ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 సెప్టెంబరు 11న డెహ్రాడూన్ను సందర్శించి.. ఉత్తరాఖండ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద పరిస్థితినీ, మేఘ విస్ఫోటం, వర్షాలు, కొండచరియలు విరిగిపడడం వల్ల కలిగిన నష్టాన్నీ సమీక్షించారు.
ఉత్తరాఖండ్లో నష్టాన్ని అంచనా వేయడంతోపాటు అక్కడ చేపట్టిన సహాయ, పునరావాస చర్యలను సమీక్షించడానికి డెహ్రాడూన్లో ప్రధానమంత్రి అధికారిక సమావేశం నిర్వహించారు. ఉత్తరాఖండ్కు రూ.1200 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ఈ ప్రాంతం, ఇక్కడి ప్రజలు కోలుకోవడానికి బహుముఖీన విధానం ఆవశ్యకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇళ్ల పునర్నిర్మాణం, జాతీయ రహదారుల పునరుద్ధరణ, పాఠశాలల పునర్నిర్మాణం, పీఎంఎన్ఆర్ఎఫ్ ద్వారా ఉపశమనం, పశువులకు మినీ కిట్ల పంపిణీ వంటి సహాయక చర్యల్ని చేపడతారు.
ప్రధానమంత్రి ఆవాస యోజన - గ్రామీణ ఆవాస్ యోజన కింద.. ఇళ్ల పునర్నిర్మాణం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ప్రత్యేక ప్రాజెక్టు’ ద్వారా వరదల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందుతుంది.
ఉత్తరాఖండ్లో నష్టాన్ని అంచనా వేయడం కోసం రాష్ట్రాలను సందర్శించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంతర మంత్రిత్వ కేంద్ర బృందాలను పంపించింది. వారి వివరణాత్మక నివేదిక ఆధారంగా మున్ముందు అందించాల్సిన సాయం వివరాలను పరిశీలిస్తారు.
ప్రకృతి వైపరీత్యంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని, అన్ని విధాలా సహాయాన్ని అందిస్తుందని చెప్పారు.

కొండచరియలు విరిగిపడడం, వరదల వంటి ఇటీవలి ప్రకృతి వైపరీత్యాల బారిన పడిన ఉత్తరాఖండ్లోని కుటుంబాలను ప్రధానమంత్రి పరామర్శించారు. బాధితులకు సంఘీభావం తెలిపారు. విపత్తులో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వరదలు, సంబంధిత విపత్తుల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50,000 పరిహారాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు.

ఇటీవలి వరదలు, కొండచరియలు విరిగిపడడం వల్ల అనాథలైన పిల్లలకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా సహాయం అందుతుందని తెలిపారు. వారి భవిష్యత్ సంరక్షణ, సంక్షేమానికి హామీ ఇచ్చారు.

ఈ దశలో రాష్ట్రాలకు ప్రకటించే ముందస్తు చెల్లింపులు సహా విపత్తు నిర్వహణ చట్టం, నియమాల పరిధిలోకి వచ్చే సహాయం ప్రస్తుత తాత్కాలిక ఉపశమనం కోసమేననీ.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులు, కేంద్ర బృందాల నివేదిక ఆధారంగా ఈ అంచనాను కేంద్రం మరింత సమీక్షిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. తక్షణ ఉపశమన, సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, రాష్ట్ర పరిపాలక - ఇతర సేవా సంస్థల సిబ్బందిని ప్రశంసించారు.

ఈ దశలో రాష్ట్రాలకు ప్రకటించే ముందస్తు చెల్లింపులు సహా విపత్తు నిర్వహణ చట్టం, నియమాల పరిధిలోకి వచ్చే సహాయం ప్రస్తుత తాత్కాలిక ఉపశమనం కోసమేననీ.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులు, కేంద్ర బృందాల నివేదిక ఆధారంగా ఈ అంచనాను కేంద్రం మరింత సమీక్షిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. తక్షణ ఉపశమన, సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, రాష్ట్ర పరిపాలక - ఇతర సేవా సంస్థల సిబ్బందిని ప్రశంసించారు.


పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రధానమంత్రి... పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తుందని హామీ ఇచ్చారు.
Interacted with victims of the floods and landslides in Uttarakhand. We remain committed to standing by them with all possible support. Their courage in the face of such adversity is truly moving. We will work together to help them rebuild their lives. pic.twitter.com/JvOjfX2c3X
— Narendra Modi (@narendramodi) September 11, 2025
Met the teams of NDRF, SDRF, Aapda Mitras and others who are working across Uttarakhand, providing assistance to all those who have been affected. I am very proud of their courage as well as dedication towards helping others in these testing circumstances. pic.twitter.com/1s5lBdCpO7
— Narendra Modi (@narendramodi) September 11, 2025
Chaired a review meeting on the flood situation in Uttarakhand. The devastation caused by floods in the state has saddened us all. My deepest condolences to the families who lost their loved ones. I pray that the people injured recover at the earliest. We are ensuring swift… pic.twitter.com/FIWDoU0NCD
— Narendra Modi (@narendramodi) September 11, 2025
उत्तराखंड में बाढ़ की स्थिति को लेकर एक समीक्षा बैठक की। राज्य में बाढ़ से हुए नुकसान को देखकर बहुत पीड़ा हुई है। जिन परिवारों ने अपने प्रियजनों को खोया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही मैं सभी घायल लोगों के जल्द स्वस्थ होने की कामना करता हूं। प्रभावित लोगों की… pic.twitter.com/iag1JI34q0
— Narendra Modi (@narendramodi) September 11, 2025
उत्तराखंड में बाढ़ और लैंडस्लाइड से प्रभावित लोगों से बातचीत कर उनका हाल जाना। हम उनके साथ पूरी मजबूती से खड़े हैं और उनकी हरसंभव सहायता के लिए प्रतिबद्ध हैं। pic.twitter.com/eYjXo05F55
— Narendra Modi (@narendramodi) September 11, 2025


