భారత్, మాల్దీవుల దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మాల్దీవులు అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజు స్మారక స్టాంపులను విడుదల చేశారు.
రెండు దేశాల మధ్యనున్న దశాబ్దాల ద్వైపాక్షిక సంబంధాలను తెలియజేసేలా ఈ స్మారక స్టాంపులు కేరళలోని బేపూర్ చారిత్రక పడవ కేంద్రంలో చేతితో తయారు చేసిన పెద్ద చెక్క ఓడ అయిన ‘ఉరు’ అనే భారతీయ పడవను, చేపలు పట్టటానికి ఉపయోగించే సంప్రదాయ మాల్దీవుల పడవ అయిన ‘వధు ధోని’ని కలిగి ఉన్నాయి. ఈ పడవలు శతాబ్దాలుగా హిందూ మహాసముద్ర వాణిజ్యంలో భాగంగా ఉన్నాయి. ‘వధు ధోని’ని తీరప్రాంతాలు, సముద్ర దిబ్బల్లో చేపలు పట్టేందుకు ఉపయోగిస్తారు. సముద్రాల విషయంలో మాల్దీవుల సాంస్కృతిక వారసత్వం.. ద్వీప జీవనం- సముద్రం మధ్యనున్న సన్నిహిత బంధాన్ని ఇది తెలియజేస్తుంది.
1965లో మాల్దీవులకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ దేశంతో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్న మొదటి దేశాల్లో భారత్ ఒకటి. ఈ స్మారక స్టాంపులు రెండు దేశాల మధ్య సన్నిహిత, చారిత్రక సంబంధాలను సూచిస్తాయి.
Commemorating a very cherished friendship!
— Narendra Modi (@narendramodi) July 25, 2025
President Muizzu and I released a stamp to mark 60 years of India-Maldives friendship. Our ties are getting stronger with the passage of time and are benefitting the people of our nations.@MMuizzu pic.twitter.com/KW8gmbNidh
ގާތް އެކުވެރިކަމުގެ ހަނދާނުގައި!
— Narendra Modi (@narendramodi) July 25, 2025
އިންޑިއާ އާއި ދިވެހިރާއްޖޭގެ އެކުވެރިކަމަށް 60 އަހަރު ފުރުން ފާހަޤަކުރުމުގެ ގޮތުން ރައީސް މުއިއްޒުއާއި އެކު ސްޓޭމްޕެއް ވާނީ ނެރެފައި. މި ގުޅުންތައް ދަނީ ދުވަސްވީވަރަކަށް ބަދަހިވަމުން އަދި ދެ ޤައުމުގެ ރައްޔިތުންނަށް ފައިދާ ކުރަމުން.@MMuizzu pic.twitter.com/lQAuo6IDLp


