సంస్కృత భాషలోని ఓ సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. ప్రయత్నం, సంయమనం, నైపుణ్యం, అప్రమత్తంగా ఉండడం, సహన గుణం, జ్ఞాపక శక్తి, ఏదైనా పనిని అన్నీ ఆలోచించిన తరువాతనే మొదలుపెట్టడం వంటివి మనిషి పురోగతికి మూల కారణాలు అవుతాయని ఆ సుభాషితం మనకు బోధిస్తుంది.
సహనంతో, అంకితభావంతో పట్టు బట్టి కృషి చేస్తే అసాధారణ విజయం అందుతుందని, ఇది దేశ సమృద్ధిలో, సామర్థ్యంలో ఓ కొత్త శక్తిని కూడా ప్రవహింపచేస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘సంయమనంతో, అంకిత భావంతో కష్టపడినప్పుడు అది అద్భుత విజయాన్ని అందిస్తుంది. ఇది దేశ సమృద్ధికి, సామర్థ్యానికి ఒక కొత్త శక్తిని కూడా ప్రవహింప చేస్తుంది.
ఉత్థానం సంయమో దాక్ష్యమప్రమాదో ధృతిః స్మృతిః
సమీక్ష్య చ సమారమ్భో విధ్ధిమూలం భవస్య తు.’’
ప్రయత్నం, సంయమనం, నైపుణ్యం, అప్రమత్తంగా ఉండడం, ఓర్పుతో మెలగడం, జ్ఞాపక శక్తిని పెంచుకోవడం, ఏదైనా పనిని బాగా ఆలోచించి మొదలుపెడుతుండడం.. ఇవన్నీ పురోగతికి మూల కారణాలు అవుతాయి’’ అని పేర్కొన్నారు.
संयम और समर्पण के साथ किया गया परिश्रम अद्भुत सफलता दे सकता है। इससे राष्ट्र की समृद्धि और सामर्थ्य को भी एक नई ऊर्जा मिलती है।
— Narendra Modi (@narendramodi) April 28, 2026
उत्थानं संयमो दाक्ष्यमप्रमादो धृतिः स्मृतिः।
समीक्ष्य च समारम्भो विद्धिमूलं भवस्य तु॥ pic.twitter.com/WSPXyBzWEm


