పవిత్ర శ్రీ అమర్‌నాథ్ యాత్ర ఈ రోజు నుంచి మొదలైన సందర్భంగా శివ భక్తులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఆయన ఇలా పంచుకున్నారు:
‘‘వాగ్బుద్ధిచిత్తకరణౌశ్చ తపోభిరుగ్నైః
శక్యం సమాకలయితుం న యదీయరూపమ్
తం భక్తిభావసులభం శరణం నతానాం
నిత్యం భజామ్యమరరనాథమహం దయాలుమ్’’.
ఈ సుభాషితం ‘‘నేను రోజూ దయామయుడైన భగవాన్ అమర్‌నాథుడిని ఆరాధిస్తున్నాను. ఆయన స్వభావాన్ని మాటలతో, బుద్ధితో, చిత్తంతో, ఇంద్రియాలతో, లేదా పెను ధనరాశులతో అవగాహన చేసుకోవడం సాధ్యపడదు. ఆయనను భక్తి ద్వారానే సులభంగా పొందగలం. ఆయన తన సమక్షంలో ప్రణమిల్లే వారికి అభయాన్నిచ్చి కాపాడతాడు.’’ అని మనకు బోధిస్తుంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
పావన-పునీత శ్రీ అమర్‌నాథ్ యాత్ర శుభారంభ వేళలో సమస్త శివభక్తులకూ అనంత శుభకామనలు. బాబా బర్ఫానీ దివ్య దర్శనాన్ని అందించే ఈ యాత్ర మీ అందరి జీవితంలో సంతోషాన్నీ, సౌభాగ్యాన్నీ, మంచి ఆరోగ్యాన్నీ అందించాలని కోరుకుంటున్నాను.
‘‘వాగ్బుద్ధిచిత్తకరణౌశ్చ తపోభిరుగ్నైః
శక్యం సమాకలయితుం న యదీయరూపమ్
తం భక్తిభావసులభం శరణం నతానాం
నిత్యం భజామ్యమరరనాథమహం దయాలుమ్’’ అని పేర్కొన్నారు. 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity

Media Coverage

PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 ఆగష్టు 2026
August 17, 2026

India Ascendant: Citizens Hail PM Modi's Vision and India’s Multi-Sectoral Growth