గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండో శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 20వ తేదీన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి శ్రీ కీత్ రౌలీతో సమావేశమయ్యారు.
 

ట్రినిడాడ్ అండ్ టొబాగో భారత యూపీఐ వేదికను వినియోగించుకుంటున్నందుకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి, డిజిటల్ పరివర్తనలో ఆ దేశానికి సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం మొదట్లో ఐసీసీ టీ-20 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ పోటీలకు సహ ఆతిథ్యం అందించినందుకు  ప్రధానమంత్రి రౌలీకి అభినందనలు తెలిపారు.  
 

ప్రస్తుతం అమల్లో ఉన్న ద్వైపాక్షిక కార్యక్రమాల ప్రగతిని సమీక్షించిన ఇరువురు నేతలూ…  భద్రత, ఆరోగ్యం, వాణిజ్యం, వ్యవసాయం, రవాణా, వ్యవసాయం, సామర్థ్య పెంపు సహా సాంస్కృతిక పరమైన సహకారాలను పటిష్ఠ పరచాలని, ఇరుదేశాల ప్రజల మధ్య మరింత స్నేహ సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. చర్చల అనంతరం ఆహార శుద్ధికి సంబంధించి ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
On Puri’s Grand Road, a devotee’s submission

Media Coverage

On Puri’s Grand Road, a devotee’s submission
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 జూలై 2026
July 16, 2026

Atmanirbhar to Inclusive: PM Modi’s Blueprint for a Self-Reliant, Empowered & Culturally Rooted Bharat