కర్ణాటకలో రూ.10,800 కోట్లకు పైగా, మహారాష్ట్రలో 38,800 కోట్లకుపైగా పనులకు శ్రీకారం. ప్రాజెక్టుల ప్రారంభం
కర్ణాటకలో కొత్తగా ప్రకటించిన రెవెన్యూ గ్రామాలలో 50 వేలమంది లబ్ధిదారులకు హక్కు పత్రాలు పంపిణీ చేయనున్న ప్రధాని
జల జీవన్ మిషన్ కింద యాద్గిర్ బహుళ గ్రామ త్రాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని
నారాయణ పూర్ ఎడమ కాలువ ‘విస్తరణ, పునర్నవీకరణ, ఆధునీకరణ ప్రాజెక్ట్’ ను ప్రారంభించనున్న ప్రధాని; 3 లక్షలమంది రైతులకు లబ్ధి
కర్ణాటకలో రెండు గ్రీన్ ఫీల్డ్ హైవే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని; రెండూ సూరత్-చెన్నై ఎక్స్ ప్రెస్ వే లో భాగమే
ముంబయ్ మెట్రో రైల్ లైన్స్ 2ఎ, 7ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని
ముంబయ్ లో ఏడు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, రోడ్డు కాంక్రీట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన; ఛత్రపతి శివాజీ మహారాజ టెర్మినస్ పునరభివృద్ధి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జనవరి 19 న కర్ణాటక, మహారాష్ట్రలలో పర్యటిస్తారు. కర్ణాటకలో యాద్గిర్, కలబురుగి జిల్లాల్లో పర్యటిస్తారు. సుమారు 12 గంటల సమయంలో యాద్గిర్ జిల్లా కోడెకల్ లో ప్రధాని నీటిపారుదల, త్రాగునీటి, జాతీయ రహదార్లు తదితర అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం సుమారు 2.15 కు కలబురుగి జిల్లా మాల్ఖేడ్ చేరుకుంటారు. అక్కడ కొత్తగా ప్రకటించిన రెవెన్యూ గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు హక్కు పత్రాలు పంపిణీ చేస్తారు. అక్కడే నేషనల్ హైవే ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తారు. సుమారు 5 గంటలకు ముంబయ్ లో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సుమారు 6.30కి ముంబయ్ మెట్రో రెండు లైన్స్ ప్రారంభించి మెట్రోలో ప్రయాణిస్తారు. 

కర్ణాటకలో ప్రధాని

ఇంటింటికీ కుళాయిల ద్వారా త్రాగు నీరందించాలన్న ప్రధాని దార్శనికతను సాకారం చేయటంలో భాగంగా జల్  జీవన్  మిషన్ కింద యాద్గిర్ బహుళ గ్రామ త్రాగునీటి సరఫరా పథకానికి యాద్గిర్ జిల్లా కోడెకల్ దగ్గర శంకుస్థాపన చేస్తారు.  ఈ పథకం కింద 117 ఎం ఎల్ డి నీటి శుద్ధి ప్లాంట్ నిర్మిస్తారు.  రూ. 2050 కోట్లకు పైగా ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్ ద్వారా యాద్గిర్ జిల్లాలో మూడు పట్టణాలు, 700 గ్రామాలకు పైగా దాదాపు 2.3 లక్షల ఇళ్ళకు త్రాగు నీరు అందుతుంది.   

ఈ కార్యక్రమం కింద ప్రధాని నారాయణ పూర్ ఎడమ కాలువ విస్తరణ, పునర్వీకరణ, ఆధునీకరణ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్ట్ కాలువల సామర్థ్యం 10,000 క్యూసెక్కులు. ఈ నీటితో 4.5 లక్షల హెక్టార్లకు సాగు చేయవచ్చు.  దీనివలన కలబురిగి, యాద్గిర్, విజయపూర్ జిల్లాలలోని 560 గ్రామాలకు చెందిన మూడు లక్షలమంది రైతులకు లబ్ధి చేకూర్చుతుంది.  ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు రూ. 4700 కోట్లు.

అదే విధంగా జాతీయ రహదారి 150-సి లో 65.5 కిలోమీటర్ల సెక్షన్ కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ ఆరు లేన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ ప్రాజెక్ట్, సూరత్ -చెన్నై ఎక్స్ ప్రెస్ వే లో భాగం. దీన్ని దాదాపు రూ. 2,000 కోట్లతో నిర్మిస్తున్నారు.

నూటికి నూరుశాతం అందరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్న ప్రధాని లక్ష్యానికి అనుగుణంగా రికార్డు కాని  1475  ఆవాసాలను కొత్త రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి ప్రకటించారు. ఇవి కలబురుగి, యాద్గిర్, రాయిచూర్, బీడర్, విజయపుర జిల్లాల్లోనివి.  కలబురుగి  జిల్లా సేద్యం తాలూకా మాల్ఖేడ్ గ్రామంలో ప్రధాని కొత్తగా ప్రకటించిన రెవెన్యూ గ్రామాల అర్హులైన లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందజేస్తారు. హక్కు పత్రాలు అందుకునే 50 వేల మందికి పైగా లబ్ధిదారులలో  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన పేద బడుగు బలహీన వర్గాలవారే ఎక్కువ.  ఇది ఒక విధంగా ప్రభుత్వం వైపు నుంచి లాంఛనపూర్వకమైన  గుర్తింపు లాంటిది. దీనివలన త్రాగునీరు, విద్యుత్, రోడ్లు లాంటి ప్రభుత్వ సేవలు అందుకోగలుగుతారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారి నెంబర్ 150 సి లో 71 కిలోమీటర్ల సెక్షన్ కు శంకుస్థాపన కూడా చేస్తారు. ఈ ఆరు వరుసల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్ట్ కూడా చెన్నై-సూరత్  ఎక్స్ ప్రెస్ వేలో భాగమే. దీన్ని రూ. 2100 కోట్లకు పైగా  వ్యయంతో నిర్మిస్తున్నారు. సూరతు-చెన్నై ఎక్స్ ప్రెస్ వే ఆరు రాష్ట్రాల గుండా – గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రవరదేశ్, తమిళనాడు గుండా వెళుతుంది. ఇప్పుడున్న 1600 కిలోమీటర్ల  దూరాన్ని 1270 కిలోమీటర్లకు తగ్గిస్తుంది.

ముంబయ్ లో ప్రధాని

రూ.38,800 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. నగర ప్రాంతాల్లో నిరాటంకంగా ప్రయాణం సాగించటానికి వీలయ్యేట్టు చేయటం ప్రధాని ప్రాధామ్యాలలో ఒకటి. దీనికి అనుగుణంగా రూ.12,600 ఖర్చుతో నిర్మించిన ముంబయ్ మెట్రో రైల్ లైన్స్ 2 ఎ, 7 ను ఆయన జాతికి అంకితం చేస్తారు.  ఈ రెండు లైన్ లకు 2015 లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.  ముంబై 1 మొబైల్ యాప్ ను కూడా ప్రధాని ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు.  ఈ యాప్ వలన ప్రయాణం సులభతరమవుతుంది. దీన్ని మెట్రో స్టేషన్ల ఎంట్రీ గెట్ దగ్గర చూపిస్తే చాలు. యుపి ఐ ద్వారా టికెట్ల కొనుగోలుకు ఈ డిజిటల్ చెల్లింపు విధానం పనికొస్తుంది.   నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ( ముంబయ్ 1)  తొలిదశలో మెట్రో కారిడార్స్ లో వాడతారు. ఆ తరువాత క్రమంగా లోకల్ రఇళు, బస్సుల వంటి స్థానిక రవాణా సాధనాలకు విస్తరిస్తారు. అప్పుడిక రకరకాల కార్డులు వెంట తీసుకువెళ్ళాల్సిన అవసరముండదు.

రూ.17,200 కోట్లతో నిర్మించే మురుగునీటి శుద్ధిప్లాంట్లకు  ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ ప్లాంట్లను మలద్, భందుప్, వెర్సోవా, ఘట్కోపర్, బాంద్రా, ధరవి, వొర్లి లో నెలకొల్పుతున్నారు.  వీటి మొత్తం సామర్థ్యం దాదాపు 2460 ఎం ఎల్ డి.  

ముంబయ్ లో ఆరోగ్య మౌలికసదుపాయాలు బలోపేతం చేయటానికి ప్రధాని 20 హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ థాకరే ఆప్లా దవాఖానాలు ప్రారంభిస్తారు. ఈ సరికొత్త చొరవ వలన ప్రజలకు  వైద్య పరీక్షలు, మందులు, నిర్థారణ వంటివి పూర్తిగా ఉచితంగా అందుతాయి. ముంబయ్ లో మూడు ఆస్పత్రుల- 360 పడకల భందుప్ మల్టీ స్పెషాలిటీ మున్సిపల్ ఆస్పత్రి, 306 పడకల గోరేగావ్ సిద్ధార్థనగర్ ఆస్పత్రి, 152 పడకల ఓషివారా మెటర్నిటీ హోమ్ పునరభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.  దీనివల్ల లక్షలాది మంది నగర పౌరులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

ముంబయ్ లో దాదాపు 400 కిలోమీటర్ల రోడ్డు కాంక్రీట్ పనులను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టును రూ.6100 కోట్లతో చేపడతారు. ముంబయ్ లో 2050 కిలోమీటర్ల రోడ్డులో 1200 కిలోమీటర్ల మేర కాంక్రీట్ వేయటమో, పాక్షికంగా వేయటమో జరిగింది. అయితే, మిగిలిన సుమారు 850 కిలోమీటర్ల రోడ్లు బాగా గుంటలు పడి  రవాణాకు అవరోధంగా తయారయ్యాయి. ఈ సవాలును అధిగమించటానికే రోడ్డు కాంక్రీట్ చేసే పనిసాగుతోంది. దీనివలన వేగం పెరగటంతోబాటు భద్రత కూడా పెరుగుతుంది. మురుగునీటి పారుదల కూడా మెరుగుపడు, పదే పదే తవ్వాల్సిన అవసరం తప్పుతుంది.

ఛత్రపతి శివాజీ మహారాజ టెర్మినస్ పునరభివృద్ధి పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కు రూ.1800 కోట్లకు పైగా ఖర్చవుతుంది. పి ఎం స్వనిధి యోజన కింద లక్ష మందికి పైగా లబ్ధిదారులకు ఆమోదిత రుణాల బదలీని కూడా ప్రధాని  ప్రారంభిస్తారు.  

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era

Media Coverage

India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s remarks during inauguration of Swaminarayan Hindu Temple in Paris
September 06, 2026

पूज्य महंत स्वामी, फ्रांस सरकार के सम्मानित प्रतिनिधिगण, उपस्थित अतिथिगण, इंडियन कम्युनिटी के मेरे साथी, देश दुनिया से जुड़े सभी हरि भक्त, देवियों और सज्जनों, जय स्वामीनारायण!

आज फ्रांस की राजधानी पेरिस में भव्य स्वामीनारायण मंदिर का लोकार्पण हो रहा है। यह लोकार्पण भारत और फ्रांस के सांस्कृतिक संबंधों का नया युग स्तंभ है। पूज्य संत जनों और सनातन परंपरा के श्रेष्ठ जनों के आशीर्वाद के साथ आज इस लोकार्पण का मंच ‘वसुधैव कुटुम्बकम’ के भाव का मंच बन गया है। भगवान स्वामीनारायण की कृपा और हमारे संतों का स्नेह, संतों का आशीर्वाद, मेरा सौभाग्य है कि मुझे ऐसे पुण्य अवसरों से जुड़ने का अवसर हमेशा मिलता रहता है। आज भी मैं भले ही पेरिस में आप सबके बीच उपस्थित नहीं हूं, लेकिन मन से और हृदय से, मैं स्वयं को आपके बीच ही अनुभव कर रहा हूं।

साथियों,

आज इस अवसर पर मैं परम पूज्य प्रमुख स्वामी जी महाराज का भी श्रद्धापूर्वक स्मरण करता हूं। प्राचीन काल में भारत का जो सांस्कृतिक आध्यात्मिक वैभव था, उन्होंने उसके पुनर्जागरण का एक अभियान शुरू किया था। आज उसका प्रकाश यूरोप समेत पूरी दुनिया में फैल रहा है। 2024 में अबू धाबी में भव्य मंदिर का लोकार्पण हुआ था। आज वहां हजारों लोग दर्शन करने जाते हैं और अब यहां पेरिस में स्वामीनारायण मंदिर का निर्माण सृजन की यह निरंतरता, यह संतों की संकल्प शक्ति का ही प्रमाण है। मैं पुनीत कार्य के लिए पूज्य महंत स्वामी का आभार प्रकट करता हूं, मैं उनके चरणों में प्रणाम करता हूं। मैं BAPS स्वामीनारायण संस्था को और करोड़ों हरि भक्तों को इस अवसर पर हृदय की गहराई से बधाई देता हूं।

साथियों,

BAPS के माध्यम से जब अलग-अलग देश में मंदिरों की प्राण प्रतिष्ठा होती है, तो वहां भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ-साथ ही जाते हैं और भारत का विचार कहता है ‘समानं मनः सह चित्तमेषाम्’ अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े। इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है, यह फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही, इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी।

साथियों,

बीते वर्षों में भारत और फ्रांस के संबंध नई ऊंचाइयों तक पहुंचे हैं। मेरे मित्र, प्रेसिडेंट मैक्रों के साथ मिलकर दोनों देश एक Special Global Strategic Partnership बना रहे हैं। Technology, AI और Defence से लेकर Space और Climate Action तक हम एक नई गति और नई ऊर्जा के साथ मिलकर के आगे बढ़ रहे हैं। हम 2026 को India-France Year of Innovation के रूप में भी सेलिब्रेट कर रहे हैं। भारत-फ्रांस की ये Strategic Partnership इसलिए भी खास है, क्योंकि ये हमारे पुराने सांस्कृतिक-राजनैतिक सम्बन्धों की मजबूत बुनियाद पर टिकी है। इतिहास गवाह है, फ्रांस में भारतीय सैनिकों के बलिदान का इतिहास आज भी मन-मंदिर में जीवित है। भाषा से जुड़े विषयों में रुचि रखने वाले लोग यह भी जानते हैं कि फ्रेंच स्कॉलर्स ने संस्कृत को लोकप्रिय बनाने में कितनी अहम भूमिका निभाई है। रामकृष्ण परमहंस और स्वामी विवेकानंद पर रोमाँ रोलाँ की की लेखनी हमारी सोसाइटीज़ को और करीब लाई है। पेरिस से पुडुचेरी के अरबिंदो आश्रम तक 'The mother' की spiritual journey, उसने कितने ही भारतीय और फ्रेंच साधकों को inspire किया है।

साथियों,

दशकों पहले श्रील प्रभुपाद स्वामी भी फ्रांस आए थे। इस्कॉन के जरिए भारत फ्रांस के बीच आध्यात्मिक सम्बन्धों का नया अध्याय उन्होंने शुरू किया था। आज योग भी भारत-फ्रांस के people to people कनेक्ट का एक माध्यम बन चुका है। 'इंटरनेशनल योगा डे' पर एफिल टॉवर के सामने से आने वाली तस्वीरें फ्रांस में योग की लोकप्रियता का उदाहरण बनती हैं और अब BAPS के इस भव्य मंदिर के जरिए, हमारे उन सांस्कृतिक सम्बन्धों में एक नया अध्याय जुड़ रहा है।

साथियों,

इन दिनों, भारत फ्रांस Joint Ventures की संभावनाओं पर बातें होती हैं। स्वामीनारायण मंदिर ने इस संभावना में भी एक नया आयाम जोड़ा है। यह मंदिर 'मेड इन इंडिया' है और 'बिल्ट इन फ्रांस' है। इसके काफी पत्थरों को भारत में तराशा गया है। भारत की प्राचीन प्रतिभा यहाँ फ्रांस में आधुनिक इंजीनियरिंग से आकर जुड़ चुकी है। पेरिस में इस भव्य मंदिर ने आकार लिया है। इसलिए, मैं आशा करता हूँ, यह मंदिर सदियों तक भारत और फ्रांस के बीच सहयोग और संभावनाओं का भी प्रतीक बनकर उभरेगा।

साथियों,

स्वामीनारायण मंदिर हमेशा से भक्ति के साथ-साथ सेवा का माध्यम भी रहे हैं। मुझे बताया गया है, यह मंदिर भी सेवा प्रकल्पों का वैसा ही केंद्र बनेगा। मुझे विश्वास है कि यहाँ से भारतीय संस्कृति के जो स्वर निकलेंगे, उनका लाभ पूरे यूरोप में लोगों को मिलेगा। भविष्य में मुझे जब भी समय मिलेगा, मैं इस मंदिर में दर्शन करने का प्रयास अवश्य करूंगा। इन्हीं शब्दों के साथ, एक बार फिर आज के इस लोकार्पण समारोह में सम्मिलित सभी अतिथिगणों को, सभी परिवारों को, सभी हरि भक्तों को और पूरी Indian Diaspora को मेरी ओर से इस शुभारंभ पर्व की ढेरों शुभकामनाएं!

बहुत-बहुत धन्यवाद!

मर्सी बोकू!

जय स्वामीनारायण!