79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి 103 నిమిషాల పాటు ప్రసంగించారు. ఎర్రకోట నుంచి శ్రీ మోదీ చేసిన ప్రసంగాల్లో ఇదే సుదీర్ఘమైనది. ఇందులో భాగంగా ఆయన కీలక ప్రకటనలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న లక్ష్యంతో సాహసోపేతమైన ప్రణాళికను ఇచ్చారు. స్వావలంబన, ఆవిష్కరణ, ప్రజల సాధికారతపై దృష్టి పెట్టిన ప్రధాని.. ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, సాంకేతికతపరంగా అభివృద్ధి చెందిన, ఆర్థికంగా ధృడమైన దేశంగా మారిన భారత్ ప్రయాణాన్ని ప్రధానంగా పేర్కొన్నారు. 

ప్రధాని చేసిన ప్రకటనలు, ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

1. బెదిరింపులకు భయపడేది లేదు... రాజీ లేదు: పహల్గామ్ దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి నిదర్శనంగా ప్రధాని మోదీ కొనియాడారు. భారత్‌లో తయారైన ఆయుధాలతో చేపట్టిన ఈ ఆపరేషన్ ఉగ్రవాద స్థావరాలను, పాకిస్థాన్‌లోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఇకపై అణు బెదిరింపులకు, ఇతర దేశాల ఒత్తిడికి భారత్ తలొగ్గదని ఈ ఆపరేషన్ తెలియజేసింది. 

* సింధూ జలాల ఒప్పందంపై సందేహాలకు తావు లేకుండా పూర్తి స్పష్టతనిచ్చారు. “రక్తం, నీరు కలిసి ప్రవహించకూడదని భారత్ ఇప్పుడు నిర్ణయించింది. సింధూ జలాల ఒప్పందం అన్యాయమని ప్రజలు గ్రహించారు. ఒకవైపు మన రైతులు బాధపడుతుంటే, సింధు నది నుంచి శత్రువుల భూములకు సాగునీరు అందించారు” అని అన్నారు. 

* ఇకపై జాతీయ ప్రయోజనాలపై భారత్ రాజీపడదని ఈ ప్రకటన పునరుద్ఘాటించింది. స్వదేశీ సాంకేతికత, రక్షణ వ్యవస్థలపై పూర్తిగా ఆధారపడి వేగంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరించే విషయంలో దేశానికి ఉన్న సామర్థ్యాన్ని ఈ ఆపరేషన్ ప్రధానంగా తెలియజేసింది. 

2. ఆత్మనిర్భర్ భారత్, సాంకేతికతను పెంచటం, పరిశ్రమలను బలోపేతం చేయడం: "ఇతరులపై ఆధారపడటం వల్ల దేశ స్వాతంత్ర్యంపై అనుమానాలు రేకెత్తుతాయి. ఆధారపడటం ఒక అలవాటుగా, ప్రమాదకరమైనదిగా మారటం దురదృష్టకరం. అందుకే మనం స్వావలంబన పొందడం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు దానికి కట్టుబడి ఉండాలి. స్వావలంబన అంటే ఎగుమతులు, దిగుమతులు, రూపాయి లేదా డాలర్ గురించి మాత్రమే కాదు.. ఇది మన సామర్థ్యాలు, సొంతంగా మన కాళ్ల మీద మనం నిలబడే శక్తి గురించిన అంశం" అని మోదీ అన్నారు. 

* అందుకే భారత్ 2025 నాటికి తన మొదటి స్వదేశీ తయారీ సెమీకండక్టర్ చిప్‌ను విడుదల చేస్తుందని, అణువిద్యుత్తు రంగ ద్వారాలను ప్రైవేట్ సంస్థలకు తెరుస్తుందని, ఇంధనం - సాంకేతికత రంగాల్లో భారీగా అవకాశాలను సృష్టిస్తుందని ఆయన ప్రకటించారు.

* దేశంలోని ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యువత జెట్ ఇంజిన్లు, సామాజిక మాధ్యమాలు, ఎరువులు, ఇతర కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాలను దేశీయంగా ఆవిష్కరించడం, ఉత్పత్తి చేయడం ద్వారా దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలని కోరారు. తద్వారా స్వావలంబన కలిగిన, శక్తిమంతమైన, ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడే భవిష్యత్తు గల భారత్‌ను సృష్టించాలని ఆయన కోరారు.

* భారతదేశ భవిష్యత్తుకు కీలకమైన వనరులను పొందేందుకు తీసుకున్న సాహసోపేతమైన చర్యలను కూడా ప్రధాని మోదీ ప్రధానంగా పేర్కొన్నారు. ఇంధనం, పరిశ్రమలు, రక్షణ రంగాలకు అవసరమైన ఖనిజాల కోసం నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ద్వారా 1,200 ప్రదేశాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. 

* ఈ ఖనిజాల విషయంలో నియంత్రణ కలిగి ఉండటం వల్ల భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి బలోపేతం అవుతుందని.. దేశ పారిశ్రామిక, రక్షణ రంగాలు అసలైన స్వావలంబనను పొందుతాయని ప్రధానంగా చెప్పారు. దీనితో పాటు నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్.. తీరప్రాంతేతర ఇంధన వనరులను ఉపయోగించేలా చేసి ఇంధన స్వావలంబనను పెంచుతుందన్నారు. తద్వారా విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని వివరించారు. దీనివల్ల పూర్తిగా స్వతంత్రంగా, శక్తిమంతంగా తయారయ్యే విధంగా భారత్ మారుతుందనన్నారు.

* ‘ప్రపంచ ఔషధ కేంద్రంగా’ భారత్‌కు ఉన్న సామర్థ్యాన్ని ప్రధానంగా పేర్కొన్న ఆయన.. ఔషధాలు, ఆవిష్కరణలలో స్వావలంబన సాధించాలని కోరారు. "మానవాళి సంక్షేమం కోసం ఉత్తమమైన, అత్యంత అందుబాటు ధరల్లో మందులను అందించేది మనం కాకూడదా?" అని ప్రశ్నించారు.

* దేశీయ ఔషధ ఆవిష్కరణలలో దేశానికి పెరుగుతోన్న ప్రావీణ్యాన్ని.. కొత్త మందులు, వ్యాక్సిన్లు, ప్రాణాలను రక్షించే చికిత్సలను దేశంలోనే పూర్తిగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. కొవిడ్ విషయంలో భారత స్వదేశీ వ్యాక్సిన్లు, కోవిన్ వంటి వేదికలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయి. ఇదే ప్రేరణతో ఇలాంటి ఆవిష్కరణలను పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.

*భారత్ తన సొంత ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవటమే కాకుండా వైద్యపరంగా స్వావలంబన పొందేలా, ఆవిష్కరణల విషయంలో ప్రపంచ కేంద్రంగా మారేలా కృషి చేయాలని పరిశోధకులు, పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. తద్వారా శాస్త్ర సాంకేతిక, మానవ సంక్షేమంలో నాయకత్వం వహించే సామర్థ్యాన్ని భారత్ ప్రదర్శించగలదని అన్నారు. 

4. మిషన్ సుదర్శన్ చక్ర, వ్యూహాత్మక రక్షణను పెంపొందించడం: దేశానికి ఉన్న గొప్ప సాంస్కృతిక, పౌరాణిక చరిత్ర నుంచి ప్రేరణ పొందుతూ దాడులు చేయటం, దాడులను నిరోధించే విషయంలో భారత్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన మిషన్ సుదర్శన్ చక్రను ప్రధాని మోదీ ప్రకటించారు. "మనపై దాడి చేయడానికి శత్రువులు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా అడ్డుకునేందుకు శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థను రూపొందించడానికి భారత్ మిషన్ సుదర్శన్ చక్రను ప్రారంభిస్తుంది" అని వెల్లడించారు.

* భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని బలోపేతం చేస్తూ రక్షణ విషయంలో వేగంగా, ఖచ్చితంగా, శక్తిమంతంగా స్పందించే వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. "2035 నాటికి అన్ని కీలక ప్రాంతాలూ దేశవ్యాప్త భద్రతా కవచం పరిధిలోకి వస్తాయి" అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఇది దేశ సమగ్ర రక్షణను నిర్ధిరిస్తూ.. రక్షణ విషయంలో స్వావలంబన పట్ల భారత్ నిబద్ధతను తెలియజేస్తోంది.

5. తదుపరి తరం సంస్కరణలు: ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన చట్టాలు, నియమ నిబంధనలు, విధానాలను సమూలంగా మార్చాలన్న లక్ష్యంతో తదుపరి తరం ఆర్థిక సంస్కరణల కోసం ఒక కార్యాచరణ బృందం (టాస్క్ ఫోర్స్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

* ప్రభుత్వం ఇప్పటికే అనవసరమైన 40,000 నిబంధనలను, 1500 పాత చట్టాలను రద్దు చేసిందని.. తాజా పార్లమెంటు సమావేశాల్లో 280కి పైగా నిబంధనలను తొలగించినట్లు ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. దీపావళి నాటికి తీసుకురానున్న తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు.. రోజువారీ నిత్యావసరాలపై పన్నులను తగ్గిస్తాయి. దీనివల్ల ఎంఎస్ఎంఈలు, స్థానిక విక్రేతలు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. అదే విధంగా ఈ సంస్కరణలు ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తాయి. మరింత సమర్థవంతమైన, ప్రజలకు అనుకూలమైన ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తాయి. 

6. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన- యువతకు సాధికారత: జనాభా విషయంలో భారత్‌కు ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు, దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించేలా చూసుకునేందుకు ప్రధానమంత్రి మోదీ రూ. 1 లక్ష కోట్ల ఉపాధి పథకం అయిన పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనను  ప్రకటించారు. దీనిద్వారా కొత్తగా ఉద్యోగం చేస్తోన్న యువత రూ. 15000 అందుకుంటారు. ఇది 3 కోట్ల మంది యువతీయువకులకు లబ్ధి చేకూర్చనుంది. 

* ఇది భారత మావన వనరుల సామర్థ్యాన్ని నిజమైన ఆర్థిక, సామాజిక ప్రగతిగా మారుస్తుందన్నారు. అంతేకాకుండా స్వతంత్ర భారత్ నుంచి సమృద్ధి భారత్‌కు ఉన్న సంబంధాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. దీనితో పాటు దేశ పురోగతి, అభివృద్ధికి క్రియాశీలకంగా పనిచేసేందుకు యువతకు సాధికారత కల్పిస్తుందని ప్రధానంగా పేర్కొన్నారు. 

7. ఇంధనం, అణు విద్యుత్తులో స్వావలంబన: భారతదేశ భవిష్యత్తుకు కీలకమైన వనరులను పొందేందుకు తీసుకున్న సాహసోపేతమైన చర్యలను కూడా ప్రధాని మోదీ ప్రధానంగా పేర్కొన్నారు. ఇంధనం, పరిశ్రమలు, రక్షణ రంగాలకు అవసరమైన ఖనిజాల కోసం నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ద్వారా 1,200 ప్రాంతాల్లో అన్వేషిస్తున్నట్లు తెలిపారు.

* ఈ ఖనిజాల విషయంలో నియంత్రణ కలిగి ఉండటం వల్ల భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి బలోపేతం అవుతుందని.. దేశ పారిశ్రామిక, రక్షణ రంగాలు అసలైన స్వావలంబన పొందుతాయని ప్రధానంగా చెప్పారు. దీనితో పాటు నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్.. తీరప్రాంతేతర ఇంధన వనరులను ఉపయోగించేలా చూసుకోవటం వల్ల ఇంధన స్వావలంబన పెరుగుతుందన్నారు. తద్వారా విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని వివరించారు. దీనివల్ల పూర్తిగా స్వతంత్రంగా, శక్తిమంతంగా తయారయ్యే విధంగా భారత్ మారుతుందన్నారు.

* స్వచ్ఛ ఇంధన రంగంలో దేశం సాధించిన అద్భుతమైన విజయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. స్వచ్ఛ ఇంధనం విషయంలో 50 శాతాన్ని లక్ష్యాన్ని 2025 నాటికే, అంటే అయిదు సంవత్సరాల ముందే భారత్ సాధించినట్లు పేర్కొన్నారు. 

* 2047 నాటికి భారతదేశ అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పది రెట్లు పెంచే ప్రణాళికలను కూడా ఆయన ప్రకటించారు. 10 కొత్త అణు రియాక్టర్లు నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. ఇవి ఇంధన భద్రతతో పాటు స్థిర వృద్ధి జరిగేలా చూసుకుంటాయన్నారు. భారత్ ‌ఇంధన దిగుమతులపై ఆధారపడకపోతే.. ఆ విషయంలో ఆదా చేసిన మొత్తాన్ని రైతుల సంక్షేమం కోసం ఉపయోగించవచ్చన్నారు. ఇది దేశానికి వెన్నెముకగా ఉన్న రైతుల్ని మరింత బలోపేతం చేయటమే అవుతుందన్నారు. 

8. అంతరిక్ష రంగ స్వాతంత్ర్యం -ఆవిష్కరణలు: అంతరిక్ష శాస్త్రంలో పెరుగుతోన్న భారత్ ప్రావీణ్యాన్ని ప్రధాని మోదీ ప్రధానంగా పేర్కొన్నారు. గగన్‌యాన్ మిషన్ విజయంతో సొంత అంతరిక్ష కేంద్రం కోసం భారత్ సన్నాహాలు చేస్తోందన్నారు. 300కి పైగా అంకురాలు ఇప్పుడు ఉపగ్రహ సాంకేతికత, అంతరిక్ష అన్వేషణ, అత్యాధునిక పరిశోధనలకు నూతన ఆవిష్కరణలు చేస్తున్నాయని తెలిపారు. ఇవన్నీ ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ కేవలం పాల్గొనటమే కాకుండా స్వదేశీ పరిష్కారాలతో ముందజలో ఉందని నిరూపిస్తున్నాయని పేరొన్నారు. 

9. భారత శ్రేయస్సుకు రైతులే వెన్నెముక: "భారతదేశం రైతు ప్రయోజనాల విషయంలో రాజీపడదు" అని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. రైతులు, పశువుల పెంపకందారులకు చెడు కలిగించే విధానానికి వ్యతిరేకంగా తాను నిలబడి.. వారి హక్కులు, జీవనోపాధిని కాపాడుతున్నట్లు ప్రధానంగా తెలిపారు. 

* దేశాభివృద్ధికి వ్యవసాయం మూలస్తంభంగా ఉందని అన్నారు. పాలు, పప్పుధాన్యాలు, జనపనారలో భారతదేశం అగ్రస్థానంలో.. బియ్యం, గోధుమలు, పత్తి, పండ్లు, కూరగాయల విషయంలో రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ ఎగుమతులు రూ. 4 లక్షల కోట్ల దాటాయని.. ఇది ఈ రంగంలో ప్రపంచ పోటీలో భారత్ స్థానాన్ని తెలియజేస్తోందన్నారు. 

* రైతులను మరింత శక్తిమంతం చేయడానికి వ్యవసాయంలో వెనుకబడిన 100 జిల్లాల కోసం ప్రధానమంత్రి ధాన్య ధాన్య కృషి యోజనను ప్రకటించారు. ఇప్పటికే కొనసాగుతోన్న పీఎం-కిసాన్, నీటిపారుదల పథకాలు, పశుసంరక్షణ పథకాలతో పాటు ఇది కూడా రైతులకు మద్దతునివ్వనుంది. దేశానికి వెన్నెముక అయిన రైతులు బలంగా, ధృడంగా ఉండేలా ఈ పథకం చూసుకోనుంది. 

10. జాతీయ సమగ్రతను కాపాడేందుకు ఉన్నత స్థాయి జనాభా మిషన్: జనాభా విషయంలో భారత్ సమగ్రతను కాపాడే అంశానికి ఉన్న ప్రాముఖ్యతను కూడా ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించారు. అక్రమ చొరబాట్ల వల్ల ఎదురయ్యే సవాళ్ల గురించి ఆయన హెచ్చరించారు. సరిహద్దు ప్రాంతాలను, ప్రజల జీవనోపాధిని రక్షించాల్సిన అవసరాన్ని ప్రధానంగా చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరిస్తూ దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను నిర్ధారించడం.. వ్యూహాత్మక, సామాజిక సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో ఉన్నత స్థాయి జనాభా మిషన్‌ను ప్రకటించారు.

భవిష్యత్తు గురించి మాట్లాడుతూ... 2047 వికసిత్ భారత్ కోసం దార్శనికతను ప్రధానమంత్రి మోదీ వివరించారు.  దేశ పురోగతి స్వావలంబన, ఆవిష్కరణ, ప్రజా సాధికారతపై ఆధారపడి ఉందని ప్రధానంగా పేర్కొన్నారు. వ్యూహాత్మకమైన రక్షణ రంగం నుంచి సెమీకండక్టర్లు వరకు, హరిత ఇంధనం నుంచి వ్యవసాయం వరకు, డిజిటల్ సార్వభౌమాధికారం నుంచి యువత సాధికారత వరకు 2047 నాటికి భారత్‌ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఈ రోడ్ మ్యాప్ కృషి చేయనుంది. ఇది ప్రపంచ పోటీతత్వం, సామాజిక సమ్మిళిత్వం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కలిగి ఉంటుంది.

భారత్ శక్తి... భారత ప్రజల్లో, ఆవిష్కరణల్లో, స్వావలంబనలో ఉందని గుర్తు చేశారు. భారత స్వాతంత్ర్య శతాబ్ది నాటికి సంపన్నమైన, శక్తిమంతమైన వికసిత్ భారత్‌ లక్ష్యాన్ని సాధించేందుకు దేశంలో తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా, లేదా శాస్త్ర సాంకేతిక, లేదా పారిశ్రామిక వ్యవస్థాపనకు కృషి చేయటం ద్వారా... ప్రతి భారతీయుడు జాతి నిర్మాణానికి దోహదపడాలని కోరారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Sanand 2.0's swift semicon wave accelerates India's chip ambitions

Media Coverage

Sanand 2.0's swift semicon wave accelerates India's chip ambitions
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates successful candidates of Civil Services Examination, 2025
March 06, 2026

The Prime Minister, Shri Narendra Modi has congratulated all those who have successfully cleared the Civil Services Examination, 2025. He said that their dedication, perseverance and hard work have enabled them to achieve this significant milestone.

The Prime Minister noted that clearing the Civil Services Examination marks the beginning of an important journey of public service. He wished the successful candidates the very best as they embark on the path of serving the nation and fulfilling the aspirations of the people.

The Prime Minister also conveyed his message to those who may not have secured the desired outcome in the examination. He acknowledged that such moments can be difficult, but emphasised that this is only one step in a larger journey.

Highlighting that many opportunities lie ahead, both in future examinations and in the many avenues through in which individuals can contribute to the nation, the Prime Minister extended his best wishes to them for the road ahead.

The Prime Minister wrote on X;

“Congratulations to all those who have successfully cleared the Civil Services Examination, 2025. Their dedication, perseverance and hard work have led to this significant milestone.

Wishing them the very best as they embark on a journey of serving the nation and fulfilling the aspirations of the people.”

“To those who may not have secured the desired outcome in the Civil Services Examination, I understand that such moments can be difficult. However, this is only one step in a larger journey. Many opportunities lie ahead, both in future examinations and in the many avenues through which you can contribute to our nation. My best wishes for the road ahead.”