ఏడాది పొడవునా నిర్వహించే జాతీయ గేయం ‘వందేమాతరం’ సంస్మరణ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 నవంబర్ 7న ఉదయం 9:30 గంటల సమయంలో ప్రారంభిస్తారు.
ఒక స్మారక స్టాంపును, నాణేన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా విడుదల చేస్తారు. స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తినిచ్చి.. నేటికీ దేశ కీర్తిని, ఐక్యతను పెంపొందిస్తున్న చిరతరమైన ఈ గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా... 2025 నవంబరు 7 నుంచి 2026 నవంబరు 7 వరకు దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా నిర్వహించే సంస్మరణోత్సవానికి అధికారిక ప్రారంభంగా ఈ కార్యక్రమం నిలవనుంది.
ఈ ఉత్సవాల్లో భాగంగా, ప్రధాన కార్యక్రమంతోపాటే ఉదయం 9:50 గంటల సమయంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో.. బహిరంగ ప్రదేశాల్లో ‘వందే మాతరం’ పూర్తి గేయాన్ని సామూహికంగా ఆలపిస్తారు.
2025తో వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. మన జాతీయ గేయం ‘వందే మాతరా’న్ని 1875 నవంబరు 7న అక్షయ నవమి శుభ వేళ బంకించంద్ర ఛటర్జీ రచించారు. ఆయన నవల ఆనందమఠ్లో భాగంగా బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో వందే మాతరం మొదటిసారి కనిపించింది. బలానికి, శ్రేయస్సుకు, దైవత్వానికి స్వరూపంగా మాతృభూమిని కీర్తించే ఈ గేయం.. దేశ ఐక్యత, ఆత్మగౌరవ స్ఫూర్తికి కవితాత్మక వ్యక్తీకరణ. అనతికాలంలోనే ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా నిలిచింది.
Tomorrow, 7th November, is a momentous day for every Indian. We celebrate 150 glorious years of Vande Mataram, a stirring call that has inspired generations and ignited an undying spirit of patriotism across our nation. To mark this occasion, I will join a programme in Delhi at…
— Narendra Modi (@narendramodi) November 6, 2025
कल 7 नवंबर का दिन देशवासियों के लिए ऐतिहासिक होने जा रहा है। हम वंदेमातरम् गान के गौरवशाली 150 वर्षों का उत्सव मनाने जा रहे हैं। यह वो प्रेरक आह्वान है, जिसने देश की कई पीढ़ियों को राष्ट्रभक्ति की भावना से ओतप्रोत किया है। इस विशेष अवसर पर सुबह करीब 9:30 बजे दिल्ली में एक समारोह…
— Narendra Modi (@narendramodi) November 6, 2025


