, उस बात के बीज बोए उन्होंने Independent Election की रचना करके, यह बाबा साहब की सोच थी और आज हम सब एक ऐसी व्यवस्था पर भरोसा करते हैं कि हिंदुस्तान के सभी दल कितना ही विरोध क्यों न हो, लेकिन Election Commission की बात को गर्व के साथ स्वीकार करते हैं। बाबा साहेब ने यह व्यवस्था हमें दी।
उनकी न्यायप्रियता देखिए। दुनिया के समृद्ध-समृद्ध कहे जाने वाले देश, most forward कहे जाने वाले देश उन देशों में भी महिलाओं को मत का अधिकार पाने के लिए 50-50, 60-60 साल तक लड़ाईयां लड़नी पड़ी थी। आंदोलन करने पड़े थे, महिलाओं को मत का अधिकार नहीं था, voting right नहीं था। पढ़े-लिखे देश से, प्रगतिशील देश से, धनवान देश से लोकतंत्र की दुहाई देने का जैसे उनका मनोबल ही था, लेकिन एक दलित मां की कोख से पैदा हुआ बेटा संविधान के पहले ही दिन हिंदुस्तान के अंदर माताओं-बहनों को वोट का अधिकार दे देता है, यह न्यायप्रियता ही उनकी।
भारत एक Federal Structure है। संघीय ढांचा आगे चलकर के कैसे चलेगा, व्यवस्थाएं कैसी होगी। मैं नहीं मानता हूं कि सामान्य मानवीय 50-60 साल के बाद क्या होगा, वो देख पाता है, मैं नहीं मानता। आज हम देखते हैं कि हमारे संघीय ढांचे को मजबूत बनाए रखने के लिए कितनी-कितनी बारीक चीजों पर ध्यान देना पड़ता है। और फिर भी कहीं न कहीं तो कोई गलती रह जाती होगी। यह बाबा साहब अम्बेडकर थे, जिनको इस बात की समझ थी कि उन्होंने संविधान की रचना के साथ एक स्वतंत्र Finance Commission की रचना रखी। जो Finance Commission केंद्र और राज्यों के संतुलन और धन के वितरण की व्यवस्था को स्वतंत्र रूप से गाइड करता है और आज भी वो व्यवस्था पर सब भरोसा करते है और चलते हैं। इस बार राज्यों को 42% तक राशि मिली है। हिंदुस्तान के इतिहास की बहुत बड़ी घटना है यह। यानी एक प्रकार से राज्यों ने कल्पना न की हो, उतने धन के भंडार इस बार मिल गए। पहली बार ऐसा हुआ है कि देश की जो Total जो तिजोरी, जो माने राज्य और केंद्र की मिलकर के तो करीब-करीब 60% से ज्यादा, 65% से भी ज्यादा amount आज राज्यों के पास है। भारत के पास मात्र 35% amount है। यह ताकत राज्यों को कैसे मिली है। सरकार के समय निर्णय हुआ एक बात है…लेकिन मूल बाबा साहब आंबेडकर के उस मूल में लिखा हुआ है, तब जा करके हुआ और इसलिए समाज के अंदर जब हम इन चीजों की ओर देखते हैं तो लगता है कि भई क्या हमारी आने वाली पीढ़ी को इस महापुरूष के कामों को समझना चाहिए कि नहीं समझना चाहिए, इस महापुरूष के विचारों को जानना चाहिए कि नहीं जानना चाहिए? हमारी आने वाली पीढि़यों को इस महापुरूष के आदर्शों से कुछ पा करके जीने का संकल्प करना चाहिए कि नहीं करना चाहिए?
अगर ये हमें करना है, तो जो आज हम व्यवस्था को जन्म देने जा रहे है, जो 20 महीने के भीतर-भीतर, गतिविधि उसकी शुरू हो जाएं, ऐसी मेरी अपेक्षा है। ये आने वाली पीढि़यों की सेवा करने का काम है और ये सरकार कोई उपकार नहीं कर रही है, मोदी सरकार भी उपकार नहीं कर रही। एक प्रकार से समाज को अपना कर्ज चुकाना है, कर्ज चुकाने का एक छोटा सा प्रयास है।
और इसलिए मैं समझता हूं कि बाबा साहब के माध्यम से जितनी भी चीजें हमारे सामने आई है.. हम कभी-कभी देखें, बाबा साहब.. women Empowerment, इसको उन्होंने कितनी बारिकी से देखा। आज भी विवाद होते रहते हैं। उस समय बाबा साहब की हिम्मत देखिए, उन्होंने जिन कानूनों को लाने में सफलता पाई, जो हिन्दुस्तान में विमिन Empowerment के लिए एक बहुत बड़ी ताकत रखते है। ये बाबा साहब का प्रयास था कि जिसके कारण हिंदू मैरिज़ एक्ट 1955 बना। ये बाबा साहब का पुरूषार्थ था कि Hindu Succession Act 1956 बना। Hindu Minority And Guardianship Act 1956 बना, Hindu Adoption और Maintenance Act 1956 बना। ये सारे कानून समाज के उन लोगों को ताकत देते थे विशेष करके महिलाओं को, ये बाबा साहब की विशेषता थी।
आज भी मैं जब लोगों से बड़े-बड़े सुनता हूं तो आश्चर्य होता है कि काश इस प्रकार के भाषण करने वालों ने कभी आंबेडकर को पढ़ा होगा। खैर.. वो तो उनको गले लगाने को तैयार नहीं थे, उनके जाने के बाद उनको पढ़ने के लिए कहा से तैयार होगे। कोई कल्पना कर सकता है कि दुनिया में Labour Reform की बात कहें तो Communist विचारधारा की चर्चा होती है। Labour Reform की चर्चा करें तो Leftist विचारधारा के खाते में जाता है, लेकिन बहुत कम लोगों को मालूम होगा कि जब ब्रिटिश सल्तनत थी, अंग्रेज वायसराय यहां बैठे थे.. और उस काउंसिल के अंदर 1942 में बाबा साहब आंबेडकर की ताकत देखिए, भारत के मजदूरों का अंग्रेज सल्तनत शोषण करती थी, ये बाबा साहब की ताकत थी कि 1942 के पहले मजदूरों को 12 घंटे काम करना पड़ता था। 1942 में बाबा साहब आंबेडकर ने वायसराय से लड़ाई लड़ करके 12 घंटे से 8 घंटे काम करवाने का पक्का कर लिया था।
ये छोटे निर्णय नहीं है और इसलिए बाबा साहब को एक सीमा में बांध करके देखने से.. भारत की पूरी विकास यात्रा में बाबा साहब का कितना बड़ा रोल था, इसको हम समझ नहीं पाते। ये मेरा सौभाग्य रहा है, क्योंकि मैं हर पल मानता हूं और अपने जीवन को देख करके मुझे हर पल लगता है कि इस महापुरूष ने हमें बहुत कुछ दिया है, बहुत कुछ दिया है। समाज के प्रति भी उनकी भूमिका क्या रही, समाज को जोड़ने की भूमिका रहीं। कभी समाज को तोड़ने की भूमिका नहीं रही।
उनके सारे विचारों को हम देखे, उनके सामने धन के ढेर कर दिए गए थे – यह बनो, यह पाओ, यह करो। मैं उसकी चर्चा में जाना नहीं चाहता हूं, इतिहास मौजूद है। लेकिन वो उससे विचलित नहीं हुए थे। और इसलिए जिस प्रकार से समता का महत्व है, उतना ही ममता का भी महत्व है। खासकर के जो अपने आप को उच्च मानते हैं, उन लोगों ने अपने आप को सोचना होगा कि समाज में भेद-भाव लम्बे अर्से तक चलने वाला नहीं है। इसे स्वीकार करना होगा और भारत जैसा देश जो विविधताओं से भरा हुआ है उसमें सामाजिक एकता एक बहुत बड़ी एकता रखती है। बाबा साहब के 125 वर्ष मना रहे हैं तब सामाजिक एकता के बिगुल को हम कैसे ताकतवर बनाए।
और इसलिए मैं कहता हूं – समता + ममता = समरता। समभाव + ममभाव = समरसता। और इसलिए अपनापन यह मेरे हैं। यह मेरे ही परिवार के अंग है, यह भाव हमें जीकर के दिखाना होगा और मुझे विश्वास है कि यह जो हम प्रयास शुरू कर रहे हैं। उस प्रयास के माध्यम से समाज की धारणा बनाने में, समाज को सशक्त बनाने में संविधान की lateral spirit, उसको कोई चोट न पहुंचे। उसकी जागरूक भूमिका अदा करने के लिए एक प्रकार से यह चेतना केंद्र बनेगा। यह विश्व चेतना केंद्र बनने वाला है, उस सपने को लेकर के हमें देखना चाहिए।
हम मार्टिन लूथर किंग की बात तो कर लेते हैं, लेकिन बाबा साहब को भूल जाते हैं और इसलिए अगर मार्टिन लूथर किंग की बात करती है दुनिया, तो हमारी कोशिश होनी चाहिए कि दुनिया जब मार्टिन लूथर किंग की चर्चा करें तो बाबा साहब अम्बेडकर की भी करने के लिए मजबूर हो जाए। वो तब होगा, जब हम बाबा साहब का सही रूप उनके विचारों की सही बात, उनके काम की सही बात दुनिया के पास सही स्वरूप में प्रस्तुत करेंगे। इस केंद्र को यह सबसे बड़ा काम रहेगा कि पूरा विश्व बाबा साहब को जाने-समझे। भारत के मूलभूत तत्व को जाने-समझे और यह बाबा साहब के माध्यम से बहुत आसानी से समझा जा सकता है।
और इसलिए मैं कहता हूं कि हमने बाबा साहब से प्रेरणा लेकर के उनके विचारों और आदर्शों से प्रेरणा लेकर के समाज को सशक्त बनाने की दिशा में, राष्ट्र के लिए.. महान राष्ट्र बनाने का सपना पूरा करने के लिए, हमारी जो भी जिम्मेवारी है उसको पूरा करने का प्रयास करना चाहिए।
मैं विभाग के सभी साथियों को बधाई देता हूं कि 20 साल से अधिक समय से भी लटकी हुई चीज, एक प्रकार से Political untouchability का स्वीकार हुआ Project है। उससे मुक्ति दिलाई है। अब आने वाले 20 महीनों में उसको पूरा करे। लेकिन यह भी ध्यान रखे कि उसका निर्माण उस स्तर का होना चाहिए ताकि आने वाली शताब्दियों तक वो हमें प्रेरणा देता रहे, ऐसा निर्माण होना चाहिए।
मैं फिर एक बार बाबा साहब आंबेडकर को प्रणाम करता हूं और सवा सौ वर्ष.. ये हमारे भीतर ताकत दें, हमें जोड़ने का सामर्थ्य दें, सबको साथ ले करके चलने का सामर्थ्य दें, समाज के आखिरी छोर पर बैठा हुआ इंसान, वो हमारी सेवा के केंद्र बिंदु में रहें, ऐसे आर्शीवाद बाबा साहब के निरंतर मिलते रहें ताकि उनके जो सपने अधूरे हैं, वो पूरे करने में हम लोग भी कुछ काम आएं, इसी अपेक्षा के साथ फिर एक बार मैं विभाग को बहुत-बहुत शुभकामनाएं देता हूं।
बहुत-बहुत धन्यवाद!
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కొన్ని రోజుల కిందట జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులను నెలకొల్పారు. గురిందర్వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులను నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు.
మిత్రులారా! దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం రెండు రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయస్థాయిలో పాతరికార్డులను మూడుసార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన ఇద్దరు అథ్లెట్లు గురిందర్వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి 'మన్ కీ బాత్'లో ఈ ఇద్దరు అథ్లెట్లతో మాట్లాడాలని అనుకున్నాను.
(ఫోన్ కాల్)
ప్రధానమంత్రి: నమస్కారం అనిమేష్ గారూ... గురిందర్వీర్ గారూ.. మీకు కూడా నమస్కారం. సత్ శ్రీ అకాల్.
అనిమేష్, గురిందర్వీర్: నమస్కారం సార్, నమస్కారం సార్.
ప్రధానమంత్రి: సోదరులారా! మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం. కానీ ఇప్పుడు పోటీలలో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాలు విసురుతారు. మరొకరు దాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. 'మన్ కీ బాత్' శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియాలని నేను కోరుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్పండి.
అనిమేష్: నమస్కారం సార్, నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను. మాది ఛత్తీస్గఢ్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరుగెత్తమని లేదా ఆడుకొమ్మని చెప్తూ మా అమ్మానాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చేవారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడం ప్రారంభమైనప్పుడు నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు. నేను అక్కడి నుండి జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈ రోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
ప్రధానమంత్రి: మరి గురిందర్వీర్ గారూ... మీ గురించి చెప్పండి.
గురిందర్వీర్: నమస్కారం సార్. నా పేరు గురిందర్వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పని చేస్తున్నాను. భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేను ఇప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకన్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను. 10.1 సెకన్ల లోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాక్పై, యూనిఫాంలో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, తాతగారు ఇద్దరూ క్రీడలు ఆడేవారు. కాబట్టి దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవడం మా భారతీయ సంస్కృతిలో భాగం. అందుకే నేను మా నాన్నగారి ట్రోఫీలను, పతకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు "మీరు ఈ ట్రోఫీని ఎక్కడ గెలిచారు? ఈ పతకాన్ని ఎక్కడ గెలిచారు? ఈ ఫోటో ఎప్పటిది?" అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన "నేను పోటీల్లో ఆడటానికి వెళ్ళాను. ఈ జాతీయ పతకాన్ని గెలిచాను. మా జట్టును గెలిపించాను" అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళమని చెప్పడం మొదలుపెట్టాను. దాంతో ఆయన నన్ను తీసుకెళ్ళడం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించడం ప్రారంభించారు. ఆ తర్వాత నాకు ఆసక్తి కలగడం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పడం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా, మా అమ్మ "బాబూ... చదువుకునే సమయం అయింది. నువ్వు చదువుకోవాలి" అని చెప్పి టీవీ ఆపేసింది. అప్పుడు "ఫర్వాలేదు...నన్ను టీవీ చూడనివ్వకు. కానీ ఏదో ఒకరోజు గురిందర్ పరుగెత్తడం చూడడం కోసం నువ్వు టీవీలో వెతుకుతావు" అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరుగెత్తడం చూసినప్పుడు నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది.
ప్రధానమంత్రి: వావ్… వావ్… వావ్ … సోదరా! ఈ విషయం చాలా గొప్పది.
గురిందర్ వీర్: అవును సార్. మేం మధ్యతరగతి కుటుంబానికి చెందినవాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కల నెరవేరలేదు. కాబట్టి తన కొడుకు ఆ కలను నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్ఖా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కలను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు ఆయన “కలలు అలా నెరవేరవు. దాని కోసం చాలా కష్టపడాలి. చాలా కష్టపడాలి” అని చెప్పేవారు. మిల్ఖా సింగ్ గారు రక్తం కక్కేవారు. ఎండలో పరిగెత్తేవారు. ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. ఆ విషయాలు నాకు స్ఫూర్తినిచ్చేవి. నేను పరుగెత్తితే మన దేశం కోసం పతకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంట్ను ఎంచుకున్నప్పుడు అందరూ నాతో "సోదరా! 100 మీటర్లు చేయకు. 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు. భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు" అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు, నేను ఎప్పుడూ "గురిందర్.. మనం దీన్ని ఎంచుకున్నాం. దాని నుండి ఇక వెనకడుగు వేయం" అని చెప్పుకునేవాళ్ళం. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి, గెలిచి చూపించాలని మా నాన్న గారు చెప్పేవారు. “నువ్వు చేస్తావు. నీపై నాకు నమ్మకం ఉంది” అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్నే నా ధైర్యంగా మార్చుకుని ముందుకు సాగాను. ఈ రోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
ప్రధానమంత్రి: చూడండి, మీరిద్దరూ గొప్ప పని చేశారు. కేవలం రెండు రోజుల్లోనే మూడుసార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురిందర్వీర్ చెప్పినట్లుగా, 100 మీటర్ల పరుగు పందెంలో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదని ప్రజలు అంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు చాలా కష్టపడ్డారు. మీ ఇద్దరి నుండి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. 'మన్ కీ బాత్' శ్రోతలు కూడా మీ అభిరుచి ఏమిటి, మీ పట్టుదల ఏమిటి, మీ ఆలోచనలు ఏమిటి, మీరంతా దీన్ని ఎలా సాధించారు? ఇది ఎంత కష్టమైనది? అనే విషయాలను మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నారు.
గురిందర్వీర్: సార్. నేను గురిందర్ ని. నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారీ గెలవలేం. కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించనప్పుడు, నాకు గాయమైనప్పుడు, నా కుటుంబసభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ “ఫర్వాలేదు... ఒక రోజు చెడుగా గడిచినా, ఒక సంవత్సరం చెడుగా గడిచినా, అది నీ జీవితాన్ని పాడుచేయదు. కలలు కనడం ఆపవద్దు” అని చెప్పేవారు. “నువ్వు చేయకపోతే ఇంకెవరూ చేయలేర”ని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
ప్రధానమంత్రి: అనిమేష్ గారూ... మీరు చెప్పండి.
అనిమేష్: సార్... నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో “చూడు... ఇది కొత్త రంగం... నువ్వు దీన్ని చేయగలవా లేదా?' అని అడిగేవారు. అప్పుడు నేను “ఇప్పుడు నేను ఈ రంగంలోకి అడుగుపెట్టాను. కాబట్టి నేను తప్పకుండా చేస్తాను” అని చెప్పాను. మా నాన్నగారు కూడా నాతో ఎప్పుడూ “నువ్వు ఈ రంగంలోకి అడుగుపెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే నువ్వు ఇది చేయాలి, అది చేయాలి అని అందరూ అనుకుంటారు. కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగుపెట్టావు. కాబట్టి దీనికే కట్టుబడి ఉండు. దీంట్లోనే ముందుకు సాగిపో' అని చెప్పేవారు. “నీకు మేం అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం. కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం... అన్నీ చేస్తాం. కేవలం కష్టపడి పనిచేసి, భారతీయులు కూడా పరుగెత్తగలరని భారతదేశానికి చూపించు.” అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకన్ల లోపు లేదా 10.1 సెకన్ల లోపు పరుగెత్తేంత గొప్పవి కావని, లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకు అంత కష్టం కాదు. మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరని ఇతర భారతీయులు కూడా చూస్తున్నారు. మేం ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీలో మరింత మెరుగ్గా రాణిస్తాం.
ప్రధానమంత్రి: అయితే చూడండి... నాకు కూడా ఒక ఆసక్తి ఉంది. ప్రజలకు కూడా ఉంటుంది. మీరిద్దరూ మంచి స్నేహితులని నేను విన్నాను. మీరు నా రికార్డును బ్రేక్ చేస్తే, నేను మీ రికార్డును బ్రేక్ చేస్తానని మీరిద్దరూ నిర్ణయించుకున్నారా? అనిమేష్… ముందు మీరు చెప్పండి.
అనిమేష్: సర్, మొదటి రికార్డు 10.18 సెకన్లు. అది నాదే. ఆ తర్వాత సెమీ-ఫైనల్లో గురిందర్వీర్ భయ్యా 10.17 సెకన్లతో దాన్ని బద్దలు కొట్టారు. రెండో సెమీ-ఫైనల్లో నేను 10.15తో దాన్ని మళ్ళీ బద్దలు కొట్టాను. ఆ సమయంలో నా సెమీ-ఫైనల్ జరిగినప్పుడు “అవును... ఫర్వాలేదు. ఈరోజు రికార్డు బద్దలైంది. మేమిద్దరం కలిసి చేశాం” అని మేమిద్దరం సంతోషించాం. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్ లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకు ముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాం. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా కూడా ఉండేవాళ్ళం. అందుకే అక్కడ మేమిద్దరం “మనం భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి. ఆ విషయం మన చేతుల్లోనే ఉంది. మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది” అని మాట్లాడుకునేవాళ్ళం.
ప్రధానమంత్రి: గురిందర్వీర్... మీరేం చెప్పాలనుకుంటున్నారు?
గురిందర్వీర్: మేమిద్దరం బాగా పరుగెత్తాలని నిర్ణయించుకున్నాం. అందుకే సార్.. మేం ఒకరికొకరం అవసరమైనప్పుడు ఒకరికొకరం అండగా నిలబడతాం. ఇప్పుడే రికార్డింగ్కు ముందు చేసినట్టు. ఇపుడు ముందుగా నేను రికార్డ్ చేశాను. ఆ తర్వాత అనిమేష్ చేశాడు. మేం వార్మప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో "అనిమేష్, ఆ బ్లాక్ సరిగ్గా ఉంది. వెళ్లి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి. మనం ఇక్కడ వార్మప్ చేద్దాం. వార్మప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికొకరు సహాయం చేసుకుంటే అవతలి వారు కూడా మెరుగుపడతారు. మనం కూడా మెరుగుపడతాం" అని చెప్పాను. కాబట్టి స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట.. పోటీకి బయట ఉన్నపుడు స్నేహితులం. మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికొకరం పోటీదారులం అవుతాం. అప్పుడు “నేను ఇతని కంటే వేగంగా పరుగెడతాను. నేను ఇతని కంటే వేగంగా పరుగెడతాను” అని అనుకుంటూ ఉంటాం.
ప్రధానమంత్రి: చూడండి.. మీరందరూ ఈ పోటీ దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేశారు. మీరు దానిని సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడాస్ఫూర్తితో ఒకరినొకరు సవాలు చేసుకుంటూ, ముందుకు సాగడానికి కృషి చేస్తూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, మీరు అద్భుతమైన పని చేశారని నేను నమ్ముతున్నాను. మీకు నా హృదయపూర్వక అభినందనలు, నా శుభాకాంక్షలు. మీరు దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారని నాకు నమ్మకం ఉంది. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
గురిందర్వీర్/అనిమేష్: ధన్యవాదాలు సార్… ధన్యవాదాలు.
ప్రధాన మంత్రి: చాలా చాలా ధన్యవాదాలు.
#####
నా ప్రియమైన దేశప్రజలారా! ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు వీస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను మర్చిపోవద్దు.
మిత్రులారా! వేడిని తట్టుకునే మార్గం తరచుగా వంటగదిలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుందని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగిపొర్లుతుంది. మరికొన్ని చోట్ల పెరుగు గడ్డకడుతుంది. పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ప్రారంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది. మీరు ఉత్తర భారతదేశానికి వెళితే అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుండి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్, హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు కనిపిస్తుంది. రాజస్థాన్, గుజరాత్లలో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాకుండా బీహార్, ఝార్ఖండ్, తూర్పు ఉత్తర ప్రదేశ్ల సత్తు షర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది కడుపు నింపి, శక్తినిస్తుంది. కొంకణ్, గోవాలలో కోకుమ్ షర్బత్, సోల్ కఢి దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం, నీర్ మోర్, సాంబారు; ఒడిశాలో లభించే బేల్ పానా కేవలం పానీయాలు మాత్రమే కాదు. అవి భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాలలో ఒక భాగం. అవి 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోవాలి. వీటిలో చాలా వరకు మన వంటగదుల నుండి, మన పొలాల నుండి, పశువుల కొట్టాల నుండి వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు. కానీ అవి తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తాయి. మీరు కూడా వేసవిలో ఈ దేశీయ పానీయాలను ఆస్వాదించాలి.
మిత్రులారా! వేసవి రాకతో ప్రతి ఇంట్లో మరో చర్చ మొదలవుతుంది. అది మామిడి పండ్లపై ఉంటుంది. మామిడిపండ్లు ఒక సాధారణ చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడిపండ్ల ప్రస్తావన రాని ఇల్లు దాదాపుగా ఉండదు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో మామిడి రకం, ఒక్కో రుచి, ఒక్కో సువాసన ఉంటాయి. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల నుండి హాపుస్, అల్ఫోన్సో రకాలుంటాయి. గుజరాత్ నుండి కేసర్- ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తర ప్రదేశ్ నుండి దశహరి; ఇక కాశీ నుండి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పండ్లకు ఒక ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా వాటి రంగు తరచుగా ఆకుపచ్చగానే ఉంటుంది. బీహార్ నుండి జర్దాలూ సువాసనను దూరం నుంచే గుర్తించవచ్చు. చౌసా, మాల్దా — ఇలా ప్రతి పేరుతో ముడివడిన జ్ఞాపకాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశానికి వెళితే బంగనపల్లె, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలుంటాయి. బెంగాల్ నుండి హిమసాగర్; ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ల నుండి సువర్ణరేఖ ఉన్నాయి. ప్రదేశం మారేకొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారతాయి. మిత్రులారా! మామిడిపండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు పల్లెటూరి నుండి ప్రపంచ మార్కెట్కు చేరుకుంటోంది. ఈ రోజు జరుగుతోన్న 'మన్ కీ బాత్' ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులను నేను ప్రశంసిస్తాను. మీరు కేవలం సాధారణ రైతులు కాదు- దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైనవారు. మీరు ఇలాగే ప్రజాదరణ పొందాలని కోరుకుంటున్నాను.
మిత్రులారా! పాఠశాలలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలకునే ఒక తరగతి గురించి నేను చెప్తాను. మిత్రులారా... ఒక పరిస్థితిని ఊహించుకోండి: అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా హాజరవుతారు. అక్కడ ఎటువంటి ఫీజులు ఉండవు. పెద్ద భవనాలు ఉండవు. తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి.
మిత్రులారా! ఇది ఒక కథ కాదు. ఇది ఒక నిజమైన ప్రయత్నం. కేరళలోని ఆలువాలో సాజి వలాశేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్బును నడుపుతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజి దివ్యాంగ పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఈ ప్రయత్నం వెనుక తీవ్రమైన వేదన ఉంది. కొన్ని సంవత్సరాల కిందట ఒక పడవ ప్రమాదంలో చాలా మంది విద్యార్థులు మరణించారు. ఆ సంఘటన సాజిని తీవ్రంగా కలచివేసింది. పిల్లలకు ఈత వచ్చి ఉంటే ఎన్నో ప్రాణాలను కాపాడి ఉండేవాళ్ళమని ఆయన భావించారు. ఆ ఆలోచనతో ఆయన ఈ కృషి ప్రారంభించారు.
మిత్రులారా! సాజి వలాశేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. సేవకు గొప్ప వనరులు అవసరం లేదు. కావాల్సింది మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాలను మార్చవచ్చు.
నా ప్రియమైన దేశవాసులారా! ఇటీవల నాకు యూరప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం లభించింది. నేను అక్కడ అనేక సమావేశాలకు హాజరయ్యాను. ఈ సమయంలో ప్రతి భారతీయుడిని గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ ప్రధానమంత్రి కూడా హాజరయ్యారు. ఈ రాగి ఫలకాల గురించి నాకు భారతదేశంతో పాటు విదేశాల నుండి కూడా నిరంతరం సందేశాలు వస్తున్నాయి. ప్రజలు తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వాటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది.
మిత్రులారా! ఈ రాగి ఫలకాల గురించి ప్రజల్లో చాలా ఆసక్తి ఉంది. అందువల్ల ఈ రోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అక్కడ 21 పెద్ద, మూడు చిన్న రాగి ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సంబంధించినవి. ఆనైమంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటున్నాయి. ఈ రాగి ఫలకాలు చోళ రాజవంశం విజయాలను కూడా వివరిస్తాయి. అవి చోళ సామ్రాజ్యం బలమైన సముద్ర శక్తిని వెల్లడిస్తాయి. ఆగ్నేయాసియా దేశాలతో వారి సంబంధాల గురించి కూడా అవి సమాచారాన్ని అందిస్తాయి.
చోళ సామ్రాజ్య గొప్ప చరిత్ర, సంస్కృతి పట్ల మనమందరం చాలా గర్వపడతాం. మిత్రులారా! భారతదేశానికి చెందిన ఇటువంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ విషయంలో 'జ్ఞాన భారతం అభియాన్' కింద ఛత్తీస్గఢ్లోని మల్హార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ మూడు అరుదైన రాగి ఫలకాలు లభించాయి. ఇవి పాండువంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు ఆరవ-ఏడవ శతాబ్దానికి చెందినవి. అంటే పద్నాలుగు వందల, పదిహేను వందల సంవత్సరాల పూర్వం నాటివన్నమాట. ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి, పాలి భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి.
మిత్రులారా! మన భారతీయులకు ఖగోళశాస్త్రంపై ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి. పంచాంగం కానివ్వండి. లేదా మన పండుగలు ఏవైనా సరే... వాటన్నింటికీ ఆకాశం, నక్షత్రాలతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలోనూ ఖగోళశాస్త్రం కుతూహలాన్ని రేకెత్తించింది. ఇది అన్వేషణకు స్ఫూర్తినిచ్చింది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళశాస్త్ర క్లబ్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయని మీరు గమనించే ఉంటారు. వాటి కార్యకలాపాలు పెద్ద నగరాల నుండి చిన్న పట్టణాల వరకు, పాఠశాలల నుండి పార్కుల వరకు కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో ఖగోళశాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. 'ఖగోళ్ మండల్' అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ప్రారంభించింది.
మిత్రులారా! రాత్రిపూట నక్షత్రాలను చూడటం ఒక అద్భుతమైన అనుభవం. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలన శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది. ఇక్కడ యువత టెలిస్కోపులను తయారు చేయడం, నక్షత్ర పటాలను ఉపయోగించడం నేర్చుకుంటారు. రాజ్కోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుండి రాన్ ఆఫ్ కచ్ వరకు అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలను నిర్వహించింది. ‘జ్యోతిర్విద్యా పరిసంస్థ’ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థలలో ఒకటి. ఇది పరిశీలన సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐఎస్ ఏఏసి (ఐజాక్-ISAAC) గురించి కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. ఇది విద్యార్థులు నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళశాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానిస్తుంది.
మిత్రులారా! మీ అభిరుచి కోసం సమయం కేటాయించడం, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలని, ఏదైనా ప్లానెటేరియంను సందర్శించాలని నేను కోరుతున్నాను.
మిత్రులారా! టీవీలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియోను చూడాలని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ఇటీవల చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడటానికి ఓపికగా, జాగ్రత్తగా ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి సుమారు 13 గంటల సమయం పట్టిందని, చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
మిత్రులారా! ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ కీలక పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. 'నమామి గంగే అభియాన్' కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు ఆశ కల్పించింది. అప్పుడు దాన్ని జాగ్రత్తగా రక్షించారు. దానికి పరీక్షలు చేసి, చికిత్స అందించి, ఆ తర్వాత సురక్షితంగా రాప్తి నదిలోకి విడిచిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణం తన గూటికి తిరిగి వచ్చింది.
మిత్రులారా! ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా ప్రత్యేకమైనది. దీన్ని ఒక మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ను సురక్షితంగా ఉంచడానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుండి వేరుపడినా దానికి తక్షణమే సహాయం అందించవచ్చు.
మిత్రులారా! మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడటం లేదు. మనం గంగానది జీవవైవిధ్యాన్ని కాపాడుతున్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి, మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని పరిరక్షిస్తున్నాం.
నా ప్రియమైన దేశప్రజలారా! మీలో చాలా మందికి నది, చెరువు లేదా బావి నీటితో ముడిపడిన జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం గుర్తుండవచ్చు. కొందరికి చెరువు గట్లపై స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండవచ్చు. మరికొందరికి మట్టి వాసన గుర్తుండవచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసులో నిలిచిపోతాయి.
మిత్రులారా! ఇలాంటి జ్ఞాపకాలను పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుండి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమ నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో పరిశుభ్రంగా, జీవకళతో నిండిన ఆ నదిలో కాలక్రమేణా ప్లాస్టిక్ పేరుకుపోవడం మొదలైంది. ఆ మురికి పెరుగుతూనే ఉంది. దీనిపై ఫిర్యాదు చేయకూడదని, ఒక కొత్త ప్రారంభం చేయాలని ఆకాష్ నిర్ణయించుకున్నారు. "ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే" అనేది ఆయన మంత్రంగా మారింది. ఆయన తన స్నేహితులను సమీకరించారు. వారి దగ్గర కేవలం ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నిటికంటే మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలనే దృఢ సంకల్పమనే గొప్ప బలం ఉండేది. ఈ యువకులు నదిలోకి దిగి, నీటి నుండి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒక్క రోజులోనే నది నుండి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్ళీ శుభ్రంగా కనిపించడం ప్రారంభించింది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజలలో పరిశుభ్రతపై అవగాహన పెరిగింది.
మిత్రులారా! గోవా నుండి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్యగారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలనే ఆయన ఉత్సాహం మాత్రం అలాగే ఉంది. మడ్డి-తోలాప్ ప్రాంతంలోని నీటి సమస్య ఆయనను తీవ్రంగా కలవరపరిచింది. ఆయన కూడా ఒక పరిష్కారం కోసం కృషి చేయడం ప్రారంభించారు. పైప్లైన్లు వేయడంలో బాలకృష్ణగారు కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజూ నీటి కోసం పోరాడవలసి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది.
మిత్రులారా! గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. ఇది కూడా ‘మన్ కీ బాత్’కు సంబంధించినదే. అందుకే ఈ రోజు నేను ఈ విషయం మీతో చర్చించాలనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలిని కలిశాను. నేను దాదాపు మూడు దశాబ్దాల కిందట కూడా ఆమెను కలిశాను. నేను మాట్లాడుతున్నది గిరిజా అమ్మగారి గురించి. ఈ సమావేశంలో ఆమెతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా! గిరిజా అమ్మగారు సుమారు 15 పాఠశాలలను నడుపుతున్నారు. వీటిలో చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైనది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి ప్రేరణనిస్తుంది. 'మన్ కీ బాత్' స్ఫూర్తితో ఆమె దేశంలోని ఎందరో సైనికులకు విరాళం ఇవ్వడానికి ప్రతిజ్ఞ చేశారు. ఇది చేయడానికి, ఆమె తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థులను ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజూ ఒక రూపాయి విరాళంగా ఇవ్వమని ఆమె పిల్లలను కోరారు. అంటే విద్యార్థుల్లో ప్రతి ఒక్కరి నుండి ఒక సంవత్సరంలో 365 రూపాయలు సేకరించారు. ఈ చిన్న విరాళాలు సుమారు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజా అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆమెకున్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య, సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించడంలో ఈ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయం. ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు ప్రత్యేక ప్రశంసలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా! భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఈ ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితోనే ముందుకు సాగుతోందనే మన నమ్మకం మరింత బలపడుతుంది. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాలను మీరు తప్పకుండా గమనించాలని నేను కోరుతున్నాను. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి. వారిని అభినందించండి. వారి నుండి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల 'మన్ కీ బాత్'లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
Just a few days ago, at the National Senior Athletics Federation Competition in Ranchi, four national records were broken across different events.
— PMO India (@PMOIndia) May 31, 2026
One achievement that caught the nation's attention was the Men's 100-metre race, where the national record was broken three times in… pic.twitter.com/TrBsr855U1
With temperatures soaring across much of the country, it is important to take extra care.
— PMO India (@PMOIndia) May 31, 2026
Stay hydrated.
If you need to step out in the sun, do so cautiously and take necessary precautions.#MannKiBaat pic.twitter.com/G1y6iKYaHp
The world loves Indian mangoes!#MannKiBaat pic.twitter.com/KmgQYf3yFb
— PMO India (@PMOIndia) May 31, 2026
In Keralam, Saji Valasseril Ji runs a unique swimming club.#MannKiBaat pic.twitter.com/jEOJPPFLdw
— PMO India (@PMOIndia) May 31, 2026
The Netherlands has returned ancient Chola-era copper plates that chronicle the achievements, maritime strength and global connections of the Chola empire.#MannKiBaat pic.twitter.com/ehHvuwKpl7
— PMO India (@PMOIndia) May 31, 2026
Under the Gyan Bharatam Abhiyan, rare copper plates dating back nearly 1,400 to 1,500 years have been discovered in Chhattisgarh. #MannKiBaat pic.twitter.com/S0wKVWrPbd
— PMO India (@PMOIndia) May 31, 2026
Astronomy has fascinated generations of Indians, sparking curiosity and a spirit of exploration. Today, that same enthusiasm is inspiring a new generation.#MannKiBaat pic.twitter.com/CdtHx38Xn7
— PMO India (@PMOIndia) May 31, 2026
Several astronomy clubs are becoming increasingly popular across the country. #MannKiBaat pic.twitter.com/Z1rbpLd61P
— PMO India (@PMOIndia) May 31, 2026
A remarkable rescue operation in Uttar Pradesh saw a Gangetic dolphin saved after hours of patient effort. The Ganga dolphin rescue ambulance played a crucial role.#MannKiBaat pic.twitter.com/MWjKU2pOP7
— PMO India (@PMOIndia) May 31, 2026
An inspiring effort from Uttar Pradesh's Basti district...#MannKiBaat pic.twitter.com/GXAdzkbwvb
— PMO India (@PMOIndia) May 31, 2026
In Goa, a retired teacher has shown how age is no barrier to service.#MannKiBaat pic.twitter.com/n9PesSPjEu
— PMO India (@PMOIndia) May 31, 2026
Small acts of patriotism and collective effort can inspire a deep sense of service and nation-building among the younger generation. Here is one such example from Tamil Nadu...#MannKiBaat pic.twitter.com/NChjgo0V5W
— PMO India (@PMOIndia) May 31, 2026



