"రాష్ట్రపతి జీ ప్రసంగం భారతదేశ అభివృద్ధి చెందుతున్న విశ్వాసాన్ని, ఆశాజనక భవిష్యత్తును, దాని ప్రజల అపారమైన సామర్థ్యాన్ని నొక్కి చెప్పింది"
"భారతదేశం పెళుసైన ఐదు, విధాన వైకల్యపు రోజుల నుండి టాప్ 5 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉండే రోజులకు వచ్చింది"
గత 10 సంవత్సరాలు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలకు ప్రసిద్ధి చెందింది"
“సబ్కా సాత్, సబ్కా వికాస్ నినాదం కాదు. ఇది మోదీ హామీ’’
"వికసిత భారత్ పునాదులను బలోపేతం చేయడానికి మోడీ 3.0 ఏ అవకాశాన్ని వదలదు "

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు రాజ్య స‌భ‌లో పార్ల‌మెంట్‌ను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి బదులిచ్చారు. సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, 75వ గణతంత్ర దినోత్సవం దేశ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని, రాష్ట్రపతి భారతదేశ ఆత్మవిశ్వాసం గురించి ప్రసంగించారని అన్నారు. తన ప్రసంగంలో రాష్ట్రపతి భారతదేశ ఉజ్వల భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారని, భారత పౌరుల సామర్థ్యాన్ని గుర్తించారని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. వికసిత భారత్ సంకల్పాన్ని నెరవేర్చడానికి దేశానికి మార్గదర్శకత్వం అందించిన ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రసంగానికి రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ‘ధన్యవాద తీర్మానం’పై ఫలవంతమైన చర్చ జరిగినందుకు సభ సభ్యులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. “రాష్ట్రపతి తన ప్రసంగంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న విశ్వాసాన్ని, ఆశాజనక భవిష్యత్తును, దాని ప్రజల అపారమైన సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు”, అని ప్రధాన మంత్రి అన్నారు.

సభ వాతావరణం గురించి ప్రధాని మాట్లాడుతూ, “ప్రతిపక్షాలు నా గొంతును అణచివేయలేవు, ఎందుకంటే ఈ స్వరానికి దేశ ప్రజలు బలం ఇచ్చారు” అని వ్యాఖ్యానించారు. పబ్లిక్ ఫైనాన్స్ లీకేజీలు, ‘పెళుసైన ఐదు’ మరియు ‘విధాన వైకల్యం’ మొదలైన సమయాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు.  దేశాన్ని మునుపటి గందరగోళం నుండి బయటకు తీసుకురావడానికి ప్రస్తుత ప్రభుత్వం చాలా శ్రద్ధతో పనిచేసిందని అన్నారు. “కాంగ్రెస్ ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలో, ప్రపంచం మొత్తం భారతదేశానికి ‘పెళుసైన ఐదు’ మరియు విధాన వైకల్యం వంటి పదాలను ఉపయోగించింది. మా 10 సంవత్సరాలలో - టాప్ 5 ఆర్థిక వ్యవస్థలలో. ఈ రోజు ప్రపంచం మన గురించి అలా మాట్లాడుతుంది”, అన్నారు

గత ప్రభుత్వాలు విస్మరించిన వలసవాద మనస్తత్వ సంకేతాలను తొలగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ప్రధాన మంత్రి వివరించారు. రక్షణ దళాలకు కొత్త చిహ్నం, కర్తవ్య మార్గం, అండమాన్ దీవుల పేరు మార్చడం, వలసరాజ్యాల చట్టాల రద్దు మరియు భారతీయ భాష ప్రచారం, అనేక ఇతర చర్యలను వివరించారు. స్వదేశీ ఉత్పత్తులు, సంప్రదాయాలు, స్థానిక విలువల గురించి గతంలో ఉన్న న్యూనతాభావాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. వీటన్నింటినీ ఇప్పుడు గంభీరంగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.

నారీ శక్తి, యువశక్తి, పేదలు,  అన్నదాత అనే నాలుగు అతి ముఖ్యమైన వర్గాల  గురించి రాష్ట్రపతి ప్రసంగం అంతర్దృష్టిని ఇస్తూ, భారతదేశం ఈ నాలుగు ప్రధాన స్తంభాల అభివృద్ధి, పురోగతి దేశం అభివృద్ధి చెందడానికి దారి తీస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారు. 2047 నాటికి వికసిత భారత్‌ను సాధించాలంటే 20వ శతాబ్దపు విధానం పనిచేయదని ప్రధాని అన్నారు.

ప్రధాన మంత్రి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల హక్కులు, అభివృద్ధిని కూడా స్పృశించారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల జమ్మూ, కాశ్మీర్‌లో దేశంలోని మిగిలిన ప్రాంతాలకు సమానమైన హక్కులు ఈ వర్గాలకు లభిస్తాయని హామీ ఇచ్చారు. అదేవిధంగా, రాష్ట్రంలోని బాల్మీకి వర్గానికి అటవీ హక్కుల చట్టం, అట్రాసిటీ నిరోధక చట్టం, నివాస హక్కులు కూడా 370 ఆర్టికల్ ని రద్దు చేసిన తర్వాతే అమలులోకి వచ్చాయి. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

బాబా సాహెబ్‌ను గౌరవించే చర్యలను కూడా ప్రధాని ప్రస్తావించారు. గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి అయిన అంశాన్ని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, గిరిజన వర్గాల అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రాధాన్యతనిచ్చారు. ఈ వర్గాలను బలోపేతం చేసేందుకు పక్కా గృహాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పరిశుభ్రత ప్రచారాలు, ఉజ్వల గ్యాస్ పథకం, ఉచిత రేషన్, ఆయుష్మాన్ యోజన వంటి వాటిని ఆయన ప్రస్తావించారు. గత 10 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పెరిగాయని, పాఠశాలల్లో చేరే వారి సంఖ్య పెరిగిందని, డ్రాపౌట్‌లు గణనీయంగా తగ్గాయని, 1 నుంచి 2కి చేరుకుని కొత్త సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీని స్థాపించామని, ఏకలవ్య సంఖ్యను పెంచామన్నారు. మోడల్ స్కూల్స్ 120 నుంచి 400కి పెరిగాయని.. ఉన్నత విద్యలో ఎస్సీ విద్యార్థుల నమోదు 44 శాతం, ఎస్టీ విద్యార్థుల నమోదు 65 శాతం, ఓబీసీ నమోదు 45 శాతం పెరిగిందని తెలిపారు.

“సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అనేది కేవలం నినాదం కాదు, అది మోదీ హామీ” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. తప్పుడు కథనాన్ని ఆధారం చేసుకుని నిరాశా నిస్పృహలను వ్యాప్తి చేయవద్దని ప్రధాని హెచ్చరించారు. తాను స్వతంత్ర భారతదేశంలో జన్మించానని, తన ఆలోచనలు, కలలు స్వతంత్రంగా దేశంలో వలసవాద మనస్తత్వానికి చోటు లేకుండా ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలలో ఇంతకు ముందు ఉన్న గందరగోళానికి విరుద్ధంగా, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు 4జి, 5జి లలో అగ్రగామిగా ఉన్నాయని, హెచ్ఏఎల్  రికార్డుల తయారీని చేస్తోందని మరియు ఆసియాలో అతిపెద్ద హెలికాప్టర్ ఫ్యాక్టరీ కర్ణాటకలోని HAL అని ప్రధాన మంత్రి అన్నారు. ఎల్‌ఐసీ కూడా రికార్డు స్థాయిలో షేర్ల ధరలతో దూసుకుపోతోంది. దేశంలో 2014లో 234గా ఉన్న పీఎస్‌యూల సంఖ్య నేడు 254కి పెరిగిందని, వాటిలో చాలా వరకు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తూ రికార్డు స్థాయిలో రాబడులు ఇస్తున్నాయని ప్రధాని మోదీ సభకు తెలియజేశారు. దేశంలో పిఎస్‌యు ఇండెక్స్ గత సంవత్సరంలోనే రెండు రెట్లు పెరిగింది. గత 10 సంవత్సరాలలో,  పిఎస్‌యు నికర లాభం 2004, 2014 మధ్య రూ. 1.25 లక్షల కోట్ల నుండి రూ. 2.50 లక్షల కోట్లకు పెరిగింది.  పిఎస్‌యుల  నికర విలువ రూ. 9.5 లక్షల కోట్ల నుండి రూ. 17 లక్షల కోట్లకు పెరిగింది.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన తాను  ప్రాంతీయ ఆకాంక్షలను బాగా అర్థం చేసుకున్నానని ప్రధాని అన్నారు. ‘దేశాభివృద్ధికి రాష్ట్రాల అభివృద్ధి’ అనే మంత్రాన్ని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాల మధ్య అభివృద్ధికి ఆరోగ్యకరమైన పోటీ ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, పోటీ సహకార సమాఖ్యవాదానికి పిలుపునిచ్చారు.

జీవితంలో ఒకసారి వచ్చే కోవిడ్ మహమ్మారి సవాళ్లపై వెలుగునిస్తూ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 20 సమావేశాలకు అధ్యక్షత వహించిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. సవాలును ధీటుగా ఎదుర్కొన్నందుకు మొత్తం యంత్రాంగాన్నీ ప్రశంసించారు.

దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించినందున జి20 కీర్తిని అన్ని రాష్ట్రాలకు వ్యాప్తి చేయడం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. విదేశీ ప్రముఖులను వివిధ రాష్ట్రాలకు తీసుకెళ్లే విధానాన్ని కూడా ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రాల పాత్రను కొనసాగిస్తూ, ఆకాంక్ష జిల్లా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రధాన మంత్రి రాష్ట్రాలకు క్రెడిట్ ఇచ్చారు. "మా కార్యక్రమం రూపకల్పన రాష్ట్రాలను వెంట తీసుకెళ్తుంది, దేశాలను సమిష్టిగా ముందుకు తీసుకెళ్లడం" అని ఆయన అన్నారు.
 

మానవ శరీరంతో దేశం యొక్క పనితీరుకు సారూప్యతను వివరిస్తూ, ఒక రాష్ట్రం వెనుకబడి మరియు అభివృద్ధి చెందని స్థితిలో ఉన్నప్పటికీ, పని చేయని శరీర భాగం మొత్తం శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అదే విధంగా దేశం అభివృద్ధి చెందినదిగా పరిగణించబడదని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.

పేదరికం నుండి బయటపడిన వారికి ప్రభుత్వ మద్దతును ఎత్తిచూపుతూ, ఉచిత రేషన్ పథకం, ఆయుష్మాన్ పథకం, మందులపై 80 శాతం రాయితీ, రైతులకు ప్రధానమంత్రి సమ్మాన్ నిధి, పేదలకు పక్కా గృహాలు, కుళాయి నీటి కనెక్షన్లు మరియు కొత్త నిర్మాణాలను శ్రీ మోదీ ప్రకటించారు. మరుగుదొడ్లు శరవేగంగా కొనసాగుతాయి. "వికసిత భారత్ పునాదులను బలోపేతం చేయడానికి మోడీ 3.0 ఎటువంటి రాయిని వదిలిపెట్టదు" అని ఆయన అన్నారు.

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s Agricultural Transformation: How India’s Agri sector transformed over the last decade

Media Coverage

India’s Agricultural Transformation: How India’s Agri sector transformed over the last decade
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister attends the Defence Investiture Ceremony 2026 (Phase-1)
June 08, 2026

Prime Minister Shri Narendra Modi today attended the Defence Investiture Ceremony 2026 (Phase-1) where Gallantry Awards were conferred upon our brave personnel.

The Prime Minister expressed pride in their extraordinary courage, commitment and selfless service to the nation.

The Prime Minister posted on X:

"Attended the Defence Investiture Ceremony 2026 (Phase-1) where Gallantry Awards were conferred upon our brave personnel. We are proud of their extraordinary courage, commitment and selfless service to the nation."